Monthly Archives: May 2020

అంతిమోపాయ నిష్ఠ – 1

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః

మణవాళ మాముణుల తనియన్ (పెరియ పెరుమాళ్ సాయించినది)

శ్రీశైలేశ దయా పాత్రమ్ దీభక్త్యాది గుణార్ణవమ్
యతీంద్ర ప్రవణమ్ వందే రమ్య జామాతరమ్ మునిమ్

పొన్నడిక్కాల్ జీయర్ తనియన్ (దొడ్డ అయ్యంగార్ అప్పై సాయించినది)

రమ్య జామాత్రు యోగీంద్ర పాదరేఖా మయం సదా
తథా యత్తాత్మ సత్తాదిం రామానుజ మునిం భజే

పరవస్తు పట్టర్పిరాన్ జీయర్ తనియన్లు

రమ్య జామాత్రు యోగీంద్ర పాద సేవైక దారకం
భట్టనాథ మునిం వందే వాత్సల్యాది గుణార్ణవం

కాన్తోపయన్త్రుయమినః కరుణామ్రుతాబ్దేః
కారుణ్యశీతల కటాక్ష సుథానిథానం
తన్నామ మంత్రకృత సర్వహితోపదేశం
శ్రీభట్టనాథముని దేశికమ్ ఆశ్రయామి

ఉపనిషదత్ అమ్రుద్బ్దేరుద్ద్రుదామ్ సారవిద్భిః
మదురకవిముకైస్తాం అంతిమోపాయ నిష్టాం
ఉపదిసతి జనేభ్యో యో దయాపూర్ణద్రుష్టిః
భజహృదయ సదాత్వం భట్టనాథమ్ మునీంద్రం

రుచిర వరమునీంద్రేణాతరేణోపతిష్ఠాం
అకృత కృతివరిష్టాం అంతిమోపాయ నిష్ఠాం
తమిహ నికిల జంతు ఉత్తరణోత్యుక్తచిత్తం
ప్రతిదినం అబివందే భట్టనాధం మునీంద్రం

నమోస్తు భట్టనాథాయ మునయే ముక్తిదాయినే
యేనైవం అంతిమోపాయనిష్ఠా లోకే ప్రతిష్ఠితా

తాతొన్ఱుం తార్బుయత్తాన్ మణవాళ ముని తనతు
పాదం పరవుం పట్టర్ ప్పిరాన్ ముని పల్కలైయుం
వేదాంగళుం చిల పురాణంగళుం తమిళ్ వేదియరుం
ఓదుం పొరుళ్ అంతిమోపాయ నిష్టై ఉరైత్తవనే!

                    *****************************

అనువాదకుల గమనిక: గ్రంధము ఇచటనుండి మొదలు.

అంతిమోపాయ నిష్ఠాయా వక్తా సౌమ్యవరో మునిః
లేకస్యాన్వయో మే అత్ర లేకనీతాలపత్రవత్

మణవాళ మాముణుల ద్వారా అంతిమోపాయ నిష్ఠ మనకు తెలియజేయబడినది. ఇందులో నాప్రమేయము వారు శాయించిన విషయాలను పత్రముపై కలముతో లిఖించుట వరకు మాత్రమే.

ఎందై మణవాళ యోగి ఎనక్కురైత్త
అంతిమోపాయ నిష్ఠైయామతనై
శిందై చ్చెయ్తు ఇంగెల్లారుం వాళ ఎళుతి  వైత్తేన్ ఇప్పువియిల్
నల్ అఱి ఒన్ఱిల్లాద నాన్

నా ఆధ్యాత్మిక పితరులైన మనవాళమాముని ద్వారా లభించిన ఆంతిమోపాయనిష్ఠలోని దైవ సంబంధిత ఆదేశాలను పరిశీలించి నాకున్న పరిమిత జ్ఞానముతో సర్వజనులకు లబ్దిచేకూరాలని ఈ రచన చేశాను. (పరవస్తు పట్టరు పిరాన్ జీయర్ మనవాళ మహామునుల ఉపదేశ రత్తినమాల రెండవ పాశురము ఆధారముగా).

కఱ్ఱోర్గళ్ తాముగప్పర్ కల్వి తన్నిల్ ఆశైయుళ్ళోర్
పెఱ్ఱోం ఎన ఉగందు పిన్బు కఱ్పర్
మఱ్ఱోర్గళ్ మాచ్చర్యత్తాల్ ఇగళిల్ వందదు ఎన్ నెంజే
ఇగళ్గై ఆచ్చర్యమో తాన్ అవర్కు

పండితులు ఈ రచనను ఆదరించగలరు. ఆసక్తి గలవారు అవగాహన చేసికొని ఆస్వాదించగలరు. విషయాసక్తి లేని ఇతరులు ఈర్ష్యచే అవహేళన చేయవచ్చు, అవహేళన చేసినవారిపై అంతగా ఆశ్చర్య చెందనవసరము లేదు.  (ఏలనన , ఈ విషయ అవగాహనపై వారికి వున్నది స్వల్ప పరిణితి కాబట్టి).

 అనేక చిక్కులతో కూడివున్న ఈ భౌతిక జగత్తులో ప్రతి జీవి జనన మరణ చక్రములో పయనిస్తాడు. మన వల్ల జరిగే చిన్న పొరపాటు పర్యవసానాన్ని అనేకానేక జన్మల వరకు అనుభవించాల్సి వుంటుందని చెప్తారు. (మన వల్ల తెలియక హాని పొందిన సూక్ష్మజీవి ద్వారా సంక్రమించిన పాపాన్ని కూడా అనేక వేల సంవత్సరాలు అనుభవించాల్సి వుంటుంది.).   

సంసార కూపమనే అతి క్రూరమైన లంపటములో చిక్కుకున్న విషయలోలత్వం కల్గిన సంసారులు దానినుంచి నిలదొక్కుకుని ఆ చిక్కులను పారద్రోలి తప్పించుకొనుట దుర్లభము.

ఈ విధముగా తికమకపెట్టే జనన మరణ చక్రమును భేదించుట సంసారులకు మిక్కిలి కష్టతరము. అయితే దీనికి తరుణోపాయము మన ఆచార్యుల ద్వారా పొందవచ్ఛును. ఆచార్యులను ఆశ్రయించి నందువల్ల వారు దయతో వీరిని ఆశీర్వదించి భయాలను పారద్రోలి ఈ సంసార సాగరం నుంచి ఉద్ధరించ గలరు.     

అజ్ఞానులైన వీరిని ఆచార్యులు సంస్కరించి వారి జన్మ సార్ధకతను విశదీకరించి అపారమైన దయతో వీరిని ఉద్ధరించగలరు.                                                                     

వీరికి ఏది అవసరమో గుర్తించి ఆచార్యులు ఆ విషయమునే వీరికి బోధించగలరు. అట్టి ఆచార్య కృపకు పాత్రులైన శిష్యులు ఆచార్యుల పాదపద్మములను ఆశ్రయించి వారి మార్గనిర్దేశనములను పొందగలరు.     

అట్టి శిష్యులు ఆచరించవలసిన ముఖ్యమైన కర్తవ్యములను ఈ ప్రబంధము ద్వారా అంతిమోపాయనిష్ఠగా మనకు తెలియజేసారు.

  • ఆచార్యుల దివ్య నామావళిని, విషయ పరిజ్ఞానాన్ని, ఆదరణని, వారి జన్మ కారణము, సత్కర్మలను నిరంతరమూ ధ్యానిస్తుండాలి.
  • ఏ దివ్యదేశములో వారి నివాసమో దానిని నిరంతరమూ ధ్యానిస్తూూ, కీర్తిస్తూ ఉండాలి.
  • వారి దివ్య చరణారవిందముల యందు శరణాగతి చేయుట శిష్యుల కర్తవ్యము.
  • ఆచార్యుల దివ్య స్వరూప ధ్యాస, వారి బాహ్య విషయములపై నిరంతర సేవ శిష్యులకు ఉపేయము అని అంతిమోపాయనిష్ఠ ద్వారా తెలియజేసారు.            
  • మనసా వాచా కర్మణా దైవ స్వరూపులైన ఆచార్యుని నిరంతరమూ సేవించుట వంటి విలువైన కైంకర్యములను అనుభవించుట.
  • శిష్యుని కైంకర్యములను స్వీకరించిన ఆచార్యునికి కలిగిన సంతృప్తికి ఆనందించి, తత్ఫలితంబుగా వారి నుంచి దీవెనలు పొందుట.
  • అందరికి శుభము జరగాలని వారి పరిపూర్ణ మంగళశాసనము లభించుట శిష్యునకు అమితానందదాయకము.

