Monthly Archives: April 2017

సరళతమ శ్రీవైష్ణవ మార్గదర్శిక – సూచికలు

శ్రీః
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవరమునయే నమః
శ్రీవానాచల మహామునయే నమః

శ్రీవైష్ణవ సరళతమ మార్గనిర్ధేశిక

<< దినచర్య – ప్రధానాంశాలు

వివిధ రకములైన ప్రమాణసూచికలు వివిధ భాషలలో ఉన్నవి అవసరమైన విషయం  సులభగ్రాహ్యమునకు ఇక్కడ విషయాసూచికలను ఇవ్వడం  జరిగింది.

సాధారణ అనుసంధానములు 

  • http://koyil.org/index.php/portal/ – శ్రీవైష్ణవ వెబ్ సైట్ ప్రవేశ ద్వారం
  • http://acharyas.koyil.org–గురుపరంపర పోర్టల్ – అనుసంధానం –ఆళ్వారుల,ఆచార్యుల జీవిత చరితం ఆంగ్లభాషతో కలుపుకొని వివిధ భారతీయ భాషలలో(తెలుగు, హింది, కన్నడం, మలయాళం మరియు తమిళం)లభించును
  • http://divyaprabandham.koyil.org-దివ్యప్రబంధం పోర్టల్ – వివిధభాషల్లో భాషాంతరీకరణం
  • http://pillai.koyil.org/– శ్రీవైష్ణవ పరిఙ్ఞానం/బాలకుల పోర్టల్
  • http://githa.koyil.org– భగవద్గీత మరియు సంబంధిత వ్యాసములు
  • http://srivaishNavagranthams.wordpress.com– సంప్రదాయ వ్యాసములు వివిధ భాషల్లో (ఆంగ్లం, తెలుగు,హింది,కన్నడం,మలయాళం మరియు తమిళం)
  • http://ponnadi.blogspot.in, https://srivaishnavagranthamstelugu.wordpress.com/ – సంప్రదాయముపై పలు వ్యాసములు ఆంగ్లభాషయందు

ప్రత్యేక అనుసంధానములు

ప్రత్యే విషయములు

ఆచరణాత్మక మార్గదర్శకత్వం

శ్రీమతే రమ్యజామాతృ మునీంద్రాయ మహాత్మనే |                                                                          శ్రీరంగవాసినే భూయాత్ నిత్యశ్రీః నిత్య మంగళమ్||

అడియేన్ నల్లా శశిధర్ రామానుజదాస

మూలం : http://ponnadi.blogspot.in/2016/01/simple-guide-to-srivaishnavam-references.html

పొందుపరిచిన స్థానము: https://srivaishnavagranthamstelugu.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
చిన్నారుల కోసం శ్రీవైష్ణవం  – http://pillai.koyil.org

చరమోపాయ నిర్ణయం – అనుబంధము – సింహావలోకనము

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవరమునయే నమః
శ్రీవానాచల మహామునయే నమః

చరమోపాయ నిర్ణయం

<< ముగింపు

చరమోపాయ నిర్ణయం అనెడి ఈ గ్రంథములో గత అధ్యాయాలలో చూచిన అనేక విషయములను సంక్షిప్తముగా సింహావలోకనము చేసుకుందాం :

