Monthly Archives: May 2022

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 30

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 29

అనంతరం, వారు “ఎణ్దిశై క్కణంగళుం ఇఱైంజియాడు తీర్థ నీర్” (అష్ట దిక్కులలోని అందరూ అత్యాదరముతో కావేరి పవిత్ర స్నానం చేస్తారు) మరియు “గంగైయిలుం పునిదమాన కావిరి” (గంగ కంటే పవిత్రమైన కావేరి) అని కీర్తించబడిన కావేరి ఒడ్డుకి చేరుకుని ఆ దివ్య నదిలో పవిత్ర స్నానం చేసి, కేశవాది ద్వాదశ ఉర్ధ్వపుండ్రములు ధరించి, భవ్యమైన ఆ దివ్య తిరువరంగ పట్టణాన్ని నమస్కరించారు. వారికి స్వాగతం పలికేందుకు తిరువరంగ వాసులు పెద్ద ఎత్తున అక్కడికి వచ్చి చేరుకున్నారు. వారందరి ఎదుట సాష్టాంగ నమస్కారం చేసి, వారితో పాటు శ్రీరంగంలోని తోటల గుండా పట్టణ ప్రవేశం చేశారు. తరువాత వారు ఈ క్రింది పాశురంలో చెప్పినట్లు శ్రీరంగ వీధుల గుండా వెళ్ళారు.

మాడమాళిగైశూళ్ తిరువీధియుం మన్నుశేర్ తిరువిక్కిరమన్ వీధియుం
ఆడల్మాఱన్ అగళంగమ్ వీధియుం ఆలినాడన్ అమర్ందుఱై వీధియుం
కూడల్ వాళ్ కులశేఖరన్ వీధియుం కులవు రాసమగేందిరన్ వీధియుం
తేడుతన్మా వన్మావిన్ వీధియుం తెన్నరగంగర్ తిరువావరణమే

(వారు ఎత్తైన భవంతులు ఉన్న వీధులను దాటి, తిరువిక్రమ వీధిని దాటి, అగళంగన్ వీధిని దాటి, తిరుమంగై ఆళ్వార్ వీధిని దాటి, కులశేఖర వీధిని దాటి, రాజమహేంద్ర వీధిని దాటి, శ్రీరంగానికి రక్షణ పొరలుగా ఉన్న ఈ వీధులన్నింటినీ దాటి వెళ్ళారు). వారు శ్రీరంగంలోని దివ్య భవంతులు, దివ్య వీధులు, దివ్య గోపురాలను ఎంతో ఆనందంతో చూస్తూ, తన లాంటి అక్కడి ఆచార్యులైన కొత్తూరిలణ్ణర్ వారి తిరుమాళిగకు చేరుకున్నాడు. గతంలో కొత్తూరిలణ్ణర్ తిరుమెయ్యం దివ్య దేశములో తిరువాయ్మొళి ఇరుబత్తినాలాయిరం (పెరియవాచ్చాన్ పిళ్ళై వారు రచించిన తిరువాయ్మొళివ్యాఖ్యానం)పై కాలక్షేపము చేసి, నంపెరుమాళ్ళు తిరిగి శ్రీరంగానికి చేరుకున్న తరువాత వీరు కూడా శ్రీరంగంలో స్థిర నివాసము ఉండాలని నిశ్చయించి అక్కడ స్థిరపడి ఉన్నవారు. నాయనార్లు ఒక విశిష్ట అవతారమని గ్రహించిన కొత్తూరిలణ్ణర్ తమ గౌరవ మర్యాదలు సమర్పించుకొనెను. అణ్ణార్ నాయనార్లను కోయిల్ కి తీసుకెళ్ళాలని, ఆ రోజుల్లోని శ్రీరంగం ఆలయ అధిపతి అయిన తిరుమాలై తండ పెరుమాళ్ భట్టర్ నివాసానికి వెళ్లారు. భట్టార్ ఎంతో సంతోషించి నాయనార్లను స్వాగతించి, కృపతో తిరువాయ్మొళి పాశుర అర్థాలను చెప్పవలసిందిగా నాయనార్లను అభ్యర్థించెను. నాయనార్ నమ్మాళ్వార్ల మహిమను చాటే పాశుర అర్ధాలను వివరించారు [6.5 పదిగానికి పరిచయంగా ఈడు వ్యాఖ్యానంలో వివరించిన విధంగా). (మన పూర్వాచార్యుల ప్రకారం తిరువాయ్మొళి 6.5.1 ‘తూవళిల్ మణిమాడం’ నమ్మాళ్వార్ల గుణాలను స్పష్టంగా తెలియజేస్తుంది.) భట్టర్ పాశురార్థాలను విని చాలా సంతోషించి, “నాయనార్లను ముప్పత్తారాయిర పెరుక్కర్ (అనేక అర్థాలతో ఈడుని స్పష్టంగా వర్ణించేవాడు)” అని చెప్పి, పెరుమాళ్లకు మంగళాశాసనం చేయమని వారిని ఆహ్వానించి, శ్రీరంగంలోని ఇతర శ్రీవైష్ణవులను కూడా రమ్మని కబురు పంపారు. అందరూ కలిసి బయలుదేరారు. మొదట్లో ఇరామానుశ నూఱ్ఱందాది పాశురము పొన్నరంగమెన్నిల్ మాయలే పెరుగుం ఇరామానుశన్” (‘గొప్ప శ్రీరంగం’ అనే పదాన్ని వినగానే రామానుజులు మోహితులౌతారు) అని చెప్పినట్లు, ఎంపెరుమానార్ సన్నిధికి చేరుకుకొనెను. వారి దివ్య తిరువడిని సేవించి, యోనిత్యం అచ్యుత…. తో ప్రారంభించి రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే తో ముగిసే తనియన్ల పఠన చేశారు.