అనువాదకుని సూచన: ఈ గ్రంథంలోని తదుపరి భాగములలో, ఆచార్యుల దయా గుణ వైశిష్ట్యాన్ని, శిష్యుని ప్రవర్తనను సమర్ధిస్తూ అనేక ప్రమాణములు వరుసగా పొందుపరచబడినవి. అట్టి 8 పుటల దృశ్యాలు ఇందులో జత చేయబడినవి. ఈ భాగములలో పొందు పరచిన ప్రమాణముల వివరణ సంక్షిప్తముగా ఇవ్వబడినవి.

అనంత సారం బహువేదితవ్యం అల్పశ్చ కాలో బహవశ్చ విఙ్ఞాః |
యత్సారభూతం తదుపాసితవ్యం హంసో యదా క్షీరమివాంబుమిశ్రం ||

అసారమ్ అల్పసారంచ సారం సారతరం త్యజేత్ |
భజేత్ సారతమం శాస్త్రం రత్నాకర ఇవామ్రుతం ||

తత్కర్మ యన్న బంధాయ సావిద్యా యా విముక్తయే |
ఆయాసాయాపరం కర్మ విద్యాన్యా శిల్పనైపుణ్యం ||

శాస్త్ర ఙ్ఞానం బహుక్లేశం భుద్దేశ్చలనకారణం |
ఉపదేశాత్ హరిం బుద్ద్వా విరమేత్ సర్వకర్మసు ||

ఆద్యాణం సద్రుసే కతం విసదృసే దేహే భవత్యాత్మనః
సద్బుద్దేస్స చ సంగమాదపి భవేదౌశ్ణ్యం యతాపాతసి |
కో వా సంగతి హేతు రేవమనయోః కర్మాత సామ్యేత్ కుతః
తద్బ్రహ్మాదిగమాత్ స సిద్యతి మహాన్ కస్మాత్ సదాచార్యతః ||

అనాచార్యోపలబ్ధాహి విద్యేయం నస్యతి దృవం |
శాస్త్రాదిషు సుదృష్ఠాపి సాంగాసహ ఫలోదయా |
న ప్రసీదతి వై విద్యా వినా సదుపదేశతః ||

దైవాధీనం జగత్సర్వం మంత్రాధీనం తు దైవతం |
తన్మంత్రం బ్రాహ్మణాధీనం తస్మాద్బ్రాహ్మణదైవతం ||

పుత్రైవ భవతో యాతా భూయాసీ జన్మ సంతతిః |
తస్యామన్యతమం జన్మ సంచిన్త్య శరణం వ్రజ ||

పాపి ష్ఠః క్షత్ర బంధుశ్చ పుండరీకశ్చ పుణ్యకృత్ |
ఆచార్యవత్తయా ముక్తౌ తస్మాదాచార్యవాన్ భవేత్ ||
బ్రహ్మణ్యేవ స్థితం విశ్వం ఓంకారే బ్రహ్మ సంస్థితం |
ఆచార్యాత్ స చ ఓంకారః తస్మాదాచార్యవాన్ భవేత్ ||

ఆచార్యస్స హరిస్సాక్షాత్ చరరూపీ న సంశయః |
తస్మాద్భార్యాదయః పుత్రాస్తమేకం గురుమాప్నుయుః ||

సాక్షాన్నారాయణో దేవాః కృత్వా మర్త్య మయీం తనుం |
మగ్నానుద్ధరతే లోకాన్ కారుణ్యాచ్చ అస్త్రపాణినా ||

తస్మాత్ భక్తిర్ గురౌ కార్యా సంసార భయ భీరుణా ||

గురురేవ పరం బ్రహ్మ గురుఏవ పరా గతిః |
గురురేవ పరావిద్యా గురురేవ పరం ధనం||

గురురేవ పరఃకామో గురురేవ పరాయణం|
యస్మా   తదుపదేష్టాసౌతస్మాత్  గురుతరో గురుః ||

అర్చనీయశ్చ  పూజ్యశ్చ కీర్తనీయశ్చ సర్వదా |
ధ్యాయేజ్జపేన్నమేద్భక్త్యా భజేదభ్యర్చయేన్ముదా ||

ఉపాయోపేయభావేన తమేవ శరణం వ్రజేత్ |
ఇతి సర్వేషు వేదేషు సర్వశాస్త్రేషు సమ్మతం ||

యేన సాక్షాద్భగవతి ఙ్ఞానదీప ప్రదే గురౌ |
మర్త్యబుద్ధిఃకృతా తస్య సర్వం కుంజరసౌచవత్ ||

యో దద్యాద్భగవద్ ఙ్ఞానం కుర్యాత్ ఆర్యోపసేవనం |
కృత్సం వా పృథివీం దద్యాన్న తతుల్యం కథంచన ||

ఐహికాముష్మికం సర్వం గురురష్ఠాక్షరప్రదం |
ఇత్యేవం యేన మన్యన్తే త్యక్తవ్యాస్తే మనీషిభిః ||

యేనైవ గురుణాయస్య న్యాసవిద్యా ప్రదీయతే |
తస్య వైకుంఠ దుగ్దాబ్ధిద్వారకాస్సర్వ ఏవ సః ||

యత్ స్నాతం గురుణా యత్ర తీర్ధం నాన్యత్ తతోదికం |
యచ్చ కర్మ తదర్ధం  తద్విష్ణో ఆరాధనాత్పరం ||

పశుర్మనుష్యః పక్షీ వా యే చ వైష్ణవసంశ్రయాః |
తేనైవ తే ప్రయాశ్యన్తి తద్విష్ణోః పరమం పదం

బాలమూకజడాంధాశ్చ పంగవో బదిరాస్తదా |
సదాచార్యేణ సంతుష్ఠాః ప్రాప్నువంతి పరాంగతిం ||

యం యం స్ప్రుశతి పాణిభ్యాం యం యం పశ్యతి చక్షుషాః |
స్థావరాణ్యపి ముచ్యంతే కింపునర్బాంధవాజనాః ||

అందోనందగ్రహణవసగో యాతి రంగేశ యద్వత్
పంగుర్నౌకాగుహరనిహితో నీయతే నావికేన |
భుంక్తే భోఘానవిదితన్రూపస్సేవకస్యార్భకాదిః
త్వత్సంప్రాప్తౌ ప్రభవతి తధా దేశికో మే దయాళుః ||

సిద్దం సత్సంప్రదాయే స్తిరదియమనగం శ్రోత్రియం బ్రహ్మనిష్ఠం
సత్వస్తం సత్యవాచం సమయనియతయా సాధువృత్యా సమేతం |
డంభాసూయాదిముక్తం జితవిషయగుణం దీర్ఘ బంధుం దయాళుం
స్ఖాలిత్యే శాసితారం స్వపరహితపరం దేశికం భూశ్నురీప్సేత్ ||

ఉత్పాదకబ్రహ్మపిత్రోర్గరీయాన్ బ్రహ్మదఃపితా |
స హి విద్యాతస్తం జనయతి తత్ శ్రేష్ఠం జన్మ |
శరీరమేవ మాతాపితరౌ జనయతాః |
దేహకృత్ మంత్ర గ్రుణ్ణ స్యాత్ మంత్రసంస్కారక్రుత్ పరః |
తౌ చేన్నాత్మవిదౌ స్యాతాం అన్యస్త్వాత్మ విదాత్మ క్రుత్ ||

నాచార్యః కులజాతోపి ఙ్ఞానభక్త్యాది వర్జితః |
న వయోజాతిహీనశ్చ ప్రకృష్ఠానామనాపది ||

కిమపి అత్రాభిజాయంతే యోగినః సర్వయోనిషు |
ప్రత్యక్షిత  ఆత్మనాత్మానాం నైశాం చిన్త్యం కులాదిగం ||

భిన్ననావస్రితో జంతుర్ యధా పారం నగచ్ఛతి |
అంధశ్చ  అందకర  ఆలంబాత్ కూపాంతే పతితోయతా ||

ఙ్ఞానహీనం గురుం ప్రాప్య కుతో మోక్షమవాప్నుయాత్ |
ఆచార్యో వేదసంపన్నో విష్ణు  భక్తో విమత్సరః |
మంత్రఙ్ఞో మంత్రభక్తశ్చ సదా మంత్రాశ్రయసూసిం ||

సత్సంప్రదాయ సమ్యుక్తో బ్రహ్మవిద్యావిశారదః|
అనన్యసాధన శ్చైవ తత్ అనన్యప్రయోజనః ||

బ్రాహ్మణో వీతరాగశ్చ క్రోధలోభవివర్జితః |
సత్ వృత్తశాసితా చైవ ముముక్షుః పరమార్థవిత్ ||

