Monthly Archives: April 2022

అంతిమోపాయ నిష్ఠ – 7

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్ వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః

అంతిమోపాయ నిష్ఠ

మునుపటి వ్యాసములో (https://srivaishnavagranthamstelugu.wordpress.com/2022/04/09/anthimopaya-nishtai-6/) మనము మన పూర్వాచార్యుల జీవితములలో  ఆచార్య కైంకర్యము / అనుభవము, భగవత్ కైంకర్యము / అనుభవము కన్నా ఉత్కృష్ట మైనదని అనేక సంఘటనల ద్వారా గమనించాము. ఈ వ్యాసములో మన పూర్వాచార్యుల గురించిన మరిన్ని సంఘటనలను తెలుసుకొందాము

నంపిళ్ళై – తిరువళ్ళికేణి

మన జీయర్ (మణవాళ మాముణులు) ఈ క్రింది సంఘటనను పదే పదే తలంచుకుంటారు. ఒకసారి నంపిళ్ళై తమ శిష్యులతో కలసి తిరువెళ్లరైలోని నాచ్చియార్ కు మంగళాశాసనము చేయుటకై వెళ్లి, శ్రీరంగమునకు తిరుగు పయనమైరి. ఆ సమయములో కావేరి నది ఉద్తృతముగా ప్రవహించుచున్నది. నదిని దాటుటకై సరైయిన నావ లేదు. నదిని దాటుటకై వారు చిన్న తెప్పను ఎక్కిరి. సూర్యాస్తమైనది. చీకటి మొదలైనది పైగా వర్షము పడుతున్నది. తెప్పను అదుపు చేయుటకు ఆ నావికుడు ప్రయాసపడుతున్నాడు. తెప్ప మునగ నారంభించినది. వారితో అతను, మీలో కొందరు నదిలో దూకినచో, మనము క్షేమముగా ఆవలి ఒడ్డుకు చేరగలము, లేనిచో, నంపిళ్ళైతో సహా అందరము మునిగి పోగలము అనెను. క్రిందికి దూకినచో, మునిగి పోగలమని ఎవ్వరును దూకుటకు ఇష్టపడలేదు. కాని ఒక స్త్రీ మూర్తి (భాగవత నిష్ఠలో మునిగి వున్నది), తెప్పవాని ఉపాయమునకు అతనిని ఆశీర్వదించుతూ, “ఓ నావికుడా! నీవు చిరంజీవిగా ఉండు! ఈ జగత్తునకే ప్రాణాధారుడైన, నంపిళ్ళై ను ఆవలి తీరమునకు చేర్చుము.” అని పలికి, “నంపిళ్ళై దివ్య తిరువడిగలే శరణము” అని పలుకుచూ, ఆ చీకటిలోనే తెప్ప నుంచి దూకి వేసెను. తదుపరి, ఆ తెప్ప క్షేమముగా శ్రీరంగమునకు చేరెను. నంపిళ్ళై, ఆమె మరణమునకు మిక్కిలి విచారముతో నుండిరి. కాని, ఆమె దూకిన తరువాత, ఒక ద్వీపముపై పడెను. నంపిళ్ళై యొక్క దుఃఖమును ఆలకించిన ఆమె, “స్వామి, మీరు చింతించవలదు, నేను ఇంకను జీవించియే వున్నాను” అని అరిచినది. ఆమెను రక్షించుటకై, నంపిళ్ళై తెప్పను పంపిరి. ఆమె సురక్షితముగా చేరి, నంపిళ్ళై పాద పద్మములకు ప్రణమిల్లెను. ఆమె పరిపూర్ణమైన ఆచార్య నిష్ఠలో నిమగ్నమై ఉండి, నంపిళ్ళైతో “నేను మునుగునప్పుడు, మీరు నన్ను రక్షించుటకై ద్వీపముగా మారినారు కదా!” అని పలికెను. అప్పుడు నంపిళ్ళై “మీ నమ్మకము అదే అయినచో, అదే అగును” అనిరి.

ఒకసారి, ఒక వైష్ణవ రాజు శ్రీవైష్ణవుల పెద్ద సమూహాన్ని గమనించి, “వీరందరూ నంపెరుమాళ్ళ దర్శనము చేసుకొని వచ్చుచున్నారా? లేదా నంపిళ్ళై ప్రవచనమును శ్రవణము చేసి వచ్చుచున్నారా?” అని అడిగిరి. అంతటి గొప్ప శ్రీవైష్ణవశ్రీ (దైవీసంపద) కలిగినవారు నంపిళ్ళై. వారి శిష్యురాలైన ఒక స్త్రీ, వారి తిరుమాళిగై (నివాసము) ప్రక్కన ఒక గృహమును తీసుకొనిరి. ఒక శ్రీవైష్ణవుడు (నంపిళ్ళై కాలక్షేప గోష్టిలో వారి శిష్యుడు మరియు ఆమెకు సహవిద్యార్థి అయినవారు) ఆ గృహములోనే అద్దెకు వున్నారు. అతను, ఆమెతో “నంపిళ్ళై వున్న ఇల్లు కొంచెము చిన్నది. కావున నీ ఇంటిని వారికి సమర్పించినచో, మన ఆచార్యునకు ఎంతో బాగుండును” అని అనేక మార్లు సూచన చేసిరి. దానికి ఆమె “శ్రీరంగములో ఇంత మంచి గృహము లభించుట కష్టము. నా కడవరకు ఈ గృహమును నేనే ఉంచుకొనెదను” అనెను. ఈ విషయమును ఆ శ్రీవైష్ణవుడు నంపిళ్ళై కి తెలిపిరి. నంపిళ్ళై ఆమెతో “నీవు నివసించుటకు ఒక మంచి వసతి మాత్రమే అవసరము. నీ గృహమును మాకు ఒసంగినచో  శ్రీవైష్ణవులు అందరూ సౌకర్యముగా ఇందులో ఉండగలరు” అనిరి. ఆమె “సరే, అటులనే ఇవ్వగలను. కాని నాకు మీరు పరమపదములో స్థానము ఇవ్వవలెను” అనెను. నంపిళ్ళై “సరే” అనిరి. ఆమె “నేను చాలా సున్నితమైన మనస్సు కల స్త్రీని. మీరు మాట ఇచ్చిన మాత్రమే విశ్వసించను. నాకు లిఖిత పూర్వకముగా కూడా ఇవ్వవలసినది” అని కోరెను. ఆమె ఆచార్య నిష్ఠకు మిక్కిలి సంతసించిన నంపిళ్ళై ఒక తాటి పత్రముపై ఈ విధముగా హామీ వ్రాసిరి “ఈ సంవత్సరము / ఈ మాసము / ఈ దినమున, తిరుక్కళికన్ఱి దాసన్ ఈమెకు పరమపదములో స్థానమును కల్పించుచున్నాను. శ్రీవైకుంఠ నాథుడు దయతో ఈ హామిని తీర్చగలరు”. ఆ పత్రమును ఆమె అంగీకరించి, ఆనందముగా తీర్థ ప్రసాదములను స్వీకరించెను. తదుపరి కొన్నిదినములు ఆమె నంపిళ్ళైని పూజించుచూ, పరమాపద ప్రాప్తిని పొందెను. ఆ విధముగా మన ఇళ్ల్యార్ “నిత్య విభూతి (పరమపదము – ఆధ్యాత్మిక జగత్తు) మరియు లీలా విభూతి (సంసారము – భౌతిక జగత్తు) అని రెండును ఆచార్యుని యొక్క అధీనములో వున్నాయి అని పలికిరి.

