శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవరమునయే నమః
శ్రీవానాచల మహామునయే నమః
పాఠకుల నిర్ధేశిని/పదకోశం
శ్రీవైష్ణవ ప్రాథమిక పరిభాష
- ఆచార్యుడు,గురువు- ఆధ్యాత్మికతను అదించువాడు- సాధారణంగా తిరుమంత్రమును ఉపదేశించువారు.
- శిష్య- శిష్యుడు /అంతేవాసి
- భగవంతుడు- శ్రీమన్నారాయణుడు
- అర్చామూర్తి- దేవాలయందు, మఠములయందు, గృహములయందు ఆరాధించబడు దయారూపిఅయిన భగనవానుని విగ్రహములు.
- ఎంపెరుమాన్,పెరుమాళ్,ఈశ్వరుడు- భగవానుడు
- ఎంపెరుమానార్ – భగవానుని కన్నా అతి కరుణామయులు –శ్రీరామానుజులు
- పిరాన్- ఉపకారకుడు
- పిరాట్టి,తాయార్- శ్రీమహాలక్ష్మి
- మూలవర్లు- ఆలయం లోపల పవిత్రంగా ప్రతిష్ఠించబడిన భగవానుని అచల(కదలని) రూపం.
- ఉత్సవర్లు- తిరువీథులలో ఊరేగించుటకు ప్రతిష్ఠ చేయబడిన చలరూపి భవగానుడు.
- ఆళ్వార్లు- – – భాగవానుని సంపూర్ణ కృపకు పాత్రులై ద్వాపరయుగాంతము నుండి కలియుగారంభము వరకు దక్షిణభారతమున నివసించిన వైష్ణవ సన్యాసులు. మరియు భగవద్భక్తిలో మునిగి తేలినవారు.
- పూర్వాచార్యులు- శ్రీవైష్ణవ సాంప్రదాయమున శ్రీమన్నారాయణుని నుండి పరంపరగా వస్తున్న ఆధ్యాత్మిక చక్రవర్తులు.
- భాగవతులి,శ్రీవైష్ణవులు- భగవానునకు దాస్యము చేయువారు.
- అరైయర్లు- భగవానుని ముందు దివ్యప్రభందములను రాగతాళ యుక్తముగా గానముచేయు శ్రీవైష్ణవులు.
- ఓరాణ్ వళి ఆచార్యులు- పెరియపెరుమాళ్ నుండి మణవాళమామునుల వరకు వేంచేసి ఉన్న ఆచార్య సమూహం.
- పెరియపెరుమాళ్
- పెరియపిరాట్టి
- విష్వక్సేనులు
- నమ్మాళ్వార్
- శ్రీమన్నాథమునులు
- ఉయ్యకొండార్
- మణక్కాల్ నంబి
- ఆళవందార్(యామునాచార్యులు)
- పెరియనంబి
- ఎంపెరుమానార్(భగవద్రామానుజులు)
- ఎంబార్
- శ్రీపరాశర భట్టర్
- నఙ్జీయర్
- నంపిళ్ళై
- వడక్కు తిరువీథి పిళ్ళై
- పిళ్ళైలోకాచార్యులు
- తిరువాయ్ మొళిపిళ్ళై
- అళిగియ మణవాళ మామునులు(వరవరమునులు)
- దివ్యప్రబంధం – అరుళిచ్చెయళ్ గా వ్యవహరింపబడు ఆళ్వారులు అనుగ్రహించిన పాశురములు.
- దివ్యదంపతులు- శ్రీమన్నారాయణుడు మరియు శ్రీమహాలక్ష్మి
- దివ్యదేశములు- ఆళ్వారులచే కీర్తిపబడిన భగవానుడు వేంచేసి ఉన్న క్షేత్రములు/స్థలములు.
- దివ్యసూక్తులు,శ్రీసూక్తులు- భాగవానుని /ఆళ్వారాచార్యుల వచనములు.
- అభిమాన స్థలములు- పూర్వాచార్యులకు అభీష్ఠమైన భగవానుడు వెలసిన క్షేత్రములు.