ఏవమాదిగుణోపేత ఆచార్యస్స ఉదాహృతః |
ఆచార్యోపి తతా శిష్యం స్నిగ్దో హితపరస్సదా ||

ప్రబోద్య భోదనీయాని ఉత్తమాచారయేత్ స్వయం |
ఉత్తారయతి సంసారాత్ తదుపాయప్లవేన తు ||
గురుమూర్తిస్తిత స్సాక్షాత్ భగవాన్ పురుషోత్తమః |
త్రిరూపో హితమాచష్ఠే దృఢ మనుష్యాణాం కలౌ హరిః ||

గురుశ్చ స్వప్నదృష్టశ్చ పూజాంతే చార్చకాననాత్ |
ఈశ్వరస్య వశస్సర్వం మంత్రస్య వస ఈశ్వరః |
మంత్రో గురువసే నిత్యం గురురేవేస్వరస్తితిః ||

యేష వై భగవాన్ సాక్షాత్ ప్రధాన పురుషేశ్వరః |
యోగీస్వరైర్ విమ్రుఖ్యాంఘ్రిర్ లోకో యం మన్యతే నరం ||

నారాయణాశ్రయో జీవస్సోయమష్టాక్షరాశ్రయః
అష్ఠాక్షర స్సదాచార్యే స్తితితస్తస్మాద్గురుం  భజేత్ ||

దయాదమసమోభేతం దృఢ భక్తిక్రియాపరం |
సత్యవాక్ శీలసంపన్న మేవ కర్మసుకౌశలం||

జితేంద్రియం సుసంతుష్టం కరుణాపూర్ణమానసం |
కుర్యాల్లక్షణ సంపన్నం ఆర్జవం చారుహాసినం |
ఏవంగుణైశ్చ సంయుక్తం గురుం విద్యాత్తు వైష్ణవం |
సహస్రసకాత్యాయి చ సర్వయత్నేషు దీక్షితాః |
కులే మహతి జాతోపి న  గురుస్స్యాతవైష్ణవః|
అఙ్ఞాన తిమిరాందస్య ఙ్ఞానాంజన సలాకయా |
చక్షుర్నిమీలితం యేన తస్మై శ్రీ గురవే నమః ||

మంత్రః ప్రకృతిరిత్యుక్తో హ్యర్తః ప్రాణ ఇతి స్మ్రుతః|
తస్మాన్మంత్రప్రదాచార్యాద్గరీయానర్తతో గురుః ||

గు శబ్దస్త్వందకారస్స్యా ద్రు శబ్దస్ తన్నిరోదకః |
అందకారనిరోధిత్వాత్ గురురిత్యభీదీయతే ||
శిష్యమఙ్ఞాన సంయుక్తం న శిక్షయతి చేద్గురుః |
శిష్యాఙ్ఞాం ఆకృతం పాపం గురోర్భవతి నిశ్చయః ||

లోభాద్వాయది వా మోహాత్ శిష్యం శాస్తి నయో గురుః |
తస్మాత్ సంశ్రుణుతే యశ్చ ప్రచ్యుతౌ తావుభావపి ||

రవిసన్నిదిమాత్రేణ సూర్యకాంతో విరాజతే |
గురుసన్నిదిమాత్రేణ శిష్య ఙ్ఞానం ప్రకాశతే ||

యధాహి వహ్నిసంపర్కాన్మలం త్యజతి కాంచనం |
తతైవ గురుసంపర్కాత్ పాపం త్యజతి మానవః ||

స్నేహేనకృపయా వాపి మంత్రీ  మంత్రం ప్రయచ్చతి |
గురుర్గ్యేయశ్చ సంపూజ్యో దానమానాదిభిస్సదా ||

అనన్యశరణాంచ తధా వానన్య సేవినాం
అనన్యసాదనానాంచ వక్తవ్యం మంత్రముత్తమం ||

సంవత్సరం తదర్ధం వా మాసత్రయ మదాపివా |
పరీక్ష్య వివదోపాయః కృపయా నిస్పృహో వదేత్ ||

నదీక్షితాయ వక్తవ్యం నా భక్తాయ న మానినే |
నాస్తికాయ కృతఙ్ఞాయ న శ్రద్దా విముఖాయ చ ||

దేశ కాలాది నియమం అరిమిత్ఱదిసోదనం |
న్యాస ముద్రాదికం తస్య పురశ్చరణకం న తు ||
నస్వరః ప్రణవోంగాని నాప్యన్య విదయస్తథా |
స్త్రీణాంచ శూద్రజాతీనాం మంత్రం ఆత్రొక్త్రిష్యతే ||

ఋష్యాదించ కరన్యాసం అంగన్యాసంచ వర్జయేత్ ||
స్త్రీ శూద్రాశ్చ వినీతాశ్చేన్మంత్రం ప్రణవార్జితం |

న దేశకాలౌ నావస్తాం పాత్రసుద్ధించ నై[నే]చ్చతి |
ద్వయోపదేశఖర్తాతు శిష్యదోషం న పస్యతి ||

దురాచారోపి సర్వాసీ కృతఙ్ఞో నాస్తికః పురా |
సమాశ్రయేదాదిదేవం శ్రద్ధయా శరణం యది |
నిర్దోషం విద్దితం జంతుం ప్రభవాత్ పరమాత్మనః ||

మంత్రరత్నం ద్వయం న్యాసం ప్రపతి శ్శరణాగతిః |

లక్ష్మీనారాయణంచేతి హితం సర్వఫలప్రదం |
నామాని మంత్రరత్నస్య పర్యాయేణ నిబోధత ||
తస్యోచ్చారణమాత్రేణ పరితుష్టోస్మి నిత్యసః ||

బ్రాహ్మణాః క్షత్రియా వైశ్యా స్స్థ్రియ శ్సూద్రాస్తతేతరాః |
తస్యాధికారిణస్సర్వే మమ భక్తో భవేద్యది ||

యస్తు మంత్రద్వయం సంయగద్యాపయతి వైష్ణవాన్ |
ఆచార్యస్స తు విఙ్ఞేయో భవబందవిమోచకః ||

వృదేహమాద్యం ప్రతిలభ్య దుర్లభం ప్లవం సుకల్యం గురుకర్ణదారకం హస్వతేరితం పుమాన్ భవాబ్దిం సతరేత్ న ఆత్మహా ||

ఆచార్యం మం విజానీయాన్నావమన్యేత కర్హిచిత్ |
న మాత్యభుద్ద్యాదృస్యేత సర్వదేవమయో గురుః ||

అధ శిష్యలక్షణం:-

మానుష్యం ప్రాప్య లోకేస్మిన్ న ముఖో పదిరోభి వా |
నాపక్రమాతి సంసారాత్ స కలూ బ్రహ్మహా భవేత్ ||

సదాచార్యోపసత్త్యా చ సాభిలాషస్తదాత్మకః |
తత్త్వ ఙ్ఞాననిధిం సత్త్వనిష్టం సద్గుణసాగరం |
సతాం గతిం కారుణికం తమాచార్యం యధావిది |
ప్రణిపాతనమస్కారప్రియవాగ్భిస్చ తోషయన్ |
తత్ప్రసాదవసేనైవ తదంజ్ఞీకారలాభవాన్ | 
తదుక్త తత్వయాదాత్మ్య ఙ్ఞానామ్రుత సుసంబృతః ||

అర్ధం రహస్యత్రితయగోచరం లబ్ధవాహనం ||

పరీక్ష్య లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణో నిర్వేదమాయాత్ నాస్త్యకృతః
కృతేన తత్ విఙ్ఞానార్ధం  స గురుమేవాభిగచేత్ సమిత్పాణి-
స్త్రోత్రియం బ్రహ్మనిష్టం తస్మై స విద్వానుపసన్నాయ సమ్యక్-
ప్రాసాంతచిత్తాయ సమన్విదాయ యేనాక్షరం పురుషం వేద సత్యం ప్రోవాచ
తాం తత్త్వతో బ్రహ్మవిద్యాం ||

గురుం ప్రకాశయేద్ధీమాన్ మంత్రం  యత్నేన గోపయేత్ |
అప్రకాశప్రకాశాభ్యాం క్షీయతే సంప్రదాయుశీ ||

ఆచార్యస్య ప్రసాదేన మమ సర్వమభీప్సితం |
ప్రాప్నుయామీతి విశ్వాసో యస్యాస్తి స సుఖీభవేత్ ||

ఆత్మనో హ్యతినీచస్య యోగిద్యేయ పదార్హతాం |
కృపయైవోపకర్తారం ఆచార్యం సంస్మరేత్ సదా ||

