Monthly Archives: March 2021

విరోధి పరిహారాలు – 45

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః

శ్రీ వైష్ణవుల రోజువారీ జీవితంలో వివిధ రూపాలలో ఎదుర్కొంటున్న అడ్డంకుల గురించి ఎమ్పెరుమానారు, వంగి పురత్తు నంబికి వివరిస్తారు. వంగి పురత్తునంబి ఈ విశేషాలను ఒక అద్భుతమైన గ్రంథ రూపంగా “విరోధి పారిహారంగళ్ (విరోధి పరిహారాలు) అనే గ్రంథంలో గ్రంథస్తపరిచారు.

ఈ సంచికలోని శీర్షికలు శ్రేణిగా ఆంగ్లములో ఈ పుస్తకము –  https://srivaishnavagranthamstelugu.wordpress.com/virodhi-pariharangal/ లో చూడవచ్చు.

దయచేసి మునుపటి శీర్షికను ఇక్కడ చుడండి – https://srivaishnavagranthamstelugu.wordpress.com/2021/03/12/virodhi-pariharangal-44/

    శ్రీ పార్థసారథి ఎమ్పెరుమాన్తో పాటు శ్రీదేవి, భూదేవి మరియు ఆండాళ్ నాచియార్ – అత్యంత విశ్వాసపాత్రుడు మరియు అరాధనీయుడు

75. అవిశ్వాస విరోధి  – అపనమ్మకంలో అవరోధాలు

బౌతిక వాదులను, దేవతాంతరములను, సామాన్య శాస్త్రమును నమ్మడాన్ని అవిశ్వాస విరోధి అని అంటారు.

విశ్వాసం అంటే నమ్మకం. ఇక్కడ, నమ్మకూడని అంశాలను  మనము నమ్మినప్పుడు, వాటిని అవరోధాలుగా వివరించబడ్డాయి. సామాన్య శాస్త్ర ఆదేశములను పాటించాల్సిన అవసరం ఉంది. కాని, ఒక ప్రపన్నుడు విశేష ధర్మాన్ని (భగవాన్ / భాగవతులకు సేవ) పాటించేటప్పుడు కొన్ని సామాన్య  లోపాలు ఉంటే, అది లోపంగా పరిగణించబడదు.

అనువాదకుల గమనిక: మనము ఇంతకు ముందు వీటిని గురించి  చాలా వివరంగా చర్చించాము. ఇక్కడ 3 అంశాలపై నమ్మకం గురించి తెలియజేస్తున్నారు – సంసారులు (లౌకిక వ్యక్తులు), దేవతాంతరములు (ఇతర దేవతలు) మరియు సామన్య శాస్త్రమును అడ్డంకులుగా తెలియజేయబడ్డాయి.

  • మనము భౌతిక అంశాలపై దృష్టి కేంద్రీకరించినప్పుడు, అటువంటి సహాయాలను పొందడానికి భౌతికవాదులను నమ్మవలసి వస్తుంది. అటువంటి చర్యలలో పాల్గొనడం ద్వారా ఈ భౌతిక సంసారంతో మన అనుబంధం మరింత పెరుగుతుంది. అందువల్ల సంసారులపై నమ్మకం ఉండకపోవడం మంచిది.
  • దేవతాంతరములు విషయానికొస్తే ఇది బ్రహ్మ, శివుడు మొదలైన వాళ్ళతో ప్రారంభమయ్యి మిగతా అందరు దేవతలకు సంబంధించినది. వారందరు కూడా బద్ద ఆత్మలు మాత్రమే. మనము వైధిక కర్మలలో భాగంగా దేవతలను గౌరవించినపుడు, అంతకు మించి వారికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఎక్కడా ఇవ్వబడలేదు. ఈ విషయానికి సంబంధించి నంపిళ్ళై ఒక సంఘటనను అందంగా వివరించారు.  శ్రీవైష్ణవులు వైధిక కర్మలలో భాగంగా దేవతలను ఆరాధిస్తారు కానీ  ప్రత్యేకంగా వారిని వారి ఆలయాలలో ఆరాధించరు ఎందుకు అని ప్రశ్నిస్తారు. అప్పుడు నంపిళ్ళై శాస్త్ర ఉపదేశాలలోని భాగంగా యజ్ఞాలు, సంధ్యావందనం మొదలైన వాటిని నిర్వహిస్తున్నపుడు ఆయా దేవతలలో అంతర్యామిగా ఉన్న శ్రీమన్నారాయణుడను ఆరాధిస్తాము అని బదులిస్తారు. శ్రీమన్నారాయణుడి ఆధిపత్యాన్ని స్పష్టంగా తెలుసుకున్న తరువాత కూడా వాళ్ళు కొన్ని సందర్భాలలో తమను స్వతంత్రంగా భావించి శ్రీమన్నారాయణుడితో కలహానికి దిగుతారు, ఓడిపోతారు కూడా.
  • శాస్త్రం రెండు వర్గాలుగా విభజించబడింది – సామాన్య శాస్త్రం మరియు విశేష శాస్త్రం. సామాన్య శాస్త్రం అంటే వర్ణాశ్రమ ధర్మం ప్రకారంగా శారీరక మరియు సాధారణ రోజువారీ అనుష్ఠానముల గురించి వివరించేది.  ఇవి చాలా అవసరం. విశేష శాస్త్రం అంటే ఆత్మ మరియు భగవానుడి‌తో ఆత్మ యొక్క  శాశ్వత సంబంధం గురించి వివరిస్తుంది. భగవాన్ మరియు భాగవతులకు చేసే రహస్య సేవలు ఇవి. పెరియాళ్వార్ దీనిని తిరుపల్లాండులో “అత్తాణిచ్ చేవకం” అని వివరించారు. ఆచార్య హృదయంలో, అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ చూర్ణిక 31 లో  – “అత్తాని చేవగతిల్ పోధువానతు నళువుం” –  భగవత్ / భాగవత కైంకర్యం చేస్తున్నప్పుడు, సామాన్య కైంకర్యాన్ని కొంతవరకు ఆలస్యం చేయవచ్చు / దాటివేయవచ్చు అని మాముణులు వ్యాఖానంలో వివరించారు. మరిన్ని వివరాలు https://srivaishnavagranthamstelugu.wordpress.com/2019/06/23/virodhi-pariharangal-10/ లో చర్చించబడ్డాయి. 


76. సంగ విరోధి – మన సాంగత్యములోని అవరోధాలు

భగవత్ జ్ఞానం (భగవాన్ గురించి జ్ఞానం) పొందిన తరువాత కూడా ఇతర  సిద్దాంతాల అనుచరులతో (శైవులు మొదలైన వారు) సంబంధం కలిగి ఉండటం.

సంగం అంటే స్నేహం, సంబంధం. భగవత్  జ్ఞానం అంటే శ్రీమన్నారాయణుడి  ఆధిపత్యానికి సంబంధించిన నిజమైన జ్ఞానం.

అనువాదకుల గమనిక: భగవాన్ గురించి జ్ఞానం అంటే భగవాన్ అత్యోన్నతుడని, మనం అతని నిత్య దాసులమని పూర్తిగా అర్థం చేసుకోవడం అని అర్థం. ఆ వాస్థవ జ్ఞానం పొందిన తర్వాత, మన వైఖరిలో పరివర్తన ఉంటుంది. అప్పుడు మనం భగవాన్ యొక్క ఆధిపత్యాన్ని తిరస్కరించే వారితో  లేదా భగవానుడిని అవమానించే వారితో మనం స్నేహం చేయాలనుకోము. ఆచార్యుల అనుగ్రహంతో మరియు భగవాన్ అనుగ్రహంతో యదార్థ జ్ఞానం లభిస్తుంది. ఆ యదార్థ జ్ఞానం లేని వారు భగవాన్ యొక్క ఆధిపత్యాన్ని అంగీకరించరు. అలాంటి వ్యక్తులతో సన్నిహితంగా ఉండకపోవడమే మంచిది. ఇక్కడ తెలుసుకోవలసిన ముఖ్య విషయం ఏమిటంటే, ఒక శ్రీవైష్ణవుడిగా, అనుకూలమైన వ్యక్తులకు (భగవాన్ గురించి తెలుసుకోవాలని ఇష్టపడేవారు) వారి వర్ణంతో సంబంధం లేకుండా ఈ విషయం పట్ల అవగాహన కల్పించడం మన కర్తవ్యం. ఎందుకంటే, తన అసలు స్వరూపాన్ని గ్రహింపజేసే ఈ జ్ఞానాన్ని వారికి తెలియజేయడం మనం వాళ్ళకు చేసే గొప్ప సహాయం కనుక.

77. సంతాన విరోధి – సంతానం విషయంలో  అవరోధాలు

మన సొంత పుత్రుడైన సరే,  భగవాన్, భాగవతులు మరియు ఆచార్యుల పట్ల ద్వేషంగా/అగౌరవంగా ఉంటే, వరాహ పురాణంలో వివరించిన విధంగా అలాంటి పుత్రుడిని వదులుకోకపోవడం అడ్డంకి.

మాజనిష్ఠ స నో వమ్సేజాతో వాత్రాక్విసృజ్యతాం
ఆజాన్మమరణం యస్య వాసుదేవో నదైవతం

సంతానం అంటే మన సొంత పిల్లలు. మన సొంత పిల్లలు అయిన్నప్పటికీ, భగవాన్ భాగవతులు మరియు ఆచార్యుల పట్ల అపచారములలో పాల్పడినప్పుడు, వారిని వదులుకోవాలి. అలాంటి సంబంధాన్ని తెంచుకోవాలి.

అనువాదకుల గమనిక: ఒక ప్రపన్నుడు, తాను ఇతర అనుకూలమైన ప్రపన్నులతో మాత్రమే కలవడం చాలా ముఖ్యం. పిల్లలు లేదా దగ్గరి బంధువులు, భగవాన్ మరియు భాగవతులకు వ్యతిరేకంగా చూపించే అహంకారాన్ని సహించకూడదు. పిల్లలకి అర్థమైయ్యేలా వివరించే ప్రయత్నంచేయాలి, వారికి సరైన మార్గనిర్దేశం చేయడానికి ప్రయత్నించాలి. కానీ అలాంటి ప్రయత్నాలు విఫలమైనప్పుడు, సంబంధం ఉంచుకోకూడదు. దీనిని కొన్ని ఉదాహరణలతో చూద్దాం. 

  • ప్రహ్లాదుడు శ్రీమన్నారాయణుడి  గొప్ప భక్తుడు. అతని మనవడైన మహాబాలి శ్రీమన్నారాయణుడి పట్ల  భక్తిని అతని నుండి వారసత్వంగా పొందాడు. కానీ అతని దురాశ కారణంగా, అతను ఇంద్రుని సంపదను స్వాధీనం చేసుకుంటాడు, శ్రీమన్నారాయణుడి పట్ల కూడా అప్రియంగా ప్రవర్తిస్తాడు. అది చూసిన, ప్రహ్లాదుడు అతనిని మందలించడానికి ప్రయత్నిస్తాడు, కానీ అది చెవిటి వాడి ముందు శంఖం ఊది నట్లు అయిపోతే, చివరికి తన సంపదంతా కోల్పోవుగాకా అని శపిస్తాడు.
  • కైకేయికిచ్చిన వరం కారణంగా  శ్రీ రాముడు వనవాసానికి వెళ్లినపుడు, భరతుడు అక్కడ ఉండడు. తిరిగి వచ్చినప్పుడు, అతను కైకేయి కారణంగా శ్రీ రాముడు అడవికి పంపబడ్డాడని తెలుసుకొని ఆమెను త్యజిస్తాడు.
  • రావణుడు సీతను అపహరించినప్పుడు, విభీషణుడు తన అన్నకు ఆమెను శ్రీ రాముడికి తిరిగి అప్పజెప్పమని విన్నవిస్తాడు. కానీ రావణుడు విభీషణుడి మాట వినిపించుకోడు. పదే పదే ప్రయత్నించిన తరువాత విభీషణుడు చివరకు రావణుడిని పూర్తిగా వదిలిపెట్టి, శ్రీ రాముని ఆశ్రయాన్ని పొందుటాడు. అతను చివరికి  తన సొంత సోదరుడు రావణుడిని ఓడించటానికి శ్రీ రామునికి సహకరిస్తాడు.


78. వర్ణ విరోధి – మన వర్ణం విషయాలలో అవరోధాలు

వర్ణానికి  విరుద్ధమైన కార్యాలలో పాల్గొనడం ఒక అడ్డంకి.  బ్రహ్మణ, క్షత్రియ, వైశ్య మరియు శూద్రులు అని నాలుగు వర్గాలుగా మనుషులను విభజించారు. ప్రతి వ్యక్తి ,వారి కోసం శాస్త్రంలో నిర్దేశించిన కార్యాలను నిర్వహించాలి. వారి స్వంత  వర్ణానికి విరుద్ధమైన పనులను చేయకూడదు.
అనువాదకుల గమనిక: ఈ విషయం ఇప్పటికే https://srivaishnavagranthamstelugu.wordpress.com/2020/08/08/virodhi-pariharangal-34/ లో చాలా వివరంగా చర్చించబడింది. ప్రతి వర్ణానికి కొన్ని బాధ్యతలు ఉంటాయి. వివిధ వర్ణానికి సంబంధించిన కార్యాలు ఈ క్రింద వివరించబడ్డాయి.