కూరత్తాళ్వాన్ మనుమడైన నడువిల్ తిరువీధి పిళ్ళై భట్టర్ కు నంపిళ్ళై యొక్క జ్ఞాన భక్తి వైరాగ్యములు, అనేక శిష్యులు, భాగవతులు వున్న గోష్టి, సర్వులకు ఆమోదయోగ్యులగుట మొదలగునవి స్వీకృతి కాలేదు. నంపిళ్ళ తో వారు ఎల్లప్పుడూ కఠినముగా ఉండేవారు. ఒకసారి వారు రాజ సభకు వెళ్లుచూ పిన్భళగియ పెరుమాళ్ జీయర్ ను దారిలో కలిసిరి. వారిని తమతో రాజసభకు విచ్చేయమనగా వారు సరే అనిరి. వారు రాజ భవనమునకు చేరగానే, రాజు వారిని ఆహ్వానించి, వారికి ఆ పెద్ద సభలో ఉచిత స్థానమును కల్పించిరి. వివేకవంతుడు మరియు శాస్త్రమునందు మంచి జ్ఞానము కల ఆ రాజు, భట్టరు వారిని పరీక్షించదలచి “భట్టరు!  శ్రీరాముడు తను దశరధ తనయుడను మరియు మానవమాత్రుడను అని (పరత్వము – ఉత్కృష్టత్త్వమును మరుగు పరచి) ప్రకటించుకొనిరి కదా! మరి వారు జటాయువునకు మోక్షమును ఎట్లు ఇచ్చిరి?” అని ప్రశ్నించిరి. సరైయిన జవాబునకు భట్టరు వారు యోచిస్తుండగా, రాజు తన పరిపాలన పరమైన కార్యములలో నిమగ్నమైరి. భట్టరు, జీయర్ తో “మన తిరుక్కళ్లి కన్ఱి దాసర్, పెరుమాళ్ (శ్రీరాముడు) జటాయువుకు మోక్షమును ఇచ్చుటను ఏ విధముగా సమర్థించిరి?” అని అడిగిరి. ఇళ్యార్ సమాధానముగా “నంపిళ్ళై ‘సత్యేన లోకం జయతి’ (సత్యవంతుడు అన్ని లోకములను జయించును) అనే సూత్రము ద్వారా సమర్థించిరి” అనిరి. భట్టరు ఇదియే తగు సమాధానము అని భావించిరి. తదుపరి, రాజు తిరిగి వచ్చి, “భట్టరు! మీరు ఇంకను సమాధానము ఇవ్వలేదే?” అనిరి. భట్టరు, “మీరు ఇతర విషయములలో మునిగినారు. నేను ఇచ్చు వివరణపై దృష్టి నిలుపుము.” అనిరి. రాజు అంగీకరించిరి. భట్టరు, రామాయణములోని పై శ్లోకమును తెలిపి, “సత్యవంతుడైన వ్యక్తి అన్ని లోకములను శాసించగలడు మరియు సత్యసంధతకు మారుపేరైన శ్రీరాముడు జటాయువునకు పరమపదమును ప్రసాదించగల సమర్ధుడు” అనిరి. రాజు ఈ వివరణను ఆలకించి, అచ్చెరువు పొంది “మీకు అన్నీ తెలుసునని అంగీకరించుచున్నాను” అని, భట్టరునకు  అనేక ప్రశంసలు, మర్యాదలు చేసి, విలువైన వస్త్రములను, ఆభరణములను, సంపదను ఒసంగిరి. రాజు భట్టరునకు ప్రణమిల్లి, గొప్ప వీడ్కోలునిచ్చారు. భట్టరు ఆ సంపదలను గైకొని ఇళ్యార్ తో “దయతో నన్ను నంపిళ్ళై దగ్గరకు చేర్చుము. నన్ను నేను వారికి సమర్పించుకొనవలెను, మరియు ఈ సంపదను వారి పాదపద్మములకు సమర్పించవలెను” అనిరి. జీయర్ వారిని నంపిళ్ళై వద్దకు చేర్చిరి. నంపిళ్ళై, నడువిల్ తిరువీధి పిళ్ళై భట్టర్ ను చూసి వారు పరమాచార్య వంశస్థులు (ఆచార్యుని యొక్క ఆచార్యులు పరాశర భట్టర్) అగుటచే, వారిని ఆనందముగా ఆహ్వానించిరి. తమ ముందు ఉంచిన సంపదను చూసి “ఇది ఏమిటి ” అని అడిగిరి. భట్టరు జవాబుగా “మీ యొక్క వేలాదివేల దైవ సంబంధమైన భాష్యములలోని, కొన్ని పలుకులకే ఇవి బహుమానము – కావున ఈ సంపదతో పాటు నన్ను మీ శిష్యునిగా స్వీకరించవలెను” అనిరి. నంపిళ్ళై ఇది సరి కాదు, మీరు ఆళ్వాన్ యొక్క మనుమలు (అంతటి గొప్ప వంశము నుంచి వచ్చినవారు), నన్ను ఆచార్యునిగా అంగీకరించరాదు అనిరి. నంపిళ్ళై పాదపద్మములపై ప్రణమిల్లి, భట్టరు ధుఃఖిస్తూ, “నిత్య సంసారి యైన ఆ రాజు మీ యొక్క కొన్ని ఆధ్యాత్మిక మాటలు విన్నంతనే ఇంత సంపదను ఒసగినారు. ఆ విధముగా అయినచో, ఆళ్వాన్ యొక్క వంశము నుంచి వచ్చిన నేను, మీకు ఎంత సంపదను సమర్పించవలెనో కదా? మిమ్ములను చాలా కాలము నుంచి నేను పట్టించు కొనకపోవడమే కాక, మీ ప్రక్క వాకిలిలోనే వున్నను, మీ పై అసూయతో వున్నాను. కావున కృతజ్ఞతగా నన్ను నేను మీకు అర్పించుకొనుట తప్ప మరేమి చేయలేను. నన్ను దయతో అంగీకరింపుము” అని వేడుకొనిరి. నంపిళ్ళై భట్టరును లేవదీసి, మిక్కిలి ప్రేమతో ఆలింగనము గావించి, ఆశీర్వదించిరి. తదుపరి, అన్ని విషయములను వారికి బోధించిరి. భట్టరు మిక్కిలి కృతఙ్ఞతతో, పూర్తి కాలము నంపిళ్ళై తో కలిసి పరమానందముగా జీవించిరి.

నంపిళ్ళై కాలక్షేప గోష్టి

తదుపరి, నంపిళ్ళై మొత్తము తిరువాయ్మొళిని భట్టరునకు వివరముగా బోధించిరి. భట్టరు శ్రద్ధగా ఆలకించి, దానిని తాళ పత్రములపై లిఖించి, వానిని నంపిళ్ళై పాదపద్మములకు సమర్పించిరి. నంపిళ్ళై “ఇది ఏమిటి? ” అని అడిగిరి. భట్టరు, “ఇది మీరు బోధించిన తిరువాయ్మొ అర్ధ సహితముగా” అనిరి. నంపిళ్ళై ఆ మూటను విప్పి చూడగా, అది మహాభారతము కన్నా అనేక రెట్లు పెద్దదిగాను – 125000 గ్రంధములుగా గమనించిరి. వారు మిక్కిలి వ్యధ చెంది, భట్టరుతో “నా అనుమతి లేకయే దీనిని వ్రాసితివి మరియు దీనిలోని అన్ని గూడార్ధములను వివరముగా వ్రాసినావు” అనిరి. భట్టరు “అంతయును మీరు వివరించిన విధముగానే వ్రాసితిని – నా స్వంత కవిత్వమును వ్రాయలేదు – మీరే గమనించుడు” అని సమాధానమిచ్చిరి. నంపిళ్ళై “నీవు తిరువాయ్మొళి గురించి నేను చెప్పినదే వ్రాసి ఉండవచ్చు. కాని, నా ఆలోచన ఏమో, నీవు ఎలా వ్రాయగలవు? ఉడయవర్ల కాలములో వారి యొక్క ఆశీర్వచనములు మరియు అనుమతితో పిళ్లన్ చాలా శ్రమతో 6000 పడి వ్రాసిరి. కాని నీవు నా అనుమతి లేకయే 125000 పడి వ్యాఖ్యానమును చాలా విపులముగా వ్రాసినావు. దాని వలన శిష్యులు ఆచార్యుల పాదపద్మములను ఆశ్రయించి నేర్చుకొనుటకు అవరోధము కలుగును” అనిరి. తదుపరి వారు ఆ తాటి పత్రములపై జలమును పోసి, చెద పురుగులకు ఆహారముగా వేసి, వానిని నశింపజేసిరి.

తదుపరి, తన ప్రియ శిష్యుడు మరియు అన్ని విషయములను తన వద్దనే అభ్యసించిన పెరియ వాచ్చన్ పిళ్ళై ను తిరువాయ్మొళికి వ్యాఖ్యానమును వ్రాయమని ఆదేశించిరి. వారు 24000 పడిగా, శ్రీరామాయణము అంతగా వ్రాసిరి. ఆ తరువాత, నంపిళ్ళై యొక్క మరొక నమ్మకస్తుడైన శిష్యుడు వడక్కు తిరువీధి పిళ్ళై, నంపిళ్ళై యొక్క ఉదయపు కాలక్షేపములో తిరువాయ్మొళిని ఆలకించి, వ్యాఖ్యానమును ఆ రాత్రియే వ్రాసిరి. ఆ వ్యాఖ్యానమును నంపిళ్ళై పాదపద్మములకు సమర్పించిరి. “ఇది ఏమిటి? ” అని నంపిళ్ళై అడుగగా, “మీరు సాయించిన తిరువాయ్మొళిని ఆలకించి, వ్రాసిన వ్యాఖ్యానము “అని వడక్కు తిరువీధి పిళ్ళై సమాధానమిడిరి. ఆ వ్యాఖ్యానమును చదివిన నంపిళ్ళై, అది మరీ విపులముగా గాని మరీ స్వల్పముగా గాని లేదు మరియు శృత ప్రకాశిక (శ్రీ భాష్యమునకు వ్యాఖ్యానము) 36000 పడి వలె అద్భుతముగా వ్రాయబడినదిగా గమనించిరి. నంపిళ్ళై అమిత సంతోషముతో “మీరు దీనిని అద్భుతముగా వ్రాసిరి: కాని దీనిని నా అనుమతి లేకయే వ్రాసిరి. కావున, దీనిని నాకు ఇవ్వగలరు” అని పలికి, ఆ వ్యాఖ్యానమును తన వద్దనే ఉంచుకొనిరి. తదుపరి ఆ వ్యాఖ్యానమును తమ ప్రియ శిష్యుడైన ఈయుణ్ణి మాధవ పెరుమాళ్ కు అందజేసిరి. ఈ సంఘటనను మన ఇళ్యార్ ఉపదేశరత్తినమాలై 48 వ పాశురములో వివరించిరి.

శీరార్ వడక్కుత్ తిరువీధి ప్పిళ్ళై
ఎళుతేరార్ తమిళ్ వేదత్తు ఈడు తనైత్
తారుమ్ ఎన వాంగ్కి మున్ నమ్పిళ్ళై
ఈయుణ్ణి మాదవర్క్కుత్ తామ్ కొడుత్తార్ పిన్ అదనైత్ తాన్

సాధారణ అనువాదము: పవిత్ర లక్షణములతో నిండిన వడక్కు తిరువీధి పిళ్ళై 36000 పడిని నంపిళ్ళై నుంచి గ్రహించిన ప్రకారము వ్యాఖ్యాన సహితముగా రచించిరి. ఆ రచనను వారి నుంచి నంపిళ్ళై తీసుకొని ఈయుణ్ణి మాధవ పెరుమాళ్ కు ఇచ్చిరి.

ఇంకను, తిరువాయ్మొళిపై అన్ని వ్యాఖ్యానములను మరియు వాని ఉత్కృష్టతను మాముణులు స్పష్టముగా గుర్తించిరి.