న చక్రాద్యంగణం నేజ్యా న ఙ్ఞానం న విరాగతా |
న మంత్రః పారమైకాంత్యం తైర్యుక్తో గురువశ్యతః ||

నిత్యం గురుముపాసీత తద్వచః శ్రవణోత్సుకః|
విగ్రహాలోకన పరస్తస్యై వాగ్యాప్రదీక్షకః ||

ప్రక్షాళ్య చరణౌ పాత్రే ప్రణిపత్యోపయుజ్య చ |
నిత్యం విదివదర్గ్యాత్యైరాదృతోభ్యర్చయేద్గురుం ||

శ్రుతిః
ఆచార్యవాన్ పురుషో వేద | దేవమివాచార్యముపాసీత |
ఆచార్యాదీనో భవ| ఆచార్యాదీనస్తిష్టేత్ | ఆచార్య దేవో భవ |
యత భగవత్యేవమ్వక్తరి వ్రుతిః | గురుదర్శనే చోత్తిష్టేత్ |
గచ్హంతమనువ్రజేత్ |

శరీరం వసు విఙ్ఞానం వాసః కర్మ గుణానసూన్ |
గురువర్తం దారయేద్యస్తు స శిష్యో నేతరస్మృతః ||

దీర్గదండనమస్కారం ప్రత్యుత్తానమనంతరం |
శరీరమర్తం ప్రాణంచ సద్గురుభ్యో నివేదయేత్ ||

గుర్వర్తస్యాత్మనః పుంసహ కృతఘ్నస్య మహాత్మనః |
సుప్రసన్నస్సదా విష్ణుర్దిహృతస్య విరాజతే ||

మంత్రే తీర్తే ద్విజే దేవే దైవఙ్ఞే భేషజే గురౌ |
యాద్రుసీ భావనా యత్ర సిద్దిర్భవతి తాదృసీ ||

యస్య దేవే పరాభక్తిర్ యథాదేవే తథా గురౌ |
తస్యై తేకతితా హ్యర్తాః ప్రకాశ్యంతే మహాత్మనః ||

దర్శనస్పర్శవచనై స్సంచారేణ చ సతమాః |
భూతమ్ విధాయ భువనమ్ మామేష్యన్తి గురుప్రియాః||

దేహకృన్మన్త్రకృన్న స్యాన్మంత్రసంస్కారకృత్పరః |
తౌ చేన్నాత్మవిదౌ స్యాతామ్ అన్యస్త్వాత్మవిధాత్మకృత్ ||

అవైష్ణవోపదిష్టమ్ స్యాత్పూర్వమ్ మంత్రవరమ్ ద్వయమ్ |
పునశ్చ విధినా సమ్యక్వైష్ణవాద్గ్రాహయేద్గురోః ||

అత స్త్రీశూద్రసంకీర్ణనిర్మూలపతితాదిషు |
అనన్యేనాన్యదృష్టౌ చ కృతాపి న కృతా భవేత్ ||

అతోన్యత్రానువిధివత్ కర్తవ్యా శరణాగతిః |
దణ్డవత్ ప్రణమేద్భూమావుపేత్య గురుమన్వహం|
దిసే వాపి నమస్కుర్యాత్ యత్రాసౌ వసతి స్వయం ||

ఆచార్యాయాహరేధర్తానాత్మానన్చ నివేదయేత్ |
తధదీనశ్చ వర్తేత సాక్షాన్ నారాయణో హిసః ||

సత్భుధ్దిస్సాదుసేవీ సముచితచరితస్ తత్వభోదాభిలాషూ |
సుష్రూశుస్త్యక్తమానః ప్రణిపతనపరః ప్రశ్నకాలప్రతీక్షః ||

సాన్తో దాన్తోనసూయుస్సరణముపగతస్సాశ్త్రవిశ్వాససాలీ |
శిష్యః ప్రాప్తః పరీక్షాన్  గృతవిదాభిమతం తత్త్వతః శిక్షణీయః |

యస్త్వాచార్యపరాదీనస్సత్  వృత్తౌ సాస్యతే యది |
శాసనే స్తిరవృతిస్స  శిష్యస్సద్భిరుదాహృతః ||

శిష్యో గురుసమీపస్తో యథావాక్కాయమానసః |
సుశ్రూషయా  గురోస్తుష్టిమ్ కుర్యాన్నిర్దూతమత్సరః ||

ఆస్తికో దర్మశీలస్చ శీలవాన్ వైష్ణవ స్సుచిః |
గంభీరశ్చతురో ధీరః శిష్య ఇత్యభీధీయతే ||

ఆసనమ్ శయనమ్ యానమ్ తదీయమ్ యఛ్చ కల్పితమ్ |
గురుణాంచ పదాక్రమ్య నరో యస్త్వదమామ్ గతిమ్ ||

ఘోస్వొష్ట్రయానప్రసాదప్రస్తరేశు కటేషు చ |
నాసీత గురుణా సార్త్దమ్ శిలాబలకనౌషూచ ||

యస్తిష్టతి గురుణాంచ సమక్షమకృతాంజలిః
సమద్రుష్ట్యా తదాఙ్ఞానత్ స సద్యో నిరయమ్ వ్రజేత్ |

ఆసనం శయనం యానం అపహాసంచ సౌనక |
అతిప్రలాపం గర్వంచ వర్జయేద్గురుసన్నిదౌ ||

యద్రుచ్చయా శ్రుతో మంత్రస్చన్నేనాతచ లేన వా |
పత్రేక్షితో వావ్యర్తస్స్యాత్పం జపేద్ యద్యనర్తకృత్ ||

మంత్రే తద్ దేవతాయాంచ తతా మంత్రప్రదే గురౌ|
త్రిశూభక్తిస్సదా కార్యా సాహి ప్రథమసాధనం ||

అధమో దేవతాభక్తో మంత్రభక్తస్తు మద్యమః |
ఉత్తమస్తు స మే భక్తో గురుభక్తోతమోత్తమహః ||

శ్రుతి:

ఆచార్యాన్మా ప్రమదః! ఆచార్యాయ ప్రియమ్ ధనమాహృత్య |

గురోర్గురుతరం నాస్తి గురోరన్యన్న భావయేత్ |
గురోర్వార్తాశ్చ కతయేద్ గురోర్నామ సదాజపేత్ ||

అర్చనీయశ్చ వంద్యశ్చ కీర్తనీయస్చ సర్వదా |
ద్యాయేజ్జపేన్నమేద్ భక్త్యా భజేతబ్యర్చయేన్ముదా ||

ఉపాయోపేయ భావేన తమేవ శరణం వ్రజేత్ |
ఇతి సర్వేషూ వేదేషు సర్వశాస్త్రేషు సమ్మతం ||

యేవం ద్వయోపదేష్టారం భావయేత్ భుద్దిమాందియా |
ఇచ్చాప్రకృత్యనుగుణైర్ ఉపచారైస్తతోచితైః ||

భజన్నవహితశ్చాస్య హితమావేదయేద్రః  |
కుర్వీత పరమాం భక్తిం గురౌ తత్ప్రియవత్సలః ||

తదనిష్టావసాదీ చ తన్నామగుణహర్షితః |
సాంతోనసూయుః శ్రద్దావాన్ గుర్వర్తాద్యాత్మప్రుతికః ||

సుచిః ప్రియహితో దాంతః శిష్యస్సోపరతస్సుదిః |
న వైరాగ్యాత్పరో లాభో న బోదాదపరం సుఖం |
న గురోరపరస్త్రాతా న సంసారాత్ పరో రిపుః ||

అనువాదకుని సూచన : ఈ అనువాదకుని సంస్కృత పరిజ్ఞానము స్వల్పమైన కారణమున, సామాన్యముగా వివరించబడే ప్రమాణములను అనువదించాను. 

ఆచార్య వైభవము భాగము యొక్క సారాంశము మరియు కొన్ని ముఖ్య అంశాలు.