  • బ్రహ్మణ వర్గం వారికి  6 ప్రధాన కార్యాలు గుర్తించబడ్డాయి. అధ్యయనం (వేదాధ్యయనం), అధ్యాపనం (ఇతరులకు వేదాలు బోధించడం), యజనం (తన కోసం యజ్ఞం చేయడం), యాచనం (ఇతరుల కోసం యజ్ఞం చేయడం), దానం (దానధర్మాలు ఇవ్వడం), పరిగ్రహం  (దానధర్మాలు తీసుకోవడం).
  • క్షత్రియులకు, అధ్యయనం (వేదాధ్యయనం), యజ్ఞం (స్వయం కోసం యజ్ఞం చేయడం) మరియు దానం (దానధర్మాలు చేయడం) మాత్రమే వర్తిస్తాయి – ఇతరులకు వేదాలను బోధించడం, ఇతరుల కోసం యజ్ఞం చేయడం మరియు దానం తీసుకోవడం వర్తించవు. కానీ వాటికి బదులుగా, వాళ్ళు ఆయుధాలను చేతపట్టడం, పౌరులను రక్షించడం, దేశాన్ని పరిపాలించడం వాళ్ళకు వర్తిస్తాయి.
  • వైశ్యులకు కూడా, అధ్యయనం (వేదాధ్యయనం), యజ్ఞం (స్వయం కోసం యజ్ఞం చేయడం) మరియు దానం (దానధర్మాలు చేయడం) మాత్రమే వర్తిస్తాయి – ఇతరులకు వేదాలను బోధించడం, ఇతరుల కోసం యజ్ఞం చేయడం మరియు దానం తీసుకోవడం వర్తించవు. కానీ వాటి స్థానంలో, వాళ్ళు వ్యవసాయం చేయడం, గో సంరక్షణ, వ్యాపారం చేయడం మొదలైనవి వాళ్ళకు వర్తిస్తాయి.
  • ఈ మూడు వర్గాల వారికి వారి వారి పనుల్లో సహాయం చేయడం శూద్రులకు వర్తిస్తుంది.

పిళ్ళై లోకాచార్యులు శ్రీవాచన భూషణ దివ్య శాస్త్రం సూత్రాలు 276, 277, 278 లో కైంకర్యం (దాస్యం) గురించి వివరించారు. మొదట 276 లో, “కైంకర్యం రెండు రకాలు” అని చెప్పారు. సూత్రం 276 లో, “వారు అనుకూలమైన వాటిని చేస్తూ  అననుకూలమైన వాటిని చేయకూడదు” అని తెలియజేసారు. సూత్రం 277 లో, “అనుకూలమైనవి/ అననుకూలమైనవి తమ వర్ణం/ఆశ్రమం మరియు వారి అసలైన జీవాత్మ స్వభావంపై ఆధారపడి ఉంటుంది” అని వారు తెలియజేస్తున్నారు. మాముణులు ఈ సూత్రానికి లోతైన వివరణ ఇచ్చారు. నిస్వార్థ వైఖరితో భగవానుడికి అన్ని కైంకర్యాలు (నిత్య, నైమిత్తిక కర్మానుష్ఠానములు మరియు భగవత్ / భాగవతులకు కైంకర్యాలు) నిర్వహించాలని వారు వివరించారు. శాస్త్రం మరియు మన ఆచార్యల నుండి నేర్చుకున్నట్లుగా వర్ణశ్రమ ధర్మాన్ని అనుసరించడం కూడా భగవత్ కైంకర్యంగా చేయాలి, మన సేవలన్నీ భగవాన్ యొక్క దివ్య సంకల్పానికి అనుగుణంగా ఉండాలి.

79. జప విరోధి – మనం చదవడంలో/ స్మరించడంలో  అవరోధాలు

మూల మంత్రం (తిరుమంత్రం) మొదలైనవాటిని పఠించేటప్పుడు అన్ని మంత్రాలకు దేవత అయిన శ్రీమన్నారాయణపై దృష్టి పెట్టడానికి బదులుగా భౌతిక లాభాలను ఆశించడం, ఇతర దేవతల చింతన చేయడం ఒక అడ్డంకి.

మూల మంత్రం అంటే శ్రీ అష్ఠాక్షర మహామంత్రం. మంత్రం త్రాయతి ఇతి మంత్రః  – పఠించే వాడిని రక్షించేది మంత్రం అంటారు. మంత్రం యొక్క దేవత ఎవరో తెలుసుకొని ఆ మంత్రాన్ని పఠించాలి. అష్ఠాక్షర మంత్రానికి శ్రీమన్నారాయణుడు దేవత. అతనికి కైంకర్యం కాకుండా వేరొక మరే ఇతర ప్రయోజనాల గురించి గానీ చింతన చేయడం ఫలితాన్ని ఇవ్వదు.

అనువాదకుల గమనిక: ప్రతి మంత్రంలో  మూడు ముఖ్యమైన అంశాలు ఉంటాయి – ఛందస్సు , ఋషి (మంత్ర ప్రచారం చేసినవాడు), దేవత (మంత్ర ధ్యానం యొక్క కేంద్ర బిందువు).  పిళ్ళై లోకాచర్యులు ముముక్షుప్పడి 4వ సూత్రంలో  – “మంత్రత్తిలుం మంత్రత్తుక్కు ఉళ్లిడాన వస్తువిలుం మంత్ర ప్రధాన ఆచర్యన్ పక్కలిలుం ప్రేమం గనక్క ఉణ్డానాల్ కార్యకరమావతు” అని ఘోషిస్తున్నారు. శిష్యుడికి మంత్రముపై,  భగవానుడిపై (మంత్రం యొక్క కేంద్ర బిందువు),  ఆచార్యునిపై (మంత్రంపై పూర్తి నియంత్రణ కలిగి ఉన్నవారు) సంపూర్ణ విశ్వాసం ఉండాలి. ఈ మూడింటిపట్ల గొప్ప ప్రీతిని  పెంపొందించుకోవాలి అని మాముణులు అందంగా వివరిస్తున్నారు. అతను అదే సూత్రాన్ని వెల్లడి చేసే సమానమైన సంస్కృత స్లోకాన్ని కూడా అందంగా ఉదహరిస్తున్నారు – “మంత్రే తత్  దేవతాయాంచ తతా మంత్రప్రదే గురౌ, త్రిషు భక్తిస్ సదాకార్యా సా హి ప్రధమ సాధనం”. ఈ అన్ని అంశాలపై సరైన అవగాహనతో మంత్రాన్ని జపించడం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ద్వయ మహామంత్రాన్ని వివరించే తిరువాయ్మొళి యొక్క అర్ధాలను ధ్యానించుకుంటూ ద్వయ మహామంత్రాన్ని నిరంతరం అన్ని సమయాలలో పఠించాలి.  మాముణులు ద్వయ మహమంత్రాన్ని నిరంతరం పఠిస్తూ, తిరువాయ్మొళి యొక్క అర్ధాలను ధ్యానిస్తున్నారని తన పుర్వ దినచర్యలో ఎరుమ్బి అప్పా కీర్తించడం మనం చూడవచ్చు. ఇది శ్లోకం 9లో “మంత్ర రత్న అనుసంధాన …” లో చూడవచ్చు.  శ్రీవచన భూషణ దివ్య శాస్త్రం సూత్రం 274 లో “జప్తవ్యం గురుపరంపరైయుం ద్వయముం” –  గురుపరంపర మంత్రాన్ని, ద్వయ మహామంత్రాన్ని నిరంతరం పఠిస్తుండాలి అని పిళ్ళై లోకాచార్యులచే చెప్పబడింది.

80.  ఆరాధన వీరోధి  – పారాయణలో అవరోధాలు

తిరువారాదనం  మన నిజమైన స్వరూపాన్ని తృప్తిపరచడానికి నిస్వార్థ ఉద్దేశ్యంతో చేయకుండా భౌతిక కోరికలు  కలిగి ఉండటం, జాతి (జన్మ), ఆశ్రయ (యజమాని / అధికారి), నిమిత్తం, మాంసాన్ని, మద్యం మొదలైన శాస్త్రవిరుద్దమైన వాటిని తిరువారాధనంలో అర్పించడం అడ్డంకులు.

తిరువారాదన సమయంలో ఎటువంటి వాటిని ఆశించకుండా భగవానుడిని పూజించాలి. ఎమ్పెరుమాన్ ఆరాధన యొక్క ఫలితం పరమానందకరమైన ఆరాధన (మరింకేదీ కాదు). ఇది ఒక అతి సాధారణమైన ప్రఖ్యాతమైన నియమం – “యదన్నః పురుషోభవతి తదన్నస్ తస్య దేవతా” – శాస్త్ర ప్రకారం మనము భుజింపదగిన తినుపదార్థములన్ని మొదట మనం ఆరాధించే పెరుమాళ్కు సమర్పించి ఆపై మనం తీసుకోవాలి. ఉదాహరణకు, శాస్త్రంలో సన్యాసులకు తాబూలం తినడం నిషేధించబడింది, కాబట్టి తిరువారాధనంలో వారు ఆరాధించే పెరుమాళ్కు సమర్పించరు.  అనుష్ఠాన విరోధి (https://srivaishnavagranthamstelugu.wordpress.com/2019/06/23/virodhi-pariharangal-10/) లో చర్చించబడిన అనేక అంశాలను మనం గుర్తు చేసుకోవచ్చు. 

అనువాదకుల గమనిక: తిరువారాదనం అనేది భగవానుడిని పూజించే ప్రక్రియ. దీన్ని http://ponnadi.blogspot.in/2012/07/srivaishnava-thiruvaaraadhanam.html లో వివరంగా వివరించబడింది. భగవానుడిని ఆరాధించడంలో ఉన్న అడ్డంకులు https://srivaishnavagranthamstelugu.wordpress.com/2019/08/25/virodhi-pariharangal-16/ లో వివరంగా వివరించబడ్డాయి. ఆహార పదార్ధాల విషయానికి వస్తే, వాటిని తినడంలో 3 రకాల పరిమితులు తలెత్తుతాయి – జాతి ధుష్టం (ఉల్లిపాయ, వెల్లుల్లి మొదలైనవి), ఆశ్రయ ధుష్టం (అవైష్ణవులతో సంబంధం కలిగి ఉన్న సాత్విక ఆహార పదార్థాలు) మరియు నిమిత్త ధుష్టం (చెడిపోయిన ఆహార పదార్థాలు మొదలైనవి) .ఇవి https://srivaishnavagranthamstelugu.wordpress.com/2019/12/15/virodhi-pariharangal-23/ లో వివరంగా వివరించబడ్డాయి.

తరువాతి భాగం మనం వచ్చే సంచికలో కొనసాగిద్దాము.

అడియేన్ శ్రీదేవి రామానుజ దాసి

హిందీలో : http://ponnadi.blogspot.com/2014/11/virodhi-pariharangal-45.html

మూలము : https://srivaishnavagranthamstelugu.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

విరోధి పరిహారాలు – 44

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః

శ్రీ వైష్ణవుల రోజువారీ జీవితంలో వివిధ రూపాలలో ఎదుర్కొంటున్న అడ్డంకుల గురించి ఎమ్పెరుమానారు, వంగి పురత్తు నంబికి వివరిస్తారు. వంగి పురత్తునంబి ఈ విశేషాలను ఒక అద్భుతమైన గ్రంథ రూపంగా “విరోధి పారిహారంగళ్ (విరోధి పరిహారాలు) అనే గ్రంథంలో గ్రంథస్తపరిచారు.

ఈ సంచికలోని శీర్షికలు శ్రేణిగా ఆంగ్లములో ఈ పుస్తకము –  https://srivaishnavagranthamstelugu.wordpress.com/virodhi-pariharangal/ లో చూడవచ్చు.

దయచేసి మునుపటి శీర్షికను ఇక్కడ చుడండి – https://srivaishnavagranthamstelugu.wordpress.com/2021/01/31/virodhi-pariharangal-43/

74. అంతిమ దశ విరోధి –  అంతిమ  క్షణాలలోని అవరోధాలు 

    వరాహ పెరుమాళ్ (తిరువిడవెంతైలో ఉన్నట్టుగా) –  తన భక్తులకు మొక్షాన్ని ప్రసాదిస్తానని ప్రమాణం చేసినవాడు.