ఇవ్వులగందన్నిల్ ఎతిరాశర్ కొండరుళుం
ఎవ్వురువుం యాన్ శెన్ఱిఱైంజినక్కాల్ – అవ్వురువం
ఎల్లాం ఇనిదేలుం ఎళిల్ అరంగత్తు ఇరుప్పుప్పోల్
నిల్లాదెన్ నెంజు నిఱైందు

(నేను ఈ లోకములో ఎక్కడికి వెళ్లినా, ఆ రామానుజుల దివ్య స్వరూపాన్ని ఎక్కడ సేవించినా, ఆ ప్రతిరూపము శ్రీరంగంలోని ఎంపెరుమానారుల దివ్యరూపాన్ని దర్శించుకున్నట్లు నాకు సంతృప్తిని కలిగిస్తుంది).

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము: https://srivaishnavagranthams.wordpress.com/2021/08/14/yathindhra-pravana-prabhavam-30/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 29

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 28

నాయనార్లను ఆశ్రయించిన అళగియ వరదర్

“శ్రీ సౌమ్య జామాతృ మునీశ్వరస్య ప్రసాదసంపత్ ప్రథమాస్యతాయ” (శ్రీ సౌమ్యజమాతృమునీశ్వరుల ప్రథమ దయాపాతృలు) [వీరు ఉత్తమైన సన్యాసాశ్రమ స్వీకారము చేసిన పిదప, నాయనార్లు సౌమ్య జామాతృముని/మణవాళ మాముని అని పిలవబడ్డారు]. అళగీయ వరదర్, సేనై ముదలియార్ మొదలైన పలు వైష్ణవులు నాయనార్ల మహిమలను విని వారి దివ్య తిరువడిని ఆశ్రయించారు. వీరిలో, అళగీయ వరదర్ సన్యాసాశ్రమాన్ని స్వీకరించి రామానుజ జీయర్ అనే నామాన్ని పొందారు [తర్వాత రోజుల్లో, వీరు ఒన్నాన శ్రీ వానమామలై జీయర్, పొన్నడిక్కాల్ జీయర్ అని పిలువబడ్డారు]. పెరియ తిరువందాది పాశురము 31లో “నిళలుం అదితారుం ఆనోమ్” (అతని నీడగా, పాదరక్షలుగా మారాము) అని చెప్పినట్లు, అళగీయ వరదర్, నాయనార్లను సేవిస్తూ వారి నిరంతర పాదరేఖగా (పాదాలపై రేఖలు) మారారు.