  • నాయనార్ ఆచ్చాన్ పిళ్ళై తమ గురువులైన పెరియ వాచ్చాన్ పిళ్ళైని కీర్తించి వారి అనుగ్రహము చేత ఈ గ్రంథము చేయుట జరిగినది. జగదాచార్యులైన శ్రీ రామానుజుల దివ్య గుణ వైభవమును చెబుతూ వారి అనుగ్రహమే శ్రీ వైష్ణవులను తమ చరమ గమ్యమైన పరమపదమునకు కొనిపోవుటకు హేతువు అన్న సత్యమును ప్రధాన భూమికగా చేసి ఈ గ్రంథము చెప్పటం జరిగినది.
  • ఆచార్య రత్నమాలలో ఎమ్బెరుమానార్లు మధ్యలో ప్రకాశించెడి అద్వితీయమైన వజ్రముగా చెప్పబడుచున్నారు.
  • స్వాను వృత్తి మరియు కృపా మాత్ర ప్రసన్నాచార్యుల తత్వములు ఈ గ్రంథములో వివరించిరి. అందులో ఎమ్బెరుమానార్లు కృపా మాత్ర ప్రసన్నాచార్యులుగా జగదోద్ధారకులుగా చెప్పబడినారు.
  • ఎమ్బెరుమానార్ల తిరుముడి సంబంధము చెప్పబడినది.
  • “పొలిగ! పొలిగ!” అను పాశురము ద్వారా నమ్మాళ్వార్లు శ్రీ రామానుజుల భవిష్యదవతారము గూర్చి చెప్పటమే కాక నాథమునులకు స్వప్నములో భవిష్యదాచార్యుని రూపములో దర్శన మిచ్చి నిజ రూపములో భవిష్యదాచార్య విగ్రహమును చెక్కించి ఇచ్చి అనుగ్రహించారు!
  • నాథమునులు ఆ భవిష్యదాచార్య విగ్రహమును ఉయ్యక్కోండార్ కు అనుగ్రహించారు!
  • ఉయ్యక్కోండార్ల నుంచి ఆ విగ్రహము మణక్కాల్ నంబికి దక్కినది!
  • మణక్కాల్ నంబి ఆ విగ్రహమును మరియు పారంపర్యముగా భవిష్యదాచార్య అవతారము గూర్చి వచ్చెడి రహస్య విషయములను ఆళవందార్లకు అనుగ్రహించారు!
  • ఆళవందార్లు ఇళయాళ్వారును తమ తరువాత శ్రీ వైష్ణవ ధర్మ ప్రవక్తకులుగా అనుగ్రహించి ఆశీర్వదించిరి!
  • ఆళవందార్లు భవిష్యదాచార్య విగ్రహమును తత్సంబంధిత రహస్యములను తిరుక్కోష్టియూర్ నంబికి అనుగ్రహించారు!
  • తమ వంశములో ఒక శ్రీ వైష్ణవుడు జన్మించుటచే పితృ దేవతలు ఎలా సంతోషపడతారో అలాగే శ్రీ రామానుజుల మునుపు అవతరించిన ఆచార్యులందరూ శ్రీ రామానుజులు ప్రపన్న కులములో అవతరించుట చేత పరమ సంతోషపడిరి!
  • భగవానుడు, నమ్మాళ్వార్లు, ఎమ్బెరుమానార్లు ఉత్తారకాచార్యులుగా నిరూపింపబడిరి! అందులో ముఖ్యముగా ఎమ్బెరుమానార్ల యొక్క ఉత్తారకత్వము పరమ విశేషముగా వివరింపబడినది!
  • ఎమ్బెరుమానార్ల ఆచార్య పంచకమైన పెరియ నంబి, పెరియ తిరుమల నంబి, తిరుక్కోష్టియూర్ నంబి, తిరువరంగ పెరుమాళ్ అరయర్, తిరుమాలైయాణ్డాన్ తమ ఉపదేశముల ద్వారా ఇతర అనుభవముల ద్వారా ఎమ్బెరుమానారే ఉత్తారకులుగా నమ్మి తమ పిల్లలను సైతం ఎమ్బెరుమానార్లకు శిష్యులుగా చేసినారు!
  • తిరుక్కచ్చి నంబి ద్వారా వరదరాజ పెరుమాళ్ళు ఎమ్బెరుమానార్ల గొప్పతనమును లోకానికి చాటినారు! ఎలాగైతే పెరుమాళ్ళు రామ కృష్ణాది అవతారములలో విశ్వామిత్ర, సాందీపని మొదలగు మహర్షుల వద్ద విద్య నేర్చుకున్నారో ఎమ్బెరుమానార్లు కూడా తమ అవతారములో భాగంగానే ఆళవందార్ల శిష్యులను ఆచార్యులుగా స్వీకరించి వారి వద్ద విద్య నేర్చినారని వరద రాజ పెరుమాళ్ళు చెప్పినారు!
  • వేద వేదాంతములకు వక్ర భాష్యములు చెప్పి భగవత్తత్వమును పక్కదారి పట్టించిన అద్వైతమును మరియు వేదమును వ్యతిరేకించిన శూన్య మాయావాదుల సిద్ధాంతములను ఖండించి వేదాంతమునకు సరియైన భాష్యము చెప్పి పరమాత్మ అస్తిత్వాన్ని కాపాడిన ఎమ్బెరుమానార్లే నిజమైన ఉత్తారకాచార్యులు! కనుక వారిని ఆశ్రయించుటలో మనకు ఎటువంటి సందేహము అవసరం లేదు! ఎందుకంటే భగవంతునికే ఉత్తారకాచార్యుడు శ్రీ ఎమ్బెరుమానార్లు కనుక!
  • ఎమ్బెరుమానార్ల అవతార రహస్యము బహిర్గతము చేయటమైనది! వారి అసలు రూపము నిత్యసూరులకు నాయకుడైన ఆదిశేషుడని తిరుమాళిరుంశోలై అళగర్, క్షీరాబ్ది నాధుడు, సరస్వతి మరియు తామే పలు సందర్భాలలో చెప్పినట్టు ఐతిహ్యములు చెప్ప బడినవి!
  • దేవ పెరుమాళ్, నమ్మాళ్వార్, కూరత్తాళ్వాన్ మొదలగువారి మూలముగా ఉడయవర్ల గొప్పతనము చెప్పటం జరిగినది! ఎమ్బెరుమానార్ల పట్ల శిష్యులకు ఉన్న ప్రేమాతిశయము ఎటువంటిదంటే వారి పరమపద వార్త విని ఎంతో మంది శిష్యులు తత్క్షణమే ప్రాణము విడిచి వారూ పరమపదము చేరిరి!
  • శ్రీ రామానుజుల ఉత్తారకత్వము ఎవ్వరెవ్వరి చేత నిరూపింప బడినదంటే:
    • పలు సందర్భాలలో వారే చెప్పుకొనుట
    • అరుళాళ పెరుమాళ్ ఎమ్బెరుమానార్
    • తిరువేంగడముడైయాన్
    • తిరుక్కురుంగుడి నంబి
    • నడాదూర్ అమ్మాళ్
    • సోమాసియాణ్డాన్
    • కణియనూర్ సిరియాచ్చాన్
    • పొన్నాచ్చియార్  (పిళ్ళై ఉరంగా విల్లి దాసర్ గారి భార్య )
  • ఆళవందార్లకు నాథమునుల మీద మరియు ఎమ్బెరుమానార్ల మీద గల ప్రేమాతిశయము వివరించడం జరిగినది! ఆళవందార్లు ఎమ్బెరుమానార్ల ఉత్తారకత్వమును ప్రతిపాదించుట చెప్పటం జరిగినది!
  • ప్రథమపర్వ నిష్ఠ కన్నా చరమపర్వ నిష్టకున్న గొప్పతనమును వివరంచటం జరిగినది!
  • శ్రీరామానుజుల ఉత్తారకత్వమును ప్రతిపాదించిన వారు:
  • చివరిగా తిరువరంగత్తు అముదనార్లు “ఇరామానుశ నూఱ్ఱందాది” గ్రంథములో చెప్పిన చరమోపాయ నిష్ఠుడు పాటించవలసిన ధర్మ సూత్రములు:
    • ఎమ్బెరుమానార్ల యొక్క భక్తుల సన్నిధే మన పెన్నిధి!
    • ఎమ్బెరుమానార్ల యొక్క దివ్య గుణానుభవమే మన నిత్య విధి!
    • ఎమ్బెరుమానార్ల గొప్పతనమును కీర్తించని వారి సాంగత్యమును విసర్జించ వలెను!
    • ఎమ్బెరుమానార్ల యొక్క దివ్య నామ సంకీర్తనమే (రామానుజ! భాష్యకారా! ఎతిరాజా! ఉడయవరే! ఎమ్బెరుమానారే!) మన జిహ్వకు ఉద్యోగము!
    • ఎమ్బెరుమానార్ల యొక్క దివ్య రూపమే మనకు ధ్యాన చిత్రము!
    • ప్రేమ భావముతో ఎమ్బెరుమానార్ల యొక్క భక్తులకు సేవ చేయాలి!
    • ఎమ్బెరుమానార్ల యొక్క దివ్య మంగళ విగ్రహముతో ఆత్మ సంబంధము కలిగి వుండాలి !
    • ఎమ్బెరుమానార్ల యొక్క శ్రీ చరణాలపై పెట్టిన నమ్మకమే వారి సన్నిధికి మనలను చేరుస్తుంది! అనుమానము శాశ్వత సంసారములోనికి పడదోస్తుంది!

నాయనార్ ఆచ్చాన్ పిళ్ళై తిరువడిగళే శరణం
పెరియ వాచ్చాన్ పిళ్ళై తిరువడిగళే శరణం
ఆళ్వార్, ఎమ్బెరుమానార్, జీయర్ తిరువడిగళే శరణం
జీయర్ తిరువడిగళే శరణం
ఆచార్య తిరువడిగళే శరణం

అడియేన్ శ్రీనివాస రామానుజ దాసన్

మూలము :   https://ponnadi.blogspot.in/2012/12/charamopaya-nirnayam-summary-of-events.html

పొందుపరిచిన స్థానము: https://srivaishnavagranthamstelugu.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

శ్రీవైష్ణవ సరళతమ మార్గనిర్ధేశిక – దినచర్య – ప్రధానాంశాలు

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవరమునయే నమః
శ్రీవానాచల మహామునయే నమః

శ్రీవైష్ణవ సరళతమ మార్గనిర్ధేశిక

<< అపచారముల నిర్మూలన

శ్రీవైష్ణవుల దినచర్యలో ఈ క్రింది అంశములు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నవి మరియు చాలా ప్రయోజనకరమైనవి.