 అంతిమ దశ అంటే మరణ శయ్యపైన ఉన్న చివరి క్షణాలు. మరణం సమీపిస్తున్నప్పుడు, చాలా మంది స్పృహ లేకుండా పడి ఉంటారు. కొంత మంది  తమ చివరి క్షణాల గురించి పూర్తిగా తెలుసి ఉన్న వారు కూడా ఉంటారు. మన ఆచార్యలు రెండు ముఖ్యమైన అంశాలను తెలియజేస్తున్నారు.  ” ‘పేరు తప్పాతు’ ఎన్రు తుణిన్తిరుక్కైయుం, పేత్తుక్కుత్ తవారిక్కైయుం శ్రీవైష్ణవాధికారిక్కు అవస్యాపేక్షితం” –  శ్రీవైష్ణవుడు తన అంతిమ లక్ష్యాన్ని సాధించగలడు అన్న విశ్వాసం కలిగి ఉండాలి మరియు తన అంతిమ లక్ష్యం పట్ల ఆత్రుతగా ఆరాటపడాలి అని వివరించారు. ఈ మొత్తం వివరణ ఈ రెండు ముఖ్యమైన అంశాలపై ఆధారపడి ఉంది. ఇక్కడ ‘పేఱు’ అంటే  శ్రీవైకుంఠం (పరమపదం) చేరుకొని అతని (పెరుమాళ్) ఆనందం కోసం నిత్య కైంకర్యంలో పాల్గొనడమే మనకు అత్యున్నత లక్ష్యం.  అనువాదకుల గమనిక: సామాన్యంగా శాస్త్రంలో, అంతిమ స్మృతిని బాగా నొక్కి చెప్పారు. భగవద్గీత 8.6 లో, శ్రీకృష్ణ పరమాత్మ “యం యం వాపి స్మరణ్ భావం త్యజతి అంతే కళేవరం తమ్ తమ్ ఏవ ఇతి కౌంతేయ సదా తద్భావ భావితః” – ఓ కుంతీ పుత్ర! ఆత్మ చివరి క్షణాలలో దేనిని స్మరిస్తే, ఆ తరువాతి జన్మలో ఆ రూపాన్ని పొందుతుంది. ఈ కారణంగానే భగవాన్ నామాలను, రూపాలు, లీలల యొక్క స్మరణ చేయాలని నొక్కి చెప్పబడింది. కానీ అంతిమ క్షణాలలో తమ పరిస్థితుల బట్టి, అది సాధ్యమౌతుంది. స్పృహలేని స్థితిలో ఉంటే, వారు ఆ సమయంలో భగవత్ చింతన చేయలేరు. పైగా, తమ లౌకిక బంధాల కారణంగా, ఆఖరి క్షణాలలో భౌతిక అంశాల గురించి ఆలోచించడం ప్రారంభించవచ్చు. జ్ఞాన యోగంలో ప్రావీణ్యం ఉన్న గొప్ప సత్పురుష రాజు అయిన భరతుడు కూడా ఒక జింక పట్ల అనురాగంలో చిక్కుకొని, తమ ఆఖరి క్షణాలలో ఆ జింక గురించి ధ్యానించడం ప్రారంభించాడు. ఫలితంగా అతను తన తరువాతి జన్మలో జింకగా జన్మించాడు. కానీ ఇవన్నీ ఉపాసకులు అయిన కర్మ / జ్ఞాన / భక్తి యోగ నిష్ఠాపరులకు ప్రత్యేకమైనవి. ప్రపన్నులకు ఇది అవసరం లేదు. సంపూర్ణ శరణాగతి చేసిన ఆత్మ భగవాన్ యొక్క నియంత్రణా బాధ్యతలో ఉన్నందున, అతను భగవత్ ధ్యానం చేయగలిగినా చేయలేకపోయినా, ఆ ఆత్మ తప్పకుండా పరమపదం చేరుకుంటుంది. ఎమ్పెరుమానార్ కొన్ని సందేహాలను స్పష్టం చేసుకోవాలనుకున్నప్పుడు, వారు దేవ పెరుమాళుకి రహస్య కైంకర్యం చేస్తున్న తిరుక్కచ్చి నంబి (కాంచిపూర్ణ స్వామి) వద్దకు వెళ్లి, ఆ సందేహాలపై దేవ పెరుమాళ్ సలహా పొందమని కోరతారు. తిరుక్కచ్చి నంబి ఎమ్పెరుమానార్ పరిస్థితి గురించి దేవ పెరుమాళ్ని అభ్యర్థిస్తారు, దేవ పెరుమాళ్ తిరుక్కచ్చి నంబికి 6 వార్తలతో (పదాలు / ఉపదేశాలు) ఆశీర్వదిస్తారు, ఇవి ఎమ్పెరుమానార్ యొక్క సందేహాలను స్పష్టం చేస్తాయని చెప్తారు. తిరుక్కచ్చి  నంబి ఎమ్పెరుమానార్ని తన సందేహాల గురించి అడగరు, దేవ పెరుమాళ్ కూడా ఆ సందేహాలు ఏమిటని తిరుక్కచ్చి నంబిని అడగరు. దేవ పెరుమాళ్  ఎమ్పెరుమానార్ యొక్క మనో హృదయాన్ని తెలుసుకొని, నేరుగా తిరుక్కచ్చి నంబికి సమాధానాలను వెల్లడి చేస్తారు. ఆ 6 విషయాలు – “నేను, శ్రీమన్నారాయణ సర్వశ్రేష్ఠుడిని”, “ద్వంద్వత్వం నిజం”, “ప్రపత్తి (శరణాగతి) మాధ్యమం”, “అంతిమ స్మృతి అవసరం లేదు”, “ప్రపన్నులు ఈ జీవిత చివరలో విముక్తి పొందుతారు”,  చివరకు” పెరియ నంబిని ఆచార్యునిగా స్వీకరించు”. ఇక్కడ అతను ఒక ప్రపన్నునికి అంతిమ స్మృతి (చివరి క్షణాలలో భగవత్ ధ్యానం చేయడం) అవసరం లేదని ప్రత్యేకంగా చెప్పబడింది.  ఇది కూడా వరాహ చరమ శ్లోకం యొక్క ప్రధాన ఉద్దేశ్యం – ఇక్కడ వరాహ పెరుమాళ్ ప్రత్యేకంగా తన పట్ల ఎంతో అంకితభావంతో ఉన్నవారికి (అంటే అతనికి శరణాగతులైన వారికి), తమ తుద దశలో వారు స్పృహ లేని స్థితిలో ఉన్నప్పటికీ, ఆ సమయంలో అతను వారిని గుర్తుచేసుకొని వారిని  పరమపదానికి తీసుకువెళతానని వెల్లడిచేస్తున్నారు.  మన ఆచార్యులలో చాలామంది వారి చివరి క్షణాలలో ప్రత్యేకంగా భగవాన్ గురించి ధ్యానం చేయకుండా తమ స్వంత ఆచార్యుడి గురించి చింతన చేశారని మన పూర్వాచార్యుల జీవితంలో మనం స్పష్ఠంగా గమనించవచ్చు. ఇప్పుడు మనం అంశంలోకి వెళ్దాం.

