Monthly Archives: April 2019

విరోధి పరిహారాలు – 6

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః

శ్రీ వైష్ణవుల రోజువారీ జీవితంలో వివిధ రూపాలలో ఎదుర్కొంటున్న అడ్డంకుల గురించి ఎమ్పెరుమానారు, వంగి పురత్తు నంబికి వివరిస్తారు. వంగి పురత్తు నంబి ఈ విశేషాలను ఒక అద్భుతమైన గ్రంథ రూపంగా “విరోధి పారిహారంగళ్ (విరోధి పరిహారాలు) అనే గ్రంథంలో గ్రంథస్తపరిచారు.

ఈ సంచికలోని శీర్షికలు శ్రేణిగా ఆంగ్లములో ఈ పుస్తకము – https://srivaishnavagranthamstelugu.wordpress.com/virodhi-pariharangal/ లో చూడవచ్చు.

<< విరోధి పరిహారాలు – 5

30. విషయ విరోధి  – భగవత్ విషయానికై విరోధాలు
బ్రహాండమైన మకరందం – ఎంతో ఇష్టపడే ఆరావముదన్
సాధారణంగా విషయం అనగా భగవత్ విషయం (భగవానునికి సంబంధించిన విషయాలు) అని అర్థం. దానికి విరుద్ధమైనది ఏదైనా ఒక అడ్డంకి.
  • శబ్ద (ధ్వని), స్పర్స (స్పర్శ), రూప (చూపు), రస (రుచి), గంథ (వాసన) మొదలైన విషయాలు మనకు లౌకిక సుఖాన్ని ఇస్తాయి, అవి భగవత్ విషయానికి విరోధాలు. అనువాదకుని గమనిక: ఇంద్రియ సుఖానుభవంలో నిమగ్నమైనప్పుడు , అవి రజో, తమో గుణాలను తనలో పెంచి క్రమేణా భగవాన్ నుండి ఆ వ్యక్తిని దూరం చేస్తాయి. స్వయంగా ఆళ్వారులు వారి పాసురాలలో శోకించుచూ, ఈ లౌకిక సుఖాలు చాలా శక్తివంతమైనవి అవి నిరంతరం వేధిస్తున్నాయి అని వివరించారు.
  • భగవానుని నామాల శ్రవణం చేయుట జీవాత్మకు మంచి లక్షణము. వారు భగవాన్ నామాలు విన్నా/ఉచ్చరించినా,  జీవాత్మ సుకృతం చేస్తున్నాడని భగవానుడు భావిస్తారు.  భగవానుని పేర్లు వినకుండా ఇతర పేర్లను వినడం ఒక అడ్డంకి.
  • భగవానుని అర్చా విగ్రహాలు (చిత్ర పఠాలు / రేఖా చిత్రాలు) అత్యంత మనోహరమైనవి. భౌతికమైన చిత్రాలు వస్తువులను చూడటం ఒక అడ్డంకి.
  • భగవానుని నామాలకు బదులుగా ఇతర పేర్లను జపించుట ఒక అడ్డంకి.
  • మనకు ఇవ్వబడిన కాళ్ళను భగవానుని యొక్క క్షేత్రాలకి ( దివ్య దేశాలు మొదలైనవి) వెళ్ళడానికి ఉపయోగించాలి. ఇతర దేవత క్షేత్రాలకు వెళ్ళే వాటికి ఉపయోగించుట ఒక అడ్డంకి.
  • నమ్మాల్వారు  తిరువాయ్మొళి 2.7లో  “పయిలుం  చుడరొళి” పదిగం మరియు 8.10 “నెడుమర్కకడిమై” (నెడుమాఱ్కడిమై) పదిగంలో భాగవతుల మహత్యాన్ని గురించి చెప్పారు. ఈ అవగాహనతో, భాగవతులను స్తుతించుట భగవానుని స్తుతించుట కన్నా గొప్పదని తెలుసుకోవాలి. అందువల్ల, భాగవతుల సేవ చేయకుండా కేవలం భగవానుని విగ్రహాన్ని పూజించుట ఒక అడ్డంకి.
  • భాగవతుల నామ జపం చేయకుండా కేవలం భగవానుని నామ జపం చేయుట ఒక అడ్డంకి. ఉదాహరణకు, “రామానుజ” నామం  “నారాయణ” నామం కంటే గొప్పదని మన పూర్వాచార్యులు వివరించారు, కావున ఎమ్బెరుమానార్ యొక్క నామ జపం అత్యంత గొప్పది. కొందరు ఒకసారి “నారాయణ” నామ జపం చేస్తుండగా వడుగ నంబి వారితో, “మనం ‘రామానుజ’ నామజపం చేయాలి, కేవలం ‘నారాయణ’ అనుట ‘నావ కార్యం’ (అనుచిత కార్యం) అవుతుంది అని చెప్పి అక్కడ నుంచి వెళ్లి పోతారు.
  • భాగవతుల చరణాలు ఆశ్రయించడం మంచిది. కానీ సంసారులను చరణాలు తాకడం, వారు మనను తాకుట ఒక పెద్ద అడ్డంకి. అనువాదకుని గమనిక పరాశర భట్టర్ జీవితంలో, ఒక సంఘటనను  ఈ సందర్భంగా వివరించబడింది.  శ్రీరంగం వీధుల్లో నడుస్తున్నప్పుడు, ఒక దేవతాంతర భక్తుడు రంగు పంచను ధరించి భట్టారు దగ్గరికి వచ్చి నిలబడి, అతన్ని తాకమన్నట్లుగా భట్టారుకి సంకేతిస్తారు.  భట్టార్ ఒక్కసారి చాలా కంగారుపడి వారి తల్లి ఆండాళ్ అమ్మ దగ్గరకు వెళ్లి విరుగుడు అడుగుతారు. అప్పుడు ఆండాళ్ అమ్మ, ఉపవీధీ (యజ్ఞోపవీతం) లేని భాగవతుని నుండి శ్రీపాద తీర్థాన్ని స్వీకరించమని భట్టార్నినిర్దేశిస్తారు. భట్టార్ ఎలాగో అలాగ ఒక భాగవతుని నంపెరుమాళ్కి శ్రీపాద కైంకర్యాన్ని చేయమని  ఒప్పింస్తారు. ఆతరువాత వారిచ్చిన శ్రీపాద తీర్థాన్ని స్వీకరించి సంతృప్తి పడతారు. భట్టార్  నంపెరుమాళ్ / నాచియార్ యొక్క దత్త పుత్రుడైన తానే సంసారుల స్పర్శతో అంత భయపడితే, మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో అర్థం చేసుకోవాలి.
  • తులసి ఎమ్బెరుమానుకి ఎంతో ప్రీతికరమైనది. కానీ భగవానునికి అర్పించిన తులసి దళాలను మాత్రమే వాసన చూడాలి. భగవనుని పాదాలకు అర్పించని తులసి ఆకుల వాసన చూచుట ఒక అడ్డంకి. అనువాదకుని గమనిక: చేతనా చేతనమైనవన్నీ భగవదాధీనమైనవి, భగవాదానందం కోసం మాత్రమే ఉనికిలో ఉన్నాయి. వాటిని మొట్టమొదట భగవానుకి అర్పించి ఆ తరువాత ప్రసాదంగా స్వీకరించాలి – మనం స్వతంత్రంగా ఏది కూడా ఆనందించలేము.

31. విశ్వాస విరోధి  – ఉపాయ విశ్వాసంలో విరోధులు

సీతా పిరాట్టి  అత్యంత ప్రతికూల పరిస్థితిలో కూడా శ్రీరామునిపై పూర్తి విశ్వాసం ప్రదర్శించారు

విశ్వాసం అంటే గాఢమైన నమ్మకం. ప్రస్తుత సందర్భంలో మనం మోక్ష ఉపాయంపై ఉండ వలసిన విశ్వాసాన్ని చూస్తున్నాము. మన పూర్వాచార్యులు శాస్త్ర ఆధారంగా ముమ్ముక్షువులకు భగవానుడే తగిన ఉపాయమని వివరించారు. అనువాదకుని గమనిక: పిళ్ళై లోకాచార్య యొక్క ముమ్ముక్షుపడి  సుత్రం 116 “పేఱు తప్పాతెన్ఱు తుణింతిరుక్కైయుం” కి మాముణులు వ్యాఖ్యానిస్తూ – “మనకు నిరంతర భగవత్ కైంకర్య లక్ష్యాన్ని సాధిస్తామని దృఢ నమ్మకం ఉండాలి” అని అన్నారు.