- పాశురము- పద్యము/శ్లోకం
- పదిగం- దశకం(పది పాశురముల కూర్పు)
- పత్తు- శతకం(వంద పాశురముల కూర్పు)
- నిర్ధిష్ఠ / ప్రత్యేక అర్థములు(శ్రీవైష్ణవ పారిభాషిక పదాలు)
- కోయిళ్- శ్రీరంగం
- తిరుమల- తిరువేంగడం, తిరుమాళింరుశోలై
- పెరియ కోయిల్- కాంచీపురం
- పెరుమాళ్- శ్రీరాముడు
- ఇళయ పెరుమాళ్- లక్ష్మణుడు
- పెరియపెరుమాళ్- శ్రీరంగనాథుడు(మూలవర్లు)
- నంపెరుమాళ్- శ్రీరంగనాథుడు(ఉత్సవర్లు)
- ఆళ్వార్-నమ్మాళ్వార్ స్వామి- భగవద్రామానుజులు
- జీయర్, పెరియజీయర్- అళిగియ మణవాళ మామునులు(వరవరమునులు)
- స్వరూపం- నిజ స్వభావం/ఆకారం(శాస్త్రం నిర్ధేశించిన లక్షణములు కలిగి ఉండుట)
- రూపం – రూపం/ఆకృతి
- గుణం- కళ్యాణగుణములు
- పరత్వం – ఆధిపత్యం
- సౌలభ్యం- సులువుగా లభించుట/అందుబాటులో ఉండుట
- సౌశీల్యం – ఔదార్యం / అరమరికలు లేని ఉదారస్వభావం
- సౌందర్యం- శరీర సుందరత
- వాత్సల్యం- అమ్మలాంటి సహనం/ఓర్పు/క్షమా
- మాధుర్యం- మధురమైన రుచి(ఒక గుణం)
- కృప,కరుణ,దయా,అనుకంపా- అనుగ్రహం,కనికరం.
- శాస్త్రం- మనను నిర్ధేశించు/మార్గనిర్దేశనం చేయు ప్రామాణిక గ్రంథములు- వేదం, వేదాంతం, పాంచారాత్రాగమం, ఇతిహాసములు (శ్రీరామాయణభారతాదులు), పురాణములు (విష్ణుభాగవతగరుడాది) , ఆళ్వారులదివ్యప్రబంధములు, పూర్వాచార్యుల కృతులు- స్తోత్రములు(స్తోత్రరత్నాది) వ్యాఖ్యానములు.
- కర్మ- చర్య,-పాప(దుర్గుణములు)పుణ్యపు(సద్గుణములు) క్రియలు.
- మోక్షం- భవబంధ విమోచనం/విముక్తి
- భగవత్కైంకర్యమోక్షం- ఈ భవబంధ విముక్తి జరిగిన పిమ్మట పరమపదమున ఉండు నిత్యకైంకర్యం.
- కైవల్యం- ఈ భవబంధ విముక్తి జరిగిన పిమ్మట ఉండు ఆనందమయ నిత్యకైంకర్యము.
- కర్మయోగ,ఙ్ఞానయోగ, భక్తియోగములు- భగవంతున్ని పొందు మార్గములు.
- ప్రపత్తి,శరణాగతి- తన భారాన్నంతటిని భగవంతుని పై వేయుట. భవంతున్ని చేరుటకు అతనే మార్గమని నమ్మి ఉండుట.
- ఆచార్యనిష్ఠులు- ఆచార్య శ్రీపాదములను మాత్రమే ఆశ్రయించువారు. వీరినే ‘ప్రపన్నులు’ అని అందురు.
- ఆచార్య అభిమానం- ఆచార్యుల కృపకు పాత్రులు అవ్వడం
- పంచసంస్కారములు(సమాశ్రయణములు)- శుద్ధీకరణ ప్రక్రియల ద్వారా ఒక వ్యక్తిని భగవానుని కైంకర్యమునందు(ఈ సంసారమునందు మరియు పరమపదమునందు) నిమగ్నపరచుట. ఆ ప్రక్రియలు..