నాయనార్లు శ్రీ రంగమునకు చేరుట

వీరు తమ విశ్వసనీయమైన శిష్యులతో ఉంటుండగా, “మన ప్రాణాధారమైన నంపెరుమాళ్ళను మనము నిత్యము సేవించాలి, స్తుతించాలి, ఈ శరీరం పడిపోయే వరకు శ్రీరంగంలో జీవించాలి; ఇదే మనకి సరికాదా?” అని నాయనార్లు ఆలోచించి వెంటనే వారు  ఆళ్వార్ సన్నిధికి చేరుకుని, ఆళ్వార్ ఎదుట సాష్టాంగము చేసి, “నణ్ణావశురర్ నలివెయ్ద నల్ల అమరర్ పొలివెయ్ద ఎణ్ణాదనగళెణ్ణుం నన్మునివర్ ఇన్బం తలై శిఱప్ప పణ్ణార్…. (దుష్టుల నాశనం, సాధు సంరక్షణ, సర్వేశ్వరునికి మరిన్ని శుభ గుణాలు కావాలని ప్రార్థించే మహర్షులకై, రాగంతో ఆలపిస్తూ…) అని నీవు [తిరువాయ్మొళి 10.7.5 వ పాశురములో] ఆతడిని స్తుతించినందున, నంపెరుమాళ్ళు తాను గతంలో (దాడులకు ముందు) అనుభవించిన వైభవాన్ని ఊహించుచుండెను. అడియేన్ పెరుమాళ్ళను సేవించాలనుకుంటున్నాను. దేవరీర్ వారి (ఓ మహానుభావా!) ఆమోదం కోరుతున్నాను” అని విన్నపించెను; నమ్మాళ్వార్ వీరు అభ్యర్థనను మన్నించి అనుమతిని ప్రసాదించెను.

తరువాత, ఈ శ్లోకములో చెప్పినట్టుగా….

తతః గతిపయైర్దివశై స్సగురుర్ దివ్యదర్శనః
ఆజగామ పరంధామ శ్రీరంగం మంగళం భువః

(కొన్ని రోజుల తర్వాత, దివ్య మంగళ స్వరూపులైన నాయనార్లు, భూమికి శుభప్రదమైన పరమ దివ్య ధామము శ్రీరంగానికి చేరుకున్నారు), నాయనార్లు తమ శిష్యులతో కలిసి శ్రీరంగానికి బయలుదేరారు. దారిలో, “విల్లిపుత్తూర్ ఉఱైవాన్ తన్ పొన్నడి కాణ్బదోర్ ఆశైయినాలే” (విల్లిపుత్తూర్లో కొలువైకున్న ఎంబెరుమానుని దివ్య స్వర్ణమయమైన తిరువడిని సేవించాలనే కోరికతో) అని చెప్పినట్లుగా శ్రీవిల్లిపుత్తూర్లో ఉన్న ఎంబెరుమానుని దివ్య తిరువడిని దర్శించాలనే కోరికతో  శ్రీవిల్లిపుత్తూరుకు చేరుకొని, ‘వడపెరుంగోయిలుడైయాన్’ (భవ్య ఆలయములో ఒక మర్రి ఆకుపై శయనించి ఉన్నవాడు) మరియు పెరియాళ్వారుని సేవించుకొనెను. తరువాత, వారు అన్నవాయల్పుదువై ఆండాళ్ (హంసలు విహరించే పంట పొలాలతో శ్రీవిల్లిపుత్తూర్లో నివసించే ఆండాళ్) అని ఆమె తనియన్లో చెప్పినట్లు “నీళాతుంగ స్థానగిరి… గోదాతస్యై నమ ఇదమిదం భూయః”  నప్పిన్నై పిరాట్టి (నీల దేవీ) వక్షస్థలంపైన పవ్వలించి ఉన్న కృష్ణుడిని వర్ణించుచూ పాడిన ఆండాళ్ ను సేవించెను. ఆ తరువాత, ఈ శ్లోకములో చెప్పినట్లు….