  • మరణం తరువాత వదిలి వెళ్ళే ఆస్థిపాస్థులు, భార్యా పిల్లల పట్ల మక్కువ కారణంగా కలవరం చెందడం ఒక అడ్డంకి. ప్రావణ్యం అంటే అనురాగము అని అర్థం. ఇల్లు, భూములు, భార్యా పిల్లలు మొదలైన వాటిని వదిలివెళ్తున్నందుకు బాధపడవచ్చు, ఇది అజ్ఞానం కారణంగా జరుగుతుంది. అనువాదకుల గమనిక:  అంతిమ క్షణాలలో మరణ శయ్యపై ఉన్న  వ్యక్తి యొక్క మానసిక స్థితి గురించి పెరియాళ్వార్ తన పెరియాళ్వార్ తిరుమోళి 4.10 లో “తుప్పుడైయారై …” తో మొదలయ్యే పదిగంలో చాలా లోతుగా వివరించారు. తాను భగవత్ ధ్యానం చేసే స్థిరమైన మనస్సు కలిగి ఉండకపోవచ్చు అని అతను మొదట భగవానుడికి తెలియజేస్తున్నారు, తన ప్రస్తుత సంపూర్ణ శరణాగతి స్థితిని గుర్తుంచుకొని తన ఈ జీవితం చివరిలో (అతని మనస్సు స్థిరంగా ఉండకపోయినా) ముక్తిని ప్రసాదించమని భగవానుడిని అభ్యర్థిస్తున్నారు. ఈ పది పాసురములలో, చివరి క్షణాలలో మనం అనుభవించే బాధలను పెరియాళ్వార్ చాలా విస్త్రుతంగా వివరించారు.  మరణ శయ్యపై ఉన్న వ్యక్తి చుట్టూ తన బంధువులు గట్టి గట్టిగా ఏడుస్తూ తన భయాన్ని ఇంకా పెంచుతుంటారు. అతను ఆ శరీరాన్ని విడిచిపెట్టే ముందు వీలైనంత ఎక్కువ సంపదను తన నుండి లాక్కోవాలని కూడా వారు చూస్తూ ఉంటారు. ఇవన్నిటికి పైగా, తన సొంత భార్యా పిల్లలను, ఆస్తిపాస్తులను విడిచిపెట్టి వెళుతున్నందుకు తనపై తను జాలిపడతాడు. కాని ఆ వ్యక్తికి తాను ఒక జీవాత్మ, తాను ఈ శరీరాన్ని మాత్రమే విడిచిపెడుతున్నాను అన్న జ్ఞానం ఉన్నప్పుడు, వాళ్ళకి ఏ బాధ ఉండదు. ఇటువంటి సాక్షాత్కారం ప్రపన్నులకు సహజమైన గుణం.తనకు ప్రియమైన అతిథి వారి ఇంటికి వస్తానన్నఫ్ఫుడు అతను వచ్చే వరకు ఎదురుచూసిన్నట్లే, ప్రపన్నులు ఆత్రుతగా మృత్యు దేవత కోసం ఎదురుచూస్తారని చెప్పబడింది. ఎందుకంటే, అటువంటి ప్రపన్నులను, మరణించిన తరువాత, వాళ్ళను స్వయంగా భగవాన్ విరజా నది తీరానికి తీసుకువెళతారు (ఇది పరమపదం మరియు సంసారం మధ్యలో ప్రవహిస్తుంది). వారు అర్చిరాది మార్గం గుండా విరజా నదిని దాటి చివరకు  శ్రీమన్నారాయణ యొక్క దివ్య నివాసానికి చేరుకుంటారు. అక్కడ అతన్ని నిత్యసూరులు మరియు ముక్తాత్మలు స్వాగతిస్తారు. తరువాత భగవాన్ కూర్చున్న శేష పర్యంకం (సింహాసనం) పైకి ఎక్కి భగవానుడిని ఆలింగనం చేసుకుంటాడు. ఆ తరువాత, భగవాన్ అతనికి నిత్య కైంకార్యాన్ని ప్రసాదిస్తాదు,  అతను సంతోషంగా చిరకాలం అక్కడే ఉండిపోతాడు. ఆ విధంగా, మరణం తరువాత ఉన్న ఈ అద్భుతమైన జీవితాన్ని చూసి, ప్రప్పన్నులు తమ ఈ శరీరాన్ని విడిచి పెట్టడం గురించి భయపడరు. కానీ ఈ తత్వ అవగాహన లేని సామాన్య పురుషులు, మహిళలు మరణాన్ని ఎదుర్కొనేందుకు చాలా కష్టపడతారు.
  • క్షేత్రాణి మిత్రాణి ” లో వివరించినట్లుగా, అటువంటి అనుబంధాలు/అనురాగాలు అననుకూలమైనవి కావు అని గమనించాలి. అలా ఉండకపోవటం ఒక అడ్డంకి. క్షేత్రాణి , మిత్రాణి – నా ఆస్థిపాస్థులు, నా స్నేహితులు, వంటి అనుబంధాలు. పరమపదం చేరుకోవడానికి ఆటంకాలు. అందువల్ల ఈ కారణాలు (అనుబంధాలు/అనురాగాలు) అననుకూలమైనవి కావని తెలియజేస్తున్నారు.  అనువాదకుల గమనిక: ఎమ్బెరుమానార్ ఈ శ్లోకం శారణాగతి గధ్యంలో ఉల్లేకించారు. “పితరం మాతరం ధారాన్ పుత్రాన్ బంధూన్ సఖీన్ గురూన్, రత్నాని ధనధాన్యాని క్షేత్రాణి చ గృహాణి చ, సర్వధర్మాం శ్చ సంత్యజ్య సర్వకామాన్ శ్చ సాక్షరాన్, లోకవిక్రాంత చరణౌ చరణం తే వ్రజం విభో!” –  ప్రియమైన భగవాన్ (విభో)! నా యొక్క తల్లి తండ్రులు, భార్యాపిల్లలు, బంధు మిత్రులు, గురువులు, విలువైన రత్నాలు, సంపద, నిల్వ ధాన్యం, పొలాలు, ఇళ్ళ పట్ల మక్కువను నిన్ను పొందడానికి వదులుకున్నాను. అన్ని ఇతర మార్గాలు, ఏ కొంచం స్వల్పమైన కోరికలున్న అన్ని మార్గాలను నేను వదులుకుని, ముల్లోకాలను కొలిచిన మీ పాద పద్మాలకు శరణాగతి చేశాను. లౌకిక సంపద పట్ల ఉన్న మక్కువను  తిరస్కరించిన తరువాత భగవాన్ యొక్క పాద పద్మాలు మాత్రమే మన అభ్యున్నతికి ఏకైక మార్గమని స్పష్టంగా తేలుపుతున్నందుకు ఈ శ్లోకం గొప్పగా మహిమపరచబడింది.
  • తిరువాయ్మొళి 9.4.7 పాసురం “మాగ వైకుంఠం కాణ్బత్తర్కు ఎన్మనం ఏకమెణ్ణుం” లో పేర్కొన్నట్లుగా అత్యోన్నత నివాసంపై ఆసక్తి లేకపోవడం ఒక అవరోధం. పరమపదం చేరుకోవటానికి,  అక్కడ ఉన్న భగవానుడిని చూడాలని గొప్ప కోరిక ఉండాలి.  “తిరువాయ్మొళి 2.3.3 లో, ఆళ్వార్  ఈ భౌతిక ప్రపంచంలో  తనని ఉంచి నందుకు తన నిరాశను వెల్లడించాడు” అని తిరుమాలై ఆండాన్ తెలియజేస్తున్నారు. అనువాదకుల గమనిక: ఈ తిరువాయ్మొళి 9.4.7 పాసురానికి నంపిళ్ళై యొక్క ఈడు వ్యాఖ్యానం చాలా స్ఫుటమైనది మరియు అందమైనది కూడా. నరసింహుని యొక్క నిత్య నివాసమయిన శ్రీవైకుంఠం గురించి నిరంతరం ధ్యానం చేస్తున్న నమ్మాళ్వారుల యొక్క స్థితిని వారు వివరించారు. రాత్రి పగలుతో సంబంధం లేకుండా నా మనస్సు పరమపదం గురించి నిరంతరం చింతన చేస్తుందని ఆళ్వార్ తెలియజేస్తున్నారు. సామాన్యంగా జనాలకి ప్రొద్దున రాత్రి పనులు వేరు వేరుగా ఉంటాయి. కాని ఆళ్వారుకి అన్నీఒకటే, నిరంతరం భగవత్ చింతన చేస్తూ ఉండే వారని  నంపిళ్ళై తెలియజేస్తున్నరు.
  • తిరువాయ్మొళి 4.9.7 పాసురం “కొడువులగం కాట్టేలే” లో పేర్కొన్న విధంగా విడిచిపెట్టవలసిన ఈ భౌతిక ప్రపంచాన్ని ద్వేషించకపోవడం ఒక అడ్డంకి. నమ్మాళ్వారులు ఈ భౌతిక ప్రపంచంలో సంసారుల మధ్య ఉండటం “కొడువులగం” – క్రూరమైన ప్రపంచమని అంటున్నారు, “నేను దీన్ని ఇకపై చూడకూడదను కుంటున్నాను” అని అంటున్నారు. అనువాదకుల గమనిక: తన గురించి నిజమైన జ్ఞానాన్ని తెలుసుకున్న వెంటనే, ఈ ప్రపంచంలో జీవాత్మకు ముళ్ళపైన ఉన్నట్టు అనిపిస్తుంది, ఇది తనకు నిరంతర కైంకర్యంలో పాల్గొనడానికి సరిపోదు అని అనిపిస్తుంది. నమ్మాళ్వారులు తన మొదటి ప్రబంధంలోని మొదటి పాసురంలోనే దుఃఖాన్ని వ్యక్తం చేస్తున్నారు – తిరువిరుత్తం 1 – “పొయ్ నిన్ఱ జ్ఞాననుం… ఇనియాం ఉఱామై” – నేను, అజ్ఞానంతో నిండి ఉన్న ఈ ప్రపంచాన్ని భరించలేకపోతున్నాను అని అర్థం. ఆళ్వార్లకు, ఈ ప్రపంచంలో ఉండటం అంటే పాదరక్షలు లేకుండా వేడి ఇసుక మీద నిలబడటం లాంటిది – అది కొన్ని క్షణాలు కూడా సహించలేము. ఈ భౌతిక ప్రపంచంలో మనం అలాంటి విరక్తిని పెంచుకోకపోతే, చివరి క్షణాలలో ఇక్కడి బంధాలను వదులుకోవడం చాలా కష్టం.
  • తిరువాయ్మొళి  పాసురం 1.2.9 లో “పిన్నమాక్కై విడుంపొళుతెణ్ణే” ప్రస్తావించినట్లుగా, ఈ శరీరాన్ని వదులుకోవాలనే కోరిక లేకపోవడం ఒక అడ్డంకి. ఈ అనిత్యమైన శరీరానికి దూరం కావాలని ఎదురుచూడాలి. తిరువాయ్మొళి 6.9.9 లో వివరించినట్లు “కూవిక్కొళ్ళుం కాలం ఇన్నుం కుఱుగాతో?” – ఆ దివ్య ధామానికి చేరుకోవాలని, మరణించే ఆ ఆఖరి క్షణం కోసం ఆత్రంగా ఎదురుచూడాలి అని అర్థం .  అనువాదకుల గమనిక: అచార్య హృదయంలో, అళగియ మనవాళ పెరుమాళ్ నాయనార్ చూర్ణిక 229 లో ఇలా వివరిస్తున్నారు, నమ్మాళ్వార్  తమ 4 ప్రబంధాలలో  భగవానుడిని పరమపదాన్ని ప్రసాదించమని ఆర్తితో 20 సార్లు పిలిచే వరకు భగవానుడు ఎదురుచూశాడని తెలియజేస్తున్నారు. అనేక కారణాల వల్ల భగావనుడు అంత కాలం ఎదురు చూసాడు, కాని ముఖ్యంగా పరమపదం చేరుకోవాలనే నమ్మాళ్వార్ కోరికను సాధ్యమైనంత పరిపక్వ స్థాయికి పెంచాలని, తద్వారా అతన్ని ముముక్షు (మోక్షం కోరుకునేవాడు) అని పిలవడానికి పూర్తిగా అర్హత సాధింపజేయడానికి అని నాయనార్ వివరిస్తున్నారు. నమ్మాళ్వారులు భగవానుడిని పిలుస్తున్న 20 ప్రదేశాలను మాముణులు వ్యాఖ్యానంలో అందంగా వివరించారు, శరణగతులైన వ్యక్తికి పరమపదంలో శాశ్వతంగా భగవానుడితో ఉండాలని గొప్ప కోరిక ఉండాలి, అలాంటి ఉన్నతమైన కోరిక శరణాగతిని పూర్తి చేస్తుంది – లేకపోతే ఆ శరణాగతిని అసంపూర్ణమని పరిగణించబడుతుంది.
  • తిరువాయ్మొళి 10.10.9వ “ఉన్నై ఎన్నాళ్ వందు కూడువన్” పాసురంలో ప్రస్తావించినట్లుగా ఎమ్పెరుమాన్తో నిత్యం ఉండాలనే కోరిక పరిపక్వం చెందిన తరువాత కూడా ఎమ్పెరుమానుని చూడకుండా తాను ఉండగలగడం ఒక అడ్డంకి. పరమపదంలో ఎమ్పెరుమాన్ యొక్క అత్యంత దివ్య రూపాన్ని నేను ఎప్పుడు చూస్తాను? నేను వ్యక్తిగతంగా అలాంటి ఎమ్పెరుమాన్ని ఎప్పుడు అనుభవిస్తాను? ఇవి నమ్మాళ్వారుల హృదయంలో భావాల అనుభవం. పరమపదంలో ఎమ్పెరుమాన్ యొక్క పరత్వ రూపాన్ని పొందాలనే కోరిక ఉన్న  దశ ఇది. బాగా పరిపక్వం చెందిన ఈ భక్తి స్థితిని పరమభక్తి అంటారు. అనువాదకుల గమనిక: మునుపటి వివరణ‌లో చెప్పినట్లుగా, భగవానుడి పట్ల భక్తి అత్యున్నత స్థితికి చేరి పరిపక్వం చెందాలి. భక్తిలోని 3 దశలు ఇవి – పరభక్తి, పరజ్ఞానం, పరమ భక్తి ఉన్నాయి. పరభక్తి అనేది ఎమ్పెరుమాన్ గురించి పూర్తి పరిజ్ఞానం ఉన్న స్థితి – ఈ స్థితిలో ఎమ్పెరుమాన్‌తో కలిసి ఉండటం ఆనందాన్ని ఇస్తుంది, భగవాన్ నుండి దూరమైనపుడు దుఃఖాన్ని ఇస్తుంది. పరమ జ్ఞానం అనేది భగవాన్ యొక్క కల్యాణ గుణాలు, నామాలు, రూపాలు మొదలైనవాటిని పూర్తిగా మనస్సులో చిత్రీకరించి మనో నేత్రాలతో చూసుకునే స్థితి. పరమ భక్తి అనేది భగవాన్ పట్ల తమ అత్యున్నత భావాల స్థితి, భగవాన్ లేకుండా తాను ఉండలేకపోవడం అని అర్థం. నాయనార్ వీటిని ఆచార్య హృదయం యొక్క చూర్ణిక 233 లో కీర్తించారు, మాముణులు వాటిని తగినంత అందంగా వివరించారు.
  • తిరువాయ్మొళి 10.6.1 పాసురం “మారులోజి ఎన్” లో పేర్కొన్న విధంగా అర్చావతార ఎమ్పెరుమానుడిపై ఎక్కువ ఆసక్తి కలిగి ఉండటం ఒక అడ్డంకి. మన కోరిక ఆధారంగా భగవాన్ మనకు పరమపదాన్ని ప్రసాదిస్తాడు అని నమ్మాళ్వార్ తెలియజేస్తున్నారు. మనము ఈ ప్రపంచంలో ఇంత వరకు భక్తితో ఆరాధించిన  అర్చావతార ఎమ్పెరుమాన్  పరమపద భగవానుడిని అనుభవించే కోరికను అతను ప్రేరేపిస్తాడు. కాబట్టి, ఇక్కడ వారు పరమపదానికి దగ్గరవుతున్నపుడు తిరువాయ్మొళి చివరలో, అర్చావతార భగవానుడిని “మారుల్” (అపార్థం) అంటారు, ఎందుకంటే ఈ అర్చావతార భగవాన్ అనుభవం ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నందున. కానీ అదే ఆళ్వార్, సుళ్విసుంబణిముగిల్ పదిగం (10.9) లో,  అర్చరాది మార్గాన్ని అనుభవిస్తూ, అతను తిరుక్కుదంతై యొక్క ఆరవముదన్ భగవానుడి పట్ల తన భక్తిని చూపించారు. కాబట్టి, అర్చావతారం పట్ల అనురాగం మన స్వభావానికి వ్యతిరేకం కాదని మనం అర్థం చేసుకోవచ్చు. తిరుమంగై ఆళ్వార్ కూడా తన చివరి క్షణాలలో, తిరునెడుంతాండగం 29 వ పాసురంలో,  “తన్కుదంతైక్ కిదాంత మాలై నెడియానై అదినాయేన్ నినైన్తిట్టేనే” అని కీర్తించారు.  అనువాదకుల గమనిక: శ్రీవైష్ణవులకు అర్చావతార పెరుమాళ్ పట్ల భక్తి ప్రేమలు ఉండటం సహజం. వారు తమ జీవితం మొత్తం అర్చావతార పెరుమాళ్కి సేవచేస్తూ గడుపుతున్నందున, దానికి మించి ఇంకేదీ వారి మనస్సులోకి రాదు. పరాశర భట్టార్ తమ చివరి క్షణాలలో “నేను పరమపదంలో శ్రీరంగనాథుని చూడకపోతే, నేను పరమపదానికి ఒక రంధ్రం చేసి దానిగుండా తిరిగి శ్రీరంగంలోకి దూకుతాను” అని చెప్పడం మనందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ, పరమపదంలో భగవానుడికి నిత్య సేవ చేయాలనే కోరికతో అర్చావతార ఎమ్పెరుమాన్ పట్ల అనురాగాన్ని తగ్గించుకోవాలి. శ్రీవైష్ణవులకు ఇక్కడి దివ్య దేశాలు మరియు పరమపద అనుభవంలో తేడా లేనప్పటికీ, ప్రత్యేక వ్యత్యాసం ఏమిటంటే – ఈ ప్రపంచంలోని దివ్య దేశాలలో, కైంకర్యంలో అంతరాయాలు ఉంటాయి – ఏది ఏమైనా, సమయం అయ్యిం తరువాత ఆలయం మూసివేయబడుతుంది, భక్తులు ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకుంటారు. కానీ పరమపదంలో, ముసలితనం, వ్యాధి మొదలైన వాటి ప్రభావం లేకుండా నిరంతర కైంకర్యం చేయవచ్చు. కాబట్టి, శ్రీవైష్ణవులు ఈ ప్రపంచంలో అర్చావతారము  పట్ల ఉన్న అనుబంధాన్ని వదులుకుని, సమయం వచ్చినప్పుడు పరమపదాన్ని అధిరోహించడానికి తమను తాము సిద్ధం చేసుకోవాలి.