- తాప- శంఖచక్రలాంఛనములు-తాపం(వేడి) గావించబడిన శంఖచక్రముద్రలను మన భుజములయందు ధరింపచేయుట. దీనివలన మనం ఇకపై భగవంతుని సొత్తుగా పరిగణింపబడతాము. ఎలాగైతే ఒక పాత్రపై యజమాని చిహ్నముచే ముద్రించిన అది వానికి ఎలాచెందునో మనం కూడ ఈ శంఖచక్రముద్రల స్థాపనం వల్ల భగవానునకే చెందిన వారమవుతాము.
- పుండ్రం(చిహ్నం) – ద్వాదశ ఊర్ధ్వపుండ్రధారణం- శరీరమున పన్నెండు స్థలములలో ఊర్ధ్వపుండ్ర(తిరుమణి మరియు శ్రీచూర్ణం) ధారణం చేయుట.
- నామ- దాస్య నామం- ఒక నూతన పేరు ఆచార్యునిచే పొందుట.(రామానుజదాస, మధురకవిదాస, శ్రీవైష్ణవదాస ఇత్యాదులు)
- మంత్రం- మంత్రోపదేశం- రహస్యమంత్రములను ఆచార్యుని ద్వారా పొందుట. ఇది మననం చేయువారిని దుఃఖముల నుండి రక్షించును.- తిరుమంత్రం, ద్వయమంత్రం మరియు చరమశ్లోకములనెడి ఈ మంత్రములు సంసార విముక్తిని కలిగించును. లోతైన విశ్లేషణకై దీనిని చూడండి: http://ponnadi.blogspot.in/2015/12/rahasya-thrayam.html
- యాగ-దేవపూజ-తిరువారాధన క్రమమును అభ్యసించుట.
- కైంకర్యం- భగవానునికి, ఆళ్వారులకు, ఆచార్యులకు, భాగవతులకు సేవ చేయుట.
- తిరువారాధన- భగవంతున్ని ఆరాధించుట(పూజ)
- తిరువుళ్ళం- ఇష్ఠప్రకారం
- శేషి- యజమాని
- శేష- దాసుడు/సేవకుడు
- శేషత్వం- భగవానునికై దాస్యమునకు సర్వదా సిద్ధమై ఉండుట. (శ్రీరామునికి సేవచేయు లక్ష్మణుని వలె)
- పారత్రంత్యం – భగవానునికి పూర్తిగా ఆధీనపడుట. (భరతాళ్వాన్ వలె శ్రీరాముని ఆఙ్ఞకు సర్వదా లోబడి ప్రవర్తించుట మరియు ఎడబాటును కూడా సమ్మతించుట )
- స్వాతంత్ర్యం- తన ఇష్ఠానుసారం నడుచుకొనుట.
- పురుషాకారం-సిఫార్సు, మధ్యవర్తిత్వం/ఉపశమింపచేయడం- ఈ జీవులు తాము చేసిన పాపకర్మ ఫలితంగా క్షింపబడడానికి అర్హులు కానున్నను పరమదయాస్వరూపిణి అయిన శ్రీమహాలక్ష్మి తాను భవగవానుని ఒప్పించి ఈ జీవున్ని అతని కృపకు పాత్రున్ని చేయును కావున తాను పురుషాకారిణి. ఆచార్యులు కూడా ఈ పురుషాకార స్వభావులే. ఈ పురుషాకారం చేయువారికి ముఖ్యంగా మూడు గుణాలు ఉండాలి.
- కృప- ఈ కర్మానుభవ జీవునిపై దయ.
- పారత్రంత్యం – సర్వం భాగవానునిపై ఆధారపడి ఉండుట.
- అనన్యర్హత్వం- భగవానునికే తప్ప ఇతరులకు చెందకుండుట.
- అనన్య శేషత్వం – భగవానునికి మరియు భాగవతులకు తప్ప ఇతరులకు కైంకర్యం చేయకుండుట.