 

  1. వర్ణ-ఆశ్రమ-ఙ్ఞాన భేధం చూడకుండ శ్రీవైష్ణవులను గౌరవించాలి. భగవంతుడు తాను మొదటగా ఆకాంక్షించేది    భాగవతులను(భక్తులను) గౌరవించడం.
  2. అహం మరియు స్వార్థచింతనారహిత జీవితాన్ని గడపాలి. ఆత్మస్వరూపం మరియు భగవానుని వైభవం తెలిసినప్పుడు మనం మన స్వార్థచింతనను మానివేస్తాము.
  3. క్రమం తప్పకుండ ఆచార్యున్ని దర్శించడం శిష్యుని ప్రధానలక్షణం. ఆచార్యుని   భౌతికజీవనం    గడపడానికి అవసరమైన వస్తువులను మరియు ఆర్ధికావసరాలను ఏర్పాటుచేయడం శిష్యుని విధి.
  4. .నిత్యకర్మానుష్ఠానములైన స్నాన-ఊర్ధ్వపుండ్రధారణ-సంధ్యావందనములను వారివారి     వర్ణాశ్రమధర్మాలనుబట్టి       ఆచరించాలి. ఈ ధర్మాలను ఆచరించువారు బాహ్యాంతరశుద్ధులను పొంది ఙ్ఞానసముపార్జనకు సంసిద్ధులవుతారు.
  5. సదా శ్రీచూర్ణతిరుమణ్లను ధరించాలి. ఇది భగవద్దాసులమని తెలుపు ప్రాథమికస్వరూపం. కావున ఈ స్వరూపమును నిత్యము నిర్భయముగా మరియు లజ్జారహితముగా ధరించాలి.
  6. వర్ణ-ఆశ్రమ-లింగధర్మములను అనుకరిస్తు సాంప్రదాయ వస్త్రములను ధరించాలి. మగవారైతే పంచకజ్జమును(గోచి పెట్టిన ధోవతి) ఆడవారయితే మడిసార్(గోచి పెట్టిన చీరకట్టు)ను ధరించాలి. దీనికి సిగ్గుపడనవసరం లేదు. మన సాంప్రదాయ పరంపరావైశిష్ఠ్యమును మనం గ్రహించాలి.
  7. ఆళ్వారులందరు శ్రీమన్నారాయణున్ని సదా సేవించడంలో నిమగ్నులై ఉంటారు. ఆళ్వార్లు మరియు మన పూర్వాచార్యులందరు దేవతాంతర (రుద్ర, ఇంద్ర, వరుణ, అగ్ని మరియు నవగ్రహములు మొదలైనవారు) ఆరాధనను నిరసించారు. మన పూర్వాచార్యులు ఈ విషయానికి అధికప్రాధాన్యతను ఇచ్చారు. భగవానునికి మరియు ఈ జీవాత్మకు మధ్యన ఉండు నవవిధ సంబంధములలో భర్తృభార్యాసంబంధం విశేషమైనది. ప్రాయశముగా అన్ని జీవాత్మలు స్త్రీప్రాయములే. భగవానుడు మాత్రమే పరమపురుషుడు. కావున ఈ సంబంధం భగవానుని యందు  విశ్వాస్యతను మనయందు ఏర్పరుస్తుంది. ఇది మిగితా దేవతాంతరములతో సంబంధం నెరపుటను నిరోధిస్తుంది.
  8. శ్రీవైష్ణవుని నిత్యవిధులలో గృహతిరువారాధన చాలా ప్రధానమైనది. మన గృహములందు తనను ఆరాధించుకోవడానికి భగవానుడు పరమకృపతో అర్చారూపమున దిగివచ్చాడు. దీనిని విస్మరించుట భగవానున్ని అవమానపరచడమే. భగవానుని మరచిపోవడం మన ఆధ్యాత్మికప్రగతిని నష్ఠపరచుకోవడమే. ప్రయాణంలో కూడ మన తిరువారాధన భగవానునిమోసుకపోవచ్చు. ఒకవేళ అది వీలుకాకపోతే ఇతర శ్రీవైష్ణవులు మన గృహమునకు వచ్చి ఆరాధనచేయుటను ఏర్పరచాలి అలాగే దానికి తగిన ఏర్పాటును కూడా చేయాలి లేదా ఇతర శ్రీవైష్ణవగృహములయందు ఉంచి వెళ్ళవచ్చు. ఆరాధన లేకుండ గృహమునకు తాళంవేసిఉంచడం భగవానుని అగౌరవపరచడమే. తిరువారాధన  వివరణాత్మక చర్చను ఇక్కడ పరిశీలించవచ్చు . http://ponnadi.blogspot.in/2012/07/srivaishnava-thiruvaaraadhanam.html.
  9. వారి వారి వర్ణాశ్రమధర్మాలను ఆధారంగా శాస్త్రం ఏర్పరచిన ఆహారనియమములను పాటించాలి. మొదట ఆహారపదార్థాలను భగవానునికి , ఆళ్వారాచార్యులకు నివేదన చేసిన తర్వాతనే మనం స్వీకరించాలి. భగవానుని నివేదనకు నిషిద్ధమైన పదార్థములను సమర్పించరాదు. ఆహారనియమ వివరణాత్మక చర్చను ఇక్కడ పరిశీలించవచ్చు http://ponnadi.blogspot.in/2012/07/srivaishnava-aahaara-niyamam_28.html and http://ponnadi.blogspot.in/2012/08/srivaishnava-ahara-niyamam-q-a.html.
  10. శ్రీవైష్ణవుల సాంగత్యమును ఆశించాలి. ఈ సాంగత్యం వలన  ఆధ్యాత్మికభావనాప్రవాహం వృద్ధిచెంది ఉజ్జీవనమునకు దారితీయును.
  11. మన జీవితంలో దివ్యదేశములు, ఆళ్వారుల మరియు ఆచార్యుల అవతారస్థలములు మరియు అభిమానస్థలముల దర్శనమునకు ప్రాధాన్యతనివ్వాలి. దివ్యదేశములయందు కైంకర్యమును చేయవలెను. ఒకవేళ ప్రస్తుతం కైంకర్యము చేయవీలుకాకపోతే కనీసం దివ్యదేశయాత్రనైన తరచుగా చేయాలి. భవిష్యత్తులోనైన ఈ కైంకర్యం చేయాలని ప్రయత్నించాలి.
  12. శ్రీవైష్ణవులకు దివ్యప్రబంధము చాలాముఖ్యమైన అంశం. పాశురములను అభ్యసించి, పూర్వాచార్యుల వ్యాఖ్యానముననుసరించి వాటి అర్థములను తెలుసుకొని అనుష్ఠానమున పెట్టవలెను. ఈ మూడు విషయములు శ్రీవైష్ణవత్వమును పెంపొందిస్తాయి. దివ్యప్రబంధఙ్ఞానం ప్రాపంచిక సుఖములయందు అశ్రద్ధను, భగవంతుని మరియు భాగవతులయందు శ్రద్ధను నిలుపుటకు తోడ్పడతాయి.
  13. పూర్వాచార్యుల జీవన అనుష్ఠానం మనకు ఙ్ఞానార్జనకు మరియు  ప్రేరణకు తోడ్పడతాయి. ఈ రోజు మనమందరం విషమ పరిస్థిలను/ సంధిగ్ధావస్థలను దాటి  నిలబడ్డామంటే అది పూర్వాచార్యులు తమ జీవన అనుష్ఠానములో ప్రదర్శించిన కరుణ మరియు  సౌలభ్యమే .
  14. పూర్వాచార్యుల సాహిత్యపఠనం చాలా విశేషం. ప్రతిఒక్కరు ప్రతిదినమునందు కొంత సమయమును ఈ లభిస్తున్న సాహిత్యనిధిని పఠించుటకు కేటాయించాలి. ఈ సాహిత్యం మనకు వేదాంతం,దివ్యప్రబంధం , స్తోత్రగ్రంథములు ,వ్యాఖ్యానములు మరియు చారిత్రాత్మక సంఘటనలు అనే రూపములో లభిస్తున్నాయి.  ఈ విషయపరిఙ్ఞానము ఈ వెబ్ సైట్ నందు లభించును http://koyil.org/index.php/portal/
  15. ఆవశ్యకమైన సూత్రములను విద్వాంసుల నుండి కాలక్షేపముగా శ్రవణం( మూలమును అనుసరించి చెప్పు వ్యాఖ్యాన ప్రవచనం)చేయడం చాలా అవసరం. ప్రస్తుత కాలములో చాలా ప్రవచనములు CD మరియు  websites నందు విరివిగా లభిస్తున్నాయి. ప్రవచనములను ప్రత్యక్షముగా  విననివారు ఈ లభిస్తున్న వాటిని ఉపయోగించుకోవాలి. అవకాశం దొరికినప్పుడు సమయానుకూలతను  బట్టి వీటిని ఉపయోగించుకోవచ్చు.
  16. కైంకర్యమునందు సదా నిమగ్నమై ఉండాలి. “ కైంకర్యము చేయకుంటే శేషత్వం లోపించును” అనేది శాస్త్రవచనం. కావున శ్రీమన్నారాయణునియందు,ఆళ్వారాచార్యులయందు దాసత్వం ప్రదర్శించాలి. ప్రతి ఒక్కరు ఏదో ఒక కైంకర్యమును విధిగా చెయ్యాలి. అది భౌతిక, మానసిక , ఙ్ఞానసంబంధిత కైంకర్యము కావచ్చును. ఇలా కైంకర్యమునందు చాలా విధములున్నవి. ప్రతి ఒక్కరు ఏదో ఒక కైంకర్యమునందు నిమగ్నమై ఉండాలి. ఇది భగవంతుని యందు భాగవతులయందు స్థిరమైన కైంకర్యబుద్ధిని ఉండేలా చేస్తుంది.
  17. భగవానుని యందు మరియు ఆళ్వారాచార్యులయందు కైంకర్యఙ్ఞానం ఉన్న భాగవతులకు మరియు ఇతరులకు సహాయం చెయ్యవలెను. ఇలాంటి స్థిరమైన(విచ్చిత్తిలేని కైంకర్యఙ్ఞానం)ఙ్ఞానం కలవారితో సంపర్కం వలన పరస్పరం  ప్రయోజనం ఉంటుంది, అనగా చెప్పేవారు వినేవారు ఇద్దరు గుణానుభవం చేస్తారు. ప్రతిఒక్కరు ఉజ్జీవించాలనే ఏకైక పరమప్రయోజనముగా  ఈ ఙ్ఞానమును మన పూర్వాచార్యులు పరంపరగా అందించారు. కావున  మనమందరం ఈ ఙ్ఞానమును సరైన మార్గదర్శకత్వములో జాగ్రత్తగా చదివి మన కుటుంబసభ్యులకు, బంధువులకు,మిత్రులకు మరియు అభిలాష ఉన్న వారందరికి అందించాలి. ఇదే మన  కర్తవ్యం.
  18. ఆత్మస్వరూపగుణమగు నిత్యానందమును పొందడానికి ప్రయత్నంచేయవలెను. నిజమైన శ్రీవైష్ణవుడు మృత్యువుకు భయపడడు, కారణం శ్రీవైకుంఠమునందు  భగవానుని  నిత్యకైంకర్యము చేయు భాగ్యంలభిస్తుంది దీనివల్లనే. మన ఆళ్వారులు మరియు ఆచార్యులందరు నిత్యవిభూతి యందు ఉన్నప్పుడు భగవద్భాగవత కైంకర్యమును చేసేవారు, ఆ తర్వాత పరమపదమునకు వెళ్ళినను భగవద్భాగవత కైంకర్యమునే ఆశించేవారు.