  • మనకున్న స్వల్ప జీవితకాలములో, మన జ్ఞానోపార్జన వృద్ధికి అనేక ప్రతిబంధకములు ఏదుర్కొంటున్నాము. ఏ విధముగా హంస పాలలోని నీటిని వేరుచేసి స్వచ్ఛమైన పాలను మాత్రమే స్వీకరించునో, మనము కూడా సుజ్ఞానో పార్జనా ఆసక్తి కలిగి ఉండాలి.
  • ఏ విధముగా అనేక విలువైన రత్నాలు సాగరములో ఉన్నాయో, మన శాస్త్రములలో కూడా అనేక విలువైన విషయాలు వున్నాయి. అయితే శాస్త్రములలో వున్న కొన్ని అనవసరమైన మరియు అంతగా ఉపయోగపడని విషయాలు విస్మరించాలి. శాస్త్రములోని అత్యంత విలువైన రత్నము తిరుమంత్రము మరియు అందులోని గోప్యమైన అర్ధములు. వానిని గ్రహించడానికి నిజమైన  జ్ఞానోపార్జన  చేసేవారు దృష్టి సారించాలి.
  • ఏ జ్ఞానము మోక్షప్రాప్తి కలిగించునో అదియే నిజమైన జ్ఞానము. ఇతర జ్ఞానములన్నియు లౌకిక సుఖములకే కావున అవి నిరుపయోగములు.
  • వివిధములైన ప్రమాణములు చదివి , శాస్త్రసారాన్ని గ్రహించుట సవాలుతో కూడినది మరియు మిక్కిలి కష్టతరము. కాని, జ్ఞానవంతుడైన ఆచార్యుని ద్వారా శాస్త్రసారాన్ని గ్రహించి , మన జీవన శైలిని తదనుగుణముగా నడుపుట చాలా సులభతరము.
  • ఈ సమస్త జగత్తు భగవంతుని అధీనములో కలదు. అట్టి భగవానుడు తను దయతో తిరుమంత్రముకు లోబడి వున్నాడు. కానీ తిరుమంత్రము ఆచార్యుని ద్వారానే సంక్రమించును. కావుననే ఆచార్యులు భగవానునితో సమానము.
  • ప్రతి ఒక్కరు ఒక ఆచార్యుని ఆశ్రయించవలెను. ఏలనన, ఆచార్యులు మాత్రమే హేయమైన పాపాత్ములకు మరియు పవిత్రులైన పుణ్యులకు కూడా విముక్తి ఇవ్వగలరు.
  • ఆచార్యులు భగవాన్ శ్రీహరి స్వరూపమే! భగవానుడు కోవెలలో స్థిరముగా ఉంటాడు. కాని, మన ఆచార్యులు నడిచే దేవుడు. ఆయన యెడల అందరూ సంపూర్ణ విశ్వాసముతో వుండాలి.
  • సమస్త జగత్తులోని ప్రజలను ఉద్దరించడానికి భగవానుడైన శ్రీమన్నారాయణుడు తన దైవికమయిన దయతో ఆచార్యుని రూపాన్ని ధరించారు. ఆచార్యులుగా ఉన్న భగవానుడు హస్తములలో శాస్త్రమును ధరించివుంటారు (భగవానుడైన రాముడు కృష్ణుడు హస్తములలో అస్త్రధారణతో వుంటారు). ఎవరైతే సంసార బంధాల భయాన్ని తొలగించుకోవాలని భావిస్తారో వారు తమ ఆచార్యులపై సంపూర్ణ విశ్వాసాన్ని కలిగి వుండాలి.
  • జీవరాశులైన వారందరూ , అనగా ఒక జంతువు , మనిషి లేక పక్షి ఎవరైతే సదాచార్యుని ఆశ్రయిస్తారో , వారికి శ్రీమహావిష్ణు జగతైన పరమపద ప్రాప్తి తప్పక కలుగును.
  • పిల్లలు, చెవిటి, మూగ, గుడ్డి, అమాయకులు మొదలైన వారికి కూడా, సదాచార్యుని ఆశ్రయము ద్వారా విశేషమైన పరమపద ప్రాప్తి తప్పక సిద్ధించును.
  • వైష్ణవ ఆచార్యుని దయాదృష్టి వీక్షణం పొందితే, చిన్న మొక్కలు, పెద్ద వృక్షములు వంటివి కూడా తప్పక మోక్షప్రాప్తి పొందగలవు. మరి మానవుల గురించి వేరే చెప్పనేల (వారు సంసార బంధాల నుండి తప్పక విముక్తి పొందగలరు).
  • ‘గు’ అజ్ఞానాన్ని సూచిస్తే , ‘రు’ దాని నుంచి విముక్తిని సూచిస్తుంది. అందులకే గురు అనగా అజ్ఞానాన్ని పారద్రోలేవారు.
  • ఆచార్యులు అనగా శాస్త్రాన్ని సంపూర్ణముగా అభ్యసించి, దానిని ఇతరులకు పూర్తిగా బోధించి, తాను సక్రమముగా ఆచరించేవారు.
  • ఇవియేగాక ఇంకను అనేక ప్రమాణములు గలవు .

శిష్య లక్షణము భాగము యొక్క సారాంశము మరియు కొన్ని ముఖ్య అంశాలు.

  • శిష్యుడు ఆచార్యుని కీర్తిస్తూ, వారి విలువైన బోధనలని అభిలాష పరులకు గోప్యంగా తెలియజేస్తారు. కాని ఇందుకు విరుద్ధముగా అనగా ఆచార్యుని గోప్యంగా కీర్తిస్తూ, బోధనలని బాహ్యంగా బోధిస్తూంటే, అట్టి శిష్యుల సంపద హరించుకు పోవును.
  • శిష్యునికి శాస్త్రముఫై అపారమైన విశ్వాసము కలిగి, భగవానుడు సూచించిన సరియైన ధర్మమును అనుసరిస్తూ, భగవత్ కైంకర్యమే తన లక్ష్యముగా దృష్ఠి ఉంచి, శ్రీమన్నారాయణునిపై సంపూర్ణ శరణాగతి కలిగి, స్వచ్ఛమైన, గాఢమైన, వివేకమైన స్థిర చిత్తముతో వుండవలెను. అటువంటి శిష్యులు ఆచార్యుని నిజమైన శిష్యులు.
  • శిష్యుడు తన మాన, ప్రాణ, ధన, జ్ఞాన, గృహ, చర్యలు మొదలుగాగలవి ఆచార్యునికి సమర్పించి, తను ఆచార్యునికి అంకితమై జీవించాలి.
  • ఆచార్యుని వద్ద నిరుపయోగమైన చర్చలు, అహంకారము మొదలైనవి విడనాడాలి.
  • శిష్యుడు ఆచార్యుని ద్వారా స్వీకరించిన మంత్రముపై, మంత్రాధి దేవతైన భగవానుడిపై, బోధించిన ఆచార్యునిపై సంపూర్ణ భక్తి కలిగి వుండాలి. మొదటి వర్గులైన (అల్పులు) శిష్యులు మంత్రాధి దేవతపై ప్రేమతో వుంటారు. తదుపరి వర్గులైన (మధ్యస్తులు) శిష్యులు మంత్రముపై ధ్యాసతో వుంటారు. చివరి వర్గులైన (మిక్కిలి శ్రేష్ఠులు) ఆ మంత్రాన్ని, మంత్రము ద్వారా భగవానుని ఇచ్చిన ఆచార్యునిపై పూర్తి బంధము కలిగి వుంటారు.
  • ఆచార్యునికి దేనిపై ఎక్కువ ప్రేమ గలదో, దానిని శిష్యుడు ఆచార్యునికి సమర్పించాలి గాని తనకిష్టమైనది కాదు.
  • ఇతరములపై గాక, ఆచార్యునిపై మాత్రమే శిష్యులు దృష్టి ఉంచాలి. గురువు బోధనలను మాత్రమే చర్చించాలి / అనుసరించాలి. గురువు నామాన్ని జపించాలి. శిష్యుడు ఆచార్యుని కీర్తిస్తూ, పూజిస్తూ, ధ్యానిస్తూ మరియు గానము చేస్తువుండాలి. ఆచార్యులే తన మార్గదర్శకులుగా, లక్ష్యముగా శిష్యుడు భావించాలి. ఇది పూర్తిగా శాస్త్ర (వేదం) సమ్మతమైనది.
  • ఇవియేగాక మరియు అనేక ప్రమాణములు గలవు.

ఇంకను గలదు.

అడియెన్ శకుంతల రామనుజ దాసి (శ్లోకాలు)

అడియేన్ గోపి కృష్ణమాచార్యులు రామానుజ దాసన్ (వచనము)

మూలము: http://ponnadi.blogspot.com/2013/06/anthimopaya-nishtai-1.html

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

 

విరోధి పరిహారాలు – 31

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః

శ్రీ వైష్ణవుల రోజువారీ జీవితంలో వివిధ రూపాలలో ఎదుర్కొంటున్న అడ్డంకుల గురించి ఎమ్పెరుమానారు, వంగి పురత్తు నంబికి వివరిస్తారు. వంగి పురత్తు నంబి ఈ విశేషాలను ఒక అద్భుతమైన గ్రంథ రూపంగా “విరోధి పారిహారంగళ్ (విరోధి పరిహారాలు) అనే గ్రంథంలో గ్రంథస్తపరిచారు.

ఈ సంచికలోని శీర్షికలు శ్రేణిగా ఆంగ్లములో ఈ పుస్తకము –  https://srivaishnavagranthamstelugu.wordpress.com/virodhi-pariharangal/ లో చూడవచ్చు.