దేవస్యమహిశీం దివ్యాం ఆదౌ గోధాముపాసతత్
యన్మౌలిమాలికామేవ స్వీకరోతి స్వయం ప్రభౌః

(వారు మొదట అళగీయ మాణవాలన్ దివ్య పత్ని అయిన ఆండాళ్ ధరించిన మాలలను తాను అమితానందముతో ధరించిన అళగీయ మాణవాలన్  ను సేవించెను.)  తరువాత, “నేఱిపడవదువే నినైవదు నలమే” (తిరుమాలిరుంజోలై వెళ్లడం ఉత్తమం) అని అరులిచ్చేయల్లో తిరుమాలిరుంజోలైని వర్ణించినట్లుగా వారు తిరుమాలిరుంజోలైలో కొలువై ఉన్న ఆ దేవుడిని సేవించాలనుకున్నారు. వారు తిరుమాలిరుంజోలై కి వెళ్లి అళగర్ ఆలయంలోకి ప్రవేశించి, ఎంబెరుమానుని దివ్య తిరువడిని సేవించుకొని, పవిత్ర తీర్థాన్ని, దివ్య ప్రసాదాలను స్వీకరించి, కూరత్తాళ్వాన్ అనుగ్రహించిన సుందర బాహుస్తవంలోని శ్లోకాన్ని స్మరించుకున్నారు.

విజ్ఞాపనం వనగిరీశ్వర! సత్యరూపాం అంగీకురుశ్వ కరుణార్ణవ మామకీనాం
శ్రీరంగధామని యతాపురమేషసోహం రామానుజార్యవశకః పరివర్తిశీయ

(ఓ కృపా సముద్రము వంటి సుందరమైన తిరుమాలిరుంజోలై దేవుడా! నీ దివ్య మనస్సుతో నా ఒక విన్నపాన్ని ఆమోదించాలి. గతంలో శ్రీరంగము వైభవంగా ఉన్నట్టు, అడియేన్ ఎంపెరుమానార్ల దివ్య తిరువడి యందు జీవనము సాగించేలా నీవు నన్ను అనుగ్రహించాలి). శ్రీ రంగనాధుని దాసుడిగా సేవ చేసుకునేందుకు వారు ఉత్సాహంతో శ్రీరంగానికి వెళ్లారు.

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము: https://srivaishnavagranthams.wordpress.com/2021/08/13/yathindhra-pravana-prabhavam-29/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 28

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 27

అళగియ మణవాళ పెరుమాళ్ళకి పిళ్ళై ఆదేశము

జ్ఞాన భక్తి వైరాగ్యాలకు ప్రతిరూపంగా గొప్ప కీర్తి ప్రతిష్ఠలతో పిళ్ళై కైంకర్య శ్రీ (సేవా సంపద) తో చాలా కాలం జీవించారు. తరువాత నిత్య విభూతి (శ్రీవైకుంఠం) లో నిత్య సేవ గురించి చింతన చేస్తూ, వారు తమ ఆచార్యులు పిళ్ళై లోకాచార్యులను ధ్యానించి

ఉత్తమనే! ఉలగారియనే! మఱ్ఱొప్పారైయిల్లా
విత్తగనే! నల్ల వేదియనే! తణ్ముడుంబై మన్నా!
శుద్ధ నన్ జ్ఞానియర్ నఱ్ఱుణైయే! శుద్ధసత్తువనే!
ఎత్తనై కాలమిరుందు ఉళల్వేన్ ఇవ్వుడంబై క్కొండే?

(శ్రేష్ఠమైన ఓ లోకాచార్య! ఓ పరమ పండితుడా! గొప్ప వేద విద్వాంసుడా! ఓ చల్లని ముడుంబై వంశ శిరోమణి! ఓ సజ్జనులకు సహచరుడి వంటి వాడా ! సత్గుణ సంపూర్ణుడా! ఇంకా ఈ భౌతిక శరీరముతో ఎంతకాలం నేను బాధపడాలి?)