  • ఎమ్బెరుమానుని ఉపాయంగా పెట్టుకొని ప్రార్ధించుటయే ప్రపత్తి. ఇది కేవలం మన మనస్సులో భగవానుని ఉపాయంగా స్వీకరిచుట, ఇది చాలా సరళమైన ఒక ముందడుగు. అయినప్పటికీ, ఇది మన వంతు అవసరమైనది. కాని,  “ఓ! ఇది చాలా సులభమైనది,  భగవానుని ఉపాయం చేయుట ఇంత సామాన్యమైనది ఎలా అవుతుంది?” అని అనుకోకూడదు. అలాంటి ఆలోచనలు కలిగి ఉండుట ఒక అడ్డంకి.
  • ఉపాయాన్ని అనుసరించడంతో ఫలితంగా ఉపేయం లభిస్తుంది. శ్రీ వైష్ణవులకు, పరమపదంలో (శ్రీవైకుంఠం లో) శాశ్వతమైన కైంకర్యమే వారి అంతిమ లక్ష్యం.  పరమపదంలోని ఆ కైంకర్యం చాలా అద్భుతమైనది, మన స్వప్రయత్నాలతో చేరుకుంటామని ఊహించలేము. నమ్మాళ్వార్  తిరువాయ్మొళి 5.1.7 లో “అమ్మాన్ ఆళిప్పిర్పిరాన్ ఎవ్విడత్తాన్ యానార్” (నా భగవాన్ తన చేతిలో చక్రం ధరించి ఉన్నాడు – వారు ఎంత గొప్పవారు నేనెంత అల్పుడను) వారి గొప్పతనంతో నన్ననుగ్రహించారు.  కాబట్టి, వారి గొప్పతనం గురించి ఆలోచించకూడదు మరియు మనం బలహీనులం కాబట్టి వారి కైంకర్యాన్ని పొందలేము అన్న భావన ఒక అడ్డంకి.
  • ఈ సంసారంలో ఎన్నో అడ్డంకులు ఉన్నాయి. ఆ అడ్డంకులకు భయపడటం ఒక అడ్డంకి. అనువాదకుని గమనిక: మముకుషప్పడి చరమ శ్లోక ప్రకరణంలో, వివరిస్తూ “సర్వ పాపేభ్యో మొక్ష ఇష్యామి మా సుచః”, పిళ్ళై లోకాచార్యులు చాలా అందంగా వ్యాశ్యానిస్తూ  అన్నారు, ” అన్ని అడ్డంకులను భగవానుడు  తొలగిస్తారు, ఇది భాగావానుడి వాగ్దానం”. మాముణులు కూడా ఈ సూత్రాలను చాలా నిపుణంగా వ్యాఖ్యానించారు.
  • చరమోపాయంపై (అత్యుత్తమ ఉపాయంపై) విశ్వాసం ఉండక పోవుట ఒక అడ్డంకి. ప్రపత్తి, ఆచార్య అభిమానం ఈ రెండింటిని చరమోపాయాలుగా పేర్కొన్నారు. ప్రపత్తికి – ఇది చాలా సులభమైనది. ఇంత సరళమైన చర్య మనకు శాశ్వతమైన కైంకర్యాన్నిఎలా ఆర్జించి పెడుతుంది? అని భావించరాదు. ఆచార్య అభిమానం కోసం – ఆచార్య కూడా మనలా ఒక మనిషి అని భావించరాదు, మనం మోక్షం పొందుటకు ఎలా సహాయ పడతారు? అని భావించరాదు. ఈ రెండింటికీ దూరంగా ఉండాలి.  అనువాదకుని గమనిక:  పిళ్ళై లోకాచార్యులు ముమ్ముక్షుపడి చరమ శ్లోక ప్రకరణలో వివరిస్తూ “సర్వ ధర్మాన్ పరిత్యజ్య” గీతా శ్లోకాన్ని చరమ శ్లోకంగా పిలుస్తారు, ఎందుకంటే ఇది చరమోపాయం (శరణాగతి)ని వివరిస్తుంది.  నాయనారాచాన్ పిళ్ళై రచించిన ఒక గ్రంథంలో ఎమ్బెరుమానార్ (ఆచార్యగా) యొక్క కీర్తి ప్రతిష్టలను వివరిస్తూ వ్రాసారు. ఆ గ్రంథం పేరు “చరమోపాయ నిర్ణయం”.
32. ప్రవృత్తి విరోధి – మన పనులకు (కైన్కర్యములకు) అడ్డంకులు 
ఇళయ పెరుమాళ్ (లక్ష్మనుడు) – భగవన్ యొక్క అత్యుత్తమ సేవకులలో మొట్టమొదటగా లెక్కించబడతారు
  • ఎమ్బెరుమానునికి కైంకర్యం చేయుటయే మన ప్రవృత్తికి సరైనదని అర్ధం. కైంకర్యం మన కర్తవ్యం.  క్రింది వివరించిన విధంగా కైంకర్యం చేయుట ఒక అడ్డంకి.
  • కైంకర్యం చాలా ప్రేమతో చేయాలి. నమ్మాళ్వారు తిరువాయ్మొళి 10.8.10లో “ఉగంతు పణి చేయ్తు” (అనగా ప్రేమతో సేవించు). ప్రేమ లేకుండా కైంకర్యం చేయుట ఒక అడ్డంకి. అనువాదకుని గమనిక: మునుపటి సూత్రాలలో కైంకర్యం యొక్క నిజ స్వభావాన్ని మనం చూసాము – “భగవత్ అనుభవ జనిత ప్రీతి కారిత  కైంకర్యం” – భగవత్ అనుభవాలు మొదలైనవి అనుభవించుట వలన ప్రేమానుభవం పొంది అది కైన్కర్యానికి దారితీస్తుంది. భావం లేకుండా  చేస్తే అది జీవాత్మ యొక్క స్వరూపానికి వ్యతిరేకం అవుతుంది.
  • పారతంత్రియాన్ని ఉల్లేఖిస్తూ కైంకర్య సమయంలో ఆత్రుత చెందక పోవుట ఒక అడ్డంకి. “ఇది ఎమ్బెరుమానుని కైంకర్యం, సరిగ్గా పూర్తిచేయాలి, మనం పొరపాట్లు చేయకూడదు, ఇటువంటి భావాలు సహజంగా ఆందోళనకు దారి తీస్తాయి.  తిరువాదన సమయంలో చివర్లో, ప్రతి ఒక్కరూ “ఉపచారాపదేశేన కృతాన్ – అపచారానిమాం సర్వాం క్షమస్వ పురుషోత్తమ” – నేను మీకు కైంకర్యం చేయటం మొదలుపెట్టాను కానీ ఈ క్రమంలో ఎన్నో పొరపాట్లతో ముగించాను, మీరు పురుషుల్లో ఉత్తముడు, దయచేసి నన్ను క్షమించు. ఏ ఆందోళనా భావం లేకుండా సాధారణం ఉండుట ఒక అడ్డంకి. అనువాదకుని గమనిక: శ్రీకృష్ణుడు విదిరుని రాజభవనానికి వెళ్ళినపుడు, విదురుడు ఆందోళనా భావంతో నిండి, శ్రీకృష్ణునికి అరటిపండు తొక్క సమర్పిస్తాడు. అయినప్పటికీ కృష్ణుడు విదురుని సేవాభావానికి మెచ్చుకుంటాడు. శ్రీకృష్ణుని ఆసక్తిగా ఆదరించినందుకు వారిని “మహామతి” (ఎంతో జ్ఞానవంతుడైన వ్యక్తి) అని విదురుని పిలుస్తారు –
  • అనుష్టానాలను సాధనంగా (ఉపాయంగా) పరిగణిస్తే అది ఒక  అడ్డంకి. స్వానుష్టానాలు (ఒకరి అనుష్టానాలు)    భగవానుడు నిర్దేశించిన అవసరమైన కర్మలు. అలాంటి చర్యలను అనుసరించక పోవుట పాపము మూట కట్టుకోనునట్లగును. ఆ  కర్మలను అనుసరించుట వలన పుణ్యము కట్టుకోము కాని  అవి తప్పనిసరి కార్యాలు. ఆ కర్మలను చేయుట వలన ఎమ్బెరుమాన్ మనకు మోక్ష ప్రదానం చేస్తారని అనుకోకూడదు. విహిత కర్మలో రోజు మూడుసార్లు సంధ్యావందనం, ఇంటి పెరుమాళ్లకు తిరువారాధనం, పితృ తర్పణం మొదలైనవి.
33. నివృత్తి విరోధి – అస్వీకరణలో అవరోధాలు
పిళ్ళై లోకాచార్యులు మరియు మాముణులు (శ్రీపెరుంబుతూర్) – ముమ్ముక్షుప్పడిలో పునరుద్ధరణ సూత్రం వివరించారు

నివృత్తి అనగా అస్వీకరణ/త్యజించడం అని అర్థం. ఎవరైతే ఎమ్బెరుమానుని మాత్రమే ఉపాయంగా స్వీకరిస్తారో వారు ఇతర ఉపాయాలను త్యజించాలి. భగవాన్ గీతా చరమ శ్లోకంలో అన్నారు, “సర్వ ధర్మాన్ పరిత్యజ్య”  మొదట అన్ని ఉపాయాలని విడిచిపెట్టి, తరువాత “మామేకం చరణం వ్రజ”  నాకు మాత్రమే శరణాగతి చేయి. కాబట్టి, దీని ప్రకారం, అన్ని ఇతర ధర్మాలను (కర్మ, జ్ఞాన, భక్తి యోగములు వంటి ఉపాయములు) పూర్తిగా విడిచి భగవానుని మాత్రమే సర్వోత్తమ ధర్మంగా స్వీకరించాలి. అనువాదకుని గమనిక: మన ఆచార్యులు శ్రీమన్నారాయణుడు మాత్రమే సర్వోత్తమ ధర్మముగా రుజువు చేశారు, మహాభారతంలో “కృష్ణం ధర్మం సనాతనం” అని చెప్పబడింది, శ్రీకృష్ణుడే నిత్య శాశ్వతమైన ధర్మము మరియు శ్రీ రామాయణములో “రామో విగ్రహవాన్ ధర్మ:” – శ్రీరాముడు ధర్మ స్వరూపుడు అని చెప్పబడింది. పిళ్ళై లోకాచార్యులు గంభీరంగా ముమ్ముక్షుపడి సూత్రం 213లో “ధర్మ సంస్థాపనం పణ్ణప్పిఱన్తవన్ తానే ‘సర్వ ధర్మంగళైయుం విట్టు ఎన్నైప్పఱ్ఱు’ ఎంగైయాళే సాక్షాత్ ధర్మం తానే ఇంగిఱతు” లో వివరిస్తూ శ్రీకృష్ణుడు ధర్మ స్థాపన కొరకై అవతరించాడు – ‘అన్ని ఇతర ధర్మాలను విడిచిపెట్టి, నన్ను స్వీకరించు’ అని చెప్పినప్పుడు, అతనే నిజమైన / శాశ్వతమైన ధర్మము అని అర్థం.