- విషయాంతరం – ప్రాపంచిక/ ఐహిక సుఖములు- కైంకర్యము కంటే వేరైనవి/ఇతరములు.
- దేవతాంతరము- శ్రీమన్నారాయణుడే పరత్వం. ఇతర జీవాత్మలు దేవతాంతరములు( అనగా ఈ జీవాత్మలు భగవానుని ఆఙ్ఞచే ఈ లౌకిక జగత్తులో కొన్ని కార్యములు నెరవేర్చుటకు నియమింపబడతారు. వీరుకూడా కర్మ బద్ధులే).
- స్వగత స్వీకారం- తమను తాము భాగవానుని/ఆచార్యునిలా భావించడం (నేను అను అహంకారం).
- పరగతస్వీకారం- భగవానుడు/ఆచార్యుడు తమ ప్రతయ్నం/ప్రార్థన లేకుండానే , అప్రయత్నంముగా మనలను స్వీకరించడం.
- నిర్హేతుక కృప- ఏ కారణం లేకుండానే చూపే దయ- జీవాత్మ ప్రోద్భలంచేయబడని/పురికొల్పబడని భగవానుని యొక్క ధృడమైన కృప.
- సహేతుక కృప- జీవాత్మ స్వప్రయత్నము చేసి పురికొల్పబడిన భగవానుని కృప.
- నిత్యులు- నిత్యసూరులు- పరమపదమున భగవానునికి కైంకర్యము చేయు వారు(ఎక్కడైనా ఉన్నను). నిత్యులనగా ఈభౌతిక సంసారబంధం లేశ మాత్రములేని పవిత్రులు.
- ముక్తులు- ఒక నాడు ఈ భౌతిక సంసారబద్దులై చివరకు పరమపదమును చేరుకొని పవిత్రులుగా మారి భగవానుని కైంకర్యం చేయువారు.
- బద్ధులు- ప్రస్తుతం ఈ భౌతిక సంసారమున జీవించువారు. వీరినే సంసారులు అందురు.
- ముముక్షువులు- మోక్షంకై ప్రయత్నం చేయువారు.
- ప్రపన్నులు- భగవానుని కైంకర్యమే సర్వమని భావించేవారు. వీరుకూడా ముముక్షువుల వంటివారే.
- ఆర్తప్రపన్నులు- ఒకసారి కష్ఠభూయిష్ఠమైన ఈ భౌతిక సంసారము నుండి విముక్తిని కోరువారు.
- దృప్తప్రపన్నులు- భగవానుని కైంకర్యమే సర్వమని భావించినను ఒకానొకసారి ఈలౌకిక ప్రపంచమున భగవానునికి మరియు భాగవతులకు కైంకర్యము చేయజాలక పరమపదములో ఈ కైంకర్యమును అభిలషించువారు.
- తీర్థం – పవిత్ర జలం
- శ్రీపాదతీర్థం- చరణామృతం- ఆచార్యుల పాదప్రక్షాళన జలం.
- భోగం- భగవానునికి సమర్పించుటకు సిద్ధమైన పక్వాపక్వములు.
- ప్రసాదం- శ్రీవైష్ణవులు స్వీకరించు భగవన్నివేదిత పదార్థములు(పక్వాపక్వములు).
- ఉచ్చిష్టం- ప్రసాదానికి మరోపేరు.(శేషప్రసాదం) కొన్ని సార్లు ఇతరులచే సృశింపబడినది(ఇతరుల అథరములచే తాకబడినది)-సందర్భమును బట్టి అర్థం మారును.
- పడి-భోగములకు ఉపయోగించు నామాంతరం(తమిళ పదం)
- సాత్తుప్పడి- చందనం
- శఠారి, శ్రీ శఠకోపమ్ – శ్రీమన్నారాయణుని పాదపద్మములు. నమ్మాళ్వార్, శ్రీ శఠకోపముగా పరిగణింపబడతారు. దీనికి కారణం వీరు భగవానుని శ్రీపాదపద్మముల స్థానీయులు.