  • చివరి క్షణాలలో “ఇప్పుడు నాకు ఆశ్రయం ఏమిటి?” అని ఆలోచించడం,  “భగవానుడికి శరణాగతి చేయుటయే మనకు ఆశ్రయం” అన్నదే నిజమైన ఆశ్రయం అని తెలియకపోవుట ఒక అడ్డంకి. పెరియ తిరుమొళి 2.7.1 లో వివరించినట్లుగా “ఉన్ మనత్తాల్ ఎన్ నినైన్తిరుంతాయ్” – మీరు నన్ను ఎలా రక్షించాలను కుంటున్నావు? మన యొక్క ముక్తి భగవానుడి బాధ్యత, వారి సంకల్పం కూడా. భగవాన్ మనస్సులో ఆ కోరిక ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి, తనను తాను ఎప్పుడూ స్వయం రక్షకుడిగా భావించి స్వతంత్రంగా వ్యవహరించకూడదు. “ఇప్పుడు నేను నన్నెలా విముక్తి పరచుకోగలను?” అని స్వతంత్రంగా ఆలోచడం ఒక అడ్డంకి అని అంటారు. శ్రీవచన భూషణ దివ్య శాస్త్రంలో, 69 వ సూత్రంలో “”అంతిమ కాలత్తుక్కు తంజం, ఇప్పోతు తంజమెన్ ఎంగిఱ నినైవు కులైగై” ఎన్ఱు జీయర్ అరుళిచ్చెయ్వర్ ” – ఆఖరి క్షణాలలో మన ఆశ్రయం ఏమిటంటే, “మనల్ని మనం రక్షించుకునే వైఖరిని వదులుకోవాలి, భగవత్ ఆశ్రయాన్నే సంపూర్ణగా స్వీకరించాలి” అని నంజీయర్ తెలియజేస్తున్నారు. అనువాదకుల గమనిక: శ్రీ వచన భూషణ దివ్య శాస్త్రం యొక్క రెండవ ప్రకరణంలో, పిళ్ళై లోకాచార్యులు ప్రపత్తి (శరణాగతి) యొక్క మహిమను వివరించారు. ఈ విభాగంలో, 60 వ సూత్రంతో ప్రారంభించి, ప్రపత్తి  (మనం శరణాగతి చేసే చర్య) కూడా ఉపాయం కాదు కేవలం భగవాన్ మాత్రమే ఉపాయం అని పిళ్ళై లోకాచార్యులు వివరించారు. భగవానుడిపై ఆధారపడినప్పుడు వారికి శరణాగతి చేయుట సర్వ సహజం అని ఇక్కడ స్థాపిస్తున్నారు. సూత్రం 63 లో, భగవాన్ జీవాత్మలను రక్షిస్తున్నపుడు, భగవాన్ జీవాత్మ నుండి ఆశించేది ఏమిటంటే అతన్ని జీవాత్మను రక్షించనివ్వడం. ఎమ్పెరుమాన్ చేత జీవాత్మ రక్షింపబడాలనే కోరిక, అతనికి రక్షణ ఇవ్వడానికి జీవాత్మ భగవానుడిని అనుమతిస్తున్నాడన్న దానికి సూచన అని మాముణులు వ్యాఖ్యానంలో వివరించారు. జీవత్మను రక్షించాలనే భగవాన్ యొక్క కోరిక ముఖ్యమని సూత్రం 66 లో పిళ్ళై లోకాచార్యులు వివరించారు.. తరువాతి సూత్రంలో, భగవాన్ నిరంతరం జీవత్మను రక్షించాలనే కోరికతో ఉంటాడని, ప్రయత్నిస్తుంటారని వివరించారు. జీవాత్మ కోరిక మారినప్పుడు అటువంటి రక్షణ కార్యరూపం దాల్చుతుందని సూత్రం 68 లో వివరించారు. “కోరికలో మార్పు” అంటే “తనను తాను రక్షించుకోవడం నుండి భగవాన్ మీద పూర్తిగా ఆధారపడటమనే వైఖరిలో మార్పు” అని మాముణులు ఇక్కడ అద్భుతంగా వర్ణించారు. ఇది 69 వ సూత్రంలో పిళ్ళై లోకాచార్యుల చేత నంజీయర్ పదాల ద్వారా స్థాపించబడింది. ఈ సూత్రంలో, నంజీయర్  అనారోగ్యంగా ఉన్న ఒక శ్రీవైష్ణవునికి సాన్త్వననిస్తూ  ప్రస్తుతానికి అతనికి ఆశ్రయం ఏమిటి అని అడిగినపుడు, నంజీయర్ వారు తనను తాను రక్షించుకునే ప్రయత్నాలను వదులుకొని,  భగవత్ ఆశ్రయాన్ని స్వీకరించడమే ఏకైక మార్గం అని తెలియజేస్తారు. ఈ విధంగా, భగవాన్ అతన్ని రక్షించనివ్వడం మరియు భగవాన్ కోరికకు లొంగి ఉండడం వంటి జీవాత్మ యొక్క సహజ వైఖరిని “అధికారి విశేషం” గా వివరించబడింది. “అధికారి విశేషం” అనగా శరణాగతి చేసిన వ్యక్తి యొక్క సహజ గుణం, కనీ అది అతని మొక్షానికి ఎన్నడూ ఉపాయం (మాధ్యమం) గా మారదు. ఈ సూత్రాలపై మరిన్ని వివరాలకు ఉత్తమమైన  విద్వాంసుల మార్గదర్శకత్వంలో శ్రవణం చేయవచ్చు.
  • స్పృహ / జ్ఞానం యొక్క అభివ్యక్తత లేకుండా ఒక రాయి/ చెక్క ముక్కలా ఉండకపోవడం ఒక అడ్డంకి. “తతస్తం మ్రియమాణంతు కాష్టపాషాణ సన్నిబం, అహం స్మరామి మద్ భక్తం” – స్వతంత్రంగా మనల్ని మనం సంరక్షించు కోకుండా చలనం లేకుండా ఒక రాయి/ చెక్క ముక్కలా ఉండాలని వరాహ పెరుమాళ్ వివరిస్తున్నారు. నాపై పూర్తిగా ఆధారపడిన అలాంటి వ్యక్తులను, వారి చివరి క్షణంలో నేను వారిని స్మరిస్తాను, వారిని ఉద్ధరిస్తాను. అనువాదకుల గమనిక: శ్రీవైష్ణవ సాంప్రదాయంలో, 3 చరమ శ్లోకములు గొప్పగా మహిమపరచబడ్డాయి. చరమ శ్లోకం అంటే అత్యున్నత మూలసూత్రాలను వెల్లడించే శ్లోకం అని అర్థం. వరాహ చరమ స్లోకం “స్థితే మనసి …” తో మొదలవుతుంది. “సకృతేవ ప్రపన్నాయ…” తో ప్రారంభమయ్యేది శ్రీ రామ చరమ స్లోకం. “సర్వధర్మాన్ పరిత్యజ్య …” తో మొదలయ్యేది కృష్ణ చరమ స్లోకం. భగవాన్ తన భక్తులకు అంతిమ రక్షకుడన్న తన ప్రతిజ్ఞను ఈ స్లోకాములన్నీ వెల్లడిస్తున్నాయి. భగవాన్ యొక్క రక్షణను పూర్తిగా స్వీకరించడం, అతని సంకల్పానికి కోరికలకు కట్టుబడి ఉండటం మన బాధ్యత.
  • చివరి క్షణాలలో మొక్షానికి ఎవైనా ప్రత్యేక నియమాలు ఉన్నాయనుకోవడం, సిద్ద సాధనం (భగవాన్) మన రక్షకుడు అన్న మన సంపూర్ణ విశ్వాసాన్ని దెబ్బతీస్తుందని తెలియకపోవడం ఒక అడ్డంకి. సిద్ద సాధన నిష్ఠ అంటే మనకు ఉపాయం (మధ్యమం), ఉపేయం (లక్ష్యం) రెండూ భగవానుడే అన్న పూర్ణ విశ్వాసం కలిగి ఉండటం. మన స్వంత ప్రయత్నంపై ఆధారపడే ఏ అవసరమైనా మన విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. అనువాదకుల గమనిక: చివరి క్షణాలలో మన ఆలోచన ప్రక్రియకు ప్రత్యేక అవసరాలు ఉన్నాయనుకున్నపుడు, అది మనల్ని స్వతంత్రంగా ఆలోచించేలా చేస్తుంది, ఆ సొంత ఆలోచనా అంశాలను అనుసరించేలా చేస్తుంది. కానీ స్వాతంత్రాన్ని వ్యక్తపరిచే ఇటువంటి ధోరణి జీవాత్మ స్వరూపానికి విరుద్ధం, జీవాత్మలు ఎల్లప్పుడూ భగవానుడిపై సంపూర్ణంగా ఆధారపడి ఉండాలి. అందువల్ల, భగవానుడే సర్వాధారము అన్న ఈ సూత్రాలను పూర్తిగా గ్రహించిన ప్రపన్నులు ఇటువంటి ప్రయత్నాలను అనుసరించరు. భక్తి యోగ నిష్ఠాపరులు, ఇతర ఉపాసకులు, భగవత్గీతలో  వివరించిన విధంగా చివరి క్షణాల్లో ఈ పద్ధతులను పాటిస్తారు. వారి తరుతాతి జన్మ వారు అనుసరించిన చివరి స్మృతి ప్రకారం ఉంటుంది.
  • చివరి క్షణాలలో మనస్సులో తలెత్తే పవిత్రమైన ఆలోచనలు/భావాలు భగవత్ ఉల్లాసాన్ని కలిగిస్తాయని, అవి మన  లక్ష్యంలో భాగమని  తెలియకపోవడం ఒక అడ్డంకి. మన యదార్థ స్వభావం (భగవత్ విషయంలో నిరంతరం నిమగ్నమై ఉండటం) నుండి ఉత్పన్నమయిన భగవద్ ఆలోచనలు/భావాలు మన అంతిమ ఫలితంలో భాగమవుతాయని తెలుసుకోవాలి. అనువాదకుల గమనిక: నిజమైన ప్రపన్నుడు, తన చివరి క్షణాలలో అతను స్పృహలో ఉంటే మాత్రం  భగవాన్ గురించి మాత్రమే ఆలోచిస్తాడు. వేరే ఇంకేదో సాధించాలని తప్పుగా అర్థం చేసుకోకూడదు. అది కేవలం వారు భగవత్ విషయంలో నిరంతరం నిమగ్నమై ఉండటం వలన, స్వయంగా భగవత్ సంకల్పం యొక్క ఫలితమిది. ఆచార్యలు వారి చివరి క్షణాలలో భగవాన్ వారి హృదయంలో సంపూర్ణంగా అభివ్యక్తమవ్వడం కారణంగా వారు పరమానందంగా ఉండటం మన పుర్వచార్యల జీవితంలో స్పష్ఠంగా గమనించవచ్చు. మన ఆచార్యలు చివరి క్షణాలలో వారి ఆచార్యల పూర్తిగా చింతనలో ఉండి పరమానందాన్ని అనుభవిస్తారు. అత్యున్నత పరిణామమైన  పరమపదంలో భగవానుడి నిత్య కైంకర్యంలోని భాగములు ఇవన్నీ.
  • చివరి క్షణాలలో ఆచార్యుల నామాలను తప్పనిసరిగా ధ్యానించాలని అనుకోవడం ఒక అడ్డంకి. ఈ విషయంతో ప్రారంభించి, ఆచార్యుల యొక్క ప్రాముఖ్యత నొక్కి చెప్పబడింది. చివరి క్షణాలలో ఆచార్యుల నామాలు సాధనం (మాధ్యమం) గా భావించకూడదు. అనువాదకుల గమనిక: భగవత్ కృప వల్ల ఏమి జరిగినా, ఆ పరిస్థితిలో మనం స్వీకరించాలి. దీన్ని బట్టి మనం ఉపాయంగా చేయవలసినది ఏమీ లేదని మనం అర్థంచేసుకోవాలి.
  • నిత్యం ఆచార్యులతో గత సహవాసం (సాంగత్యము) కారణంగా సహజంగా వచ్చే ఆలోచనలు/భావములు పరమపద ప్రయాణంలో ఉపయోగపడతాయని తెలియకపోవటం మరియు అలాంటి ఆలోచనలు తప్పనిసరిగా రావడం అవసరం అనుకోవడం ఒక అడ్డంకి. ఆ క్షణాలలో ఆచార్యుని గుర్తు చేసుకోవడం మంచిది. ప్రయాణపాదేయం –  సుదీర్ఘ ప్రయాణాలకు వెళ్ళినప్పుడు, మన వెంట కొంత ఆహార సామగ్రిని తీసుకువెళతాము. అదేవిధంగా అర్చరాది మార్గంలో పరమపదానికి ప్రయాణించేవారికి, ఆచార్యుని ఆలోచనలు ఆహారం వంటివి. అనువాదకుల గమనిక: సాధారణంగా “పాదేయం పుండరికాక్ష నామ సంకీర్తనం” – సాధారణంగా ప్రయాణించేటప్పుడు భగవాన్నామ సంకీర్తనమే మనకు ఆహారం. అదేవిధంగా, ఇక్కడ చివరి ప్రయాణంలో ఆచార్యలను కీర్తించడం మనల్ని ఆదుకుంటుంది అని నొక్కి చెప్పబడింది.
  • నిత్యం ఆచార్యులతో గత సాంగత్యము కారణంగా సహజంగా వచ్చే ఆలోచనలు/భావములు ఉపాయం (మాధ్యమం) గా పరిగణనలోకి తీసుకోవడం ఒక అడ్డంకి. ఇది ఏదైనా సాధించడానికి ఉపాయంగా మారదు. అనువాదకుల గమనిక: ఇది ముందు వివరించినట్లు గత అనుభవాల కారణంగా ఉన్న సహజ స్మృతులు,  మన అంతిమ లక్ష్యంలోని భాగంగా పరిగణించాలి.
  • ఈ ప్రయాణంలో మనల్ని నడిపించేది మన నిజమైన శ్రేయోభిలాషి “అతడు” అని తెలియకపోవడం ఒక అడ్డంకి. ఈ ప్రయాణంలో మనల్ని నడిపించే మన నిజమైన శ్రేయోభిలాషి అయిన వారు ఆచార్యులు అని మనం తెలుసుకోవాలి. అనువాదకుల గమనిక: సాధారణంగా భగవానుడిని “మార్గబంధు” అని కీర్తిస్తారు – ప్రయాణాల సమయంలో నిజమైన తోడుగా ఉండేవాడు. ఇక్కడ ఆచార్యుడని గురించి కూడా చెప్పవచ్చు. ఈ సూత్రం భగవాన్ మరియు ఆచార్యుడు ఇద్దరికీ వర్తిస్తుంది. తిరుమోగూర్ యొక్క కాళమేగ పెరుమాళ్ను వళిత్తునై / మార్గ బంధు పెరుమాళ్ అని అంటారు. ఎమ్పెరుమానార్ను “శ్రీ విష్ణులోక మణిమండప మార్గదాయి” అని కీర్తిస్తారు. మనకి పరమపద మార్గాన్ని ఇచ్చేవాడు. కాబట్టి, భగవాన్ మరియు ఆచార్యులు ఇద్దరికీ ఇది వర్తిస్తుంది.
  • అనిష్ఠ నివృత్తి (అనవసరమైన అంశాలను తొలగించడం – అజ్ఞానం, మొదలైనవి) మరియు ఇష్ఠ ప్రాప్తి (కావలసినవి సాధించడం – అర్చరాది మర్గంలో వెళ్లడం, పరమపదం చేరుకోవడం మొదలైనవి) మన సొంత ప్రయత్న ఫలితమని భావించడం అవరోధం. అవిధ్య (అజ్ఞానం) అంటే భౌతిక ప్రపంచంలో శారీరక అంశాల బంధం వల్ల ఆర్జించిన జ్ఞానం. భౌతిక శరీరం పోయినప్పుడు, అజ్ఞానం తొలగి, జ్ఞానం పూర్తిగా విస్తరిస్తుంది. ఇది ముక్తుని యొక్క స్థితి. అర్చిరాది గతి అనేది అర్చిస్ (కాంతి) తో ప్రారంభమై పరమపదంలో ముగిసే ఒక దారి. మన సొంత ప్రయత్నంతో ఇవి సంభవించాయని భావించకూడడు.
  • అటువంటి అవరోధాలను తొలగించి,  వరాలను ప్రసాదించే భగవానుడు ఈ ఫలితానికి నిజమైన ఉపకారి అని తెలియకపోవడం ఒక అడ్డంకి. అనువాదకుల గమనిక: ఇది చాలా ముఖ్యమైన సూత్రం. “చేతన లాబం ఈశ్వరనుక్కు” – ఒక బద్దాత్మ శుద్ధి చేయబడి ముక్తి పొందినప్పుడు, అతను పరమపదానికి చేరుకుని భగవాన్ నిత్య సేవ చేయడం ప్రారంభిస్తాడు. కాబట్టి, జీవాత్మలను బంధ విముక్తులను చేయడంలో భగవానుడు అత్యున్నత్ సహకారి అని వివరించబడింది.  భగవాన్ యొక్క నిత్య సేవ చేయడమే జీవత్మ యొక్క నిజమైన స్వభావం అయినప్పటికీ,  భగవాన్ యొక్క కృపతో మాత్రమే అతను ఉద్ధరించబడతాడు. ఈ విధంగా, భగవాన్ ప్రతి ఒక్కరికీ యజమానిగా ఉండటం కారణంగా వారు అత్యున్నత శ్రేయోభిలాషి.  శ్రీ వచన భూషణ దివ్య శాస్త్రం 70 వ సూత్రంలో “ప్రాప్తవుం ప్రాపకనుం ప్రాప్తిక్కు ఉగప్పానుం అవనే” – మార్గనిర్దేశం చేసేవాడు, వరాన్ని ఇచ్చేవాడు, లక్ష్యాన్ని సాధించిన పిదప ఆనందాన్ని పొందేవాడు కూడా భగవానుడు అని పిళ్ళై లోకాచార్యులు  వివరించారు. మాముణులు ఈ సూత్రానికి ఒక ఉత్తమమైన వ్యాఖ్యానాన్ని ఇచ్చారు. అతను ఈ సూత్రాలను ప్రమణాలతో వివరించారు. భగవానుడు ప్రాప్త మరియు ప్రాపకుడు కాబట్టి – జీవాత్మ సొంత ప్రయత్నంతో పని లేకుండా,  అంతిమ ఫలితం లభించిన తరువాత పరమానందాన్ని పొందేవాడు కూడా భగవానుడు కాబట్టి – తన ఆనందం కోసం జీవాత్మ ప్రయత్నించకూడదు.
  • ఇష్టా అయిష్టాలలో అనుబంధం కలిగి ఉండటం ఒక అడ్డంకి. భగవాన్ అంతర్యామిగా ఉండటం కారణంగా, ఆ జీవత్మాకు అనుకూలమైన మరియు అననుకూలమైనదాన్ని నిర్ణయించడం అతని బాధ్యత. అనువాదకుల గమనిక: మనం భగవా‌నుడిని అత్యున్నత మార్గం మరియు లక్ష్యంగా స్వీకరించినప్పుడు, మన చర్యలన్నీ ఈ సూత్రం ప్రకారం నడుపుకోవాలి. మన జీవితాల్లో శాస్త్రం (గ్రంథాలు) మరియు అనుష్ఠానం (మన పూర్వాచార్యుల చేత ఆచరించబడినవి) లో వివరించిన వాటిని మనస్ఫూర్తిగా పాటించాలి. మనకు అనుకూలమైన/ అననుకూలమైన అంశాలను మన ఇష్టాయిష్టాలకు బదులుగా శాస్త్రం మరియు ఆచార్యుల సూచనల ద్వారా నిర్ణయించబడాలి. చాలా సార్లు మనము చూస్తుంటాము, కొంతమంది “నేను పూర్తి శరణాగతి చేసాను, ఇక నేను భగవానుడి బాధ్యత” అని చెబుతారు. కానీ వారి ప్రవర్తన శాస్త్రం మరియు శిష్ఠాచారములకు పూర్తి విరుద్ధంగా ఉంటుంది – సామాన్యంగా ఎటువంటి నియమ నిబంధనలను పాటించక తప్పించుకోవడానికి ఇది ఒక సులభమైన మార్గం, పైగా వారు తమను తాము చాలా జ్ఞానులుగా, నిష్ఠాపరులుగా చూపించుకుంటారు. ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందాలని కోరుకునే వారికి ఇటువంటి వైఖరి హానికరం.
  • అలాంటి ఇష్టాలు మరియు అయిష్టాలు, “అహం” లో వివరించబడిన భగవానుడికి సముచితమైనవి అని తెలియకపోవడం ఒక అడ్డంకి. అనువాదకుల గమనిక: భగవత్గిత చరమ స్లోకంలో “అహం త్వా సర్వపాపేబ్యో మోక్షయిష్యామి” అని ప్రకటించినట్లుగా – ‘అహం’  అంటే “నేను” అని ధైర్యంగా భగవాన్ మాత్రమే ఘోషించగలడు. భగవాన్ మరియు భాగవతులపై ఆధారపడుటను వ్యక్తపరిచే “అడియేన్”, “దాసుడు” అని మనల్ని మనం ఎప్పుడూ సంభోదించుకోవాలి. అతను మాత్రమే అసలైన యజమాని కాబట్టి, అతనికి మాత్రమే ఇష్టాలు మరియు అయిష్టాలు ఉంటాయి. మన ఇష్టాయిష్టాలు అతన్ని అనుసరించాలి. ఉదాహరణకు, భగవాన్ జ్ఞానులను (బాగా జ్ఞానం ఉండి భగవాన్ పట్ల అంకితభావం ఉన్నవారు) ఇష్టపడతాడని భగవత్గితలో ఉపదేశించారు. శాస్త్రంలో ఉన్న తన సూచనలను ఖండించి, అధర్మాన్ని అనుసరించే వారిని అతను ఇష్టపడడు. మనం కూడా మన జీవితాలను ఆ ప్రకారంగా మలచుకొని, తద్వారా మనం అలాంటి జ్ఞానులకు సేవ చేస్తూ అధర్మ మార్గాన్ని అనుసరించకుండా ఉండాలి.
  • మనకు నిజమైన జ్ఞానాన్ని ప్రసాదించే శాశ్వతమైన యజమాని, మనకు మోక్షాన్ని కూడా ప్రసాదిస్తాడని విశ్వాసం లేకపోవడం ఒక అడ్డంకి. ఆశించేవారికి నిజమైన జ్ఞానాన్ని ఇచ్చేవాడు ఆచార్యుడు. భగవాన్ స్వయంగా ఆచార్యుడిగా వచ్చి మనల్ని తనలోకి చేర్చుకుంటాడు. కాబట్టి ఆయన అసలైన యజమాని, మోక్షాన్ని ప్రసాదించేవాడు. అనువాదకుల గమనిక: భగవానుడిని ‘ముకుంద’ అని పిలుస్తారు – మోక్షాన్ని ఇచ్చేవాడు. మోక్షం అంటే పరమపదంలో నిత్య కైంకార్యం చేయడం. అటువంటి విముక్తిని పొందడానికి, మొదట తన గురించి నిజమైన జ్ఞానం ఉండాలి. చిత్, అచిత్ మరియు భగవాన్ – తత్వ త్రయం గురించి జ్ఞానం ఉండాలి. అలాంటి జ్ఞానాన్ని ఆచార్యుని నుండి శిష్యుడు పొందుతాడు. నిజమైన జ్ఞానం లభించిన తర్వాత, సహజంగానే, బంధ ముక్తులయ్యి పరమపదంలో భగవానుడికి నిత్య సేవలు అందించాలని కోరుకుంటారు. ఈ సంసారం నుండి విముక్తి పొందడం మరియు పరమపదంలో నిత్య కైంకర్యం  పొందడం కేవలం భగవాన్ చేతనే అనుగ్రహింపబడుతుంది.