ఆ విధముగా, నంపిళ్ళై ఈ లోకమున అవతరించి మరియు అనేక జీవాత్మలను చాలా కాలము వరకు ఉజ్జీవింప జేసి, చివరగా పరమపదమునకు పయనమైరి. చరమ కైంకర్యములలో భాగముగా వారి శిష్యులందరూ శిరోముండనము గావించుకొనిరి. నడువిల్ తిరువీధి భట్టరు యొక్క సోదరుడు వారితో “ఈ విధముగా చేయుట మన కూర కులము (ఆళ్వాన్ యొక్క వంశ పారంపర్యము) నకు అవమానము కదా! తిరుక్కళ్లి కన్ఱి దాసర్ పరమపదమునకు వెళ్లినందులకు మీరందరు శిరోముండనము చేసికొనుట ఏమి?” అని ప్రశ్నించిరి. భట్టరు “ఓహ్! నేను మీ వంశమునకు అవమానము చేసినానే” అనిరి. వారి సోదరుడు “మీరు అవహేళన చేస్తున్నారే?” అనిరి. భట్టరు “నంపిళ్ళై పరమపదమునకు పయనమైనప్పుడు, వారి పాదపద్మములనే నేను ఆశ్రయించి నందు వలనను, నేను కూర కులమున జన్మించినందు వలనను, ఆళ్వాన్ యొక్క శేషత్వము (ఆచార్యునికే నిరంతర సేవ చేయుట) అను వారి ఉత్తమ లక్షణముచే, నేను నా ముఖమును మరియు శరీరమును కూడా సేవకుల వలె ముండనము చేయవలెను. కాని శిష్యుల వలె శిరోముండనము మాత్రమే గావించుట, నాకు అవమానకరము, ఏలనన, ఆళ్వాన్ యొక్క సేవాపరత్వము అను గుణమును విస్మరించినందులకు” అనిరి. అప్పుడు వారి సోదరుడు భట్టరుతో “ఇప్పుడు మీ తిరుక్కళ్ళికన్ఱి దాసర్ మీకు దూరమైనారు కదా, మీరు ఇంకా ఎంత కాలము వారిపై కృతఙ్ఞతతో ఉందురు” అని అడిగిరి. భట్టరు “ఈ ఆత్మ నశించేంత వరకు, నంపిళ్ళై పైన సదా కృతజ్ఞతతో ఉండగలను” అనిరి. వారి సోదరుడు పై మాటల భావమును అర్ధము చేసికొనిరి, వారు కూడా పండితులు మరియు ఉత్తమ వంశములో జన్మించినందు వలన. మన ఇళ్యార్ “తరువాత వారు తమను తాము పూర్తిగా భట్టరునకు సమర్పించుకొని, వారి నుంచి అన్ని ముఖ్య సూత్రములను అభ్యసించిరి” అని తెలిపిరి.

కొందరు శ్రీవైష్ణవులు ఇతరులతో “శ్రీభాష్యము ఎలా ఉండును?” అని అడుగగా, వారు “నడువిల్ తిరువీధి (శ్రీరంగములోని వీధులలోని మధ్య వీధి) లో సుందరమైన వేష్టి (పంచ) మరియు ఉత్తరీయమును ధరించిన కూరత్తాళ్వన్ అను వ్యక్తి వుంటారు. ఆ వీధికి మీరు వెళ్లినచో, శ్రీభాష్యము నడిచి వెళ్ళుట  మీరు చూడగలరు.” అని అనిరి. కొందరు శ్రీవైష్ణవులు “మేము భగవద్విషయమును ఎచ్చట శ్రవణము చేయగలము?” అని అడిగిరి. సమాధానముగా “నడువిల్ తిరువీధిలో భట్టరు నామముగల తీయని పండిన ఫలాలున్న ఒక వృక్షము వున్నది. అచ్చటకు వెళ్లి, ఆ వృక్షముపై రాళ్ళను విసరకుండా, దాని క్రింద నిలబడి వున్నచో, భగవద్విషయము అనే పండ్లు స్వాభావికముగా మీ పై రాలగలవు”.

పరాశర భట్టరు అతి పిన్న వయసులో, వీధిలో ఆడుకొనుచుండగా, “సర్వ జ్ఞాన్” అను విద్వాంసుడు మిక్కిలి ఆడంబరముగా పల్లకిలో వచ్చారు. భట్టరు వారిని ఆపి “మీకు అన్ని విషయములు తెలుసునా?” అని అడిగిరి.  వారు “అవును, నాకు అన్ని విషయములు తెలియును” అనిరి. భట్టరు, భూమిపై నుంచి ఒక గుప్పెడు ఇసుకను తీసి, “ఇది ఎంత?” అని అడిగిరి. దానికి సమాధానము నకు మాటలు లేక, అతను అవమానముతో తల దించుకొన్నారు. భట్టరు వారితో “మీ వద్దనున్న అన్ని బిరుదులు మరియు పతకములు వదిలి వేయుము” అనిరి. వారు అంగీకరించి, ఓటమిని ఒప్పుకున్నారు. పిమ్మట భట్టరు “మీరు ఇది ‘గుప్పెడంత’ ఇసుక అని జవాబునిచ్చి మీ బిరుదులు మరియు పతకములు కాపాడు కొని వుండవచ్చు. ఇప్పుడు మీరు అన్ని కోల్పోయారు – మీరు ఇక వెళ్ళవచ్చును” అని వారిని పక్కకు తోసివేసిరి.

పాషండి (మాయావాద) వేత్తలు, ఒక వైష్ణవ రాజు వద్దకు వెళ్లి, శంఖ / చక్రాంకిత లక్షణమునకు (పంచ సంస్కారములో భాగముగా వేడి చేసి శంఖ, చక్ర ముద్రలను భుజములపై ముద్రించుట) ఋజువు లేదు అని ప్రకటించిరి. ఆ రాజు మిక్కిలి వివేకుడు, భట్టరును ఆహ్వానించి “శంఖ / చక్ర లక్షణమునకు ఋజువు కలదా?” అని అడిగిరి. భట్టరు “అవును, ఖచ్చితముగా కలదు” అనిరి. రాజు “నాకు ఋజువును చూపగలరా? అని అడిగిరి. భట్టరు తన సుందరమైన భుజములను చూపి, “ఇదిగో, నా రెండు భుజములపై వున్నాయి” అనిరి. రాజు మిక్కిలి ఆనందముతో దానిని అంగీకరించి” అన్ని విషయములు తెలిసిన భట్టరుకు ఈ శంఖ / చక్ర లక్షణములు వున్నాయి కదా, ఇంతకన్నా ఏమి ఋజువు కావలెను” అని ఆ పాశండులను తరిమి వేసిరి.

పై సంఘటనలు మన పెద్దలు వివరించిరి. ఈ విధముగా శృతి వాక్యములు ( ఖ / చక్ర లక్షణములకు సంభందించినవి) మరియు ఈ క్రింది రెండు పాశురములు / శ్లోకములు, భట్టరు వ్రాయగా, మిక్కిలి ఆదరణ పొందినవి.

మట్టవిళుంపొళిల్ కూరత్తిల్ వందుతిత్తు
ఇవ్వైయమెల్లామ్ ఎట్టుమిరణ్డుమ్ అఱివిత్త ఎమ్పెరుమాన్
ఇలన్గు చిత్తర్ తొళుం తెన్నరంగేశర్ తమ్ కైయిల్ ఆళియై
నానెట్టన నిన్ఱ మొళి ఏళుపారుమ్

సాధారణ అనువాదము: ఆళ్వాన్ చే ఆరాధింపబడిన, శ్రీరంగనాథుని యొక్క శంఖము (మరియు చక్రము) ముద్రలు నాకు వున్నవి. ఆళ్వాన్ కూరమ్ లో దర్శనమిచ్చి, తిరుమంత్రము మరియు ద్వయమునకు అర్ధములను వివరించిరి. అదియే లోకమంతయు అంగీకరించి మరియు అనుసరించినదనుటకు ఋజువు కదా.

విధానతో దధానః
స్వయమేనామభి తప్తచక్రముద్రామ్
బుజయేవమమైవ భూసురాణామ్
భగవల్లాఞ్చన ధారణే ప్రమాణమ్

సాధారణ అనువాదము:  ఈ శంఖ / చక్రములు  నా భుజములపై వుండుట అను యధార్ధమే సరైయిన ఋజువు కదా, శ్రీవైష్ణవులు దానిని అంగీకరించి అనుసరించుటకు.

పై సంఘటనల ద్వారా, మన పూర్వాచార్యులు అందరు ఆచార్యుల అనుగ్రహము అను నీడను ఆశ్రయించారు అని అవగతమౌచున్నది మరియు అజ్ఞాని లేక జ్ఞాని అయినా వారు ఉద్ధరింప బడుటకు ఆచార్యులే ఆధారము.

సశేషం……

అడియేన్ గోపీ కృష్ణమాచార్యులు బొమ్మకంటి రామానుజ దాసన్.

మూలము: http://ponnadi.blogspot.com/2013/06/anthimopaya-nishtai-7.html

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

అంతిమోపాయ నిష్ఠ – 6

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్ వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః

అంతిమోపాయ నిష్ఠ

మునుపటి వ్యాసములో (https://srivaishnavagranthamstelugu.wordpress.com/2021/09/21/anthimopaya-nishtai-5/ ) మనము భట్టరు, నంజీయర్ మరియు నంపిళ్ళై ల యొక్క దివ్య లీలలను గమనించాము. ఈ వ్యాసములో మన పూర్వాచార్యుల గురించిన మరిన్ని సంఘటనలను తెలుసుకొందాము.

ఒక ఉత్సవము గురించి తిరుకోష్ఠియూర్ నంబి శ్రీ రంగమునకు వచ్చి, ఉత్సవమంతా అచ్చటనే ఉండి ఎంపెరుమానార్, నంబి సేవలో వున్నారు. నంబి తిరిగి వెడలుచున్నప్పుడు, ఎంపెరుమానార్ వారితో “దయతో నాకు కొన్ని మంచి ఆదేశాలు కృప చేయుము, వానిని శరణు చేయుదును” అని వేడుకొనిరి. నంబి కొంత సమయము కన్నులు మూసికొని, తరువాత “మేము ఆళవందార్ వద్ద శిక్షణ పొందుతున్నాము. ఆ సమయములో, వారు నదీ స్నానము చేయుచు, శిరస్సును క్రిందకు నీటిలో ముంచి వుండగా, వారి శరీరపు వెనుక భాగము మెరయుచున్న అందమైన రాగి పాత్ర వలె కనిపించును. అట్టి దివ్య అనుభూతిని శరణు చేసెదము. ఆ విధముగానే మీరు శరణాగతి పొందవచ్చును” అని పలికిరి. ఈ సంఘటన బహు ప్రాచుర్యము పొందినది.
(అనువాదకుని గమనిక: ఈ సంఘటనే గురుపరంపర ప్రాభవము లోని 6000 పడిలో వివరించారు. ఈ సంఘటన ద్వారా శిష్యుని దృష్టి ఆచార్యుని దివ్య స్వరూపముపై నిలుపవలెనని తెలియుచున్నది).
తిరుకోష్టియూర్ కోవెల ప్రధాన గోపురము పైఅంతస్తున నంబి వుంటూ, ఆళవందార్ ను ప్రార్ధిస్తూ, సదా “యామునైతువర్” (యామూనాచార్యులు) అను మంత్రాన్ని వల్లిస్తూ ఉంటారని చెబుతూ వుంటారు.