- మథురకవులు- నమ్మాళ్వార్ (పాదస్థానీయులు) శ్రీపాదములకు వ్యవహారనామము.
- శ్రీరామానుజం-ఆళ్వార్ తిరునగరిలో నమ్మాళ్వార్ (పాదస్థానీయులు) శ్రీపాదములకు వ్యవహారనామము.
- శ్రీరామానుజం- అందరి ఆళ్వారుల (పాదస్థానీయులు) శ్రీపాదములకు వ్యవహారనామము
- ముదలిఆండాన్- శ్రీరామానుజుల (పాదస్థానీయులు) శ్రీపాదములకు వ్యవహారనామము
- పొన్నడియామ్ శఙ్కమలం – మామునుల శ్రీపాదములకు వ్యవహారనామము.
- సాధారణంగా ప్రధానశిష్యులు శ్రీపాదములుగా వ్యవహరింపబడతారు. ఉదాహరణకు- ఎంబార్ కు – శ్రీపరాశరభట్టర్ శ్రీపాదములు(పాదస్థానీయులు), – శ్రీపరాశరభట్టర్ కు నఙ్జీయర్ శ్రీపాదములు, నఙ్జీయర్ కు నంపిళ్ళై శ్రీపాదములు మొ.
- విభూతి – సంపద/ఐశ్వర్యము
- నిత్యవిభూతి – ఆధ్యాత్మిక జగత్తు( పరమపదం/శ్రీవైకుంఠము)
- లీలావిభూతి- లౌకిక జగత్తు(జీవులు నివాసమగు ఈ సంసారం)
- అడియేన్ ,దాసుడు – తమను తాము సంభోధించుకొనే సాంప్రదాయక గౌరవవాచకము(నేను కు బదులు) వినయపూర్వక తాను.
- దేవరవారు, శ్రీమాన్- ఇతర శ్రీవైష్ణవులను సంభోధించు సాంప్రదాయక గౌరవవాచకము- మీ దయ
- ఎళుందరళుతల్- వేంచేయడం(సాంప్రదాయక వచనములు)
- కణ్ వళరుతళ్ – శయనించడం.
- నీరాట్టం- స్నానమాడుట.
- శయనం – నిద్రించడం.
- శ్రీపాదం- భగవానుని/ఆళ్వారులను/ఆచార్యులను పల్లకిలో మోయుట/మోయువారు.
- తిరువడి- శ్రీపాదపద్మములు(హనుమాన్ కు సాంప్రాదాయక సంభోధన)
- వ్యాఖ్యానం- స్పష్ఠ వివరణ.
- ఉపన్యాసం – ప్రసంగం
- కాలక్షేపం- మూలమును చూచి దానిలోని వరుస వాక్యములకు చదివి దానికి విస్తృత వ్యాఖ్యానమును అనుగ్రహించుట.
- అష్ఠదిగ్గజములు- శ్రీమణవాళమాహామునులు శ్రీవైష్ణవ సత్సాంప్రదాయమును నలుదిశలా భావితరాలకు ప్రచారం చేయుటకు ఏర్పరచిన/స్థాపనచేసిన ఎనిమిదిమంది ఆచార్యులు.
- 74 సింహాసనాధిపతులు – శ్రీ రామానుజాచార్యులు శ్రీవైష్ణవ సత్సాంప్రదాయమును నలుదిశలా భావితరాలకు ప్రచారం చేయుటకు ఏర్పరచిన/స్థాపనచేసిన డెబ్బైనాలుగు మంది ఆచార్యులు.
వేదాంత/తత్త్వ సంబంధిత పదాలు
- విశిష్ఠాద్వైతం- చిత్తు అచిత్తుతో కూడుకొని ఉన్న పరతత్త్వమును(భగవంతున్ని) తెలుపు సిద్ధాంతం/తత్త్వశాస్త్రం.
- సిద్ధాంతం – ఒక నియమమును స్థిరీకరించునది.