అడియేన్ నల్లా శశిధర్ రామానుజదాసు

మూలం : http://ponnadi.blogspot.in/2016/01/simple-guide-to-srivaishnavam-important-points.html

పొందుపరిచిన స్థానము: https://srivaishnavagranthamstelugu.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
చిన్నారుల కోసం శ్రీవైష్ణవం  – http://pillai.koyil.org

చరమోపాయ నిర్ణయం – ముగింపు

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవరమునయే నమః
శ్రీవానాచల మహామునయే నమః

చరమోపాయ నిర్ణయం

<< భగవద్రామానుజుల ఉత్తారకత్వము – 3

గత మూడు అధ్యాయాలలో జగదాచార్యులైన ఎమ్బెరుమానార్ల యొక్క ఉత్తారకత్వమును అనుభవించి యున్నాము! ఇక ఇంత అద్భుతమైన గ్రంథము యొక్క ముగింపు చూద్దాము!

(గమనిక : ఈ ముగింపు భాగము తిరువరంగత్త అముదనార్లు రచించిన “ఇరామానుశ నూఱ్ఱందాది” అను ప్రబంధమును ఆధారముగా చేసుకొని చెప్పడం జరుగుతున్నది! అముదనార్లుకు ఉడయవర్లపై గల అసాధారణ మరియు నిరుపమాన భావానుభూతులు ఈ ప్రబంధము ద్వారా మనం తెలుసు కొనవచ్చును! ఈ ప్రబంధమును నాలాయిర ప్రబంధములలో చేర్చ వలెనని మరియు తిరు వీధులలో స్వామి పురప్పాడు (ఊరెరిగింపు) జరుగునపుడు ఈ ప్రబంధమును ఆచార్య పురుషులు అనుసంధించ వలెనని సాక్షాత్తు శ్రీ రంగనాధుడే (నమ్పెరుమాళ్) ఆజ్ఞ చేసాడు! దీని వలన భగవంతునికి కూడా ఈ ప్రబంధము పట్ల ఉన్న అభిమానము స్పష్ట మగుచున్నది! ఈ ప్రబంధమునకు “ప్రపన్న గాయత్రి” అని పేరు! ఈ ప్రబంధమును స్త్రీ పురుష వర్ణ వయో భేదములు లేక రామానుజ దాసులైన వారెల్లరూ గాయత్రి అనుష్టానము వలె దీన్ని అనుసంధించు కోవచ్చునని ఆర్యోక్తి !! అంటే గాయత్రి ఎంత జపిస్తే అంత శక్తిమంతమో ఈ ప్రబంధము కూడా ప్రపన్నులైన రామానుజ దాసులకు ఎంత పాడు కుంటే అంత రామానుజ కటాక్షము!!