దయచేసి మునుపటి శీర్షికను ఇక్కడ చుడండి –  https://srivaishnavagranthamstelugu.wordpress.com/2020/04/23/virodhi-pariharangal-30/

65. సమర్పణ విరోధి – మన సమర్పణలలో అవరోధాలు 

                                                                నమ్మాళ్వార్, ఆళవందార్, ఎమ్పెరుమానార్

అర్పణం అంటే సమర్పించడం / అర్పించడం అని అర్థం. సాధారణంగా, భగవానుడు, ఆచార్యులు మొదలైన గొప్ప వ్యక్తులకు అర్పించడాన్ని “సమర్పణం” అని అంటారు. ఇది సాధారణంగా వైధిక వేడుకలలో కనిపిస్తుంది, మనం  శ్రీవైష్ణవులకు ఏదైనా సమర్పించినప్పుడు, “శ్రీవైష్ణవేభ్యో సంప్రదతే – న మమ” అని అంటాము.  “ఇది ఇప్పుడు శ్రీవైష్ణవులకు ఇవ్వబడింది, ఇకపై నాది కాదు” అని అర్థం . ఈ విభాగంలో, ఆత్మ సమర్పణం గురించి వివరంగా చర్చించి స్పష్టం చేయబడింది. ఆత్మ సమర్పణం అంటే  ఎమ్పెరుమాన్ పాద పద్మాల వద్ద తమను తాము అర్పించుకోవడం అని అర్థం. తిరువాయ్మొళి 2.3.4 లో, నమ్మాళ్వారు ఇలా అన్నారు,  “ఎనాధవి తంతొళిన్తేన్….ఇని మీళ్వతెన్బతుణ్డే” – (నన్ను నేను అర్పించుకున్నాను…తిరిగి వచ్చే ప్రసక్తేలేదు) అని తనను తాను భగవానుడికి అర్పించారు.  ఆళ్వార్ అడుగుజాడలను అనుసరించి, ఆళవందార్ స్తోత్ర రత్నం 52వ స్లోకంలో “తదయం తవ పాద పద్మయోః అహం అద్యైవ మయా సమర్పితః” అని తనను తాను భగవానుడి పాద పద్మాలకు అర్పించారు. అనువాదకుల గమనిక: మధురకవి ఆళ్వార్ కణ్ణినుణ్ చిఱుత్తాంబు 5వ పారురంలో,  “నంబినేన్ పిరార్ నన్పొరుళ్ తన్నైయుం” – భగవానుని (పిరార్ – ఇక్కడ భగవాన్ అని అర్థం) ఆస్తి అయిన నెను, నా సంపద అని భావించి నాపైన నెను (నన్పొరుళ్ – ఆత్మ) అనురాగం పెంచుకున్నాను. జీవాత్మ పరమాత్ముని సంపద. భగవాన్ యజమాని, జీవాత్మ సంపద. అలా ఆలోచిస్తే జీవాత్మ తనను తాను భగవానుడికి ఎలా సమర్పించుకుంటాడు (అప్పటికే భగవాన్ యజమాని అయినప్పుడు?). రాత్రికి భగవానుడి తిరుఆభరణాన్ని దొంగిలించి మర్నాడు ప్రొద్దున వెళ్లి గొప్ప గర్వంతో మన సొంత వస్తువు భగవానుడికి సమర్పిస్తున్నట్టుగా భావించుటగా మన పూర్వాచార్యులు ఈ చర్యను వివరిస్తున్నారు. అయినప్పటికీ, మన ఆళ్వారులు మరియు ఆచార్యులు ఇలాంటి చర్యలో పాల్గొన్నారు. దీన్ని మన పూర్వాచార్యులు చాలా అందంగా వివరించారు. తిరువాయ్మొళి 2.3.4 లో, ఆళ్వారు మొదట భగవాన్కు తనను తాను అర్పించినప్పటికీ, పాసురం యొక్క తరువాతి భాగంలో వారు వెంటనే తన తప్పును గ్రహించి, ఎమ్పెరుమాన్ “ఎనదావియార్? యాన్ ఆర్? తండ నీ కొండాక్కినైయే” – నేను ఎవరు? నేను ఇప్పటికే మీ స్వంతం. మీరు ఇప్పుడు మీ స్వంత ఆస్తినే స్వీకరిస్తున్నారు. వ్యాఖ్యానంలో, సమర్పణం లేకపోతే, అది సర్వ ముక్తి ప్రసంగానికి దారి తీస్తుందని నంపిల్లై వివరిస్తున్నారు (శరణాగతి చేసే అవసరం లేకుండా ఎమ్పెరుమాన్ ప్రతి ఒక్కరినీ పరమపాదానికి తీసుకువెళ్లాలి). కానీ మనం ఆత్మ సమర్పణం చేస్తే అప్పుడు భగవానుకి వారి సొంత ఆస్తిని సమర్పించినట్లవును. నంపిళ్ళై గారు వివరణ ఇస్తూ – సంసారంవైపు చూసి, ప్రపన్నులు ఒక్కోసారి  భయపడతారు, వారు తమను తాము అర్పించడం ద్వారా ఎమ్పెరుమానుకి శరణాగతులమని చెప్పారు – ఇది చాలా గందరగోళమైన స్థితి (సంసారంవైపు చూసి భయపడటం) గా వివరించబడింది. కానీ, వారు భగవాన్ని చూసినప్పుడు, వారి భయం పూర్తిగా కనుమరుగవుతుంది – ఎందుకంటే వారు భగవాన్ యొక్క సంపద అని, వారు తన ఆశ్రితులను రక్షించగల సామర్థ్యం గల వాడని గుర్తుకువస్తుంది, అప్పుడు వారు భగవాన్ యొక్క సొంత సంపదను వారికే ఇవ్వడం ద్వారా గొప్ప తప్పు చేశారని వారు గ్రహిస్తారు. ఆత్మా సమర్పణం చేసిన తప్పుకు పశ్చాత్తాప పడతారు. వారు సంసారంలో ఉన్నంత కాలం ఇది నిరంతరం జరుగుతుంది – ఎందుకంటే వారు సంసారం మరియు భగవాన్ ఇద్దరినీ మళ్లీ మళ్లీ చూస్తున్నారు కాబట్టి. ఇదే సూత్రాన్ని ఆళవందార్  కూడా ప్రస్తావించారు – స్తోత్రరత్నం 52వ శ్లోకంలో వారు తనను తాను అర్పిస్తున్నారు, కాని 53వ శ్లోకంలో వారు భగవాన్ని అడుగుతారు ” అతవా కిం ను సమర్పయామి” ఔరా! నేను ఎవర్ని? నేను నీకు ఏమి అర్పిస్తున్నాను? నాకు యజమాని అయిన మీకు నేను సమర్పించే స్వాతంత్ర్యం నాకు లేదు. ఈ శ్లోకానికి పెరియవాచ్చాన్ పిళ్ళై తన వ్యాఖ్యానంలో ఇచ్చిన ఈ వివరణ. ఈ విధంగా, ఆత్మ సమర్పణం వాస్తవానికి జీవాత్మాకు తగిన చర్య కాదని మనం చూడవచ్చు, అయినప్పటికీ అజ్ఞానం వల్ల జరుగుతుంది మరియు  జీవత్మ పరమాత్మ అధీనుడన్న నిజమైన స్వభావ సాక్షాత్కారం వచ్చిన తర్వాత పశ్చాత్తాపం చెందుతాడు. ఈ పరిచయంతో విభాగంలోకి ముందుకు వెళ్దాం.