మన జీయర్ ఈ క్రింది సంఘటనను వివరిస్తున్నారు.

ఉడయవర్లు ఒకసారి, ఒక మూగ వానిని అపారమైన కరుణచే కటాక్షించుటకై, తన గదికి గొనిపోయి, తన దివ్య రూపము మరియు పాద పద్మములే ఆ మూగ వానికి శరణు అని సైగల ద్వారా చూపారు. ఆ మూగ వాడు పారవశ్యముతో, ఉడయవర్ల పాదముల ముందు మ్రోకరిల్లాడు. ఆ మూగవాని శిరస్సుపై ఉడయవర్లు తమ పాదములను నుంచి దీవించిరి. ఇది గమనించిన కూరత్తాళ్వాన్, “ఓహ్, నేను కూడా మూగవానిగా జన్మించిన, నాకు కూడా ఇట్లే మార్గ దర్శనము చూపించేవారు కదా (ఇది ఎంపెరుమానార్ల దివ్య స్వరూపమును శరణాగతి చేయుటయే). కాని నేను ఆళ్వాన్ గా జన్మించి శాస్త్రములను అభ్యసించాను. అందువల్ల, ఉడయవర్లు నాకు ప్రపత్తి మార్గమును అనుగ్రహించారు. కావున నేను ఎంపెరుమానార్ల దివ్య స్వరూపమును ఆశ్రయించుటకు అనర్హుడనయ్యాను.” అని తలంచి, తనపై తానే కలతనొందిరి.

ఒకసారి నమ్మాళ్వార్లకు మంగళశాసనము చేయ తలంచి ఉడయవర్లు, ఆళ్వార్ తిరునగరికి పయనమైరి. మార్గములో వారు తిరుపుళ్లింగుడి అనే దివ్యదేశము చేరిరి. అచ్చట వీధిలో కనబడిన ఒక చిన్నారి బ్రాహ్మణ బాలికతో, “ఓ చిన్నారి, ఇచ్చట నుండి ఆళ్వార్ తిరునగరి ఎంత దూరము?” అని అడుగగా, ఆ బాలిక “ఓ జ్ఞానమూర్తి! మీరు తిరువాయ్మొళిని అభ్యసించలేదా?” అని సమాధానమిచ్చెను. ఉడయవర్లు ఆశ్చర్యచకితుడై, “తిరువాయ్మొళిని అభ్యసించుటకు, ఇచ్చట నుండి ఆళ్వార్ తిరునగరికి దూరము తెలిసికొనుటకు ఏమిటి సంబంధము? ” అని అడిగిరి. దానికి ఆ బాలిక ఈ విధముగా సమాధానమిడెను, “ఆళ్వార్ అనుచున్నారు – “తిరుప్పుళిన్గుడియాయ్! వడివిణైయిల్లా మలర్మగళ్ మఱ్ఱై నిలమగళ్ పిడిక్కుమ్ మెల్లడియై క్కొడువినైయేనుమ్ పిడిక్క నీ ఒరునాళ్ కూవుతల్ వరుతల్ చెయ్యాయే (తిరువాయ్మొళి 9.2.10)” – “ఆళ్వార్, తిరుపళ్లింగుడిలో ఉన్న పరమాత్మతో నన్ను నీవేల పిలుచుట లేదు, లేదా నా వద్దకు వచ్చుట లేదు, నేను నీ సుకుమారమైన పాదపద్మములను ఆశ్రయించవలెను. కాని వానిని ఇప్పటికే మిక్కిలి సుందరీమణులైన శ్రీదేవి మరియు భూదేవి నాచియార్లు ఆశ్రయించి వున్నారు కదా! – దీని వలన నీకు అర్ధము కాలేదా, ఆ దూరము చాలా స్వల్పము అని. (ఎలనన, అచ్చటి నుండి ఎంపెరుమాన్ పలికిన, ఆళ్వార్ తిరునగరి లోనున్న ఆళ్వార్ కు వినిపించెను కదా!)”.
ఇది విన్న ఉడయవర్లు పరమానందము చెంది, ఆ బాలిక తెలివితేటలకు మరియు ఆమెకు ఆళ్వార్ పలుకులపై వున్న విశ్వాసమునకు మిక్కిలి సంతోషించిరి. తనతో వంటకు తెచ్చిన మట్టి పాత్రలను పగుల గొట్టి, ఆ బాలిక నివాసమును తెలిసికొనిరి. ఆ బాలిక ఉడయవర్లను తన గృహమునకు తీసికొని వెళ్లగా, వారు ఆ బాలికను, ఆమె తల్లి తండ్రులను మరియు వారి బంధువులను తమ శిష్యులుగాగైకొనిరి. ఎంపెరుమాన్ కు విందు భోజనము (ప్రసాదం) చేయుమని వారిని ఆదేశించిరి. ఆ ప్రసాదమును తాము స్వీకరించిరి. తదుపరి అచ్చటి నుంచి బయలుదేరి, ఉడయవర్లు ఆళ్వార్ తిరునగరి చేరిరి. ఆనాటి నుంచి, ఆ బాలిక ఆమె బంధువర్గము ఉడయవర్లను తమ ఆరాధ్య దైవముగా భావించి, అద్భుతమైన జీవనము సాగించిరి, అని మన పెద్దలు వివరించిరి.

పై సంఘటనల ద్వారా, పిల్లలు, మూగ వారు, నిస్సహాయులు మొ || వారు శాస్త్రమును అభ్యసించుటకు అర్హత లేకపోయినను, నిజమైన ఆచార్యుని సంపర్కము చేత అంతిమ లక్ష్యమును పొందగలరని తెలియుచున్నది. ఆచార్యుని నిర్హేతుకమైన కృపచే, ఆ బాలిక, మూగవాడు ఉడయవర్ల యొక్క అద్భుతమైన దీవెనలు అందుకున్నారని మనము చూసాము.

ఈ క్రింది రెండు సంఘటనలు (మిగతా వానితో పాటు) పెరియాళ్వార్ తిరుమొళి 4.4.1 నవకారియం పాశుర వ్యాఖ్యానములో మామునిగల్ గుర్తించిరి. (అనువాదకుని గమనిక: ఈ రెండు సంఘటనలు ఆచార్యునిపై సంపూర్ణ నమ్మకము యొక్క ప్రాముఖ్యతను మరియు భగవానుని మాత్రమే కీర్తిస్తూ, ఆచార్యుని సమునిగా గాని అధికునిగా గాని చూడని వ్యక్తుల సాంగత్యమును వీడుటను తెలియజేయుచున్నవి.)

  • ఒకసారి తిరుక్కురుగైప్పిరాన్ పిళ్లాన్ కొంగు ప్రాంతమునకు (కోయంబత్తూరు, మొ ||) ప్రయాణిస్తున్నారు. అచ్చట ఒక శ్రీవైష్ణవుని నివాసమును చేరి, తళిగ ప్రసాదమును తామే చేయవలెనని భావించారు. ఆ గృహములో అందరూ భగవానుని నామ సంకీర్తనను చేయుచున్నారని (ఆచార్యుని తలంపకనే) అని గమనించారు. అది వారికి నచ్చలేదు, కావున ఆ గృహమును వీడినారు.
  • ఒకసారి, ఎంపెరుమానార్ సభకు ఒక వైష్ణవుడు వచ్చి, తిరుమంత్రమును పఠించెను. ముందుగా గురుపరంపర పఠించకనే తిరుమంత్ర అనుసంధానము చేయుట గమనించిన వడుగనంబి, ఇట్టి అనుసంధానము నాలుకకు అయోగ్యము అని ప్రకటించి, అచ్చటి నుంచి నిష్క్రమించారు. (అనువాదకుని గమనిక : సత్ శిష్యుడు సదా గురు పరంపర పఠించ వలెనని శ్రీ వచన భూషణ దివ్య శాస్త్రములో పిళ్ళై లోకాచార్యులు ప్రకటించారు).

బాగా తెలిసిన వార్తామలై ప్రకారము, తిరుమలై ఆండాన్ అనిరి “నేను భగవద్విషయము బోధించవలెనని తలంచినను, ఈ భౌతిక విషయవాంఛల జగత్తులో అనేకులు దానిని వినరు మరియు నేర్చుకొనరు. మనము ఒక అరెక గింజ (వక్క) ను నాటి, కొంత ఎరువు వేసి మొలకెత్తు వరకు చూసి అచ్చటనే ఒక గుడిసె వేసుకొని, అది పెరుగుటను అనేక సంవత్సరములు చూడగా, చివరగా కొన్ని గింజలు మాత్రమే చూచెదము. ఇంత శ్రమ పడినను స్వల్ప ఫలితమే మనకు దక్కును. కాని భగవద్విషయము వలన ఈ బాధా పూరితమైన భౌతిక ప్రపంచము నుండి ముక్తి కలిగి, అతి పావనమైన పరమపదము లభించును. అయితే దీనికి అవసరమైనది, ఆచార్యునిపై ఎంతో కొంత కృతఙ్ఞత. ఆయనే ఈ భౌతిక జగత్తు నుంచి ముక్తి కలిగించగలరు అనే భావన. ఈ చిన్న విషయము కూడా చేయని వారికి నేను భగవద్విషయమునెలా బోధించగలను” అని విచారములో మునిగినారు. వారు ఇలా అనుచున్నారు “గోగ్నే చైవ సురాపే చ చోరే భగ్నవ్రతే తతా; నిష్కృతిర్ విహితా సద్భిః క్రుతఘ్నే నాస్తి నిష్కృతిః” (అనువాదకుని గమనిక: ఈ శ్లోకము అతి హేయమైన గోహత్య, సురాపానము, చౌర్యము, మొ || ప్రాయశ్చిత్తములు లేని పాపములను వరుసగా తెలియజేయుచున్నది. ఇట్టి పాపములను చేసిన కృతఙ్నులు కూడా పుణ్య కాలములో చేయు కొన్ని భక్తి పూర్వక చర్యల ద్వారా పాపరహితులు కాగలరు. కృతఙ్ఘునులు చేయు గోహత్య, చౌర్యము మొదలగు చర్యలు ఎంత హేయమో, లౌకిక వాసనల నుండి జీవాత్మను ఆధ్యాత్మికత వైపు మరలించే ఆచార్యునిపై కృతజ్ఞత లేక పోవుట గురించి ఏమి చెప్పగలము – బహుశా ఈ పాపమునకు ప్రాయశ్చిత్తము ఉండదు.