  • వీటన్నింటినీ అర్ధం చేసుకున్న తరువాత కూడా, “ఈ ఇతర ఉపాయాలను విడిచిపెడితే నేను  పాపం మూటకట్టుకుంటానేమో?” అన్న భావన ఉండకూడదు. అది ఒక అడ్డంకి. ఇది భగవానునిపై విశ్వాసం లేకపోవడం మాత్రమే చూచిస్తుంది. అలాంటి సంకోచంతో మన లక్ష్యాన్ని సాధించలేము.
  • ఎమ్బెరుమానుపై సందేహాస్పదంగా ఇటువంటి చర్యలు చేయడం కూడా ఒక అడ్డంకి. అనువాదకుని గమనిక: “ఒక వేళ ప్రపత్తి విఫలమైతే? నేను కర్మ, జ్ఞాన లేదా భక్తి యోగాలు కొద్దిగా చేస్తే అవి నన్నాదుకుంటాయేమో” అని భావించరాదు. భగవానుడు బ్రహ్మాస్త్రంగా వివరించబడ్డారు.  బ్రహ్మాస్త్రానికి తిరుగుండదు,శత్రువును సులభంగా చీర్చేస్తుంది. కానీ బ్రహ్మాస్త్ర శక్తిని సందేహించి ఇంకేదో జోడించి ప్రయత్నించినట్లయితే, బ్రహ్మాస్త్రం తనను తాను ఉపసంహరించుకుంటుంది. హనుమంతునిపై బ్రహ్మాస్త్రము ప్రయోగించినపుడు, పైనుంచి రాక్షసులు తాడుతో హనుమానుని కట్టివేస్తారు, బ్రహ్మాస్త్రం హనుమంతుడిని విడిచి పెట్టేస్తుంది. హనుమంతుడు చివరికి రావణుని రాజ భవనానికి వెళ్లి అతన్ని హెచ్చరించి తరువాత లంకా దహనం చేస్తాడు.
  •  ఇతర ఉపాయాలను కేవలం వారి ఆశక్తి (అసమర్థత) కారణంగా విడిచిపెట్టుట ఒక అడ్డంకి.  ఇతర ఉపాయాలు మన స్వరూపానికి సరైనవి కావు కాబట్టి వాటిని విడిచిపెట్టాలి అని పరిగణించాలి.
  • ఇతర ఉపాయాలను కేవలం వారి సామర్థ్యత కారణంగా విడిచిపెట్టుట ఒక అడ్డంకి. పైన సూత్రంలో చెప్పుకున్నట్టుగా ఇతర ఉపాయాలు మన స్వరూపానికి సరైనవి కావు కాబట్టి వాటిని విడిచిపెట్టాలి అని పరిగణించాలి. అనువాదకుని గమనిక: ఉదాహరణకు, ఒకరు కర్మ యోగమును విడిచిపెట్టగలడు, “ఓ! నేను చాలా నియంత్రణలో ఉన్నాను, కాబట్టి నేను కర్మయోగాన్ని త్యాగం చేస్తున్నాను” – అది కూడా మంచిది కాదు.
  • అన్ని ఉపాయాలను త్యాగం చేసి వాటిని గురించి ప్రగల్బాలు పలుకనవసరం లేదు – ఇది కూడా ఒక అడ్డంకి. ఒకవేళ అలా త్యాగం చేయగలిగితే, అది జీవాత్మకి సహజమైన గుణం, ఇవన్నీ ఎమ్బెరుమాన్ మరియు ఆచార్యుల అనుగ్రహంతో జరుగుతాయి – అలా చేసి తనను తానూ మెప్పులు పలుకి ” నేను అన్నీ త్యాగం చేసాను! ఎంత గొప్ప? అని భావించరాదు.

మనం నిత్యం పిళ్ళై లోకాచార్యుల యొక్క ముమ్ముక్షుపడి సూత్రం 271 – “కర్మం కైన్కర్యత్తిలే పుగుం; గ్యానం – స్వరూప ప్రకాసత్తిలే పుగుం; భక్తి ప్రాయ రుచియిలే పుగుం; ప్రపత్తి – స్వరూప యాతాత్మ్య జ్ఞానత్తిలే పుగుం;” అని గుర్తుచేసుకోవాలి. మాముణులు అందంగా వివరిస్తూ, ” ఇటువంటి చర్యలు మొత్తం సమాజానికి ప్రేమ, కరుణతో నిర్వహించాల్సిన అవసరాన్ని పేర్కొన్నారు. (గొప్ప మనుషులు ఈ విహిత కర్మలను విడిచిపెడితే, ఇతరులు కూడా అనుసరించి దిగాజారిపోతారు) – అయినప్పటికీ, వాటిని ఎప్పుడూ ఉపాయంగా పరిగణించకూడదు – అవి కైంకర్య పరంగానే చేయాలి. ఏ కర్మలయినా (సంధ్యావందనం మొదలైన వంటివి) – అవి ఎమ్బెరుమానుని కైన్కర్యంలో భాగమవుతాయి. జ్ఞాన యోగం ద్వారా సంగ్రహించిన దేదైనా ఆత్మ యొక్క జ్ఞానోదయానికి దారి తీస్తాయి. భక్తిలో భాగంగా ఏది చేసినా భగవానునిపై ప్రేమానురాగాలు పెరుగుటకు సహాయం చేస్తాయి. అంతిమంగా ప్రపత్తి జీవాత్మ యొక్క అంతర్గత స్వభావానికి సరిపడుతుంది, భగవానుని మాత్రమే ఉపాయంగా స్వీకరించేందుకు సహాయపడుతుంది. 

తరువాతి భాగం మనం వచ్చే సంచికలో కొనసాగిద్దాము.

హిందీలో : http://ponnadi.blogspot.com/2013/12/virodhi-pariharangal-6.html

అడియేన్ శ్రీదేవి రామానుజ దాసి

మూలము : https://srivaishnavagranthamstelugu.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

 

తత్త్వత్రయం – అచిత్తు: పదార్థము అనగా నేమి?

శ్రీ:  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమద్వరవరమునయే నమః  శ్రీవానాచల మహామునయే నమః

తత్త్వత్రయం

<< చిత్తు: నేను ఎవరు?

  • గత అధ్యాయములో  (https://srivaishnavagranthamstelugu.wordpress.com/2018/04/24/thathva-thrayam-chith-who-am-i/), చిత్తు (జీవాత్మ) యొక్క తత్వము తాలూకు వివరములను తెలుసుకున్నాము.
  • శ్రీ పిళ్ళై లోకాచార్యుల “తత్వత్రయం” అను ఈ గ్రంథమును శ్రీమణవాళ మహాముణుల దివ్య వ్యాఖ్యాన సహితముగా చిదచిదీశ్వర తత్వముల యొక్క వైభవమును తెలుసు కొనుటకు సాగిస్తున్న మన ప్రయాణములో ఈ అధ్యాయములో అచిత్తు, అనగా స్థూల పదార్థమును గూర్చి వివరాలను తెలుసుకొందాము.

జ్ఞానుల ఉపదేశముల ద్వారా అచిత్ (పదార్థము) యొక్క తత్వమును అర్థం చేసుకొనుట :

పరిచయము:

  • అచిత్తు (జడమైనది, అచేతనమైనది) జ్ఞాన విహీనమై మార్పు, రూపాంతరములకు లోబడి ఉండును.
  • జ్ఞాన విహీనమైన అచిత్తు కేవలం పారతంత్రుల భోగ విశేషముగా మాత్రమే ఉండును.
  • మార్పుకు అతీతమైన చిత్తత్వము వలె కాక అచిత్తు మార్పు ప్రధానమై ఉండగలదు.
  • అచిత్తును మూడు విధములుగా విభజించవచ్చు, అవి:
    • శుద్ధ సత్వము – రజస్తమో గుణ రహితమై నటువంటి శుద్ధాత్మకమైన పదార్థము.
    • మిశ్ర సత్వము: సత్వ – (సత్యపూతము), రజ: (కాముక), తమ: (అజ్ఞానము) గుణ మిళితమైన పదార్థము.
    • సత్వ శూన్యము – సర్వకాల సర్వావస్థల యందు సంపూర్ణ గుణ హీనమైన పదార్థము.

శుద్ధ సత్వము (స్వచ్ఛమైన సత్యము)

పరమపదము: శ్రియఃపతి యగు శ్రీమన్నారాయణుని నివాస స్థానమైన మోక్ష సామ్రాజ్యము: పరమ పవిత్రమైన మండపములు, ఉద్యాన వనములతో కూడిన శ్రీ స్థానము.