తరువాతి భాగం మనం వచ్చే సంచికలో కొనసాగిద్దాము.

అడియేన్ శ్రీదేవి రామానుజ దాసి

హిందీలో – http://ponnadi.blogspot.com/2014/11/virodhi-pariharangal-44.html

మూలము : https://srivaishnavagranthamstelugu.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

అంతిమోపాయ నిష్ఠ – 2

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః  శ్రీ వానాచల మహామునయే నమః

అంతిమోపాయ నిష్ఠ

ఇంతకు ముందు వ్యాసములో(https://srivaishnavagranthamstelugu.wordpress.com/2020/05/25/anthimopaya-nishtai-1/), మనము ఆచార్య వైభవము మరియు శిష్య లక్షణముల గురించి అనేక ప్రమాణములు చూసాము. 

ఆచార్య వైభవము గురించి మరికొన్ని విశేషములు – నిజమైన ఆచార్యుని ఆశ్రయము లభించుట మరువలేని అనుభవము. అనంతమైన చీకటి నుంచి, సరియైన ఆచార్యుని ఆశ్రయము నిజమైన వెలుగును వంటిది.

ఈ క్రింద వాటితో అర్థము చేసుకుందాము.

  • “పుణ్యామ్బోజ వికాసాయ పాపద్వాన్త క్షయాయ చ; శ్రీమాన్ ఆవిరబూత్బూమౌ రామానుజ దివాకరః” – ఏ విధముగా తామర పువ్వు భాస్కరుని దర్శించిననే వికసించునో, అట్లే మన సర్వ పాపములు, అజ్ఞానము దివ్యులైన రామానుజుల వారి పుణ్య ప్రదమైన దర్శన భాగ్యముచే తొలగిపోవును .
  • “ఆదిత్య రామ దివాకర అచ్యుత బానుక్కళుక్కు ప్పోగాత ఉళ్ళిరుళ్ నీన్గి, సోశియాత పిఱవిక్కడల్ వఱ్ఱి, వికసియాత పోతిల్ కమల మలర్ న్తతు వకుళ బూషణ బాస్కరోదయత్తిలే” – ఈ లౌకిక జగత్తు లోని అజ్ఞానము, తెలివిలేని తనములు శ్రీరామ , శ్రీకృష్ణ అవతారములతో తొలగింపబడలేదు. కాని, అవి నమ్మాళ్వార్ (వకుళాభరణన్) రాకతో తొలగించబడినవి.

ఈ విధముగా ఆచార్యుని యొక్క రూప దర్శనము వల్ల సంసారము/లౌకిక జగత్తులోని అనంతమైన అజ్ఞానము తొలగించబడునని చెప్పవచ్చు. భాగవతుని దయార్ద దృష్టి ఎవరిపై ప్రసరిస్తుందో, వారి లక్ష్యాన్ని చేరే అన్ని అడ్డంకులు / అవరోధాలు తొలగిపోతాయి. ఎంతటి పాపాత్ములైన వారైనా ఆచార్యుని ఆశ్రయము వల్ల అన్ని కర్మల నుంచి విముక్తి పొంది, పూర్తిగా పుణ్యాత్ములై, దివ్యమైన శ్రీమన్నారాయణుని పరమపద ప్రాప్తి పొందగలరు.

దీనిపై మరింత అవగాహన కొరకు ఈ క్రింది సూచికలు :

ఆర్తి ప్రబంధము – 45

నారాయణన్ తిరుమాల్ నారమ్ నామ్ ఎన్నుమ్ ముఱై
ఆరాయిల్ నెన్జే అనాది అన్ఱో – శీరారుమ్
ఆచారియనాలే అన్ఱో నామ్ ఉయ్ న్దదు ఎన్ఱు
కూచామల్ ఎప్పొళుదుమ్ కూఱు

ఓ మనసా ! జీవాత్మలైన మనకు పరమాత్మ అయిన శ్రీమన్నారాయణుని మధ్య ఉన్న బంధము శాశ్వతమైనది. దీనిని మన ఆచార్యుల దివ్య ఆదేశాలమేర మాత్రమే గుర్తించి జ్ఞానులమౌతాము. అందులకే మన ఆచార్యులపై భయమును వీడి సర్వదా కృతజ్ఞతా భావముతో ఉండవలెను .

శ్రీ వచన భూషణము – సూత్రము 408 మరియు 409

ఉన్ ణ్డపోతొరు వార్ త్తైయుమ్ ఉన్ ణ్నాపోతొరు వార్తైయుమ్ చొల్లువార్ పత్తుప్పేరున్ణ్ డిరే, అవర్గళ్ పాశురమ్ కొన్ ణ్డన్ఱు ఇవ్వర్ త్తమ్ అఱుతియిడువతు

భగవత్ అనుభవము పొందిన పది మంది ఆళ్వార్లు, ఆ సమయములో భాగవతులను కీర్తిస్తారు. కానీ ఆ అనుభవము లేనప్పుడు వారిని అవహేళన చేస్తారు  (ఆ అనుభవము నుంచి దూరమైనామనే అమిత విచారంతో). అట్టి ఆళ్వారుల మాటల ద్వారా  ఆచార్య వైభవమును నిరూపించలేము.

అవర్గళై చ్చిరిత్తిరుప్పార్ ఒరువరున్ ణ్డిఱే; అవర్ పాశురమ్ కొన్ ణ్డు ఇవ్వత్ త్తమ్ అఱుతియిడక్కడవోమ్

నమ్మాళ్వార్లను మాత్రమే సదా కీర్తించే మధురకవి ఆళ్వార్ ఇతర ఆళ్వార్లపై చిన్న చూపుతో వుంటారు . వారి మాటల ద్వారా  ఆచార్య వైభవమును నిరూపించవచ్చు  .