  • అహంకారం (దేహాన్ని ఆత్మగా పరిగణించుట) మరియు మమకారం (భగవాన్ సంపత్తిని తనదిగా భావించుట) ఇవి రెండూ జీవాత్మను మరియు జీవాత్మకు చెందినవి,  భగవాన్ మరియు భాగవతులకు అర్పించకుండా అనాదిగా ఆపుతున్నాయి. తాను స్వతంత్రుడని భావించడం మహాపాపం. అసలు నిజం ఏమిటంటే “అన్నీ / అందరూ భగవాన్ సొంతం”. నమ్మాళ్వారు తిరువాయ్మొళి 2.9.9 లో ఇలా అన్నారు “యానే ఎన్నై అఱియగిళాతే యానే ఎంతనతే ఎన్ఱిరుంతేన్” – ఇంతకు ముందు నేనెవరో నాకు తెలియదు, నన్ను నేను స్వతంతృడని భావించాను – అది జీవత్మా యొక్క యధార్థ స్వభావాన్ని గ్రహించక ముందు ఉన్న స్థితి. అదే పాసురంలో నమ్మాళ్వారులు  ఇలా అంటున్నారు “యానే నీ ఎన్నుడైమైయుం నీయే” – నేను నీ సొంతం మరియు నా శరీరం కూడా నీ సొంతం – ఇది జీవత్మా యొక్క నిజమైన స్వభావాన్ని గ్రహించిన తరువాత ఉన్న స్థితి. తిరువాయ్మొళిలో నమ్మాళ్వారు ప్రతి ఒక్కరికీ ఇచ్చిన మొట్ట మొదటి ఉపదేశము 1.2.2 లో ఉంది “నీర్ నుమతు  ఎన్ఱివై వేర్ ముతల్ మాయ్ త్తు” – అహంకర మమకారాలను సంపూర్ణంగా వదులుకోవాలి. అనువాదకుల గమనిక: ఆధ్యాత్మిక ప్రయాణంలో నేర్చుకోవలసిన మొదటి పాఠం ఏమిటంటే, ఆత్మ దేహానికి (శరీరానికి)  భిన్నమైనదని స్పష్టంగా అర్థం చేసుకోవడం. మనము శాశ్వతమైన ఆత్మలము, మన శరీరాలకు భిన్నమైన వాళ్ళము. చాలా మంది ఆత్మ మరియు శరీరం మధ్య తేడాను గుర్తించ కుండా శారీరక ధోరనిలో ఎల్లప్పుడూ కృషి చేస్తుంటారు. రెండవది, భగవాన్ సర్వ స్వతంత్రుడని సర్వాధికారి (చిత్, అచిత్) అని మనం అర్థం చేసుకోవాలి. ఈ సమస్థ సృష్టిలో మన స్వంతం ఏమీ లేదు. ఈ రెండు సూత్రాలపై సరైన అవగాహన ఉంటే, యావత్తు సృష్థికి అధిపతి అయిన భగవాన్ ప్రీతి కొరకు మనం సహజంగా కృషి చేస్తాము. ఈ రెండు (అహంకార మమకారాలు) మన ఆధ్యాత్మిక పురోగతిలో అతిపెద్ద అవరోధాలు. శ్రీ కృష్ణుడు  భగవత్గీతలో అర్జునుడికి ఆత్మ సాక్షాత్కారం యొక్క దివ్య జ్ఞానాన్ని ఉపదేశించడం ప్రారంభించినప్పుడు దీనిని స్పష్టంగా వివరించారు. 2.12 లో వివరించడం ప్రారంభిస్తూ – ఆత్మ దేహానికి భిన్నమైనది, అసంఖ్యాక ఆత్మలు ఉన్నాయి, ప్రతి ఆత్మ ఇతరులకన్నా భిన్నంగా ఉంటుంది, భగవాన్ మహోన్నతుడు. ఆచార్యుల ద్వారా శరణాగతి చేసిన తరువాత కూడా, ఈ రెండు అడ్డంకుల వల్ల మనం తరచుగా కలవరపడవచ్చు. మనం శరీరాలకు భిన్నమైన జీవాత్మలు అని నిరంతరం గుర్తుంచుకోవాలి, మనం భగవాన్ మీద ఆధారపడి ఉన్నాము. ఈ స్థిరమైన భావనతో,  మనం సరైన పద్ధతిలో నడుచుకోవచ్చు.
  • భగవాన్ దాసుడని అని తెలుసుకున్న తర్వాత కూడా, ఆ వస్తువు తన సొంతమని భావించుట ఒక అడ్డంకి. భగవాన్ సేవకుడిగా నిజమైన స్వభావం గురించి గ్రహించిన తర్వాత,  తనకు చెందిన ప్రతిదీ సహజంగానే భగవానుడికి మాత్రమే చెందుతుంది. కాబట్టి, సంకోచం లేకుండా ప్రతిదీ భగవాన్కు అర్పించాలి.
  • మనం యజమానులము అనే ఆలోచనతో భగవానుడికి అర్పించడం ఒక అడ్డంకి. ప్రతిదీ భగవాన్ యాజమాన్యంలో ఉంది అనేది నిజం. మనల్ని మనం యజమానులుగా భావించడం సంశయానికి గురిచేసే స్థితికి దారితీస్తుంది. భగవాన్ యాజమాన్యంలో ప్రతిదాన్ని పరిగణించడం మనస్సు యొక్క స్పష్టమైన స్థితికి దారితీస్తుంది. అనువాదకుల గమనిక: పరిచయ భాగంలో ఇప్పటికే వివరంగా వివరించబడింది.
  • భగవాన్ యొక్క ఆస్తిని దొంగిలించడం (వారి స్వంత ఆనందం కోసం ఆత్మ మరియు దేహము ఉపయోగించడం) వాటిని భగవాన్కు సమర్పించడం ఒకటే అన్న మునుపటి మన అజ్ఞాన స్థితి గురించి తెలియకపోవడం ఒక అడ్డంకి. భగవానుడికి తనను అర్పించుకోవడం, రాత్రి ఆలయం నుండి ఒక విలువైన ఆభరణాన్ని దొంగిలించి, ఉదయాన్నే భగవానుడికి అర్పించడంతో పోల్చబడింది. అనువాదకుల గమనిక:  తనను (ఆత్మ) తాను స్వతంతృనిగా పరిగణించుట మరియు దాని ప్రకారంగా వ్యవహరించుట పెద్ద దొంగతనం / పాపంగా శాస్త్రంలో  వివరించబడింది – దీనిని మహాభారతంలో “కిం తేన న కృతం పాపం చోరేణ ఆత్మాపహారిణా” – ఆత్మను (భగవాన్ యొక్క ఆస్తి) తమ సొంతమని భావించేవాడు అన్ని రకాల దొంగతనాలు / పాపాలు చేసినట్లుగా భావించాలి అని చెప్పబడింది. ఇది అర్పణకు ముందు లేదా సమర్పణ సమయంలో అయినా, ఆత్మ తన సొంతం అనే ఆలోచన ఉంటే, అది తగనిదిగా పరిగణించబడుతుంది.
  •  “నేను ఇప్పటికే తన ఆస్తి, నేను వారికి ఎలా సమర్పించగలను?” అన్న ఆలోచనతో తనను తాను అర్పించక పోవుట. మన పూర్వాచార్యులు తమను తాము అర్పించినప్పటికీ. ఆత్మ సమర్పణం మన పూర్వాచార్యులు చేత చేయబడింది. అలవందార్ “అహం అధ్యైవ మయా సమర్పిత:”. అయినప్పటికీ, ఆత్మ భగవాన్ యాజమాన్యంలో ఉన్నప్పటికీ, మనం ఆయనకు తమనుతాము అర్పించాలి. కానీ అలవందార్లు పశ్చాత్తాప పడి తరువాతి స్లోకంలో “అథవా కిం ను సమర్పయామి” అని అంటున్నారు.  నేను పూర్తిగా మీ స్వంతమని నేను గ్రహించిన తర్వాత, నన్ను నేను మీకు ఎలా సమర్పించగలను? అని ఇక్కడ అంటున్నారు.  నమ్మాళ్వారులు కూడా మొదట ఆత్మ సమర్పణం ప్రదర్శించి ఆ తరువాత తిరువాయ్మొళి 2.3.4 – “ఎనదావి తన్తొళింతేన్….ఇని మీళ్వతెన్బతుణ్డే? యాన్ ఆర్? తంద నీ కొణ్డాక్కినైయే ఆ తరువాత “ఎనదావియార్? యాన్ ఆర్? తంద నీ కొణ్డాక్కినైయే” అని అంటున్నారు. ఈ సంధర్భంలో, వ్యాఖ్యాన చక్రవర్తి పెరియవాచ్చాన్ పిళ్ళై స్తోత్ర రత్న వ్యాఖ్యానంలో వివరిస్తూ –  “సంసార భీతియాల్ సమర్పిక్కైయుం, స్వరూప యాదాత్మ జ్ఞానత్తాల్ అనుసయిక్కైయుం ఇరణ్దుం యావన్మోక్షం అనువర్తిక్కక్కడవతు.” – సంసార భయముతో తమనుతాము  భగవానుడికి సమర్పించడం ఆపైన తమ నిజ స్వభావాన్ని గ్రహించి పశ్చాత్తాపం చెందడం మనం ఈ సంసారం నుండి విముక్తి పొందే వరకు జరుగుతూనే ఉంటుంది – ఇది అనివార్యమైనది. శ్రీవచన భూషణ దివ్య శాస్త్రంలో పిళ్ళై లోకాచార్యులు , ప్రపత్తిని ఉపాయంగా పరిగణించడం మరియు అటువంటి సూత్రంలో లోపాలను సిద్ధోపాయ నిష్ఠ ప్రకరణంలో లోతైన వివరణ ఇచ్చారు. ఈ సూత్రం146లో, భగవాన్ మాత్రమే ఉపాయం కనుక “ప్రపత్తిని ఉపాయం” గా పరిగణించుట కూడా సరికాదని సూత్రం 146 లో వివరించారు. మాముణులు గద్య  త్రయంను ఉదాహరిస్తూ, ఇక్కడ ఎమ్పెరుమానార్  మొదట ప్రపత్తిని నిర్వహించి ఆ తరువాత తాను మునుపు చేసిన చర్యలకు భగవంతుని క్షమాపణ కోరతారు – కాబట్టి మన పూర్వాచార్య రచనలన్నిటి నుండి, తమను తాము ఎమ్పెరుమానుకి అర్పించడం, తరువాత పశ్చాత్తాపం చెందడం వంటివి చూడవచ్చు.