  • ఇది రజస్తమో గుణ రహితమై పరమ శుద్ధమైన, సత్యమైన పదార్థము. పరమపదమందలి అన్ని అచిత్పదార్థములనూ శుద్ధ సత్వములుగా వ్యవహరించవచ్చు.
  • దీని సహజ స్వభావములు:
    •  శాశ్వతమైనది
    • ఆనందమునకు, జ్ఞానమునకు నిలయమైనది.
    • కర్మ బద్ధుడైన జీవాత్మ యొక్క ఐహిక కామ్యము వలె గాక పరమాత్మ యొక్క లీలామాత్ర సంకల్పము చేత సృష్టించబడిన విమానములు/ గోపురములు, మండపములు ఇత్యాది రూపములు ధరించి ఉండును.
    • అనంత తేజోమాయమైన రూపము గలది.
    • నిత్యులు (శాశ్వతముగా సంసార ముక్తి పొందినవారు), ముక్తులు (సంసారము నుంచి ముక్తిని పొందినవారు) సైతం వర్ణింపనలవి గానిది. ఇక్కడ మణవాళ మహాముణులకు సైతం సందేహము కలిగినదట! సర్వజ్ఞుడైన భగవానునికి సైతం తెలుసుకొనుటకు సాధ్యము కానంతటి రూపము శుద్ధ సత్వమునకు ఉన్నచో మరి భగవానుడు సర్వజ్ఞుడు ఎట్లు కాగలడు? అని! దానికి పిదప మామునులే సమాధాన పడ్డారట, అనంతమైన శుద్ధసత్వపు నిజ తత్వము ఎఱిగినవాడు భగవానుడు కనుక భగవానుడు సర్వజ్ఞుడు, అని!
    • అపరిమితమైన వైభవము కలది!
  • అచిత్తును గూర్చి కొందరు ప్రకాశవంతమైనదని కొందరు కాదు అని అభిప్రాయం వెల్లడించారు.
  • అయితే అధిక భాగమున అచిత్తును ప్రకాశవంతమైన వస్తువుగా ఒప్పుకొనుట జరిగినది! అచిత్తు ప్రకాశవంతమైన వస్తువు అయినందు వలన నిత్యులకు, ముక్తులకు, మరియు భగవంతునికి గోచరమై యున్నది (అనగా తన అస్తిత్వమును పరమపద మందు నిలుపు కొనుటకు, పరమపద వాసులు గుర్తించుటకు అనువుగా ప్రకాశమును పొంది ఉన్నదని అర్థం)! అయితే సంసారుల చేత చూడనలవి కానిది ఇది!
    • అయితే ఇది ఆత్మ కలిగిన వస్తువు కాదు కనుక తనను గూర్చి తాను తెలుసుకోలేదు.
    • మార్పు చెందే స్వభావము కలిగి ఉండును.
  • అచిత్తు జ్ఞానమునకు కూడా అతీతమై ఉండును,
    • కనుక, ఉపకార ఆవశ్యకత లేకుండా మార్పులు చెందును.
    • తన్మాత్రల (శారీరిక ఇంద్రియములు) ప్రభావము లేనిదై జడమై ఉండును.
మిశ్ర సత్వము (సత్వరజస్తమో గుణ మిళితము):
  • స్వాభావికముగా ఇది,
    • సత్వరజస్తమో గుణ మిళితము.
    • జీవాత్మలను నిజజ్ఞానము తెలుసుకోనివ్వకుండా మనసుకు పొర వలె కమ్మివేయును.
    • జీవాత్మలలో అజ్ఞానమునకు కారణమైనది.
    • శాశ్వతమైనది.
    • జీవాత్మలపై ప్రయోగించుటకు భగవానునికి క్రీడా విశేషమైనది.
    • సమయమును బట్టి (సృష్టి యందు ఒకవిధముగా, అలాగే ప్రళయ మందు మరో విధముగా) తన స్థితిని సారూప్యముగా లేక వ్యతిరిక్తముగా (వ్యక్త, అవ్యక్త రూపములుగా) మార్చుకోగల గుణము కలది.
    • దీనినే ప్రక్రుతి (మార్పుకు నిలయమైనది), అవిద్య (అజ్ఞాన హేతువు), మాయ (పరిణామము విపరీతమై గ్రహించనలవి కానిది) అని వ్యవహరింతురు.
  • నమ్మాళ్వార్లు తిరువాయ్మొళి యందు (10.7.10) పదార్థమును 24 రకములుగా చెప్పియున్నారు, అవి:
    • పంచ తన్మాత్రలు – శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు
    • పంచ జ్ఞానేంద్రియములు – శ్రోత్ర (శబ్ద), త్వక్ (స్పర్శ), చక్షు: (దృష్టి), జిహ్వ (రుచి), ఘ్రాణ (వాసన పీల్చుట)
    • పంచ కర్మేంద్రియములు – వాక్ (నోరు), పాణి (కరములు), పాద (పాదములు), పాయు (విసర్జనంగాములు), ఉపస్థ (జననాంగములు)
    • పంచ భూతములు – ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ
    • మనస్సు – బుద్ధి
    • అహంకారము – జీవుల అస్థిత్వము
    • మహాన్ – అవిర్భుతమైన జీవజాలము
    • మూల ప్రక్రుతి – అనావిర్భుతమైన జీవ జాలము
  • మూల ప్రక్రుతి అనావిర్భావ దశ నుంచి గుణములను / గుణ సమూహమును బట్టి ఆవిర్భవించును.
  • గుణములు మూడు – అవి సత్వ గుణము (జ్ఞానపూర్ణము), రజో గుణము (కాముక స్థితి), తమో గుణము (అజ్ఞానావస్థ)
  • మూల ప్రకృతి యందు ఈ మూడు గుణములు సమ పాళ్ళలో నిండి యుండును.
  • సత్వ రజస్తమో గుణములు మూల ప్రకృతిలో అసమానమై ఉన్నచో జీవ జాలము ఆవిర్భవించును.
  • అవిర్భుతమైన జీవ జాలమందు మహాన్ మొదటి స్థితిగా సంభవించును.
  • మహస్థితి నుంచి అహంకారము ఉద్భవించును.
  • అహంకార స్థితి నుంచి వరుసగా తన్మాత్రలు, జ్ఞాన కర్మేంద్రియాదులు ప్రభవించును.
  • పైన చెప్పిన 24 పదార్థములతో భగవానుడు ఈ సమస్త ప్రకృతిని సృష్టించి యున్నాడు.
  • భగవానుడు కేవలం తన సంకల్ప మాత్రము చేత కార్య కారణ రూపముగా మూల ప్రకృతి నుంచి ఈ సమస్త విశ్వాన్ని సృష్టించియున్నాడు.
  • భగవానుడు బ్రహ్మ, ప్రజాపతులు ఇత్యాది సమస్త జీవ గణాన్నిసృష్టించి వారిలోనే అంతర్యామిగా పరమాత్మగా కొలువై సృష్టి స్థితి లయలను లీలా వినోదియై సలుపుచుండును.

  •  ఈ విశాలమైన విశ్వమునకు సృష్టి కేవలము పరమాత్మ యొక్క సంకల్పము వల్లనే జరిగినది.
  • ఈ అనంతమైన విశ్వములో ఎన్నో బ్రహ్మాణ్డములు ఉన్నవి. ప్రతి బ్రహ్మాణ్డమునకు 14 పొరలు కలవు. సశాస్త్రీయముగా శ్రీమణవాళ మహాముణులు వాటిని గూర్చి చెప్పియున్నారు.

లీలా విభూతి యొక్క నిర్మాణం

లీలా విభూతి యొక్క రూపము (సంసారము –  బాహ్య ప్రపంచము):

  • 7 అథో లోకములు / తలములు/ పొరలు:
    • ఇవి అతల వితల సుతల నితల తలాతల పాతాళ లోకములు. ఇవి భూమికి అథో భాగములో ఉండి పిశాచములకు, సర్పములకు, కొన్ని జాతుల పక్షులకు నెలవై యుండును.
    • ఈ లోకములలో స్వర్గమును మించిన సుందరమైన నగరములు, ఇంద్ర భవనములు ఉండునని చెప్పబడినది.
  • 7 ఊర్థ్వ లోకములు తలములు/ పొరలు:
    • ఇవి భూలోక, భువర్లోక, స్వర్గ లోక, మహో లోక, జనో లోక, తపో లోకములు.
    • భూలోకము – ఇందులో ప్రజాపతులు, మనువులు సంకల్పించి సృష్టించిన మనుష్య జాతి, పశుపక్ష్యాది జంతు జాలము నివాసముండును. ఇది ఏడు ఖండములుగా విభజించ బడియున్నది.
    • భువర్లోకము – ఇది గంధర్వ లోకము: ఇందులో సంగీత దేవతలైన గంధర్వులు నివాసముంటారు.
    • స్వర్గ లోకము: భూర్భువర్లోకముల కార్యకలాపములు చూచే ఇంద్రుడు అతని పరివారము నివసించే లోకము.
    •  మహర్లోకము: ఇచ్చట ఇంద్రత్వము అనుభవించిన పాత ఇంద్రులు, ఇంద్రత్వము కొరకు వేచి ఉండేవారు వంటి మహాత్ములు నివసించే లోకము.
    • జనోలోకము: ఇచ్చట బ్రహ్మ మానస పుత్రులైన సనక సనందనాదులు, ఇతర ఋషులు, బ్రహ్మర్షులు నివసించే లోకము.
    • తపోలోకము: ప్రజాపతులు (సృష్టికి మూల పురుషులు) నివసించే లోకము.
  • సత్య లోకము – ఇచ్చట బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మరియు వారి పరివార గణములు నివసించును.
  • ప్రతి బ్రహ్మాణ్డము యందు ఈ పద్నాలుగు భువనములు ఉండును. వీటి పైన పంచ భూతములు, ఆఖరుగా వాటిపై మూల ప్రకృతి పొరగా ఆవరించు ఉండును.

  •  జ్ఞానేంద్రియములు స్థూల మరియు విశాల పదార్థముల నుంచి కర్మేంద్రియముల చేత జ్ఞానమును పొందును.  కర్మేంద్రియములు బాహ్య కర్మలను ఆచరించును. బుద్ధి ఇంద్రియములను నియంత్రించుచు వాటి ధర్మములు అవి ఆచరించుటకు సహాయపడును.
  • పంచీకరణం అనగా భగవానుడు రకరకాల పదార్థములను తగు పాళ్ళలో కలిపి సృష్టి చేసిన విధానము.
సత్వ శూన్యము (కాలము):
  • మూల ప్రకృతి నుంచి పదార్థము ఆవిర్భవించుటకు హేతువైన ఉత్ప్రేరకమునకు కాలము అని పేరు.
  • కాలము పరిపరి విధములైన కొలమానములలో అన్వయించబడినది.
  • ఆది అంతము లేని శాశ్వతమైన తత్వము కాలము.
  • భగవానుని క్రీడా వస్తువు.
  • భగవానుడే కాల స్వరూపుడు.
  • మామునులు నడువిల్ తిరువీధి పిళ్ళై భట్టర్ అనుగ్రహించిన కాల విశ్లేషణను ఇక్కడ వివరించారు:
    • నిమేషము: కనురెప్ప కాలము. కొలవ దగ్గ అత్యల్ప కాలము.
    • 15 నిమేషములు: ఒక కాష్ఠము.
    • 30 కాష్ఠములు: ఒక కల
    • 30 కలలు: 1 ముహూర్తము
    • 30 ముహుర్తములు: 1 దినము
    • 30 దినములు: 1 మాసము: 2 పక్షములు (శుక్ల, కృష్ణ)
    • 2 మాసములు: 1 ఋతువు
    • 3 ఋతువులు: 1 అయనము (ఉత్తరాయన దక్షిణాయములు)
    • 2 అయనములు: 1 సంవత్సరము
    • 360 మానవ సంవత్సరములు: 1 దేవతా సంవత్సరము
  • శుద్ధ సత్వ, మిశ్ర సత్వ అచిత్తత్వములు భోగ్య విశేషములు. అవి పరమపదస్థులు, జీవాత్మల చేత అనుభవించదగ్గవి.
  • శుద్ధ సత్వము అథో భాగమందు మరియు పార్శ్వములలో అపరిమితముగా విస్తరించబడి ఉండును. కానీ ఊర్థ్వదిశ యందు పరిమితముగా విస్తరించి ఉండును.
  • మిశ్ర సత్వము పార్శ్వములలో మరియు అథోముఖంగా పరిమితమై ఉండును. కానీ ఊర్ధ్వ దిశలో అపరిమితముగా విస్తరించి యుండును.
  • అయితే కాలమునకు ఎటువంటి పరిమితులు లేవు. అది అన్ని లోకముల యందు విస్తరించబడి యుండును.
  • అయితే కాల తత్వము పరమపదంలో స్థిరముగా అనంతముగానూ, సంసార మందు అస్థిరంగా క్షణ భంగురమై కదులును. అయితే పెరియ వాచ్చాన్ పిళ్ళై “తత్వ త్రయ వివరణం” అనే గ్రంథములో కాలము పరమపదములోనూ, సంసారములోనూ సమముగా వ్యవహరించునని చెప్పినారని మామునులు ప్రస్తావించెను. అయితే ఇప్పుడు ఈ గ్రంథము లుప్తమైయున్నది. అయితే తర్వాతి కాలములలో ఎందరో ఆచార్యులు కాల తత్వము పరమపదంలో సంసారములో ఒకే విధముగా అన్వయించదని చెప్పియుండుట చేత సంసారము దృష్ట్యా కాలము మారుతూ ఉండునను సత్యమును గ్రహించి కాలము అస్థిరమైనదిగా పరిగణించబడినది.
  • కొందరు అసలు కాలమే లేదని వాదించెదరు. అయితే తర్కమున ఆ వాదము నిలువబోదు గనుక శాస్త్రము ఆ వాదమును పరిగణించదు.