అనువాదకుని సూచన: ఎవరైతే నమ్మాళ్వార్లను భక్తితో అనుసరిస్తారో, వారికి తప్పక శ్రీవైకుంఠము (పరమపదము) ప్రాప్తమగునని మధురకవి ఆళ్వార్లు కణ్ణినుణ్ శిఱుతాంబు చివరి పాశురములో ప్రకటించారు .

నమ్మాళ్వార్ , మధురకవి ఆళ్వార్ , నాథమునిగళ్ కాంచీపురం

నమ్మాళ్వార్ , ఎమ్బెరుమానార్ – ఆళ్వార్ తిరునగరి

అనువాదకుని గమనిక: తదుపరి వివరణలో ఎమ్బెరుమానార్లపై నమ్మాళ్వార్ల పలుకులను వానికి సరియైన మధురకవి ఆళ్వార్ పలుకులతో పోల్చుతున్నారు. అట్టి పోలిక ద్వారా ఆచార్యుని ఉత్కృష్టత సాక్షాత్తు భగవానుని గొప్పదనము కన్నా అధికము అని అర్ధమగుచున్నది. ముద్రితమైన గ్రంథములో ఈ వివరణ సంపూర్ణముగా లేదని గుర్తించబడినది.

పరమాచార్యులైన నమ్మాళ్వార్ల పదాలు :

శ్రీ మధురకవి ఆళ్వార్ల పదాలు :

అప్పొళుతైక్కప్పొళుతు ఎన్ ఆరావముదమ్ – ప్రతి క్షణము  భగవానుడే నాకు దివ్య అమృత తుల్యుడు తెన్కురుకూర్ నమ్బి ఎన్ఱక్కాల్ అణ్ణిక్కుమ్ అముదూరుమ్ ఎన్నావుక్కే –  నమ్మాళ్వార్ల నామములు  నేను పలుకుటే,  నాకు అమృత తుల్యము
మలక్కు నావుడైయేన్ – ఎమ్బెరుమాన్ కీర్తిని వర్ణించి పాడుటయే నాకు అత్యంత రుచికరము. నావినాల్ నవిఱ్ఱు ఇన్బమెయ్తినేన్ – నమ్మాళ్వార్ కీర్తిని గురించి భాషించినప్పుడు, నేను చాలా ఆనంద పరవశుడనౌతాను .
అడిక్కీழ் అమర్ న్దు పుగున్తేన్ – తిరువేంకటముడయాన్ చరణ కమలముల వద్ద ఆశ్రయము పొందినాను. మేవినేన్ అవన్ పొన్నడి మెయ్ మ్మైయే – నమ్మాళ్వార్ యొక్క  సువర్ణ పాదపద్మములకు నిక్కముగా లొంగిపోయాను
కణ్ణనల్లాల్ దెయ్వమిల్లై – కణ్ణన్ ఎమ్పెరుమానార్ వంటి దైవము వేరొకరు లేరు దేవు మఱ్ఱఱియేన్ – నమ్మాళ్వార్ తప్ప వేరొక దైవమును నేను ఎరుగను 
పాడి ఇళైప్పిలమ్ – భగవంతుని దివ్య లీలా గానము నేను ఎన్నడూ వీడను పాడిత్తిరివనే – నేను సదా నమ్మాళ్వార్ కీర్తిని గానము చేస్తూ విహరిస్తూ వుండెదను
ఇన్ఙే తిరిన్తేర్క్కిళుక్కుఱ్ఱేన్ – ఈ జగత్తులో  భగవానుని ఆరాధించే ప్రజలకు ఈ జగత్తులోనే కలిగే నష్టము ఏమిటి? తిరితన్తాగిలుమ్ దేవ పిరానుడై క్కరియకోల తిరువురు కాణ్బన్ నాన్ – నిత్యసూరులకే నాయకుడైన ఆ భగవంతుని దివ్యరూపాన్ని ఈ జగత్తులో ఆరాధించుటను నేను వీక్షిస్తాను. ఆచార్యునిపై నిష్టాగరిష్ఠుడైన మధురకవి ఆళ్వార్లు కూడా ఎమ్పెరుమానార్ను ఆరాధిస్తారు, ఏలనన, వారి ఆచార్యులను ఆనందపరుచుటకై.
ఉరియ తొణ్డన్ – భగవంతుని దాసులలైన వారికి సరియైన దాసులు.  నమ్బిక్కాళురియన్ – నంబిక్కాళురియన్ – నమ్మాళ్వార్ల  యొక్క రియైన దాసులు (భగవంతుని సేవకులు).
తాయాయ్త్ తన్తైయాయ్ – భగవానుడే నా మాతా పితరులు (వారు నా యందు సంపూర్ణ వాత్సల్యము కలిగి యుండిరి.) అన్నైయాయ్ అత్తనాయ్ నమ్మాళ్వారే  నా మాతా పితరులు (వారు నా యందు సంపూర్ణ వాత్సల్యము కలిగి యుండిరి)
ఆళ్గిన్ఱాన్ ఆళియాన్ – దివ్యమైన చక్రమును ధరించిన భగవానుడే నన్ను నియంత్రించును ఎన్నైయాణ్డిడుమ్ తన్మైయాన్ – నన్ను నమ్మాళ్వార్ నియంత్రించును
కడియనాయ్ క్కంజనై క్కొన్ఱ పిరాన్ – కంసుని సంహరించి భగవానుడు నాకు చాలా సహాయము చేసెను. ఇచ్చట ఆళ్వార్ చూపించేదేమనగా, భగవానుడు ఇతర భాగవతులకు చేసిన ఉపకారములు తమకు చేసినవిగా భాగవతులు గమనించవలెను. శడగోపన్ – పుట్టుకతో మనను ఆవహించిన “శఠం ” అను అఙ్ఞానమును నమ్మాళ్వార్లు పారద్రోలినారు.
యానే ఎన్తనతే ఎన్ఱిరున్తేన్ –  నేను అహంకారము, కాముతో నిండి ఉన్నాను. నమ్బినేన్ పిఱర్ నన్ పొరుళ్ తన్నైయుమ్ నమ్బినేన్ మడవారైయుమ్ మున్బెలామ్) – ఆత్మ నాది అనే  భావనతో నేను  ఉన్నాను ( అది భగవంతుని సొత్తు అని అర్ధము చేసుకోవటానికి బదులుగా ) మరియు మగువలు నాకు ఆనందాన్ని ఇవ్వడానికే అని భావించాను .
ఎమరేళెళుపిఱప్పుమ్ మాసతిరిత్తుపెఱ్ఱు – భగవంతుని గొప్ప దీవెనలు నాకు ఆశీర్వచనముగా అనేక జన్మలుగా లభిస్తున్నాయి. ఇన్ఱు తొట్టుమ్ ఎళుమైయుమ్ ఎమ్పిరాన్ – ఇంక నా తదుపరి  జన్మలకు నమ్మాళ్వారులే నా దైవము.
ఎన్నాల్ తన్నై ఇన్తమిళ్ పాడియ ఈశన్ – నా పలుకుల ద్వారా భగవానుడు తన కీర్తిని చాటాడు. నిన్ఱు తన్ పుగళ్ ఏఱ్ఱ అరుళినాన్ – నమ్మాళ్వార్ల ఆశీర్వచనము లభించుటచే,  నేను వారి కీర్తిని చాటుతున్నాను.
ఒట్టుమో ఇని ఎన్నై నెగిక్కవే – నా నిష్ఠ నుండి వానుడు నన్ను క్రింద వేయునా (లేదు). ఎన్ఱుమెన్నై ఇగళ్ విలన్ కాణ్మినే –  నా నిష్ఠ నుంచి నమ్మాళ్వార్లు నన్ను ఎన్నడు పడవేయరు.
మయర్వఱ మదినలమ్ అరుళినన్ – భగవంతుని ఆశీర్వచనము వల్ల నాకు దోషరహితమైన దివ్య జ్ఞానము లభించినది ఎణ్డిశైయుం అఱియ ఇయమ్బుకేన్ ఒణ్తమిళ్ శఠగోపన్ అరుళైయే – నేను నమ్మాళ్వార్ యొక్క దివ్య క్షమా గుణమును అన్ని ప్రాంతాలకు ప్రచారము చేస్తాను (దోషరహితమైన జ్ఞానము వారి ఆశీర్వచనము వల్ల లభించుటచే)
అరుళుడైయవన్ – భగవానుడు దయా స్వరూపుడు అరుళ్కణ్డీర్ ఇవ్వులగినిల్ మిక్కతే – మొత్తము భౌతిక జగత్తు కంటే నమ్మాళ్వార్ యొక్క దయా గుణము గొప్పది
పేరేనెన్ఱు ఎన్ నెన్జు నిఱైయప్ పుగున్తాన్ – నా హృదయములో ప్రవేశించిన భగవానుడు నన్ను ఎన్నడూ వీడనని ప్రకటించారు నిఱ్కప్పాడి ఎన్నెన్జుళ్ నిఱుత్తినాన్ – శాస్త్ర సారాన్ని దృఢముగా విశదీకరించి నా హృదయమును సదా వారు  ఆక్రమించిరి  (భాగవత శేషత్వము- భాగవతులకు సేవనందించుట)
వళువిలా అడిమై శెయ్య వేణ్డుమ్ నామ్ – వివిధ మార్గాలద్వారా భగవంతునికి మనము లోపరహితమైన సేవలు అందించాలి ఆళ్ పుక్క కాదల్ అడిమై ప్పయనన్ఱే – సేవాపరత్వము ద్వారా ఉత్పన్నమైన ప్రేమ / బంధుత్వములు నమ్మాళ్వార్లపై శాశ్వత సేవాపరత్వమునకు దారి చూపును
పొరుళల్లాత ఎన్నై ప్పొరుళాక్కి అడిమై కొణ్డాయ్ – భగవానుడు నన్ను అజ్ఞానము నుంచి జ్ఞానము వైపు మరల్చి, తన సేవకై నియమించెను పయనన్ఱాగిలుం పాంగల్లరాగిలుం శెయల్ నన్ఱాగ త్తిరుత్తిప్పణి కొళ్వాన్ – దేనికి పనికిరాని నన్ను నమ్మాళ్వార్ శుద్ధిచేసి, ఆయన సేవకై నియమించెను
ఆరాత కాతల్ – భగవంతునిపై అంతులేని ప్రేమ కలదు ముయల్గిన్ఱేన్ ఉన్తన్ మొయ్కళ్ క్కన్బైయే – మీ పాద పద్మములపై ప్రేమ / బంధుత్వము పెంపొందించుటకే ప్రయత్నించుచున్నాను
కోలమలర్ ప్పావైక్కన్బాగియ ఎన్ అన్బేయో – నేను భగవంతునికి ప్రియతముడను. (భగవానుడు శ్రీమహాలక్ష్మికి ప్రియతముడు) తెన్కురుగూర్ నగర్ నమ్బిక్కు అన్బనాయ్ – ఆళ్వార్ తిరునగరిని నియంత్రించు నమ్మాళ్వార్లకు నేను ప్రియతముడను
ఉలగమ్ పడైత్తాన్ కవి – గొప్ప కవి మధురకవి – మధురమైన (తీయని) కవి
ఉరైక్కవల్లార్క్కు వైగున్తమాగుమ్ తమ్మూరెల్లామ్ – తిరువాయ్మొ ని ఎవరైతే పారాయణ చేస్తారో, ఆ స్థలము వైకుంఠము (పరమపదము) గా మారిపోవును. నమ్బువార్ పది వైగున్తమ్ కాణ్మినే – ఎవరైతే ఆచార్య నిష్ట కలిగి, నా మాటలను విశ్వసించి నడచుకొంటారో, వారు వైకుంఠము (పరమపదము) చేరుకుందురు.

అనువాదకుని గమనిక: ఈ క్రింది భాగములలో, ఆచార్యుని లక్షణములు, గొప్పదనము పిళ్ళై లోకాచార్యుని శ్రీ వచనభూషణము నుంచి గ్రహించి మణవాళ మాముణుల వ్యాఖ్యానము ద్వారా చక్కగా తెలియజేయబడినది.