జగదాచార్యులైన స్వామి రామానుజులు – శ్రీ పెరుంబుదూరు

గతములో తెలుసుకున్నట్లు ఎమ్బెరుమానార్లే జగదాచార్యులు, ఉత్తారకాచార్యులు! ఉడయవర్లు ఈ ఘోర కలిలో సామాన్య జనులకు  సైతం మోక్షార్హత కల్పించి వారిని సంసారము నుండి కాపాడి సద్గతుల నిచ్చు ఒక ప్రత్యేక అవతారముగా వచ్చి నటువంటి పరమ ప్రేమైక మూర్తి! వారి శ్రీచరణాలే పరమమని నమ్మి జీవించెడి చరమపర్వనిష్ఠులైన శ్రీవైష్ణవులకు నిస్సందేహముగా వారే ఉపాయము మరియు ఉపేయమున్నూ!

  • 105వ పాశురములో చెప్పినట్లు, “ఇరామానుసనై తొళుమ్ పెరియోర్ ఎళుందిరైత్తాడుమ్ ఇడం అడియేనుక్కు ఇరుప్పిడమే – పెద్దలైన శ్రీ వైష్ణవులు ఎక్కడైతే రామానుజుల దివ్య వైభవాన్ని గానం చేస్తారో అక్కడే నాకు స్థానమ”, అని చెప్పినట్లు ప్రపన్నులు ఉండదగిన చోటు రామానుజ వైభవము కీర్తించెడి పెద్దల సాంగత్యములోనే.
  • 94వ పాశురములో “ఉవందరుందేన్ అవన్ సీర్ అన్ఱి యానోన్ఱుమ్ ఉళ్ మగిళ్ న్దే – రామానుజుల వైభవ కీర్తనము తప్ప మరేదీ మనసులో నిలుపజాలను”, అని చెప్పినట్లు చేయవలసిన కార్యము నిరతము రామానుజ దివ్యగుణ కీర్తనమే! ఇదే అర్థము 2వ పాశురములో కూడా ధ్వనిస్తుంది, “ఇరామానుశన్ మిక్క సీలమల్లాల్ ఉళ్ళాదు ఎన్నెన్జు – రామానుజ తత్వముపై తప్ప తక్కిన విషయములపై నిలువదు నా మనసు ” ! కనుక చరమాధికారుల (ఆచార్య నిష్టులు) పరమ గమ్యము రామానుజుల దివ్యగుణ స్మరణమే!
  • 15వ పాశురములో చెప్పినట్లు, “ఇరామానుసన్ తన్ పిరంగియశీర్ సారా మనిసరై చ్చేరేన్ ఎనక్కెన్న తాళ్వినైయే – రామానుజుల దివ్యగుణములను అనుభవించని మనుష్యులతో చేరను! వారితో నాకేమి లాభము? “, అని చెప్పినట్లు రామానుజ గుణానుభవము చేయని వారి సాంగత్యమును విసర్జించవలెను! “అటువంటి వారితో చేరకపోవుట చేత నాకెటువంటి నష్టము లేదు!” అని అముదనార్లు పాశురములో చెప్పుటచే, “రామానుజ గుణానుభవత్యక్తుల సాంగత్యము మనకు నష్టమును కలిగించును”, అని అర్థము చేసుకొనవలెను! దీని వలన స్వరూప నాశనము జరుగునని రూఢి అగుచున్నది!
  • 28వ పాశురములో, “ఇరామానుశన్ పుగళ్ అన్ఱి యెన్ వాయ్ కొంజిప్పరవగిల్లాదు – రామానుజుల గుణ వైభవ కీర్తనము తప్ప నా నోరు పక్క దారి పట్టి ఎగుర లేదు! ” అని చెప్పినట్లు ఎల్లప్పుడూ రామానుజుల గుణానుభవ కీర్తనమే జిహ్వకు ఉద్యోగముగా చేయవలెనని అర్థము!
  • 35 వ పాశురములో చెప్పిన విధముగా, “ఇరామానుశన్ మన్ను మామలర్ తాళ్ అయరేన్ – రామానుజుల దివ్యచరణ కమలాలను ఎన్నటికీ మరువను”, అనునట్లు సదా రామానుజుల చరణ సరోజములను ధ్యాన మందు నిలుపు కొనవలెనని అర్థము! ఎందు కంటే ఆ చరణములు సకల పాప హరణములు! అంతర్బాహ్య శుద్ధి కరణములు ! వాటిని ఎన్నటికీ మరువరాదు!
  • 107 వ పాశురములో, “ఉన్ తొండర్గట్కె అన్బుత్తిరుక్కుమ్ బడి ఎన్నై యాక్కి అంగాట్పడుత్తే – నీ దాసుల యందు ప్రియము కల్గి ఉండునట్లు నను నీవే చేసి అనుగ్రహించుము”, అని చెప్పినట్లు చరమ పర్వ నిష్టుల కర్తవ్యము (స్వరూపము) రామానుజుల దాసులైన శ్రీ వైష్ణవుల పట్ల అభిమానము కలిగి వారి యెడల సేవాభావముతో జీవించుట!
  • 104 వ పాశురములో చెప్పినట్లు, “ఉందన్ మెయ్యిల్ పిరంగియ శీర్అన్ఱి వేణ్డిలన్ యాన్….. ఇవ్వరుళ్ నీ సెయ్యిల్ తరిప్పన్ ఇరామానుశా – నీ దివ్య మంగళ విగ్రహ సందర్శనము తప్ప వేరేదీ కోరేవాడను కాను – అది నాకు అనుగ్రహిస్తే తరిస్తాను”, అని చెప్పినట్లు రామానుజుల దివ్య మంగళ విగ్రహమును సందర్శనమే మనస్సుకు పరమౌషధముగా భావించ వలెను!
  • 80 వ పాశురములో, “ఇరామానుశన్ తిరునామం నమ్బవల్లార్ తిరత్తై ….శైయ్వన్ సోర్విన్ఱియే – రామానుజుల తిరు నామము జపించెడి ఉత్తములైన శ్రీ వైష్ణవులను మనసా వాచా కర్మణా సేవిస్తాను”, అని చెప్పినట్లు రామానుజ ధ్యాన పరాయణులైన శ్రీ వైష్ణవ శిఖామణులను ఎల్లపుడు సేవిస్తూ వారికి మనసా వాచా కర్మణా సేవ చేయవలెను! మరియు 46 వ పాశురములో, “ఇరామానుశన్ తిరునామమ్ నమ్బిక్కల్లార్ అకలిడత్తోర్ ఎదు పేరెన్ఱు కామిప్పరే – రామానుజుల తిరు నామము నమ్మని వారికి ఈ లోకములో ఏది గతియని చూపించండి చూద్దాం?”, అని చెప్పుటలో రామానుజులను నమ్మని మూఢులకు లోకములో మోక్షము కొరకు వేరు గతి ఉండదని తెలుసుకోవాలి!