- మిథునం- శ్రీలక్ష్మీనారాయణులు(పెరుమాళ్ మరియు పిరాట్టి)
- ఏకాయనం- శ్రియః పతిత్వమునునకు.(మహాలక్ష్మికి పతియైన వాడు) ప్రాథాన్యత ఇవ్వకుండా శ్రీమన్నారాయణుని ఆధిక్యాన్ని అంగీకరించుట.
- మాయావాదం- ఏక రూపం గల బ్రహ్మమును అంగీకరిస్తు మిగితాదంతా మిథ్యా(భ్రాంతి- లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా భావించడం) అని భావించు ఒక సిద్ధాంతం.
- ఆస్థికుడు- శాస్త్రమును ప్రమాణముగా అంగీకరించువాడు.
- నాస్థికుడు- శాస్త్రమును ప్రమాణముగా అంగీకరించనివాడు.
- బాహ్యులు- శాస్త్రమును ప్రమాణముగా అంగీకరించనివారు
- కుదృష్ఠులు- శాస్త్రమును తమకు అనుకూలంగా మారుస్తు ప్రమాణముగా అంగీకరించువారు.
- ఆప్తులు – మన ఉన్నతిని కోరువారు.
- ప్రమా – ప్రామాణిక ఙ్ఞానం
- ప్రమేయం – ప్రామాణిక ఙ్ఞానం లక్ష్యము.
- ప్రమాత – ప్రామాణిక ఙ్ఞానమును రక్షించువాడు.
- ప్రమాణం – ప్రామాణిక ఙ్ఞానమును ఆర్జించువాడు.
- ప్రత్యక్షం- ఇంద్రియ(కన్ను,చెవులు మొ||) గోచరమైనది.
- అనుమానం- పూర్వపు పరిశీలన ఆధారముగా ఉత్పన్నమైన ఙ్ఞానం.
- శబ్దం-శాస్త్ర వచనములు/ప్రామాణిక ఆధారం
- తత్త్వత్రయం- ప్రపన్నులు స్పష్ఠంగా తెలుసుకోదగ్గ మూడు అస్థిత్వముల. లోతైన విశ్లేషణకు చూడండి: http://ponnadi.blogspot.in/p/thathva-thrayam.html
- చిత్తు అచిత్తు,జీవాత్మ- ఆత్మఙ్ఞానం
- అచిత్తు,అచేతనం, ప్రకృతి- పదార్థం, జడమైనది.
- ఈశ్వరుడు – భగవాన్ శ్రీమన్నారాయణుడు
- రహస్యత్రయం- పంచసంస్కార సమయమున ఆచార్యునిచే అనుగ్రహింపబడు మూడు గోప్యమంత్రములు. లోతైన విశ్లేషణకు చూడండి: http://ponnadi.blogspot.com/2015/12/rahasya-thrayam.html .
- తిరుమంత్రం- అష్ఠాక్షరీమహామంత్రం
- ద్వయమంత్రం- రెండుగా ఉన్న మహామంత్రములు.
- చరమశ్లోకం- ‘సర్వథర్మాన్ పరిత్యజ్య’– అను గీతాశ్లోకం: ‘సకృదేవ ప్రపన్నాయ’ – అను రామ చరమశ్లోకం: ‘స్థితే మనసి’– అను వరాహ చరమశ్లోకములు. సాధారణంగా – ‘సర్వథర్మాన్ పరిత్యజ్య’– అను గీతాశ్లోకమే చరమశ్లోకముగా రూఢి అయినది.
- అర్థపంచకం- ఐదు ప్రధాన నియమాలు- పంచసంస్కారములు అనుగ్రహించేటప్పుడు ఆచార్యులు ఉపదేశిస్తారు. లోతైన వివరణ కోసం http://ponnadi.blogspot.com/2015/12/artha-panchakam.html దర్శించండి
- జీవాత్మ- లౌకిక(సంసారిక) జీవులు(మానవులు)
- పరమాత్మ – భగవానుడు
- ఉపేయం , ప్రాప్యం- పొందవలసిన లక్ష్యం -చేయవలసిన కైంకర్యం
- ఉపాయం- ఆ లక్ష్యాన్ని పొందడానికి మార్గం.