ఒక పాత్రలో ఇసుక కలిపిన నీటిని తీసుకొని, దానిని శుద్ధి చేయుటకు తేత్తం అనే విత్తును వేయగా, ఇసుక పాత్ర అడుగుకు చేరి శుభ్రమైన నీరు పైకి ఎట్లు తేలునో, అదే విధముగా, ఆచార్యుని కృపచే మనలోని (పాత్ర) అజ్ఞానము (ఇసుక) తొలగించుటకై , జీవాత్మ (శుద్ధ జలము)ను తిరుమంత్రము (విత్తు) ద్వారా శుద్ధి చేయుటచే, అజ్ఞానము నశించి, జ్ఞానము ప్రకాశించును. కాని ఆ పాత్రలోని శుద్ధ జలమును వేరొక పాత్రకు మార్చునంత వరకు, ఆ జలమును స్పృశించిన, తిరిగి ఇసుక ఆ నీటిని కలిసి ఎలా కలుషితము చేయునో, అటులనే జీవాత్మ కూడా పరమపదములో మరియొక శుద్ధ శరీరము పొందు వరకు అయోమయములో వుండును. ఇట్టి అయోమయము తొలగుటకై, శిష్యుడు ఆచార్యుల మరియు ఆచార్యులకు సమమైన ఇతర శ్రీవైష్ణవులకు చేరువలో వుండుట అవసరము. మన పూర్వాచార్యులు ఈ నియమమునే వివరించారు.

ఆళవందార్లు తిరువనంతపురమునకు పయనమవుతూ, తన ప్రియ శిష్యుడైన దైవవారి ఆండన్ తో ఎంపెరుమాన్ కు పూమాలల కైంకర్యము చేయవలెనని మరియు శ్రీరంగములోని మఠమును పర్యవేక్షించవలెనని ఆదేశించారు. ఆండన్ మిక్కిలి చింతతో వుంటూ, తీర్థ ప్రసాదములను కూడా నిరాకరించి రోజు రోజుకూ చిక్కి శల్యమవుతున్నారు. “మీరు ఎందుకు ఇలా అవుతున్నారు” అని పెరుమాళ్ అడుగగా, దానికి ఆండన్ “నాకు దేవరవారి కైంకర్య సేవ చేసే భాగ్యము లభించినను, నా ఆచార్యుని వీడి ఉండలేకపోవుచున్నానని, అందులకే నా శరీరము చిక్కి పోవుచున్నది” అని సమాధానమిడిరి. “అయినచో, మీరు ఆళవందార్ వద్దకు వెళ్ళుము” అని పెరుమాళ్ పలికిరి. ఆండన్ ఆనందముగా పయనమై, ఆళవందార్లను (తిరువనంతపురము నుంచి తిరిగి వస్తుండగా), తిరువనంతపురము సమీపములో ఒక నది ఒడ్డున కలిసిరి. అచ్చట తమ ఆచార్యుని చూసి, పరమానందము చెంది, ఆరోగ్యమును కూడా పొందిరి. ఆ సమయములో ఆళవందార్ ఆండాన్ తో ” మీరు తిరువంతపురము దగ్గరలోని ఉద్యానవనములను చూడుము. అచ్చటికి శ్రీవైష్ణవులతో కలిసి వెళ్లుము మరియు అనంతశయన పెరుమాళ్ ను ఆరాధించుము” అని పలికిరి. దానికి ఆండాన్ “అది మీ తిరువంతపురము. నేను నా తిరువనంతపురమును ఇప్పటికే చేరాను” అనిరి. (అనువాదకుని గమనిక: ఎంపెరుమాన్ ఆచార్యుని దివ్య రూపములోనే ఉండుటచే, అదే శిష్యునికి ఒక దివ్య దేశము). ఆళవందార్ “ఎంత గొప్ప నమ్మకము. ఇటువంటి నమ్మకస్తుడైన శిష్యుడు లభించుట దుర్లభము” అనిరి మరియు ఆండన్ ను చూసి పరమానంద భరితుడైరి.

పిన్భళగియ పెరుమాళ్ జీయర్ అనారోగ్యముతో వున్నప్పుడు, ఇతర శ్రీవైష్ణవులతో “ఎంపెరుమాన్ ను ప్రార్ధించి, నాకు ఇప్పుడే పరమపదము వలదని, నేను ఇంకా కొంత కాలము శ్రీరంగము లోనే నివసించునటుల కోరవలసినదని మరియు వారితో ఆళియెళ (తిరువాయి మొళి 7.4), ఏళై ఏతలన్ (పెరియ తిరుమొళి 5.8) పాశురములను పారాయణము చేయుచూ, పై విన్నపమును చేయుము” అనిరి. (అనువాదకుని గమనిక: శ్రీవైష్ణవ సంప్రదాయము ప్రకారము ఇది సరికాదు. ఏలనన, ఎంపెరుమాన్ ను కోరికతో ప్రార్ధించరాదు, అనారోగ్యము నుంచి బాగు పడుటకైనను). ఆ వైష్ణవులు ఆ ప్రకారముగానే చేయగా, వారు అనారోగ్యము నుంచి కోలుకొని, స్వస్థులైనారు. ఇది గమనించిన నంపిళ్ళై శిష్యులు, “వారు చాలా జ్ఞానులు మరియు పెద్దలు కదా, అయినను ఎంపెరుమాన్ ను ఈ విధముగా ఆరోగ్యమును కావలెనని కోరుట, వారి స్వరూపమునకు సమంజసమేనా” అని అడిగిరి. నంపిళ్ళై “వారి ఆలోచనలు ఏమిటో మనకు తెలియవు కదా? అయినను, పిళ్ళై ఎంగల్ ఆళ్వాన్ ను కలిసి అడుగుము” అని తెలిపిరి. వారిని అడుగగా, ఆళ్వాన్ “వారు శ్రీరంగములోని అద్భుతమైన కైంకర్యములపై అమిత బాంధవ్యము కలిగి మరి కొంత కాలము అచ్చటనే నివసించు కోరికతో ఉండి ఉండవచ్చు” అనుచు, ” ప్రతి ఒక్కరూ తమ కర్మ పూర్తి అగు వరకు ఈ సంసారమున ఉండక తప్పదు” అనిరి. తదుపరి, నంపిళ్ళై తమ శిష్యులను తిరునారాయణ పురత్తు అరయర్ ను కలిసి అడుగ మనిరి. అరయర్ “వారికి ఏమైనను ఇంకను చేయవలసిన కార్యములు వున్నవేమో, వానిని పూర్తి చేయుటకై, తమ జీవిత కాలమును పొడిగించు ప్రార్ధన చేసి ఉండ వచ్చు” అనిరి. మరల, నంపిళ్ళై తమ శిష్యులను అమ్మంగి పెరియ ముదలియార్ ను కలువమనిరి. వారు “నంపిళ్ళై కాలక్షేప గోష్టిని ఎవరూ వదలు కొనవలెనని భావించరు. వారి కాలక్షేప గోష్టిని పూర్తిగా వినవలెనని వారు ఈ విధముగా ప్రార్ధన చేసియుండవచ్చ ” అనిరి.
నంపిళ్ళై తమ శిష్యులను అమ్మంగి పెరియ ముదలియార్ వద్దకు వెళ్లి అడుగమనిరి. వారిని అడుగగా, “పరమపదములో నంపెరుమాళ్ యొక్క దివ్య స్వరూపము కానరానిచో, అచ్చటనే ఒక కంత చేసి, శ్రీరంగమునకు తిరిగి దూకివేయగలను అని భట్టరు అనిరి. అదే విధముగా, వారు నంపెరుమాళ్ పై అమిత ప్రేమచే, ఈ ప్రదేశమును వీడుటకు ఇచ్ఛ పడుటలేదేమో! ” అనిరి. ఈ అభిప్రాయములన్నియు విన్న పిదప, నంపిళ్ళై, చివరగా ఇళ్యార్ ను “ఇవన్నియు మీ యొక్క ఆలోచనలతో సరిపడునవిగా ఉన్నాయా” అని అడిగిరి. జీయర్ “ఇవి ఏవియును నా ఆలోచనలకు సరిలేవు” అనిరి. నంపిళ్ళై మీ మనస్సులో ఏమున్నదో తెలుపమనిరి. ఇళ్యార్, “మీకు అంతయును తెలియును. కాని, నాపై దయతో నాకు మీరు ఈ అవకాశమును అనుగ్రహించినారు. నేను ఇచ్చటనే నివసించ వలెనని భావించుటకు కారణమును తెలిపెదను. మీరు ప్రతి రోజు స్నానము అనంతరము, నూతన వస్త్రములను ధరించి, ఇచ్చట నడయాడు నప్పుడు, మీ దివ్య తిరుమేనిపై ఏర్పడు చిన్న స్వేద బిందువుల నుండి ఉపశమునకై, నేను వింజామరతో వీచేదను కదా! మీ యొక్క అట్టి దివ్య స్వరూపమును మరియు అట్టి సేవను నేను ఎటుల వదులుకొని పరమపదమునకు వెళ్లెదను?” అనిరి. నంపిళ్ళై, వారి శిష్యులు ఇట్టి పరమానందమైన దివ్య అనుభూతిని గాంచి, వారి అంకిత భావమునకు అచ్చెరువొందిరి. మన జీయర్ (మాముణులు) కూడా వారి అంకిత భావమునకు మిగుల ఆనందభరితులై, తమ మనస్సున కూడా ఇట్టి అంకిత భావమును పెంపొందించు కొనవలెనని ఉపదేశరత్తిన మాలై లోని 66 వ పాశురము నందు ఈ క్రింది విధముగా ఆదేశించిరి.