కూరత్తాళ్వార్లను సేవించెడి తిరువరంత్త అముదనార్లు – అముదనార్లు కూరత్తాళ్వార్ల వద్ద సమాశ్రయణము రామానుజసంబంధమును పొందారు

అముదనార్లు ఈ అద్వితీయమైన ప్రబంధమును శ్రీ రామానుజులు వేంచేసి ఉన్న కాలములోనే రచించి గానము చేసినారు! శ్రీ రామానుజుల చేత మరియు నంబెరుమాళ్ళయిన శ్రీ రంగనాథుని చేత ఆమోదించబడిన ఈ గ్రంథములో చెప్పిన చరమ పర్వస్థ నియమాలు సూత్రాలు నిస్సందేహముగా పాటించదగినవని పూర్వాచార్యుల ఉవాచ! ఎందు కంటే :

సత్యం సత్యం పునస్సత్యం యతిరాజో జగద్గురుః !
స ఏవ సర్వలోకానామ్ ఉద్ధర్తా నాత్ర సంశయః !!

అర్థము : సత్యం! సత్యం! మరల సత్యం ! యతిరాజులే జగద్గురువులు ! వారే సర్వలోకులను ఉద్ధరించగలరు ! ఇందులో సందేహము లేదు!

ఇరామానుశన్ మన్ను మామలర్ తాళ్ పొరుందానిలై యుడై ప్పున్మయిలోర్కు

ఒన్ఱుమ్ నన్మై శెయ్యా ప్పెరుందేవరై ప్పరవుమ్ పెరియోర్ తమ్ కళల్ పిడిత్తే  – 62 వ పాశురము

అర్థము – రామానుజుల శ్రీ చరణాలను ఆశ్రయించని దుర్మార్గులకు కొంచెము కూడా సహాయపడని గొప్ప దేవతలైన పెద్దల శ్రీచరణాలను ఆశ్రయిస్తాను!

చరమోపాయ నిర్ణయము ముగిసినది !!

నాయనార్ ఆచ్చాన్ పిళ్ళై తిరువడిగళే శరణం
పెరియ వాచ్చాన్ పిళ్ళై తిరువడిగళే శరణం
ఆళ్వార్, ఎమ్బెరుమానార్, జీయర్ తిరువడిగళే శరణం
జీయర్ తిరువడిగళే శరణం
ఆచార్య తిరువడిగళే శరణం

అడియేన్ శ్రీనివాస రామానుజదాసన్

మూలము:   https://ponnadi.blogspot.in/2012/12/charamopaya-nirnayam-conclusion.html

పొందుపరిచిన స్థానము: https://srivaishnavagranthamstelugu.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

చరమోపాయ నిర్ణయం – భగవద్రామానుజుల ఉత్తారకత్వము – 3

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవరమునయే నమః
శ్రీవానాచల మహామునయే నమః

చరమోపాయ నిర్ణయం

<< భగవద్రామానుజుల ఉత్తారకత్వము – 2

గత అధ్యాయములో (https://srivaishnavagranthamstelugu.wordpress.com/2016/12/01/charamopaya-nirnayam-ramanujar-our-saviour-2/) భగవద్రామానుజుల ఉత్తారకత్వ ప్రభావము పెద్దలు పొందిన కొన్ని అనుభవాల మూలముగా తెలుసుకున్నాము! ఇక ఈ అధ్యాయములో స్వామి వారి ఉత్తారకత్వ వైభవమును మరి కొన్ని ఐతిహ్యముల ద్వారా తెలుసు కుందాము!!

ఒకనాటి రాత్రి ఎంబార్ భగవద్ గుణానుభవము గావిస్తూ తిరు వీధులలో నడుస్తూ ఉండగా భట్టర్ వారిని సమీపించి అంజలి ఘటించి, “ద్వివిధములైన ఆచార్యత్వము (స్వాను వృత్తి ప్రసన్నాచార్యత్వము, కృపా మాత్ర ప్రసన్నాచార్యత్వము) మరియు తద్విషయ స్వీకారత్వమున్ను (స్వగత స్వీకారము, పరగత స్వీకారము) ద్వి విధములై ఉన్నందున ఎందులో చరించవలెనో దేవరవారే అనుగ్రహించ వలసింది!”, అని ప్రార్థించగా ఎంబార్, “కృపా మాత్ర ప్రసన్నాచార్యత్వము, పరగత స్వీకారమే ఉత్తమమైన మార్గములు! అవి ఉడయవర్ల విషయములో మెండుగా ఉన్నవని మేము గ్రహించితిమి! మీరు కూడా మిమ్ములను శ్రీ రంగనాధుడు తమ పుత్రునిగా స్వీకరించాడని, పరమ భక్తి జ్ఞాన వైరాగ్య సంపన్నులైన కూరత్తాళ్వాన్ పుత్రుడనని, సకల విద్యా పారంగతుడనన్న అహంకారము ఇత్యాది జాడ్యములను దరి చేరనీయక మా వలె ఉడయవర్లే ఉత్తారకులుగా నమ్మి వారి వద్ద ఉత్తారక ప్రతి పత్తి చేయండి!”, అని బదులిచ్చెను!

భట్టర్ నంజీయరుకు తిరువాయ్మొళి వ్యాఖ్యానమును కాలక్షేపమును అనుగ్రహించి నపుడు “ప్రత్యక్షే గురవః స్తుల్యః – ప్రత్యక్షములో ఆచార్యులు స్తుతించదగినవారు”, అను విధముగా నంజీయర్ భట్టర్ ను పలు విధములుగా స్తుతించి, “దాసుని శిరస్సుపై దేవర వారి శ్రీ చరణాల నుంచి దాసుని అనుగ్రహించి తరింప చేయండి!”, అని ప్రార్థించగా భట్టర్ అటులనే ఏకాంతముగా నంజీయర్ శిరస్సుకు తమ పాద స్పర్శనము చేసి ఇటులనిరి, “ఈ పాదాలు కాదు మీరు శరణు వేడవలసింది! ఆచార్య కటాక్షముపై మీకు నమ్మకము కలుగచేయుట కొరకే మేమెటులచేసితిమి! మీకు, మాకు, మిగిలినవారందరికి ఉడయవర్లే ఉత్తారకులు! వారే జీవులకు చరమోపాయము! ఈ సత్యమును మనస్సులో ఉంచుకుని తదేక నిష్ఠులై జీవించండి! లేక పోతే నిత్య సంసారిగా మిగిలి పోతారు జాగ్రత్త!” దీనివల్ల మనకు తెలియునదేమనగా ఉడయవర్ల శ్రీ చరణాలను ఆశ్రయించుటయే ఉజ్జీవనమునకు హేతువు! మిగిలినవి ఉజ్జీవకములుగా భావించుట అజ్ఞానము!

ఈ అర్థమును అముదనారు “ఇరామానుశ నూఱ్ఱందాది”లో చక్కగా అనుగ్రహించారు!