ముగింపు

ఈ విధముగా ఈ అధ్యాయములో శుద్ధ సత్వ (పరమపద సంబంధితమైనది), మిశ్ర సత్వ (సంసార సంబంధమైనది), మరియు సత్వ శూన్యమైన (ఉభయ సత్వములకు సంబంధించిన) అచిత్స్వరూపమును లవలేశముగా తెలుసుకున్నాము. అనంత జ్ఞాన ప్రదాయమైన ఆచార్య సన్నిధిలో ఇటువంటి నిగూఢ రహస్యములైన శాస్త్ర విషయములు కాలక్షేపముగా విన్నచో మరింత విశదంగా ఈ విషయములు అవగతమవుతాయి.

శ్రీమతే రమ్యజామాతృ మునింద్రాయ మహాత్మనే |
శ్రీరంగ వాసినే భూయాత్ నిత్యశ్రీర్నిత్య మంగళం ||

మంగళాశాసన పరైర్మదాచార్య పురోగమై: |
సర్వైశ్చ పూర్వైరాచార్యై: సత్కృతాయాస్తు మంగళమ్ ||

తరువాతి అధ్యాయములో ఈశ్వర తత్వమును గూర్చి తెలుసుకొందాము.

అడియేన్ శ్రీనివాస రామానుజ దాసన్

మూలము: http://ponnadi.blogspot.in/2013/03/thathva-thrayam-achith-what-is-matter.html

పొందుపరిచిన స్థానము: https://srivaishnavagranthamstelugu.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

విరోధి పరిహారాలు – 5

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః

శ్రీ వైష్ణవుల రోజువారీ జీవితంలో వివిధ రూపాలలో ఎదుర్కొంటున్న అడ్డంకుల గురించి ఎమ్పెరుమానారు, వంగి పురత్తు నంబికి వివరిస్తారు. వంగి పురత్తు నంబి ఈ విశేషాలను ఒక అద్భుతమైన గ్రంథ రూపంగా “విరోధి పారిహారంగళ్ (విరోధి పరిహారాలు) అనే గ్రంథంలో గ్రంథస్తపరిచారు.

ఈ సంచికలోని శీర్షికలు శ్రేణిగా ఆంగ్లములో ఈ పుస్తకము – https://srivaishnavagranthamstelugu.wordpress.com/virodhi-pariharangal/ లో చూడవచ్చు.

<< విరోధి పరిహారాలు – 4

24. స్వరూప విరోధి – జీవాత్మ  యొక్క నిజమైన స్వభావాన్ని గ్రహించడంలో అవరోధాలు.

భాగవత శేషత్వం – జీవాత్మ యొక్క అంతర్లీన స్వభావం

స్వరూపము అనగా జీవాత్మ యొక్క నిజమైన స్వభావం. జీవాత్మ జ్ఞానంతో కూడిన వాడు, జ్ఞానం , శేషత్వం మరియు పారతంత్రియం (పూర్తి నియంత్రణ) కల వాడు.  జ్ఞానం ఉన్న వ్యక్తి  ప్రతి దానిని యథా తథంగా గ్రహించి అర్థం చేసుకోవాలి. ఈ అంశంలోని అడ్డంకులను చూద్దాము.

  • ఏ వస్తువు అయినా, జ్ఞానం (నిజమైన జ్ఞానం), జ్ఞాన అనుదయం (అజ్ఞాన స్థితి), అన్యథా జ్ఞానం (వస్తువు యొక్క గుణాన్నితప్పుగా అర్థం చేసుకోవడం – శంఖం పసుపు రంగులో ఉందని అర్థం చేసుకొనుట) మరియు విపరీత జ్ఞానం (వస్తువునే అపార్ధం చేసుకొనుట –  ఒక స్థంభాన్ని మనిషిగా అనుకోవడం). ఇందులో జ్ఞాన అనుదయం,  అన్యథా  జ్ఞానం మరియు విపరీత జ్ఞానం అడ్డంకులు. అనువాదకుని గమనిక: సాధారణ ఉదాహరణలతో దీన్ని అర్థం చేసుకుంటాము.
    • జ్ఞాన అనుదయం – ఆత్మా జ్ఞాన (పరిజ్ఞానం) తత్వమని, శరీరానికి భిన్నమైనదని తెలియకపోవుట పూర్తి అజ్ఞాన స్థితి.
    • అన్యథా జ్ఞానం – ఆత్మ శ్రీమన్నారాయణుడికి కాకుండా ఇతర దేవతల అధీనం అనుకొనుట ఆత్మ యొక్క శేశాత్వాన్ని అపార్ధం చేసుకున్నట్లవును.
    • విపరీత జ్ఞానం – జీవాత్మ స్వతంతృడు అన్న భావన  జీవాత్మ స్వభావాన్ని అపార్ధం చేసుకున్నట్లవుతుంది. 
  •  ఎమ్బెరుమాన్ జీవాత్మను ఆస్వాదిస్తుండగా, వారు జీవాత్మ యొక్క శేశాత్వాన్ని జయించి, అంటే, వారు జీవాత్మను ఉన్నత స్థానంలో ఉంచి, వారు తక్కువ స్థానములో ఉండి, జీవాత్మను సేవించే ప్రయత్నంచేసినపుడు, జీవాత్మ తాను నిత్యం భగవానుని శేషుడని వారి ఆధీనుడని వ్యతిరేకించకూడదు. ఇటువంటి వ్యతిరేకత ఒక అడ్డంకి మరియు ఇది భగవానుని  ఆనందానికి ఒక ఆటంకం అవుతుంది. శేశత్వం అనగా భగవానుని ఆధీనుడై ఉండుట లేదా భగవానుని సేవకై నిత్యం సిద్ధంగా ఉండుట.  ఉదాహరణకు,  భార్య తన భర్తకు అనేక విధాలుగా సేవ చేయడం (మన సాంప్రదాయ జీవనశైలిలో) మనం సహజంగా చూస్తుంటాము. కానీ ఒక వేళ భర్త తన  భార్య పట్ల ప్రేమానురాగంతో సేవ చేస్తే, భార్య దాన్ని వ్యతిరేకించ కూడదు, “కాదు! మీరు నాకు సేవ చేయకూడదు, నేను మీ సేవ చేయాలి” – తన భార్యను సేవించడం ద్వారా ఆ భర్త పొందుతున్న ఆనందానికి ఇది అవరోధం అవుతుంది. పరమాత్మ మరియు జీవాత్మ మధ్య బర్త్రు (భర్త) – భార్య (అర్ధాంగి) సంబంధం ఉంది. ఈ కోణంలో చూస్తే , జీవాత్మ (భార్య) భగవానునికి సేవ చేయాలి. అయితే జీవాత్మకు సేవ అందించడం ద్వారా భగవానుడు ఆనందం పొందాలని ఇష్టపడితే, భగవానుని సంతోషాన్ని గ్రహించి వారికి సహకరించాలి. ఇదే సూత్రాన్ని పిళ్ళై లోకాచార్యులు ముమ్ముక్షుప్పడి సూత్రంలో 92 ఇక్కడి వ్యాఖ్యానంలో వివరించారు.
  • శేష (దాసుడు) అనగా శేషి (యజమాని) యొక్క కీర్తి ప్రతిష్టలు పెంపొందించువాడు అని అర్థం. పారతంత్రియం అనగా యజమాని యొక్క పూర్తి అధీనుడై ఉండుట, ఒక అచిత్ మాదిరిగా. (అనువాదకుని గమనిక: యజమాని తన గడియారాన్ని చేతికి పెట్టుకున్నా లేదా బల్లపై పెట్టినా ఆ యజమానిని ఎవరూ ప్రశ్నించరు. జీవాత్మ కూడా ఎమ్బెరుమాన్ పట్ల అలా ఉండాలి). అయితే మునుపటి వివరణలో ఉదహరించినట్లుగా, ఎమ్బెరుమాన్ జీవాత్మ ను ఆస్వాదించాలని కోరుకున్నప్పుడు, జీవాత్మ ఎలాంటి స్పందన లేకుండా ఒక రాయిలా ఉండకూడదు. భగవాన్ యొక్క ఆనందాన్ని పెంచడానికి జీవాత్మ ప్రతిస్పందించాలి. అలా చేయక పోవుట ఒక అడ్డంకి. (అనువాదకుని గమనిక: కుచేలుడు శ్రీకృష్ణుని చూడటానికి వెళ్ళినపుడు, శ్రీకృష్ణుడు కుచేలుని పాదాలను మర్దన చేసి వారికి సేవ చేస్తారు, కృష్ణుని ఆనందానికి అడ్డురాకుండా కుచేలుడు అంగీకరిస్తాడు. అదే విధంగా,   నమ్మాల్వారునికి ఎమ్బెరుమాన్ సేవ చేయాలనుకుంటారు, ఆళ్వారుని కుడి పాదానికి గొప్ప ఆనందంతో మర్దన చేయుడం ప్రారంభిస్తారు. ఆళ్వారు మొదట్లో కలవరపడతారు, కానీ తరువాత వారి ఆనందాన్ని తెలుసుకుంటారు. అవును! కొంతసేపు తర్వాత, ఆళ్వారు తన కుడి పాదాన్ని తీసి తన ఎడమ పాదాన్ని ఎమ్బెరుమాన్ ముందుంచుతారు.  ఎమ్బెరుమాన్ సంతోషం  రెట్టింపు అవుతుంది. అందువల్ల, పారతంత్రియం కారణంగా ఎమ్బెరుమాన్ యొక్క సేవాభావపు క్రియలకు  ప్రతిస్పందించకపోవుట ఒక అడ్డంకి.
  • భాగవత శేషత్వాన్ని తక్కువ ప్రాధాన్యత ఇచ్చుట (పైగా భగవత శేషత్వానికి  ప్రాథమికత ఇచ్చుట) ఒక అడ్డంకి. మనము సహజంగా భగవానుని అధీనులై ఉంటాము. ఈ భగవత శేశాత్వ  భావన భాగవత శేశత్వంగా  పురోగమించాలి. భాగవానుడు తన కంటే ఎక్కువ తన భక్తుల సేవ చేస్తే సంతోషిస్తారు.  అందువల్ల, భాగవత శేషత్వాన్ని ఏ కారణంగా కూడా తక్కువ ప్రాముఖ్యత  ఇచ్చుట ఒక అడ్డంకి.
  • అదే విషయం ఆచార్యుల పట్ల కూడా వర్తిస్తుంది. అనువాదకుని గమనిక: ప్రతి వారూ వారి అచార్యాధీనులై అన్ని పరిస్థితుల్లోనూ వారిని సేవించాలి. పిళ్ళై లోకాచార్యులు విశేషంగా శ్రీవచన భూషణంలో  ఆచార్యులకు శరణాగతిని, ప్రాముఖ్యతను  విస్తారంగా  కీర్తించారు. మణవాళ మామునులు ఈ సూత్రం యొక్క సారాంశతత్వాన్ని ఉపదేశ రత్నమాలలో ఉన్నతంగా కీర్తించారు.
25.  పరస్వరూప విరోధి  – పరమాత్మ నిజమైన స్వభావాన్ని అర్థం చేసుకోవడంలో అవరోధాలు
గరుడను అధీష్టించిన వాడు సర్వశ్రేష్టమైన దేవుడు (వేదాత్మాగా పేర్కొనబడిన)