పిన్బऽళగరామ్ పెరుమాళ్ జీయర్
పెరున్తివత్తిల్ అన్బదువుమఱ్ఱు
మిక్క ఆసైయినాల్ నమ్పిళ్ళైక్కాన అడిమైగళ్ సెయ్
అన్నిలైయై నన్నెన్జే! ఊనమఱ ఎప్పొళుదుమ్ ఓర్

సాధారణ అనువాదము: పిన్భళగరామ్ పెరుమాళ్ జీయర్, పరమపదముపై ఆసక్తి చూపక, శ్రీరంగములోనే నంపిళ్ళై దివ్య స్వరూపమును సేవించ వలెనని అమిత ప్రేమతో నివసించిరి. ఓ, ప్రియ మనసా! ఎల్లపుడు అట్టి అంకిత భావమునే కలిగి వుండుము.

ఒకసారి పెరియనంబి, తిరుక్కోష్ఠిర్ నంబి మరియు తిరుమలై ఆండాన్ శ్రీరంగములోని చంద్ర పుష్కరిణి ఒడ్డున వున్న పొన్న చెట్టు వద్ద కలిశారు. వారి ఆచార్యుల (ఆళవందార్) మధుర జ్ఞాపకాలు స్ఫురణకు తెచ్చుకొని, వారి అద్భుత ఆదేశాలను గురించి చర్చించు కొనుచూ అనుభవిస్తున్నారు. ఆ సమయములో సెల్వర్ (అనువాదకుని గమనిక: సెల్వర్ అనగా పరివార దేవతలకు ప్రసాదమును పంచు పద్ధతిని గమనించే ఎంపెరుమాన్ రూపము (విగ్రహము)) యొక్క ఊరేగింపు ప్రారంభమై, కైంకర్య పరులతో కూడి శ్రీబలి (ప్రసాదమును) వద్దకు వెంచేసినారు. అపుడు వారు చర్చను ఆపి వేసి ఎంపెరుమాన్ ముందు ప్రణమిల్లి, నిలుచొని, “ఇదుగో గుంపును ఆకర్షించు వారు వచ్చినారు: నేటి నుంచి మనము ఎచటనైతే సెల్వర్ ప్రసాదము పంచే తమ కైంకర్య పరులతో వేంచేపుచేస్తారో, అచ్చటకు మనము వెళ్ళరాదు అని ప్రతిజ్ఞ చేసెదము” అనిరి. (అనువాదకుని గమనిక: అప్పటి నుంచి, వారి ప్రతిజ్ఞను నెరవేర్చుటకై, ఎంపెరుమాన్ కూడా శ్రీరంగములోని తమ శిష్యుల దివ్యమైన చర్చలకు అవరోధము కలుగరాదని, తమ కైంకర్య పరులతో కలిసి వూరేగింపుగా రాకూడదని ప్రతినబూనినారు. నేటికి అదే పద్ధతి అచ్చట కొనసాగు చున్నది).

నంజీయర్ (భట్టరుచే సంస్కరింపబడిన వేదాంతి) ను అనంతాళ్వాన్ కలిసినప్పుడు, వారు సన్యాసమును స్వీకరించి శ్రీరంగమునకు చేరు ఆలోచనలో నుండగా, వారితో “మీరు సన్యాసాశ్రమమును స్వీకరించినందుచే, మీరు మీ ఆచార్యునకు చేయు కైంకర్యములకు అవరోధము కలుగును కదా! మీకు స్వేద కలిగినప్పుడు స్నానము చేయుట, ఆకలి కలిగినప్పుడు ఆహారము స్వీకరించుట మరియు ఎల్లప్పుడూ భట్టరు గారి పాద పద్మములనే ఆశ్రయించుట చేయునప్పుడు వారు పరమ పదము నుంచి త్రోసి వేయుదురా? మీరు ఇప్పుడు భట్టరు సేవ చేయకయే, ఒక మూల ఉండవలెను.”

తొండనూరు నంబి యొక్క ఒక శిష్యుడు, పూర్వమున శైవుడు, ఒకసారి తిరుమలకు వచ్చి, అనంతాళ్వాన్ ను కలిసిరి. అనంతాళ్వాన్ తిరు వేంకటేశ్వరునికై తన తోటలో నున్న పూలు కోయుచు మరియు విత్తనములు నాటుచు ఉండుటను గమనించిరి. వారితో “ఓ, అనంతాళ్వాన్! అనేకులైన నిత్యసూరులు ఎంపెరుమాన్ సేవకై ఈ తిరుమలపైన పుష్ప రూపులై వున్నారు. మీరు వారిని అనవసరముగా నలిపి వేయుచున్నారు. మా ఆచార్యులైన తొండనూరు నంబి నివాసములో నాకు వారి ఇంటి వెనుక భాగమున శ్రీవైష్ణవులు స్వీకరించు ప్రసాద కైంకర్యమునకై అరటి ఆకులను శుభ్రముగా మరియు సరిగా వుంచు కైంకర్యమును ఒసగిరి. నేను చేయు ఈ కైంకర్యములో మీకును కొంత భాగమును ఇచ్చెదను. ఈ విధముగా భాగవత కైంకర్యములో పాలుపంచు కొనుట వలన మన జీవితమును పెయిలుం చుడరోళి (తిరువాయ్మొళి 3.7) మరియు నెడుమార్కడిమై (తిరువాయ్మొళి 8.10) లో తెలిపిన విధముగా కొనసాగించ వచ్చును.
(అనువాదకుని గమనిక : ఈ రెండు పదిగాలు కూడా భాగవతులకు విధేయులుగా ఉండుటకు ప్రాధాన్యమును చూపుచున్నవి). మీరు ఇట్టి దివ్య పుష్పములు కలిగిన వృక్షములను నాశనము చేయుట వీడలేరా?” అనిరి. తదుపరి ఆ శ్రీవైష్ణవుడు అనారోగ్యముపాలై, అనంతాళ్వాన్ ఒడిపై శిరము నుంచి ఒదిగిరి. అనంతాళ్వాన్ “మీరు ఇప్పుడు ఏమి ఆలోచిస్తున్నారు?” అని అడిగిరి. ఆ శ్రీవైష్ణవుడు “తొండనూర్ నంబి నన్ను స్వీకరించి, నా పూర్వపు చెడు సహవాసములను విస్మరించి, నన్ను సంస్కరించిరి. నేను వారి నివాసములోని వెనుక భాగములో కైంకర్యము చేయుచు, ధ్యానములో ఉందును.” మరియు వెంటనే పరమపదము నొసగిరి. ఈ సంఘటన యొక్క ప్రాధాన్యత ఏమనగా, ఆ శ్రీవైష్ణవుడు తిరువేంగడ ముడియాన్ ముంగిట ఉండే భాగ్యము వున్నను, దానిపై ఆసక్తి లేక తమ ఆచార్యులు స్వీకరించిన, తను కైంకర్యము చేయు ప్రాంతముపైననే పూర్తిగా దృష్టి కలిగి ఉండిరి.

అనువాదకుని గమనిక: పై సంఘటనల ద్వారా మన పూర్వాచార్యుల ప్రకారము భగవత్ కైంకర్యము / అనుభవము కన్నా, ఆచార్య కైంకర్యము / అనుభవముపై గల ప్రాధాన్యము బోధపడుచున్నది.

సశేషము…..

అడియేన్ గోపీ కృష్ణమాచార్యులు బొమ్మకంటి రామానుజ దాసన్.

మూలము: http://ponnadi.blogspot.com/2013/06/anthimopaya-nishtai-6.html

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 23

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 22

ఈ క్రింద చెప్పినట్లుగా …

అతత్స్య గురుః శ్రీమాన్ మత్వాదం దివ్య తేజసం
అభిరామవరాధీశ ఇతి నామ సమాధిశత్

(దివ్య తేజస్సుతో ఉన్న ఆ బిడ్డను చూసి, అణ్నార్, (ఆ బిడ్డ తండ్రి) మరియు ఒక శ్రీమాన్ (ఎమ్పెరుమానునికి కైంకర్యం చేయువారు), ఆ బిడ్డకు అళగియ మణవాళ పెరుమాళ్ అని దివ్య నామకరణం చేశారు). విప్పిన పడగలతో అనాదిగా ఆదిశేష శయ్యపైన పవళించి ఉన్న ఆ పెరుమాళుని దివ్య నామాన్ని ఆ బిడ్డకి పెట్టారు. పెరియాళ్వార్ తిరుమొళి 1.1.7 లో కృష్ణుని గురించి పెరియాళ్వార్ చెప్పినట్లే “ఆయర్ పుత్తిరన్ అల్లన్ అరుం దెయ్వం” (ఆతడు గొల్ల బాలుడే కాదు, ఆతడు పరమాత్మ) మరియు పెరియాళ్వార్ తిరుమొళి 2.5.1 “ఎన్నైయుం ఎంగళ్ కుడి ముళుదాట్కొండ మన్నన్” (నన్ను నాతో పాటు నా వంశాన్నంతటినీ గెలిచినవాడు), ఆ బిడ్డను వారి తల్లిదండ్రులు అతని తాతగారి ఊరైన సిక్కిల్ కిడారం కు తీసుకొని వెళ్లి అక్కడ పెంచి పోషించారు. అతను కూడా, ఈ క్రింద చెప్పినట్లుగానే