పొయ్యై చ్చురక్కుమ్ పొరుళై త్తురందు
ఇంద ప్పూదలత్తే మెయ్యై పురుక్కుమ్ ఇరామానుశన్ నిర్క
వేఱు నమ్మై ఉయ్యక్కొళ్ళవల్ల దైవ మిన్గు యాదెన్ఱు ఉలర్న్దు
అవమే అయ్యప్పడానిఱ్పర్ వైయ్యత్తుళ్ళోర్ నల్లఱి విళిన్దే! – 79వ పాశురము

భావము – అసత్య ప్రచారములు (వేదమును అంగీకరించని మతాలు) చేయు బాహ్యములను, మరియు కుదృష్టులను (వేదమును అంగీకరించియును తప్పుడు అర్థమును బోధించెడి మతములు) రూపు మాపి జనులకు నిజమైన జ్ఞానమును అందించుటకు శ్రీ రామానుజులు సిద్ధముగా ఉండగా ఈ లోకులు ఎందులకు వేరే దైవము వచ్చి తమను ఉద్ధరిస్తుందని ఎదురు చూస్తారు?

అని చెప్పడం చేత ఉడయవర్ల తరువాత జనులను ఉజ్జీవింపజేసేది ఇక భగవానుడే! అయితే చరమపర్వమగు ఉడయవర్లు వేంచేసి ఉండగా, ప్రథమపర్వమగు భగవంతుని ఆశ్రయించుట అజ్ఞాన కార్యమగును! మనవద్దకొచ్చిన చరమపర్వమును విడిచిపెట్టి విప్రకృష్టమగు ప్రథమ పర్వమును పట్టుకొనుట అజ్ఞానమే కదా!

ఎట్ట ఇరుంద కురవై ఇఱై ఎన్ఱు అన్ఱు విట్టు
ఓర్ పరనై విరుప్పురుతల్
పొట్టనైత్తన్ కణ్ సెంబళిత్తు కై తుఱత్తి నీర్ తూవి
అంబుదత్తై పార్తిరుప్పాన్ అన్ఱు -జ్ఞాన సారము – 33వ పాశురము

భావము – తనకు చేరువనున్న గురువును కాదని ఎక్కడో మనకు కనపడని దూరములో నున్న దైవమును ప్రార్థించుట ఎటులన్న దాహము గొన్నపుడు దరిలో నీరుండగా ఆకాశముకేసి చూసి వానకై నిరీక్షించి నట్టు ఉండును!
అని దృష్టాంత సహితముగా అరుళాళప్పెరుమాళ్ ఎమ్బెరుమానార్ అనుగ్రహించారు కదా!

(గమనిక – ఈ పాశురమును వ్యాఖ్యానించు సమయములో స్వామి మణవాళ మహాముణులు ఒక శ్లోకము చెప్పియున్నారు! అది “చక్షుర్గుమ్యం గురుం త్యక్త్వా శస్త్రగమ్యం తు యః స్మరేత్! కరహస్తం ఉదకమ్ త్యక్త్వా కా నస్థం ఆభివాఛతి !!” మహాముణులు జ్ఞాన సారము యొక్క గొప్పతనమును అవతారికలో అద్భుతముగా చెప్పియున్నారు! గ్రంథ కర్త అయిన అరుళాళ ప్పెరుమాళ్ ఎమ్బెరుమానార్ ఉడయవర్లకు ప్రత్యక్షంగా శుశ్రూష చేసి వారి వద్ద నేర్చుకున్న అత్యంత క్లిష్టతరమైన చరమోపాయమును బహు సులభముగా సామాన్యులకు అర్థమగు నట్లు చిన్న చిన్న ఉదాహారణలతో విశదీకరించి యున్నారు!)

“చరమపర్వమునకు తగనివాడు ప్రథమ పర్వమునకు కూడా తగడు!”, అని వంగి పురత్తు నంబి గారి సూక్తి! తదీయ శేషత్వ జ్ఞానము లేని వాడికి తచ్చేషత్వ జ్ఞానము కూడా లేకుండా ఉండును! భగద్విషయము నందు జ్ఞానము లేనివాడు దాన్ని పొందుటకు ఆచార్యుని ఆశ్రయించ వలెను! ఆచార్యాభి మాననిష్ఠుడు ప్రథమ పర్వ మందు తలదూర్చడు! ఆచార్యాభిమానము కోల్పోయిన వాడు భగవద్కృతమైన స్వరూప సంకోచమును పొందుతాడు! ఈశ్వరాభిమానమును కోల్పోయినవా డు ఆచార్యాభిమాన మందు ఒదిగి ఉండవలెను! చరమోపాయ నిష్ఠునకు ఈశ్వరాభిమానము అవసరం లేదని ఇక్కడ చెప్ప వచ్చు ! దీని బట్టి చెప్ప వచ్ఛేదేమిటంటే ఉడయవర్ల అభిమానము పొందని వానిని ఈశ్వరుడు కూడా విడిచి పెడతాడు! ప్రథమ పర్వమైన ఈశ్వరుడు దోషదర్శనము చేత చేతనుని విడిచి పెడతాడు! కానీ, చరమ పర్వమైన ఆచార్యుడు, అనగా, ఉడయవర్లు మాత్రం విడిచి పెట్టరు! ఉడయవర్ల శ్రీ చరణ సంబంధము పొందాక ఇక సద్గతి కొరకు భగవంతుని ప్రార్థన చేయ నక్కరలేదు కదా – అని అర్థము! “తేవు మత్తఱియేన్ మేవినేన్ అవన్ పొన్నడి మెయిమ్మయే – వేరొక దైవమెరుగను ! శ్రీ  శఠకోపుల బంగారు పాదములాశ్రయించాను (కణ్ణినుణ్-2)” అనువిధముగా జీవించినట్లైతే సద్గతి తప్పక కలుగును కదా! ఎందు కంటే ఆశ్రయించెడి చరణాలు “పొన్నడి – బంగారు పాదాలు” కనుక! ఈ విధముగా అన్ని ప్రకారములుగా అందరికి ఉత్తారకులు ఉడయవర్లే కనుక కొరత చెందే పని లేదు ! అటువంటి ఉడయవర్ల యొక్క అభిమానమును మనసారా పొందనివారు నిత్య సంసారులుగానే మిగిలిపోతారు!

ఉడయవర్ల శ్రీ చరణాలు ఆశ్రయించిన వారు వారి తిరు నామమును నిత్యమూ స్మరించు కోవాలి! అముదనార్లు ఉడయవర్ల యొక్క తిరునామము యొక్క గొప్పతనమును వారి యొక్క శ్రీ చరణ కమల ప్రావణ్య జనకముగా ఈ విధముగా చెప్పియున్నారు, “ఇరామానుశన్ చరణారవిందం నామ్ మన్ని వాళ నెంజే! సొల్లువోమ్ అవన్ నామంగళే! – ఇరామానుశ -1” అని చెబుతూ, “నామ్ మన్ని వాళ  అవన్ నామంగళే సొల్లువోమ్!” అని చెప్పుట వలన ఉడయవర్ల యొక్క నామజపము చేయని యెడల వారి యందు భక్తితో జీవించ లేమని అర్థము! వారిని ఆశ్రయించి జీవిస్తున్నట్లైతే శ్రీ రామానుజ నామస్మరణ అనుసంధించవలెనని అదే వారి శ్రీ పాద కమలాల యందు ప్రావణ్యమును పెంపొందింప జేయగలదని అర్థము! ఈ విధముగా ఉడయవర్ల తిరునామమును అనుసంధించు కొనుచు వారి శ్రీ చరణాలను ఆశ్రయించిన వారికి ప్రాప్య ప్రాపకములు రెండూ వారే కదా! “పేఱొన్ఱు మత్తిల్లై నిన్ చరణన్నిఅప్పేఱళిత్తర్కు యారొన్ఱుమిల్లై మత్త చ్చరణన్ని- ప్రాప్యము ఏది లేదు నీ శ్రీచరణాలు తప్ప! ఆ ప్రాప్యమును ఇచ్చునట్టి ప్రాపకమూ వేరేదీ లేదు నీ శ్రీ చరణాలు తప్ప – ఇరామానుశ – 45” అని ప్రాప్య ప్రాపకములు రెండూ ఉడయవర్ల యొక్క శ్రీ చరణాలే అని ఉద్ఘాటించారు అముదనార్లు!