తమ ఆచార్యుని చేరేందుకు తన ఈ దేహమే అడ్డంకి అని స్పష్ఠంగా ఎరిగిన వీరు, ఆ శరీరం నుండి విముక్తులను చేయమని తమ ఆచార్యుని అభ్యర్థించెను. ఆ ఆలోచనతో వారు అనారోగ్యపాలై విశ్రాంతిలో ఉన్నారు. ఒకసారి వీరు అకస్మాత్తుగా ఉలిక్కిపడి లేచారు. నాయనార్లు మరియు ఇతర శిష్యులు “ఏమైంది?” అని అడుగగా, “ఇది కలికాలం, ఆళ్వార్ల ఆరుళిచ్చెయల్ (నాలాయిర దివ్య ప్రబంధం) పట్ల పూర్ణ ఆసక్తి, విశ్వాసంతో మన దర్శనాన్ని (సంప్రదాయాన్ని) ఎవరు ముందుకు తీసుకువెళతారు? అడియేన్ కు భయంగా ఉంది” అని వారు బాధతో అన్నారు. నాయనార్లు, వారి తిరువడి యందు సాష్టాంగ నమస్కారం చేసి “అడియేన్ చేస్తాను” అని అభయమిచ్చారు. “కేవలం మాటలతో సరిపోదు” అని పిళ్లై అనగా, నాయనార్లు పిళ్ళై దివ్య తిరువడికి నమస్కారము చేసి “నేను చేస్తాను” అని ప్రమాణం చేసెను. పిళ్లై సంతృప్తి చేందెను; వారు నాయనార్లని పిలిచి, “ కేవలం సంస్కృత శాస్త్రాలపైనే నీ దృష్ఠి ఉంచకుము; శ్రీ భాష్య శ్రవణ చేయి, కానీ ఎంబెరుమానార్లకు మరియు మనకందరికీ ప్రీతి అయిన దివ్య ప్రబంధాన్ని కుడా నిరంతరం విశ్లేషిస్తూ ఉండుము. మన పూర్వాచార్యుల వలె  పెరుమాళ్ళను సేవిస్తూ శ్రీరంగంలో నిత్య నివాసము చేయి” అని ఆదేశించెను. వారు తమ ఇతర శిష్యులను పిలిచి, “నాయనార్లను విశిష్ట అవతారంగా భావించి ఆదరంతో ఉండండి” అని తెలిపెను. తిరువాయ్మొళిలో “మాగవైగుందం కాణ ఎన్ మనం ఏగమేణ్ణుం” అని చెప్పినట్లే, పిళ్ళై లోకాచార్యుల దివ్య తిరువడి ధ్యానం చేస్తూ శ్రీవైకుంఠం చేరుకోవాలని నిత్యము ధ్యానిస్తూ ఉండేవారు. వారు వైకాశి (ఋషభ) మాసంలో బహుళాష్టమి (పౌర్ణమి తర్వాత ఎనిమిదవ రోజు) నాడు దివ్య పరమపదానికి వారు బయలుదేరారు.

తిరువాయ్మొళి పిళ్ళై వారి విశిష్ఠత

ఆ తరువాత, నాయనార్లు మరియు ఇతర ఆచార్యులు తమ ఆచార్యుని నుండి వీడినందుకు తట్టుకోలేక దుఃఖ సాగరములో మునిగిపోయారు. వారు తమ దుఃఖాన్ని మ్రింగి, పిళ్ళై చరమ కైంకర్యములు నిర్వహించి, 13 వ రోజు తిరువధ్యయనం నిర్వహించారు. ఆ తర్వాత, ప్రతి ఏడాది, వైకాశి మాసంలో పౌర్ణమి తర్వాత 8 వ రోజున, నాయనార్లు అందరు శ్రీ వైష్ణవులకు మూడు ఫలముల (మామిడి, అరటి, పనస) తో కూడిన విందు ఏర్పాటు చేసేవారు.

పిళ్లై లోకాచార్యులకు ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, వారు స్త్రీలు మరియు అజ్ఞానులు కూడా అర్థం చేసుకోగలిగే విశిష్టమైన అర్థాలను చాలా సమగ్రంగా సులువైన రీతిలో అందించారు. వారు భగవానుని నుండి వీడి ఉండలేకపోయేవారు, అందుకని భగవత్ నిత్య సేవలో మునిగి ఉండేవారు. శిష్యుని గురించి “శరీరమర్థం ప్రాణంచ సద్గురుభ్యో నివేదయేత్” (తమ శరీరం, సంపద, జీవితం తమ ఆచార్యులనికై వినియోగించాలి) అనే సామెతలో చెప్పినట్లే, తిరువాయ్మొళి పిళ్ళై, పరమాచార్యులైన నమ్మాళ్వార్ల విగ్రహం, వారి ప్రియ శిష్యులైన ఉడయవర్ల విగ్రహాన్ని ఆళ్వార్ తిరునగరిలో ప్రతిష్టించారు. ఇది తిరువాయ్మొళి పిళ్ళై వారి విశిష్ఠత. వీరికున్న మరో ప్రత్యేకత ఏమిటంటే, ఆళ్వార్ల అరుళిచ్చెయల్ (దివ్య ప్రబంధము) పట్ల వీరికున్న రుచి మరియు వాటి ప్రచారం పట్ల వీరి దృఢత్వం అపారమైనది. వైకాసి (ఋషభ) మాసంలో వీరి దివ్య తిరునక్షత్రం విశాఖం. వీరి తనియన్