పరభక్తి పరజ్ఞానం పరమాభక్తిద్యపి
వపుషావర్తమానేన తత్తస్య వవృతేత్రయం

(పెరిగి పెద్దగౌతున్న ఆ అళగియ మణవాళ పెరుమాళ్  తిరుమేనితో పాటు, వారిలో పరభక్తి, పరజ్ఞానం మరియు పరమ భక్తి అను మూడు గుణాలు కూడా పెరగసాగాయి) [పరభక్తి అనగా ఎమ్పెరుమాన్ గురించి తెలుసుకునే స్థితి, పరజ్ఞానం అంటే ఎమ్పెరుమానుని ప్రత్యక్షంగా ఊహించుకొని దర్శించే స్థితి. పరమ భక్తి అనేది భగవానుడు లేకుండా ఉండలేని స్థితి), వారి తిరుమేని స్వరూపంతో పాటు వారి దివ్య గుణాలు కూడా పెరిగేలా ఎదిగారు. వారు తండ్రిగారైన అణ్ణర్ కూడా బ్రాహ్మణ జన్మకి తగిన రీతిలో అన్ని కర్మలనాచరించారు. ఈ క్రింద శ్లోకములో చెప్పబడింది…

ప్రాప్తాన్ ప్రాతమివికేవర్ణే కల్పజ్ఞాః కల్పయంతి యాన్
కాలే కాలే చ సంస్కారాన్ తస్య చక్రే క్రమేణ సః

(మొదటి వర్ణంలో జన్మించి కల్పసూత్రాలనెరింగిన బ్రాహ్మణుడికి ఏ ఆచారాలు నిర్దేశించబడ్డాయో, వాటిని అణ్ణర్ తమ తిరుకుమారునికి నిర్వహించారు)

అణ్ణర్ వారి తిరుకుమారునికి తగిన వయస్సులో శాస్త్రానుసారంగా చౌలం (శిఖ), ఉపనయనం వంటి విధులను పూర్తిచేసెను. వారు తమ తిరుకుమారునికి వేదముల అర్థాలను కూడా బోధించారు. ఈ శ్లోకములో ఇలా చెప్పబడింది…..

ఆత్మాంపరపాదం ఆజాను భుజం అంబుజలోచనం
ఆకారమస్య సంపశ్య ముక్తోపి ముమునే జనః

(ఎర్రటి కమలాన్ని పోలిన ఎర్రటి వారి దివ్య పాదాలు, దివ్య మోకాళ్ళను తాకుతున్న వారి దివ్య హస్తాలు, ఎర్రటి కమలముల వంటి దివ్య నేత్రాలతో ఉన్న అతని దివ్య స్వరూపాన్ని చూసి జ్ఞానము లేని సామాన్యులు కూడా ఎంతో ఆనందించారు)

సౌశీల్యేన సుహృత్వేన గాంభీర్యేన గరీయసా
రజ్ఞనేనప్రజానాంచ రామోయమితి మేనిరే

(వారి ఒదిగి ఉండే స్వభావాన్ని, అణకువతో అందరితో మెదిలే స్వభావాన్ని, అందరి పట్ల ప్రేమ చూపించి సంతోషపెట్టుట, ఠీవీ తనాన్ని చూసి ప్రజలు ఆయన్ను శ్రీరామునిగా భావించేవారు), తమను చూసిన ప్రతి ఒక్కరినీ ఆకర్షించి సంతోషపరిచేవారు. చంద్రుడు ప్రతిరోజు కిరణాలను పెంచుకుంటూ పెరుగుతున్నట్లుగా, అళగియ మణవాళన్ కూడా పెరిగెను. ఈ శ్లోకములో చెప్పిబడింది….

కాలేన సకలానాంచ కలానామేగమాస్పతం
సుసుపే సత్తం పూర్ణః సుతాంశురీవ నిర్మలః

(అన్ని కళలకు నిధిగా అళగియ మణవాళన్ ఏ దోషం లేని చంద్రునిలా ప్రకాశించెను), సంపూర్ణ జ్ఞానం కారణంగా అంతులేని గొప్పతనమున్నవారు.

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము: https://srivaishnavagranthams.wordpress.com/2021/08/07/yathindhra-pravana-prabhavam-23/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 22

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 21

అళగియ మణవాళ మాముణుల దివ్య అవతారము

తుర్కుల దాడులు మరియు ఇతర కారణాల వల్ల ప్రపత్తి మార్గం మెల్లి మెల్లిగా బలహీనపడటంతో, కరుణతో నిండిన శ్రీమహాలక్ష్మికి పతి అయిన పెరియ పెరుమాళ్, శ్రీరంగంలోని ఆదిశేషుని సర్ప శయ్యపై శయనించి ఉండి నిరంతరం ఈ ప్రపంచ సంరక్షణ గురించి ఆలోచిస్తూ, ఒకే ఆచార్యుని ద్వారా దర్శనం (సంప్రదాయము) వృద్ధి చెందుతున్న విధానాన్ని చూసి, “ఎమ్పెరుమానార్ల (భగవద్ రామానుజులు) వలె ఈ ప్రపంచాన్ని ఉద్ధరించే మరొక ఆచార్యుని సృష్టిద్దాం.” అని నిర్ణయించుకొనెను. తగిన వ్యక్తిని అన్వేషిస్తుండగా, ఆతడి దివ్య కృప తిరు అనంత ఆళ్వాన్ (ఆదిశేషన్) పై స్థిరపడి, ఈ ప్రపంచాన్ని సరిదిద్దమని వారిని నియమించెను. వారు కూడా ఇలా చెప్పబడినట్లు, పెరియ పెరుమాళ్ళు కోరుకున్నట్లుగానే…

తదస్థదింగితం తస్య జానత్వేన జగన్నితేః
తస్మిన్ దామ్ని శటారాతేః పురే పునరవాతరత్

(అప్పుడు, తిరువనంతుడు పెరియ పెరుమాళ్ళ దివ్య సంకల్పాన్ని గ్రహించి, శ్రీ శఠగోపుల (నమ్మాళ్వార్) దివ్య నివాసమైన ఆళ్వార్ తిరునగరిలోనే పునరవతారము దాల్చెను)

సంసన్ని సమయం తస్య తులాం ప్రాప్తే ద్విషాంపతౌ
మూలం హి సర్వసిద్ధీనాం మూలరుక్షం ప్రచక్షతే

(తిరువనంత ఆళ్వాన్ యొక్క దివ్య అవతారం మూలా నక్షత్రంలో జరిగిందని మన పూర్వాచార్యులు ధృవీకరించారు – సూర్యుడు సంచరిస్తూ తులా రాశిలోకి ప్రవేశించినపుడు, ఈ నక్షత్రము కార్య సిద్దికి దోహదపడుతుంది)

యన్మూలమాశ్వయుజమాస్యవతార మూలం కాంతో పయంతృ యమినః కరుణైకసింధోః
ఆసీతసత్సుగణితస్య మమాపిసత్తామూలం తదేవజగదప్యుదైయైక మూలం

(కరుణా సాగర అవతార తిరునక్షత్రమైన ఐప్పసి (తులా) మాసంలోని మూలం, పైగా సమస్థ ప్రపంచ సంరక్షణకు కారణము మరియు అసత్ గా భావించబడే ఈ అల్ప వ్యక్తి యొక్క ఉనికికి కారణమైన వారు [ఈ శ్లోకం మణవాళ మాముణుల శిష్యుడు ఎరుంబి అప్పాచే స్వరపరచబడింది) అణ్ణర్ (తిగళక్కిడందాన్ తిరునావీఱుడైయ దాసర్ అణ్ణన్) భార్య గర్భంలోకి ప్రవేశించి తొమ్మిది మాసాలు అక్కడ నివాసమున్నారు.

ఈ శ్లోకములో చెప్పబడినట్లు

పాదేరభావం గతాయాం కలియుగ శరతి శ్రద్దరాయే శకాప్తే
వర్షే సాధారణక్యే సమధిగతతులే వాసరే ధీరసంఖ్యే
వారే జీవేచతుర్థాం సమజనిసతితౌ శుక్లపక్షే
సుకర్మా ప్రాజన్ మూలాక్యతారే యతిపతిరపరో రమ్యజామాతృ నామా

(కళ్యత్వం 4471, సకాప్తం 1292, సాధారణ వరుషం, సూర్యుడు తులా రాశికి చేరుకున్నప్పుడు, ఆ నెలలోని 26వ రోజున, గురువారం, మూల నక్షత్రం, శుక్లపక్ష చతుర్థి తిథిన, మణవాళ మాముని అను దివ్య ఆత్మ (రమ్యజామాతృ ముని అని కూడా పిలుస్తారు), యతిపతి భగవద్ రామానుజుల పునరవతారము) కలియుగంలోని 4471వ సంవత్సరంలో, సాధారణ అను ఏడాది, ఐప్పాసి మాసం, శుక్లపక్షం, చతుర్థి తిథి, మూల నక్షత్రములో, తిగళక్కిడందాన్ తిరునావీఱుడైయపిరాణ్ తాదరణ్ణరరైయర్ యొక్క గొప్ప వంశంలో, మణవాళ మాముణులు వారి తిరుకుమారులుగా దివ్య అవతారమునెత్తెను.

వెంటనే, కలి పురుషుడు అల్లంత దూరాన పారిపోయెను, ఈ శ్లోకం ద్వారా స్థాపించబడినది.

యస్మిన్ స్వపాదపద్మేన స్పర్శ పృతివీమిమాం
కలిశ్చ తదక్షణేనైవ దుతృవే దూరదస్థరాం

మణవాళ మాముణులు తమ దివ్య కమలం లాంటి పాదాలతో ఈ భూమిని తాకిన ఆ క్షణంలోనే, కలి పురుషుడు పారిపోయెను.