వడుగ నంబి ఒకనాడు ఉడయవర్ల సభలోకి ప్రవేశించి ఉడయవర్లకు దండం సమర్పించి నిలుచుంటే, ఉడయవర్లు వారిని ఉద్దేశించి, “మన మధురకవులు వచ్చారు!” అన్నారుట! నమ్మాళ్వారుకు ఒక మధురకవులు ఉన్నారు కదా! అంత అభిమానము వడుగ నంబి మీద ఉడయవర్లకు! వడుగ నంబి కూరత్తాళ్వార్లను, ముదలియాణ్డాన్ ను ఉద్దేశించి, “ఇరుకఱైయర్- ఇరుతీరాలవారు”, అని పిలిచేవారుట! అంటే శ్రీ రామానుజులు, భగవంతుడు అంటే రెండు తీరాలను పట్టుకుని ప్రవహించే శుద్ధ గంగానది వంటి వారని వారి ఉద్దేశ్యము!

ఒకనాడు ఉడయవర్లు వడుగ నంబిని పిలిపించి, “వడుగా! ఆచార్యాభిమాన నిష్ఠుడు ఎలా ఉండవలెను?”, అని అడుగగా నంబి, “వేంబిన్ పుళుపోలే ఇరుప్పన్ – వేపలోని పురుగువలె ఉంటాడు”, అన్నారుట! దానికి అర్థము వేప చెట్టును పట్టుకుని బ్రతికే పురుగు వేపరుచి తప్ప వేరు రుచి ఎరుగదు!  “కఱుమ్బిన్ ఫుళు – చెఱకులోని పురుగు” వలె అన్య ఆస్వాదనాలాలస కలుగనిదై ఉండును! అదే విధముగా ఆచార్యాభిమాన నిష్ఠుడు కూడా వేప పురుగు వలె ఒక ఆచార్యుని మాత్రమే ఆశ్రయించి వారి అనుగ్రహము చేత ముక్తిని పొందుతాడు తప్ప వేరు ఆలోచన కూడా మనసుకు రానీయడు! మరి ఇక్కడ చెఱకు పురుగు అంశం ఎందుకంటే ఆచార్యుడు ఎంత దయాళువై ఉన్ననూ తననే నమ్ముకుని ఉన్న శిష్యుని పట్ల విరసభావమును పొంది ఘాతుక దశలో ఉన్ననూ, “నానున్నై యన్ఱి ఇలేన్ (నాన్ముగన్ తిరు -7 ) – నిన్ను వదిలి నేను ఉండలేను” అనువిధముగా ఆచార్యుడు లేకపోతే వేరు గతి లేదను ప్రగాఢ నమ్మకంతో, “కళైకణ్ మఱ్ఱిలేన్ (తిరువాయ్మొళి-5-9-8) – వేరు రక్షకుడు లేనివాడను”, అన్నంత ఆచార్య అభిమాన నిష్ఠ కలిగి ఉండవలెను! అందుచేత ఉడయవర్ల విషయములో ఒదిగి ఉన్నవాడు తదేక నిష్టుడై ఉండి తద్వ్యతిరిక్త విషయములలో ఆసక్తి లేనివాడై ఉండవలెనని అర్థము! అత్యంత గొప్పదైన పరమోత్కృష్టమైన వస్తువు సొంతమైతే ఇంక మిగిలిన విషయములు అవసరము లేదు కదా! “పల్లుయిఱ్కుమ్ విణ్ణిన్ తలైనిన్ఱు వీడళిప్పాన్ నమ్మిరామానుశన్ -(ఇరామానుశ – 95) పలు జీవులకు పరమపదములో తన పురుషకారము చేత చోటు ఇప్పిస్తారు శ్రీ రామానుజులు” అని ఉడయవర్ల యొక్క  గొప్పతనమును చెప్పారు కదా సకల శాస్త్ర ప్రావీణ్యులైన అముదనార్లు!

నంబిళ్ళై ఒకనాడు ఉడయవర్ల సన్నిధికి వెళ్లి దండము సమర్పించి, నూఱ్ఱందాది అనుసంధించి, “ఈనాడు దాసుడుకి ఒక హితమును అనుగ్రహించండి!”, అని ప్రార్థించారుట! ఆనాటి రాత్రి ఉడయవర్లు స్వప్నములో దర్శనమిచ్చి తమ తిరువడిగళ్లను నంబిళ్ళై శిరస్సుపై ఉంచి ‘మీకు హితము చేకూరవలెననిన మా పాదాలే రక్షకముగా భావించండి! మిమ్మలను ఆశ్రయించినవారికి కూడా వీటినే రక్షకములుగా ఉపదేశించండి! దీనిని మించిన హితము లేదు!'”, అని ఉపదేశించిరి! నిదురలేచిన నంబిళ్ళై ఆనంద బాష్పాలతో పరవశులై తమ కుమారుడైన పెరియ వాచ్చాన్ పిళ్ళైని పిలిచి స్వప్న వృత్తాన్తమును చెప్పి సంతోష పడిరి! నంబిళ్ళై చరమ దశలో ఉండగా వారి కుమారులు సమీపించి తమకు దిక్కేది బాధపడు చుండగా నంబిళ్ళై, “ఎమ్బెరుమానార్ల శ్రీ చరణాలు మనకు రక్షకములు! వేరు హితమేమి అవసరము? వారి అభిమాన మందు అన్తర్భూతులై ఉంటే మన హితము కొరకు ఆలోచించాల్సిన అవసరము రాదు! అదే నిష్ఠతో జీవితము గడపండి! నేను పొందే పరమపదము మీకు కూడా లభిస్తుంది!”, అని ఉపదేశించారుట !
ఇక వచ్చే అధ్యాయములో ఈ గ్రంథము యొక్క ముగింపు విషయములను తెలుసుకుందాము!

అడియేన్ శ్రీనివాస రామానుజ దాసన్

మూలము:  https://ponnadi.blogspot.in/2012/12/charamopaya-nirnayam-ramanujar-our-saviour-3.html

పొందుపరిచిన స్థానము: https://srivaishnavagranthamstelugu.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org