పరస్వరూపం అనగా పరమాత్మ యొక్క నిజమైన స్వభావం. భగవానుడు సర్వశ్రేష్టులు , సర్వజ్ఞుడు, సర్వశక్తివంతుడు, అన్ని లోకాలకు అధిపతి, ఏ మచ్చ లేనివాడు మరియు అన్ని కళ్యాణ గుణాలతో నిండి ఉన్నవాడు. ఈ అంశంలోని అడ్డంకులను చూద్దాము.

  •  విషయ వాంఛలకు, లౌకిక సుఖాలకు లోనవుట ఒక అడ్డంకి. ఈ ప్రకృతి ఒక తెరలాగా భగవానుడి నిజస్వరూపాన్ని దాచివేస్తుంది. ప్రకృతి మూడు గుణాలు – సత్వం (మంచితనం), రజస్సు (రాగ ద్వేషాలు) మరియు తమస్సు (అజ్ఞానం) తో కూడి ఉంటుంది. శారీరక సుఖాలకు అధీనుడై ఉండుట మనల్ని భగవానుని నుండి దూరంగా ఉంచుతుంది. ఒక వ్యక్తిలో సత్వ గుణం పెరిగితే భగవానుని యొక్క నిజమైన స్వభావాన్ని అర్ధం చేసుకునేందుకు ఈ శరీరం ని సమర్థవంతంగా ఉపయోగించవచ్చు. కానీ రజో / తమో గుణాలు పెరిగితే, అదే శరీరం భగవానుని అర్థం చేసుకోకుండా మనలను దూరం చేస్తుంది. అందువలన, విషయ వాంఛలకు లోనవుట ఒక అడ్డంకి.
  • లౌకిక ధోరణి ఉన్న వ్యక్తులను సర్వోపరి అని భావించుట ఒక అడ్డంకి. బ్రహ్మ, రుద్రుడు మొదలైన వంటి దేవతాంతరులు కూడా ప్రమాదకరమైన జన్మ మరణ చక్రంలో చిక్కుకున్నవారే. తొండరడిప్పొడి ఆళ్వార్ తిరుమాలై 10లో ” నాట్టినాన్ దెయ్వంగళాగ అత్  దెయ్వనాయగన్ తానే”, అని అన్నారు,  దేవతాంతరులందరికి నిర్దిష్ట కార్యములు ఇవ్వబడినవి, వారిని సర్వోపరిగా పరిగణించరాదు.
  • “ఈ దేవతాంతరులు ఏమ్బెరుమానుచే  నియంత్రించబడతారు” అని పరిగణనలోకి తీసుకోకపోవడం. ప్రతి ఒక్కరూ చివరికి భగవాన్ అధీనులు. కాబట్టి, అటువంటి ఆలోచన లేకపోవడం ఒక అడ్డంకి.
  • భగవానుని సౌలభ్యాన్ని (సరళత) చూసి వారి ఆధిపత్యాన్ని శంకించుట  ఒక అడ్డంకి. వాత్సల్యం (మమత), సౌలభ్యం (సరళత్వం / సులభంగా లభ్యత), సౌశీల్యం (ఔదార్యం) మొదలైనవి భగవానుని ప్రతిష్టాత్మకమైన కళ్యాణ గుణాలు. కానీ ఒకవేళ “భగవానుని సులభంగా అందుబాటులో ఉండటం వలన, అతను కూడా సామాన్య మానవుడై ఉండాలి”, అన్న అంచనా ఒక అడ్డంకి. అనువాదకుని గమనిక: గీతాచార్యులు గీతలో (9.11) “అవజానంతి మాం మూఢ” అని అన్నారు. “మూర్ఖులైన మనుష్యులు నన్ను (నా అవతారాల సమయంలో) సామాన్య మానవుడిగా పరిగణలోకి తీసుకుంటారు మరియు వారు నా ఆధిపత్యాన్ని అర్థం చేసుకోలేరు.
  • భగవత్ విషయంలో అజ్ఞానం మరియు అన్యథా జ్ఞానం కూడా అడ్డంకిగా ఉంటాయి. అనువాదకుని గమనిక: భగవానుని యొక్క పరత్వం (సార్వభౌమత్వo) మరియు సౌలభ్యం (సరళత) సరిగ్గా అర్థం చేసుకోవాలి. అలాంటి సరైన అవగాహన ఉండకపోయినా భగవత్ అపచారాలకు దారి తీస్తుంది.

26. స్వానుభవ విరోధి  – స్వీయ అనుభవంలో వచ్చే అడ్డంకులు

స్వానుభవం అంటే శుద్ధ స్థితిలో వారి సొంత ఆత్మను  అనుభవించుట/ఆనందించుట  అని అర్థం.   భగవానుని అనుభవించే కంటే ఇది తక్కువై ఉన్నప్పటికీ ఆత్మానుభవం ఆనందదాయకంగా పరిగణిస్తారు. ఆత్మ భౌతిక శరీరంలో చిక్కుకొని ఉండుటయే ఒక పెద్ద అడ్డంకి. ఈ క్రింద కొన్ని అడ్డంకులు వివరించబడినవి:

  • దేహ వాసనా (శారీరక ) నుండి సుఖానుభవాలు / జ్ఞాపకాలు జ్ఞప్తికి తెచ్చుకొనుట ఒక అడ్డంకి. ఇంద్రియాల ద్వారా గతంలో అనుభవించిన సుఖానుభవాలు, అసలు అనుభవం తరువాత కూడా జ్ఞాపకాలుగా ఉండిపోతాయి. ఈ వాసనా (జ్ఞాపకాలు) చాలా ప్రమాదకరమైనవి, రచికి (రుచి) దారి తీస్తాయి. అనువాదకుని గమనిక: వాసనా – అచేతన మనస్సు ప్రభావాలు, రుచి – ఉద్దేశపూర్వకమైన కోరికలు.
  • భార్య, పిల్లలు, సంపద మొదలైనవి శరీరంకి సంభందమైన సుఖాలు జ్ఞప్తికి తెచ్చుకొనుట, అడ్డంకులవుతాయి,  అత్మానుభవమును పరిమితం చేస్తాయి.
  •  వాసనా (ప్రభావాలు) నుండి ఉద్భవించిన రుచి (రుచులు) కూడా ఒక అడ్డంకి. సాధారణంగా, పాల రుచిచూసిన పిల్లి మళ్ళీ పాలను దొంగిలించడానికి వస్తుందని అంటారు. అనువాదకుని గమనిక: మన శరీరం ఒక సారి సుఖాలను అనుభవిస్తే,   మన ఇంద్రియాలను నియంత్రించడం కష్టమైపోతుంది. అందువల్ల, గొప్ప ఋషులు మనలను  విషయ వాంఛల వైపు కాకుండా పరిత్యాగం వైపు మార్గనిర్దేశం చేసారు. కోరికలు ఎన్ని తీర్చినా అవి పెరిగుతూనే ఉంటాయి పుడుతూనే ఉంటాయి.
27. పరానుభవ విరోధి – పరమాత్మను అనుభవించడంలో వచ్చే అడ్డంకులు
ఎంతో మనోహరమైన తిరుక్కురుంగుడి నంబి అర్చావతారం

పారానుభవం అనగా మనస్పూర్తిగా అర్ధంచేసుకొని సర్వోపరి భగవానుని యొక్క స్వరూప (స్వభావం), రూప (రూపాలు), గుణ (కళ్యాణ గుణాలు), విభూతి (సంపద) అనుభూతిని ఆనందించుట అని అర్థం. భగవానుడు ఐదు ప్రాకారములు (రూపాలు) –   పర (పరమపదం లో), వ్యూహ (వాసదేవ, సంకర్షణ, ప్రధ్యుమ్న మరియు అనిరుద్ధ, క్షీరాబ్ధి నాథుడు), విభవం (శ్రీరాముడు, కృష్ణుడు మొదలైన వంటి అనేక అవతారాలు), అంతర్యామి (అంతటా  వ్యాపించి ఉన్న పరమాత్మ), అర్చా (విగ్రహ రూపాలు). వీటిలో, ప్రస్తుత పరిస్థితిలో, అర్చావతారం మాత్రమే మన ఇంద్రియాల ద్వారా అనుభవించి/ఆనందించ గలిగినది అని తిరుమంగై ఆళ్వారు తిరునెడుంతాండగం 10 లో  “పిన్నానార్ వణంగుం చోతి” – భవిష్యత్తు తరాలవారు (శ్రీకృష్ణునితో ముగించిన విభావావతారములు తరువాత ఆరాధించేటట్లుగా) అని వివరించారు.  ఇప్పుడు, ఇతర్లను మానస సాక్షాత్కారంతో (మనస్సు ద్వారా)  మాత్రమే అర్థం చేసుకోవచ్చు. అనుభవము (అనుభూతి / సంతోషం) భగవన్ పట్ల  అనురాగం / ప్రేమకు దారితీస్తుంది. ఆ ప్రేమ వారి కైన్కర్యాన్ని ప్రేరేపిస్తుంది. ఇవన్నీ అనుభవంలోని భాగాలు – అటువంటి అనుభవానికి అంతరాయం కలిగించేది ఏదైనా ఆటంకమే. ఈ అంశంలోని అడ్డంకులను చూద్దాము.