  • వారు తమ సంపత్తినే స్వీకరిస్తున్నాడని అర్థం చేసుకోకపోవడం ఒక అడ్డంకి. భగవాన్ అన్నింటికీ యజమాని కాబట్టి, అతను తన సొంత ఆస్తినే స్వీకరిస్తున్నాడు – అలాంటి సరైన అవగాహన లేకపోవడం ఒక అడ్డంకి.
  • తనను తాను “నాది” గా భావించి వారికి  సమర్పించడం ఒక అడ్డంకి. ముందు చెప్పినట్లుగా, ప్రతిదీ భగవాన్ సొంతం. తనను తాను యజమాని అని అనుకోవడం, తమను భగవానుడికి మన స్వంత ఆస్తిని అందిస్తున్నట్లుగా సమర్పించడం సరికాదు. అయినప్పటికీ తమను ప్రేమతో ఎమ్పెరుమాన్ అర్పించాలి. భగవత్గీతలో, నాకు ప్రేమతో అర్పించినదానిని నేను చాలా ఆనందంతో స్వీకరిస్తాను అని అంటారు శ్రీ కృష్ణ పరమాత్మా. కాబట్టి, మనం అందించేది ప్రేమతో నిండి ఉండాలి. ఏదైనా తాను ఆధిపత్యాన్ని వహిస్తున్నానన్న  కలుషిత భావన జీవాత్మ యొక్క స్వభావానికి అనుకూలమైనది కాదు. కాబట్టి ఇక్కడ ఖండించబడింది.
  • భగవానుడు అసంతృప్తి పరుడని,  స్వయం సమృద్ధిగా లేడని భావించడం, అతను మన నుండి ఏదో ఆశిస్తున్నాడని భావించుట ఒక అడ్డంకి. భగవాన్ని అవాప్త సమస్త కాముడు అని పిలుస్తారు (అన్ని కోరికలు తీరినవాడు). అయినప్పటికీ, అతనికి తన భక్తులు ప్రేమతో అర్పించిన వాటిని ఎంతో ఆనందంతో స్వీకరిస్తాడు.
  • ఆయన దగ్గర లేనిదేదో మనము ఇస్తున్నామని భావించడం ఒక అడ్డంకి. అతని దగ్గర ఈ వస్తువు లేదు, నేను వారికి ఈ వస్తువు ఇస్తే , తద్వారా అతను ఆ వస్తువుకు యజమాని అవుతాడు” అని మనం అనుకోకూడదు.
  • అతను సర్వ సంపన్నుడు, మన సేవను పూర్తి చేయడానికి మరియు మమ్మల్ని ఉద్ధరించడానికి మాత్రమే మన సమర్పణలను స్వీకరిస్తాడు అన్న భావన లేకపోవడం ఒక అడ్డంకి. “దేహిమే – దదామి తే” (నేను నీకేదో ఇస్తాను, నీవు నాకేదో ఇవ్వు) అని అనుకోకూడదు – ఈ మనస్తత్వం అస్థిరమైన స్థితికి దారితీస్తుంది. సాధారణంగా ప్రజలు ఇబ్బందుల్లో / బాధలో ఉన్నప్పుడు, వారు భగవానుడిని ప్రార్థిస్తూ “దయచేసి ఈ బాధ నుండి నన్ను బయటపడేలా చేయి, నేను ప్రతిఫలంగా మొక్కుబడి తీర్చుకుంటాను” – దీనిని సాధారణంగా సంస్కృతం / తమిళంలో ప్రార్థనా / వేణ్డుతల్ అని పిలుస్తారు. కానీ ఆయన (పెరుమాళ్) అతని పట్ల స్వచ్ఛమైన భక్తిని ప్రదర్శించి వారి సంరక్షణను మనము స్వీకరించాలని మాత్రమే ఆశిస్తాడు. అయినప్పటికీ, ఆయన పట్ల ప్రేమతో మన సామర్థ్యంతో (ఆయన మనకు ఇచ్చిన దానిలో) సమర్పించాలి. అనువాదకుల గమనిక: భౌతిక సమస్యలను పరిష్కరించడానికి ఈ రకమైన లౌకిక ప్రార్థనలు జీవాత్మ యొక్క నిజమైన స్వభావానికి తగినవి కావు. భగవాన్ మరియు భాగవతులకు శాశ్వతమైన కైంకర్యం చేయాలని మనం ఎల్లప్పుడూ ప్రార్థించాలి, ఎందుకంటే ఇది జీవత్మ యొక్క నిజమైన స్వభావానికి సరిపోతుంది. భౌతిక సుఖాలకై ప్రార్థన మన ఆధ్యాత్మిక పురోగతికి పెద్ద ఆపద.
  • భగవాన్ ప్రసాదించిన దానికి ప్రతిఫలంగా మనమేదో వారికి అందిస్తున్నామని భావించుట. అనువాదకుల గమనిక: ఇంతకుముందు వివరించినట్లుగా, భగవాన్‌ను భక్తి ఉళవన్ (భక్తి యొక్క రైతు) అంటారు. అతను జీవత్మలో భక్తి విత్తనాన్ని నాటి, దానిని సాగుచేసి (పెంచి), శాస్త్రాన్ని మార్గదర్శకంగా అందించి, ఆచార్యుని చూపించి, భాగవత సంబంధాన్ని అందించి, అడ్డంకులను తొలగించి జీవాత్మను చివరికి  పరమపదంలోకి తీసుకువస్తాడు. ఇంత గొప్ప సహాయానికి జీవాత్మ ఏ విధంగానూ తిరిగి ఇవ్వలేడు.
  • ఎమ్పెరుమాన్ చేసిన సహాయాలకు బదులు చెల్లించలేకపోవడం గురించి చింతించక పోవడం. మధురకవి ఆళ్వర్ కణ్ణినుణ్ చిఱుత్తాంబు 10వ పాసురంలో “ముయల్గిఱేన్ ఉంతన్ మొయ్కళర్కన్బయే” (నేను మీ పాద కమలములకు ప్రేమపూర్వకమైన చిన్న సేవ చేయటానికి ప్రయత్నిస్తున్నాను, కానీ నీవు చేసిన కృపకు సరితూగేంత నేను చేయలేకపోతున్నాను) నమ్మాళ్వారి ప్రార్థనలకు ప్రతిఫలంగా ఏమీ చేయలేకపోతున్నాడని అతను బాధపడుతున్నాడు. నమ్మాళ్వారు కూడా భగవాన్ పట్ల ఇటువంటి దివ్య భావాలను తిరువాయ్మొళి 2.3.4లో “ఎనధావి ఉళ్ కలన్త పెరునల్లుతవిక్ కైమ్మాఱు” – నీవు నా వద్దకు వచ్చి ఎంతో ప్రేమతో మెలిగావు, కానీ ఇంత గొప్ప అభిమానానికి నేనేమిచ్చి నీ ఋణం తీర్చుకోగలను అని వ్యక్తం చేస్తున్నారు.
  • ఆత్మ సమర్పణం చేస్తున్నప్పుడు, ఆత్మ తన సొంతమని భావించడం ఒక అడ్డంకి. అనువాదకుల గమనిక:  మనం దీని గురించి వివరంగా చర్చించాము, ఆత్మ పూర్తిగా ఎమ్పెరుమాన్ యాజమాన్యంలో ఉంటుంది, ఎమ్పెరుమాన్ తన సొంత సంపత్తినే స్వీకరిస్తున్నాడు.

తరువాతి భాగం మనం వచ్చే సంచికలో కొనసాగిద్దాము.

అడియేన్ శ్రీదేవి రామానుజ దాసి

హిందీలో : http://ponnadi.blogspot.com/2014/07/virodhi-pariharangal-31.html

మూలము : https://srivaishnavagranthamstelugu.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org