ఆ విధంగా సమస్థ జీవాత్మలను ఉద్ధరించుటకై దివ్య అవతారము దాల్చిన తన తిరుకుమారుని కొరకు, జాతకర్మలు జరిపించి, పన్నెండవ రోజున భుజాలపై తిరువిలచ్చినై (దివ్య ముద్రలు) ధరింపజేశారు. ఆ రోజుల్లో, శిశువుకు పుణ్యాకవచనం [జాతకర్మం వలె] అయిన తర్వాత, పుష్ప సమాశ్రయణం చేయబడేది. దీనిలో, ధాతువుతో కూడిన శంఖ చక్రాలను వేడి చేసిన ముద్రలకు బదులుగా, శిశువుకు తిరుమణ్ కాప్పుతో అద్దిన శంఖ చక్రాల చిహ్నాలను, శ్రీ చూర్ణ ముద్రలు వేసేవారు. ఇప్పటికీ కొంత మంది శ్రీ వైష్ణవుల తిరుమాలిగలలో ఈ పద్దతి మనం చూడవచ్చు.

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము: https://srivaishnavagranthams.wordpress.com/2021/08/06/yathindhra-pravana-prabhavam-22/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 21

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 20

తిరుమలై ఆళ్వార్ మరియు విళాంజోలై పిళ్ళై

తిరుమలై ఆళ్వార్ తాను తిరువనంతపురానికి వెళ్లి, విళాంజోలై పిళ్ళైకి పాదాభి వందనాలు సమర్పించుకొని వారి వద్ద అన్ని సంప్రదాయ రహస్య అర్థాలను నేర్చుకోవాలని తమ దివ్య మనస్సులో నిర్ణయించుకున్నారు. ఆళ్వార్ల ప్రధాన శిష్యులన్న హుందాతనాన్ని చూపిస్తూ వారు ఆలయం లోపలికి వెళ్లి, పడగలు విప్పి ఉన్న ఆదిశేషునిపై పవళించి ఉన్న భగవానుని దివ్య పాదాలను సేవించెను. ఆ తరువాత శ్రీ కృష్ణుడి దివ్య పాదాలను దర్శింపజేసిన ఉలగారియన్ (పిళ్ళై లోకాచార్యులు) ను ఆశ్రయించిన నారాయణన్ (విళాంజోలై పిళ్ళైల మరో పేరు) దివ్య తిరువడిని సేవించేందుకు వెళ్ళెను. విళాంజోలై పిళ్ళై నివాసం ఉంటున్న తోటలోకి వీరు ప్రవేశించెను. “గురుపదాంబుజం ధ్యాయేత్ గురోర్ నామసదాజపేత్” (నిత్యము ఆచార్యుని దివ్య తిరువడిని ధ్యానిస్తూ, ఆచార్యుని దివ్య నామాన్ని నిరంతరం పఠిస్తూ ఉండాలి) అని చెప్పబడినట్లే,

శ్రీలోకార్య ముఖారవిందం అఖిల శృత్యర్థ కోశం సదాం
తద్గోష్ఠీంచ తదేకలీనమనసా సంచింతయంతం సదా

(వేదార్థాలకు నిలవుగా పరిగణించడే పిళ్లై లోకాచార్యుల దివ్య శ్రీముఖాన్ని అలాగే సత్పురుషుల నివాసంగా పరిగణించబడే వారి గోష్టిని విలాంజోలై పిళ్లై నిత్యము ధ్యానిస్తుండేవారు. సాలె పురుగులు చుట్టూ బూజులు అల్లాయని కూడా తెలియకుండా పిళ్ళై లోకాచార్యుల దివ్య మంగళ స్వరూపాన్ని ధ్యానిస్తున్న స్థితిలో తిరుమలై ఆళ్వార్ విలాంజోలై పిళ్ళైని దర్శించెను. తిరువాయ్మొళి పిళ్ళై వారి ఎదుట సాష్టాంగ నమస్కారం చేసి, అంజలి ప్రణామాలు సమర్పించారు. విలాంజోలై పిళ్ళై తమ దివ్య నేత్రాలు తెరిచి “ఎవరు నువ్వు? ఇక్కడికి ఎందుకు వచ్చావు?” అని అడిగెను. తిరుమలై ఆళ్వార్ అప్పటి వరకు జరిగినదంతా వివరించారు. విలాంజోలై పిళ్ళై సంతోషించి, తిరుమలై ఆళ్వారుకి శ్రీ వచన భూషణం యొక్క ముఖ్యమైన నిగూఢ అర్థాలను కృపతో బోధించెను. శ్రీ వచన భూషణమే కాకుండా, విలాంజోలై పిళ్ళై తిరుమలై ఆళ్వార్‌కు కేవలం ఏడు పాసురాలలో శ్రీవచన భూషణ సారమైన సప్తకాదై అర్థాలను కూడా బోధించెను. మేలిమి బంగారం వంటి విలాంజోలై పిళ్ళైల సంబంధముతో తిరుమలై ఆళ్వార్ల జన్మ దోషాలు తొలగిపోయాయి; విలాంజోలై పిళ్ళై వద్ద అన్ని రహస్య అర్థాలను తెలుసుకున్న తర్వాత, తిరుమలై ఆళ్వార్‌ ఆళ్వార్తిరునగరికి తిరిగి వచ్చెను. విలాంజోలై పిళ్ళై, జ్యోతిష్కుడిలో తమ ఆచార్యులు (పిళ్ళై లోకాచార్యులు) తనకు అప్పగించిన పనిని పూర్తి చేసి, నిత్యాసురులు మరియు ముక్తాత్మాలతో కలిసి భగవానునికి కైంకర్యము చేయాలనే కోరికతో మరియు “సెఱిపొళిల్ అనంతపురత్తు అణ్ణలార్ కమలపాదం అణుగువార్ అమరరావార్” (చుట్టూ సుసంపన్నమైన తోటలతో విస్తరించి ఉన్న తిరువనంతపురం స్వామి యొక్క దివ్య కమల చరణాలను ఆశ్రయించి) అనే సూక్తికి అనుగుణంగా, వారు శ్రీవైకుంఠానికి చేరుకొనెను.

ఆ సమయంలోనే, తిరువనంతపురం ఆలయంలోని నంబూద్రీ పూజారులు అనంత పద్మనాభునికి తిరువారాధన కైంకర్యము చేస్తుండెను. విలాంజోలై పిళ్ళై అనంత పద్మనాభుని గర్భ గృహంలోకి ప్రవేశించడం, పెరుమాళ్ళ దివ్య పాదాలను సేవించడం వారు చూశారు. తక్కువ జాతికి చెందిన వ్యక్తి ప్రవేశించిన చోటిలో తాము ఉండలేము అని నిర్ణయించుకుని, పెరుమాళ్ళకు దివ్య రక్షణ లేపనము చేసి వాళ్ళు గర్భ గృహము వదిలి ఆలయము బయటకు వచ్చారు. అదే సమయంలో, విలాంజోలై పిళ్ళై శిష్యులు తమ ఆచార్యులు విలాంజోలై పిళ్ళై లోకాచార్యుల దివ్య తిరువడిని చేరుకున్నారని, తమకు పెరుమాళ్ళ దివ్య పరివట్టం (వస్త్రం), పుష్ప మాలలు కావాలని, ఇరామానుశ నూఱ్ఱందాది పఠిస్తూ ఆలయము లోనికి అచ్చెను. ఇది చూసిన నంబూద్రీ అర్చకులు గుడిలో తాము చూసిన అద్భుతమైన అనుభవాన్ని వారితో పంచుకున్నారు. తిరుమలై ఆళ్వారుని వద్దకు తిరిగివచ్చి ఆచార్యులు జరిగిన ఈ సంఘటన గురించి విని ఇలా అన్నారు.

గత్వానంతపురం జగత్గురు పదధ్యానేరతం కుత్రచిత్ తం
నారాయణదాసమేత్యవిమలం గత్వా తదంగ్రిం ముదా
తస్మాధార్యజనోక్తిమౌక్తికకృతం వేదాంత వాగ్భూషణం
శ్రీవాగ్భూషణమభ్యవాప్సగురుం శ్రీశైలనాథోభవత్

తిరుమలై ఆళ్వార్ తిరువనంతపురానికి వచ్చి, పిళ్లై లోకాచార్యుల దివ్య చరణాలను నిత్యము ధ్యానించాలని కోరుకునే ఆ నారాయణ దాసుని (విలాంజోలై పిళ్ళై) ని ఆశ్రయించెను; ఆనందంగా వారి దివ్య తిరువడికి నమస్కరించి, పూర్వాచార్యుల వేదాంత సూక్తులతో కూడిన శ్రీ వచన భూషణాన్ని అందుకొని గొప్ప ఆచార్యులైనారు. విలాంజోలై పిళ్ళై శ్రీవైకుంఠాన్ని అధిరోహించిన వార్త విన్న తిరుమలై ఆళ్వారు, ఒక శిష్యుడు తమ ఆచార్యునికి, తనయుడు తన తండ్రికి చేయవలసిన చరమ కైంకర్యాలు అన్ని నిర్వహించెను.

పిళ్లై లోకాచార్యుల శిష్యులలో ఒకరైన కోట్టూర్ అళగియ మణవాళ పెరుమాళ్ పిళ్ళై తమ ఆచార్యులు పరమపదము చేరుకున్న తరువాత, తిరుప్పుళ్ళాణి సమీపంలోని సిక్కల్ కిడారం అనే చోటికి చేరుకుని అక్కడ కొంత కాలం ఉన్నారు. తరువాత, తిగళక్కిడందాన్  తిరునావీఱుడైయ పిరాన్ తాడరణ్ణణరైయర్ వారి వద్దకు వచ్చి తమ కుమార్తె శ్రీ రంగ నాచ్చియార్ ను వివాహం చేసుకుని వారి ఇంట్లోనే ఉన్నారు. పిరాన్ తమ మామగారిని పిళ్లై లోకాచార్యులుగా భావించి, పిళ్లై లోకాచార్యుల వద్ద నేర్చుకోలేక పోయిన అన్ని విషయాలని నేర్చుకున్నారు. అతనికి అన్ని రహస్యార్థాలను బోధించిన తర్వాత, అళగియ మణవాళ పెరుమాళ్ పిళ్ళై దివ్య  శ్రీ వైకుంఠానికి చేరుకుకొనెను.

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము: https://srivaishnavagranthams.wordpress.com/2021/08/05/yathindhra-pravana-prabhavam-21/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org