  • స్వీయ కేంద్రీకృత కార్యకలాపాలు అడ్డంకులు. నమ్మాల్వారు తిరువాయ్మొళి 3.2.1లో “అన్నాళ్ నళ్ తంత ఆకైయిన్ వళి ఉళల్వేన్”  నేను నీవిచ్చిన ఈ శరీరం (ఉద్ధరణ మార్గాన్ని సులభతరం చేయడానికి), ఇంద్రియాలతో బాధపడుతున్నాను. శరీరాన్ని మరియు ఇంద్రియాలను ఉద్ధరణకు ఉపయోగించుటకు బదులుగా, సొంత స్వార్థ కార్యకలాపాల కోసం ఉపయోగించుటకు భగవత్ అనుభవానికి ఒక అడ్డంకి అవుతుంది.
  • ఎమ్బెరుమాన్ యొక్క పవిత్రమైన కళ్యాణగుణాల గురించి విన్నపుడు ఈర్ష్యపడుట ఒక అవరోధం అవుతుంది.  కాలం గడిచి మనం మరచిపోయిన పాపాల కారణంగా, భగవానుని యొక్క కీర్తి ప్రశంసలు వినడంతో శిశుపాలుడు, దుర్యోధనుడు మొదలైన వారిలాగా అసూయపడవచ్చు. ఇది ఒక అడ్డంకి.
  • ఇతరుల (సంసారులు, రాక్షస ప్రవ్రుత్తి గలవారు మొదలైనవారు) గురించి విని ఆనందించుట ఒక అడ్డంకి అవును.
  • భగవానుని సార్వభౌమత్వాములో మునిగి నిమగ్నమై, తరువాత వదిలివేయుట ఒక అడ్డంకి. తిరుమంగై ఆళ్వార్ తిరునెడుంతాండగం 21లో “అవరైన్ఱ౦జినోమే” – భగవానుడు మహోన్నతుడని నేను తలచి భయపడ్డాను. ఆళ్వారుల సందర్భంలో, అది ఆళ్వార్ మరియు ఎమ్బెరుమాన్ మధ్య దివ్య పరస్పర సంభాషణ – ప్రశ్నకు అతీతమైనది, కానీ సాధారణంగా భగవానుని సార్వభౌమత్వాములో మునిగి నిమగ్నమై, తరువాత వారికి దూరంగా వెళ్లిపోవట అనేది ఒక అడ్డంకి.

28.  సంస్లేశ విరోధి – జీవాత్మ పరమాత్మను చేరకలో వచ్చే అవరోధాలు

సంస్లేశం అనగా ఎమ్బెరుమానునితో అనుభవం.  ఇది మానస అనుభవం (మనసులో) లేదా ప్రత్యక్ష అనుభవం (ముఖా-ముఖీ) కావచ్చు. ఏదో రకంగా ఎమ్బెరుమాన్తో కలసి ఆనందించుట సంస్లేశం అని పిలుస్తారు. అది 27వ వ్యాఖానంలో పరానుభావానికి  పోలి  ఉంది. ఈ అంశంపై అడ్డంకులను చూద్దాము.

  • భగవానుని సార్వభౌమత్వాములో మునిగి నిమగ్నమై, తరువాత వదిలివేయుట ఒక అడ్డంకి. 27వ సూత్రంలో చర్చించాము.
  • భగవానుని కళ్యాణ గుణాలతో సంతృప్తిపడి, మన ఆత్మ స్వల్పతను పరిగణించి భగవానుని సాంగత్యానికి దూరంగా ఉండుట ఒక అడ్డంకి.  తన ఆత్మను తక్కువగా భావించి,  భగవానునితో సాంగత్యం వారి కల్యాణ గుణాలను తగ్గించగలదు అన్న భావన భగవత్ అనుబంధానికి ఒక అడ్డంకి. ఈ స్థితిని “వళవేళులగు తలైయెడుత్తల్” గా సూచించబడింది – – (తిరువాయ్మొళి 1.5 పద్యగం). నమ్మాల్వారు తిరువాయ్మొళి 1.5.7లో “అడియేన్ చిఱియ జ్ఞానత్తాన్, అఱితళార్కుం అరియానై – కణ్ణనై – అడియేన్ కన్బాన్ అలఱ్ఱువన్, ఇతనిల్ మిక్కోర్ ఆయర్వున్డే” – గొప్ప ఋషులకు కూడా అతి కష్టంగా కనిపించే వాడు, శ్రీకృష్ణునిలా  అవతరించారు – నేను అతనిని చూడడానికి పరితపించి పోతున్నాను – ఇంతకంటే మూర్ఖత్వం ఇంకేముంటుంది? ఎమ్బెరుమాన్ మరియు ఆళ్వార్ మద్య ఇటువంటి పరస్పర సంభాషణలు ప్రేమను ఇచ్చి పుచ్చు కొనుటగా అర్థం చేసుకోవాలి. కానీ మనకు, భగవానునితో సాంగత్యం వారి కల్యాణ గుణాలను తగ్గించగలదని భావించి ఎమ్బెరుమానునికి దూరంగా ఉండకూడదు.
  • మహాలక్ష్మి తాయార్ యొక్క పురుషకారం (సిఫార్సు) లేకుండా భగవానుని సమీపించుట ఒక అడ్డంకి. భగవానుడు సర్వస్వతంత్రుడు  మరియు ఎవరి నియంత్రణలో లేనివాడు. ఒక వేళ వారిని నేరుగా సమీపిస్తే, నమ్మాల్వారు  తిరువాయ్మొళి 1.4.7లో చెప్పినట్లుగా, “ఎన్ పిళైయే నినైంతు అరుళాత తిరుమాళ్” – (కేవలం నా లోపాలను పరిగనించి, శ్రీమన్నారాయణ నన్ను అనుగ్రహించలేదు), భగవానుడు మన కర్మానుసారంగా మళ్ళీ క్రిందకు ఈ సంసారంలోకి తోసివేస్తాడు. కానీ మనము తాయార్ సిఫార్సుతో వెళ్ళితే, మన కోరికలు సులభంగా నెరవేరుతాయి. పురుషకారం అనగా సిఫార్సు అని అర్థం. తను ప్రతి ఒక్కరికీ తల్లిగా, భగవానుడు మన తప్పులు క్షమించేలా చేస్తుంది. (ఒక తండ్రి తన పిల్లవాడి తప్పును వాడి తల్లి సిఫార్సుతో క్షమించే విధంగా). ఈ పురుషకారం పిరాట్టి స్వభావం, అలాంటి పురుషకారాన్ని విస్మరించుట ఒక అడ్డంకి. అనువాదకుని గమనిక: ఈ ప్రపంచంలో,  ఆచార్యులు తాయార్ని సూచిస్తారు, వారు భగవానుని సులభంగా చేరుకునేటట్టు చేస్తారు.
  • భగవానుని చేరుకొనుట చాలా కష్టం అని వారి సహవాసానికి దూరంగా ఉండుట ఒక అడ్డంకి. అనువాదకుని గమనిక: తమ సొంత ప్రయత్నాలు చేసే వారికి భగవానుని చేరుకొనుట మహా కష్టం, ఆచార్యుల ద్వారా తనకు పూర్తి శరణాగతి చేసిన వారికి సులువుగా లభిస్తాడు.

29.   విశ్లేష విరోధి – పరమాత్మ నుండి విడిన జీవాత్మకు అడ్డంకులు

తమ ప్రియమైన వారి నుండి విడిపోవుటను విస్లేశం అంటారు.  వ్యాఖ్యానంలో విస్లేశమే ఒక అడ్డంకిగా వివరించ బడినది.