- విరోధి – ఆ లక్ష్యాన్ని పొందడానికి అడ్డంకులు
- ఆకారత్రయం – ప్రతి జీవాత్మకు ఉండవలసిన మూడు ముఖ్యమైన స్థితులు/లక్షణములు.
- అనన్యశేషత్వం- భగవంతుడే రక్షకుడని(పరత్వం) నమ్ముట.
- అనన్య శరణత్వం- భగవంతుడే ఆశ్రయించతగ్గవాడని నమ్ముట.
- అనన్య భోగ్యత్వం- సాధారణ “ కేవలం భగవంతున్ని మాత్రమే అనుభవించుట” , భగవానుడు మాత్రమే అనుభవించ యోగ్యుడు” అని నమ్మిఉండుటయే ప్రథానఉద్దేశ్యం.
- సామానాధికరణ్యం-ఒకే ఆథారముతో ఒకటి కన్న ఎక్కువ సంఖ్యలో ఉన్న కారకం/గుణం. ఒకే పరిధిని వివరించు రెండు అంతకన్నా ఎక్కువ పదాలు. దీనికి ఉదాహరణగా – మృద్గటం (మట్టి కుండ) . కుండ తయారుకావడానికి – ఆధారం(మూలం) ఆధేయం(రూపం) కావాలి. అవే మట్టి మరియు ఘటత్వం. వేరొక ఉదాహరణ- “శుక్లపటము”(తెల్లని వస్త్రం)దీనికి రెండు విశేషణములు- ఒకటి తెలుపుదనం రెండవది పటత్వం(వస్త్రం అగుట). వీటి మాదిరిగా – బ్రహ్మా/భగవానుడు సామానాధికరణ్యముగా అన్నిఅస్థిత్వములకు ఆధారం. సంస్కృతం మరియు వేదాంత ఙ్ఞానమున్న పండితులవద్ద తెలుసుకొనవలసిన లోతైన విశ్లేషణ.
- వైయాధికరణ్యం- రెండు అంతకన్నా ఎక్కువ అంశాలతో కూడికొని ఉన్న మూలం. ఉదాహరణకు- ఒక కుర్చికి భూమి ఆధారం కావచ్చు మరియు పూలకుండికి ఒక బల్ల ఆధారం కావచ్చు. వేరువేరువాటికి (అస్థిత్వాలకు )వేరువేరు ఆథారాలు ఉంటాయి.
- సమిష్ఠి సృష్ఠి- భగవానుడు ఈ సృష్ఠిని పంచభూతము వరకు నిర్వహించి జీవాత్మను బ్రహ్మలాగా నియమిస్తాడు. ఈ స్థితిని సమిష్ఠి సృష్ఠి అంటారు.
- వ్యష్ఠి సృష్ఠి- భగవానుడు బ్రహ్మను మరియు ఋషులను మొదలైన వారిని నియమించి (తాను అంతర్యామిగా ఉంటూ) అస్థిత్వాలకు వేరువేరు రూపాలను సృష్ఠిస్తాడు.
- వ్యష్ఠి సంహారం- భగవానుడు , రుద్రుడు, అగ్నికి అధికారమిచ్చి(తాను అంతర్యామిగా ఉంటూ) ఈ అస్థిత్వాలను నశింపచేస్తాడు.
- సమిష్ఠి సంహారం- భగవానుడు తనంతటతానే స్వయంగా పంచభూతములను తనలో కలుపుకొంటాడు
మిగితా వివరాలకు : http://kaarimaaran.com/downloads.html
తెలుగుసేత
అడియేన్ నల్లా శశిధర్ రామానుజదాస
మూలము: https://srivaishnavagranthams.wordpress.com/readers-guide/
పొందుపరిచిన స్థానము: https://srivaishnavagranthamstelugu.wordpress.com/
ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org
Pingback: శ్రీవైష్ణవ సరళతమ మార్గనిర్ధేశిక – ఉపోద్ఘాతం | SrIvaishNava granthams – Telugu