పిళ్ళైలోకాచార్యులు, మణవాళ మామునిగళ్ – శ్రీ పెరుంబుదూరు
  • సూత్రము 308 – శిష్యుని శ్రేయస్సే దృష్టిగా ఆచార్యుని ద్వారా ఇవ్వబడిన సూచనల స్వభావమును, ఫలితమును, శిష్యులు అపార్థము చేసికొనరాదు. అట్టి అపార్ధము వల్ల ఆచార్యుని సంపూర్ణ విఫలము బహిర్గతమగును.
  • సూత్రము 309 – తనకు తాను అపార్థము చేసికొనుట అనగా ‘నేనే ఆచార్యుణ్ణి ‘ (తాను తన ఆచార్యుడి శిష్యుడు అని భావించాలి). శిష్యుణ్ణి అపార్థము చేసికొనుట అనగా ‘ఇతను నా శిష్యుడు‘ అని (ఈ శిష్యుడు తన ఆచార్యుని శిష్యుడు అని భావించాలి). ‘ఫలితమును’ అపార్థము చేసికొనుట అనగా అది భౌతికమని భావించుట, శిష్యుణ్ణి ఉద్ధరించుట, శిష్యుణ్ణి భాగవత కైంకర్యానికై వినియోగించుట, తన సంసారము సాగిస్తూనే సత్సంగము ఉండుట.
  • సూత్రము 310 – పైన తెలిపిన విధముగా ఆచార్యులు ఫలితమును పరిగణించకపోయినా సహజముగా అది జరుగును. శిష్యుని కోరికపై (ఆచార్యుని నిత్య అవసరములు తీర్చే విధముగా పని చేసేవారు). భగవంతుని ఆజ్ఞ మేరకు, శిష్యుడు ఉద్దరించ బడతాడు. ఆచార్యుని కోరికపై భగవత్ కైంకర్యము శిష్యుని ద్వారా ఈడేరును. శిష్యుని కృతజ్ఞతా భావము వల్ల సంసారములో వుంటూనే, నిత్యము అతను ఆచార్యుని తోడుగా వుండును.
  • సూత్రము 311 – నిజమైన ఫలితము (అనగా భగవానుని క్షేమము కాంక్షించుచు శిష్యుడు మంగళాశాసనము గావించుట) ఆచార్యుని నిర్హేతుక కృప వలననే సాధ్యము. ఆచార్యత్వం (ఆచార్యుని స్థితి) స్థాపింపబడుటపై దృష్టి సారించుటకై ఇతరులను మంగళ శాసనము చేయుటపై లక్ష్యమును నిలిపి,  భగవానుని కోరిక ద్వారా సాధించ వచ్చును.
  • సూత్రము 312 – ఆచార్య శిష్య సంబంధము పైన పేర్కొన్న నియమాలు పాటించకుంటే,  వారిరువురు ఆచార్య మరియు శిష్య అని పిలువబడుటకు అర్హత కోల్పోతారు.
  • సూత్రము 313 – తన శిష్యునిపై ఆచార్యునికి కరుణ ఉండాలి మరియు తన ఆచార్యునిపై పూర్తిగా ఆధారపడి ఉండాలి.
  • సూత్రము 314 – శిష్యుని నిజమైన స్వరూపము ఆచార్యుని కరుణ పొందుట ద్వారా తెలియబడును. తన యొక్క ఆచార్యునిపై పూర్తిగా ఆధారపడుటయే ఆచార్యుని నిజ స్వరూపమగును.
  • సూత్రము 315 – తిరుమంత్రమును (ద్వయము మరియు చరమ శ్లోకము) అర్ధ సహితముగా బోధించే వారే నిజమైన ఆచార్యులు.
  • సూత్రము 316 – ఇతరులు ఎవరైతే భగవానుని కీర్తించే మంత్రములను బోధిస్తూ, లౌకిక ప్రయోజనాలపై దృష్టి కేంద్రీకరిస్తారో,  వారు ఆచార్యులు కాజాలరు.
  • (అనువాదకుని సూచన: తదుపరి సూత్రముల ద్వారా తెలియజేయునది ఏమనగా, తిరుమంత్రము తప్ప ఇతర భగవత్ మంత్రములు సంపూర్ణము కావనియు మరియు భగవత్ కైంకర్యమే అంతిమ దీవెనగా దృష్టి సారించవు – ముముక్షుపడిలో ఈ విషయం స్పష్టముగా తెలియజేయబడినది కూడా)
  • సూత్రము 328 – ఆచార్యుని దృష్టి శిష్యుని ఉద్ధరించుటగా ఉండవలెను.
  • సూత్రము 333 – ఆచార్యులు శిష్యుని స్వరూపముని (ఆత్మను) పెంచుటపై శిక్షణ ఇచ్చెదరు.
  • సూత్రము 335 – శిష్యుని భౌతిక కోరికలు పెంచుట ఆచార్యుని ప్రవృత్తికి వ్యతిరేకం.
  • సూత్రము 337 – శిష్యుని భౌతిక అవసరములకు, అతని సంపదనే ఆచార్యులు వినియోగించెదరు.  (ఏలనన, శిష్యుడు తన సంపదనంతను ఆచార్యునికే చెందునని, దానిని ఆచార్యునికి  సమర్పించును)
  • సూత్రము 338 – ఆచార్యులు శిష్యుని సంపదను స్వీకరించరు (ఎప్పుడు శిష్యుడు తన సంపదను స్వయముగా / మనః స్ఫూర్తిగా ఆచార్యునికి సమర్పించరో మరియు ఆ సంపద తనదేనని భావిస్తారో, ఆచార్యులు ఆ సంపదను స్వీకరించరు)
  • సూత్రము 339 – పై సూత్రమున తెలిపినట్టు స్వీకరించినచో, అతనిని బిక్షకునిగా భావించవచ్చు.
  • సూత్రము 340 – నిజమైన ఆచార్యునికి అపారమైన ఆధ్యాత్మిక సంపద కలిగివుండుటచే, వారు ఇతర సంపదలను స్వీకరించరు.
  • సూత్రము 341 – దీని ద్వారా ఆచార్యుని ముఖ్య లక్షణమైన తృప్తి అనే ప్రవృత్తి గోచరము అగుచున్నది.
  • సూత్రము 427 – భగవంతుని శరణు వేడుకొనుట అనగా ఆయన హస్తములను పట్టుకొని సహాయమునకు అభ్యర్దించుట. ఆచార్యుని శరణు వేడుట అనగా భగవానుని పవిత్ర చరణములను ఆశ్రయించి, సహాయమునకై అభ్యర్థించుట (తదుపరిది ఉత్తమము).
  • సూత్రము 430 – స్వయముగా భగవానుడే ఆచార్యునిగా ఉండవలెనని ఇష్టపడును.
  • సూత్రము 431 – అందువలననే అయన పరమాచార్యునిగా (ప్రధమ ఆచార్యులు) మన గురుపరంపరలో వున్నారు, భగవద్గీతను బోధించారు మరియు విభీషణుని శరణాగతిని అంగీకరించారు.
  • సూత్రము 432 – ఆచార్యుని ఋణమును తీర్చుటకై, మనకు భగవానుని అవసరము కలదు మరియు మరియొక ఆధ్యాత్మిక / ఆది భౌతిక ప్రపంచము కూడా అవసరము (ఎలనన భగవానుడు మరియు ఆతని సంపద (రెండు విషయములు) ఆచార్యుని అధీనములో ఉండును మరియు ఆ విధముగా ఆచార్యులు మనను ఋణవిముక్తులుగా దీవించెదరు. అనగా, ఆచార్యులు మనకు చేసిన ఉపకారమును మనము ఎన్నటికీ చెల్లించ లేము.
  • సూత్రము 433 – భగవానునితో మన బాంధవ్యమునకు బంధం (ఈ సంసారములో అనేక జన్మల పుట్టుక) మరియు మోక్షము (పరమపద ప్రాప్తి) అను రెండు విషయములు కారణములు. కాని ఆచార్యునితో బాంధవ్యము మోక్షహేతువే అగును.
  • సూత్రము 437 – ఆచార్యునితో శిష్యుని బాంధవ్యమునకు అవరోధము (విడిపోయినచో) కలిగినచో, శిష్యుడు సంపూర్ణ జ్ఞానుడైనను, నిర్లిప్తుడైనను అది నిరూపయోగమే.
  • సూత్రము 438 – ఏ విధముగా ఒక పుణ్యస్త్రీ ( భర్త జీవించి ఉండగా) వివిధ ఆభరణములు ధరించునో, తన మాంగాళ్యము కోల్పోయినచో (భర్త మరణించిన పిదప), అవే ఆభరణములు ఆమెకు ఆందోళన కారకములగును.
  • సూత్రము 439 – ఆచార్యుని సంభంధము లేనిచో, భగవత్ సంభంధము ఉండదు.
  • సూత్రము 443 – వడక్కు తిరువీధి పిళ్ళై ఈ విధంగా వక్కాణించారు, “యే జీవాత్మ అయితే అన్నింటిని నేనే ఎల్ల వేళలలో నియంత్రిస్తున్నాను అనే భావనలో ఉంటాడో, అతను భగవానుని కృపను కోల్పాతాడు. వారికి ఆచార్యుని దయా గుణమే మోక్ష మార్గము అగును.
  • సూత్రము 447 – ఆచార్యుని దయా గుణము మాత్రమే శిష్యుని ఉద్దరించగలదు.
  • సూత్రము 460 – ఆచార్యుని అభిమానము కొరకు మనము ఈ క్రింది ప్రమాణములపై, ధ్యాస ఉంచుదాము.
    • నాచియార్ తిరుమొళి 10.10 – నల్లవెన్ తొళి – ఇందులో ఆండాళ్ పెరియాళ్వార్ యొక్క భగవానుడు కృష్ణుడని ప్రకటించారు, కృష్ణుడిని తీసుకొని వస్తే, ఆతనిని స్వీకరిస్తాను అని ఆండాళ్ తెలుపుతుంది.
    • నాన్ముగన్ తిరువందాది 18 – మాఱాయ దానవనై – ఇందులో తిరుమళిసై ఆళ్వార్ కీర్తిస్తూ ఎవరైతే నారసింహునికి సంపూర్ణ శరణాగతి చేస్తారో, అట్టి భక్తులకు మనము శరణాగతి చేస్తూ వారి దయను ఆశ్రయించాలి.
    • స్తోత్ర రత్నము – అకృత్రిమ చరణారవిందము – ఇందులో ఆళవందార్లు ఈ విధంగా ప్రకటించారు – తనకున్న జ్ఞానము / భక్తిని పరిగణించకుండా, ఎంబెరుమాన్ కి  అత్యంత ప్రియులు / సంబంధము కల నాథమునులతో తనకున్న బాంధవ్యయము వలన ఎంబెరుమాన్ తనను స్వీకరించగలరు.
    • పురాణ శ్లోకము – పసుర్ మనుష్య పక్షివా – ఒక జంతువు, మనిషి లేక పక్షి – జన్మముతో సంబంధము లేకుండా (శాస్త్రము యొక్క జ్ఞానము పొందుటకు అర్హులైనచో), వారు ఒక వైష్ణవుని సంబంధం ద్వారా సులువుగా పరమపదము పొందగలరు.
  • సూత్రము 461 – ఆచార్యుని దయ ప్రపత్తితో సమానము – ఏలనన అది స్వయం ఉపాయముగాను మరియు ఇతర ఉపాయములకు సహాయకారి గాను అగును.
  • సూత్రము 462 – భక్తి చేయలేని వారికి ప్రపత్తి వున్నది: ప్రపత్తి చేయలేనివారికి, ఆచార్యుని దయ కలదు.
  • సూత్రము 463 – ఆచార్యుని దయకు పాత్రులైనచో అది వారి నిజమైన స్వయం స్వరూపమును నిరూపించును. (అనగా మనము భాగవతుల సేవకులము అని); తదుపరి అది మనము  భగవానుని / భాగవతులను మాత్రమే అంగీకరించి, ఆశ్రయించుట యందలి నిజమైన అవగాహనను పెంపొందించును; చివరిగా అది మనము భగవానుని / భాగవతులకు  నిజమైన కైంకర్యము, సేవా చేయుటపై నియుక్తులను చేయును.

అనువాదకుని సూచన: పైన తెలియజేసిన భాగము శ్రీవచన భూషణ దివ్య శాస్త్రములోని కొన్ని సూత్రముల యొక్క అనువాదము. వీటిని సరియైన ఆచార్యుని ద్వారా బోధన పొంది, అర్ధములను లోతుగా గ్రహించ గలరని నివేదిస్తున్నాము.

పెరియవాచ్చాన్ పిళ్ళై ఈ విధముగా తెలియజేస్తున్నారు: ఓర్పుతో వుంటూ, లౌకిక లాభాలను ఆశించేవారు ఆచార్యులు కాజాలరు. కానీ శిష్యుల ఉన్నతి కోసము ఆదేశాలను ఇస్తూ వారిని నియంత్రించ గలిగిన వారు నిజమైన ఆచార్యులు. దీనికి విరుద్ధముగా తప్పుగా ప్రవర్తించు ఆచార్యులను వదిలి వేయవలెను.

అట్టి ఆచార్యులు అవసరంలేని / ప్రాపంచిక విషయాలను చర్చిస్తూ వుంటారు.

జీవాత్మను ఉద్ధరించుటపై ఆచార్యుని దృష్టి ఉండవలెను.

ఆచార్యులు తామే సంసార సాగరములో మునగరాదు – కాని వారికి భగవద్విషయముపై గల సంపూర్ణ జ్ఞానముచే సురక్షితులై (సరైయిన అనుష్టానము – శిక్షణ వలన) ఇతరులను కూడా రక్షించవలెను.

శిష్యునకు, ఆచార్యుని దివ్య స్వరూపముపై ధ్యాస వుండినచో చాలు – ఆచార్యుని నుంచి జ్ఞానము / అనుజ్ఞలు కూడా పొందవలసిన అవసరము లేదు.

ఏ విధముగా గరుడ మంత్రము ధ్యానిస్తే పాము కాటు విషము నుంచి విముక్తి కలుగునో, అటులనే ఆచార్యుని స్వరూపమును ధ్యానించుట వల్ల శిష్యునికి సంసారమనే విషము నుంచి విముక్తి లభించును.

బౌతిక సంపద, కామ వాంఛలుపై అనురక్తి లేనందు వల్ల ఆచార్యులు గౌరవప్రదులుగా వుంటారు, శిష్యునికి నిజమైన జ్ఞానమును పెంపొందించుతారు.

తదుపరి భాగములో శిష్యుని నిజమైన ప్రవృత్తి గురించి చర్చించబడును.

సశేషం….

అడియేన్ గోపీ కృష్ణమాచార్యులు బొమ్మకంటి రామానుజ దాసన్.

మూలము : http://ponnadi.blogspot.com/2013/06/anthimopaya-nishtai-2.html

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org