 పరాంకుస నాయకి (నమ్మాల్వారు) – శ్రీరంగం

  •  తగినంత భక్తి లేక విరహంలో వేదన పడకుండా సాధారణంగా ఉండుట విరోధాలు. “భక్తి పారవస్యం” (భగవానుని భక్తి భావంలో మునిగి ఉండుట) “పరగుణావిష్ట:” గా అర్థంచేసుకోవచ్చు (భగవానుని గుణాలు కలిగి ఉండుట), నమ్మాల్వారు యొక్క పెరియ తిరువంతాది 34లో “కాళాళుం నెంజళియుం” –  కాళ్లు తమ స్వంతంగా నిలబడలేకపోవుట, గుండె కరిగిపోతుంది) మరియు నమ్మాల్వారు యొక్క తిరువాయ్మొళి 7.2.1లో “కంగులుం పాగలుం కణ్తుయిలఱియాళ్ కణ్ణ నీర్  కైగళాలిఱైక్కుం – ఎంగనే ధరిక్కేన్ ఉన్నై విట్టు” – పరాంగుస నాయకి తల్లి తన కుమార్తె గురించి మాట్లాడుతూ “నా కుమార్తె రాత్రింబగళ్ళు నిద్రపోకుండా నిరంతరం విలపిస్తుంది మరియు శ్రీరంగనాథుడు  లేకుండా ఎలా భరిస్తుందని ఆలోచిస్తూన్నాను”). విరహంతో బాధపడే ఇటువంటి ఈ స్థితిని పారవస్యం అని పిలుస్తారు. ఆ స్థితిలో బాధ లేకుండా సాధారణ స్థితిలో ఉండటం అడ్డంకి.
  • భగవద్గీతలో గీతాచార్యులు 10.9లో అన్నారు “మచ్చిత్తా మద్గత ప్రాణా బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ” – నా భక్తులు నిరంతరం నన్ను స్మరిస్తూ నన్ను వారి ప్రాణ వాయువులా ఉంచి  నా లీలలను వారి మధ్య చర్చించుకుంటారు.  నిరంతరం నా దివ్య లీలలను చర్చించుకొనుట  ద్వారా, వారు (చెప్పేవారు మరియు వినేవారు) గొప్ప సంతృప్తి మరియు ఆనందాన్ని పొందుతారు. భగవానుని యొక్క లీలలను మరియు కీర్తిప్రతిష్ఠలను పంచుకోవడం మరియు చర్చించి తద్వారా సంతృప్తి మరియు సంతోషాన్ని పొందే ఈ చర్యను సాధారణంగా “బోధయంతః పరస్పరం” అని పిలుస్తారు. అలాంటి చర్చలలో పాల్గొనేవారిని “ఉచాత్తునై” (ఆధారపడదగిన సహచర) అని పిలుస్తారు. వారు హృదయంలో విరహవేదనను తగ్గిస్తారు. విరహవేదన సమయంలో భగవత్ విషయాన్ని చర్చించడానికి అటువంటి ఆధారపడే సహచరులతో సహవాసం చేయకపొతే మరింత దుఃఖానికి దారి తీస్తుంది తద్వారా అడ్డంకి అవుతుంది. నమ్మాల్వారు తిరువాయ్మొళి 5.4.9లో “చెంజుడర్త్  తామరైక్కణ్ చెల్వనుం  వారానాల్ – నెంజిడర్ తీర్పార్ ఇనియార్? నింన్ఱు అరుగుగిన్న్ఱెనే ” – ఎర్రటి కమల నయనాల శ్రీమాన్ రాకకోసం నేను విరహవేదనలో మునిగిపోతున్నాను. ఇప్పుడు నా హృదయం నుండి ఆ బాధలను ఎవరు తొలగిస్తారు?

తరువాతి భాగం మనం వచ్చే సంచికలో కొనసాగిద్దాము.

హిందీలో : http://ponnadi.blogspot.com/2013/12/virodhi-pariharangal-5.html

అడియేన్ శ్రీదేవి రామానుజ దాసి

మూలము : https://srivaishnavagranthamstelugu.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం 20

శ్రీ:  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః   శ్రీమద్వరవరమునయే నమః

ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం

 << ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం – 19

శ్రీభాష్యం మంగళ శ్లోకము – దివ్య ప్రబంధ అనుభవం – మొదటి భాగము

భగవద్రామానుజులు తమ శ్రీభాష్యం ప్రారంభంలో ఈ మంగళ శ్లోకాన్ని చెప్పి ప్రారంభించారు.

అఖిలభువనజన్మ స్తేమభంగాదిలీలె

వినతవివిధభూతవ్రాతరక్షైకదీక్షే!

శృతిశిరసి విధీప్తే బ్రాహ్మణి శ్రీనివాసే

భవతు మమ పరస్మిన్ శేముషీ భక్తిరూపా!

           మహాచార్యులైన భగవద్రామనుజుల వారి శ్రీసూక్తిగా వెలువడిన ఈ శ్లోకం సకల భక్త గోష్టికి సదా సర్వదా  అమృతతుల్యము. ఇది భక్తుల హృదయాలలో భక్తి రూపాపన్న జ్ఞానాన్ని నిలుపుతుంది.

ఈ శ్లోకానికి ఆళ్వార్లు అనుగ్రహించిన ప్రబంధాలు, ఆచార్యుల శ్రీసూక్తులు  మూలాధారంగా చెప్పవచ్చు. ముందుగా ఆళ్వార్ల ప్రబంధాలకు ఈ శ్లోకానికి ఉన్న సంబంధాన్ని చూద్దాం.

పరమాత్మ జగత్సృష్టి, స్థితి, సంహారాలను లీలగా చేస్తున్నాడని చెప్పే ‘అఖిలభువనజన్మ స్తేమ భంగాదిలీలె’ అన్న శ్లోక భాగంలోని మాటలు బ్రహ్మసూత్రాలలోని రెండవదైన

‘జన్మాద్యస్య యతః’

అని, ఆ సూత్రంమే

‘యతోవా ఇమాని భూతాని జాయంతే’

అనే ఉపనిషత్ వాక్యం యొక్క మూలం అన్నది  స్పష్టంమవుతున్నది. స్తేమ అన్న పదం రక్షణ, దీర్గ కాలము నిలిపి వుంచుట అన్న అర్థాన్నిస్తాయి. ఇందులో పరమాత్మ తత్వమైన లోక రక్షణత్వము  కూడి వుంది. ఇలా రక్షణ గురించి రామానుజులు ఇంతకు ముందే చెప్పారు. మళ్ళీ

‘వినత వివిధ భూత వ్రాత రక్షైక దీక్షే’

అన్నారు. శ్రీనివాసుడి లక్ష్యము తన భక్తులను రక్ష్మించటమే అని తెలుస్తున్నది.

శ్లోకం మొదటి భాగంలోనే  చెప్పబడిన ఈ  రక్షణత్వము మళ్ళీ ఎందుకు చెప్పారు?

మన ఆచార్యులు ఎప్పుడు ఏది చెప్పిన శృతి ప్రమాణము తోనే చెపుతారు. ఇక్కడ రామానుజుల ఈ పద ప్రయోగం చూసినప్పుడు దీని మూలం ఆళ్వార్ల పాశురాలలో కనపడుతుంది.

తిరువాయిమోళి 1 – 3- 2 లో   ‘ఎళివరుం ఇయల్వినన్’ అన్న  పాశుర భాగంలో నమ్మళ్వార్లు పరమాత్మ గుణానుభవము చేశారు.  ఆయన యొక్క అప్రాకృత, అసంఖ్యాక, కల్యాణ గుణములను అనుభవిస్తున్నారు.  ఇంకా అయన మోక్షప్రదత్వమును ‘విడాన్ తెళితరు నిలైమై అదు ఒళివిలన్’ అన్నారు.

ఇంతకు ముందే చెప్పిన గుణాలతో ఇది కూడా చేరి వుంటుంది కదా! మళ్ళి చెప్పాలా! అన్న ప్రశ్నకు మన పూర్వాచార్యులు మోక్షప్రదత్వము పరమాత్మ గుణాలలో అత్యున్నత మైనదని అందువలన ఇక్కడ పునరుక్తి దోషము రాదని వివరించారు. ఆళ్వార్లు రెండవ పత్తులో  ‘అణైవదరవణైమేల్’ అని మోక్షప్రదత్వాన్ని   అనుభవించారు. స్వామి దేశికులు కూడా ద్రమిడోపనిషత్ తాత్పర్య రత్నావళిలో  తిరువాయిమోళి యొక్క  ప్రధానఉదేశ్యము  మోక్షప్రదత్వము అని చెప్పారు. అందువలన పరమాత్మ కున్న మోక్ష ప్రదత్వము అనే గుణము విడిగా అనుభవించదగినది అని చెపుతున్నారు. ఇక ‘వినత వివిధ భూత వ్రాత రక్షైక దీక్షే’ అన్న ప్రయోగంలో రక్షకత్వము అంటే సామాన్యఅర్థంలో కాక మోక్షప్రదత్వము అని బోధపడుతుంది.

వాదికేసరి అళగియ మనవాళ జీయర్ స్వామికి ముందు ఎవరూ తమ సంస్కృత రచనలలో ఆళ్వార్ల శ్రీసూక్తులను ప్రమాణంగా చూపలేదు కావున ఇక్కడి శ్రీభాష్య పంక్తిలో శ్రుత ప్రకాశికాభట్టరు, ‘జగదుద్భవ – స్థితి – ప్రణాశ – సంసార విమోచన‘ అని ఆళవందార్లను ఉదాహరించారు.

అడియెన్ చూడామణి రామానుజ దాసి

మూలము : https://srivaishnavagranthams.wordpress.com/2018/02/18/dramidopanishat-prabhava-sarvasvam-20/

archived in https://srivaishnavagranthams.wordpress.com/

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org
pramAthA (preceptors) – https://guruparamparai.wordpress.com
SrIvaishNava Education/Kids Portal – http://pillai.koyil.org

 

స్తోత్రరత్నం – తనియన్లు

స్తోత్రరత్నం – తనియన్లు

                                                       శ్రీమతే శఠకోపాయ నమః                                                         

  శ్రీమతే రామానుజాయ నమః 

శ్రీమద్వరవరమునయే నమః

alavandhar

శ్రీయామునాచార్యులు , కాట్టుమన్నార్ కోయిల్

స్వాదయన్నిహ సర్వేషాం త్రయ్యంతార్థం సుదుర్గ్రహం|

స్తోత్రయామాస యోగీంద్రః తం వన్దే యామునాహ్వయం||

అవగాహనకు క్లిష్ఠతరమైన వేదాంతార్థాలను సులభముగా తమ స్తోత్రమున అదించిన, యోగులలో శ్రేష్ఠులైన శ్రీయామునాచార్యులను సదా సేవిస్తాను.

యత్ పదాం భోరుహ ధ్యాన విధ్వస్తాశేషకల్మషః |

వస్తుతాముపయాతోహం యామునేయం నమామి తం ||

ఎవరి దివ్యకృపతో నా కల్మషములన్నీ నాశనము చెందినవో మరియు ఒక వస్తువుగా గుర్తించబడ్డానో, పూర్వము అసత్ (అచేతనము)గా ఉండి యామునాచార్యుల పాదముల ధ్యానముతో ప్రస్తుతం సత్(ఆత్మ/ చేతనము) గా భావిస్తున్నానో ఆ శ్రీయామునాచార్యులకు  నమస్కరిస్తున్నాను.

నమో నమో యామునాయ యామునాయ నమో నమః |

నమో నమో యామునాయ యామునాయ నమో నమః | |

మరలా మరలా శ్రీయామునాచార్యులను ఆరాధిస్తాను. నిరంతరం వారికి నమస్కరించుటను నిరోధించుకోలేను.

అడియేన్ నల్లా శశిధర్ రామానుజదాసః

ఇటు తరువాత అవతారికను తెలుసుకుందాం.

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org
pramAthA (preceptors) – http://acharyas.koyil.org
SrIvaishNava education/kids portal – http://pillai.koyil.org