నమః శ్రీశైలనాథాయ కుంతీనగరజన్మనే
ప్రసాదలబ్ద పరమప్రాప్య కైంకర్య శాలినే

(కుంతీపురంలో కృపతో అవతరించిన శ్రీ శైలేశర్ అని పిలువబడే తిరువాయ్మొళి పిళ్ళైకు నేను నమస్కరిస్తున్నాను. నమ్మాళ్వార్ల అనుగ్రహంతో, వీరు అసమానమైన కైంకర్య సంపద పొంది ఆ కారణంగా శ్రేష్ఠతను గడించారు)

తరువాత, నాయనార్లు కూడా, తమ ఆచార్యుల [తిరువాయ్మొళి పిళ్ళై] నిర్దేశము ప్రకారం, తిరువాయ్మొళి దివ్య ప్రబంధ ఉపన్యాసం ఇవ్వడం ప్రారంభించారు. ఈ క్రింది శ్లోకంలో చెప్పినట్లే…

తదస్థు మూలభూతేషు తేషు దివ్యేషు యోగిషు
వవృతే వర్దయన్ భక్తిం వకుళాభరణాధీషు
తతా తద్దత్ ప్రపన్నార్థ సంప్రదాయం ప్రవర్తకాన్
అయమాద్రియత శ్రీమాన్ ఆచార్యానాధిమానపి

తరువాత, శ్రీమాన్ (కైంకర్యం సంపద కలిగి ఉండుటచేత) అళగియ మాణవాళ పెరుమాళ్ నాయనార్ నమ్మాళ్వార్ల పట్ల భక్తి ప్రపత్తులను పెంచుకుని, తమను తాను పోషించుకున్నారు. అదే విధంగా ఆళ్వార్ చేత చెప్పబడిన సాంప్రదాయ అర్థాలను తమ జీవితాల్లో అన్వయం చేసుకున్న పుర్వాచార్యుల పట్ల అమితమైన గౌరవాన్ని ప్రదర్శించారు. ప్రమాణాలు (గ్రంధాలు), ప్రమేయం (సర్వేశ్వరుడు) మరియు ప్రమాథలు (గ్రంధాల రచయితలు) పట్ల గొప్ప గౌరవాన్ని చూపుతూ, వీరు ఆళ్వార్ తిరునగరిలో దర్శనం పోషణ కొనసాగించెను.

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము: https://srivaishnavagranthams.wordpress.com/2021/08/12/yathindhra-pravana-prabhavam-28/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 27

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 26

ఒకరోజు తిరువాయ్మొళి ప్పిళ్ళై వారి తోటలో పండిన లేత కూరగాయలను నాయనార్ల తిరుమాళిగకి పంపారు. అందుకు నాయనార్లు సంతోషించి, “ఇవి ఆళ్వార్ల మడప్పళ్ళికి (వంటగదికి) పంపుటకు బదులు, ఈ అడియేన్ గృహానికి ఎందుకు పంపారు?” అని అడిగారు. పిళ్ళై అతనితో “ఈ దాసుడికి దేవర్వారి వంటి వారు ఇంతవరకు లభించలేదు, కాబట్టి అర్చారాధనలో మునిగి ఉండెను” అని నాయనార్లకు తమ మనస్సులోని భావనను తెలిపెను. ఆ రోజు నుండి వారు ప్రతిరోజూ నాయనార్లకి తాజా కూరగాయలను పంపేవారు. పైగా అన్ని విధాలుగా వారి అవసరాలను చూసుకునేవారు. భోజన సమయంలో నాయనార్లతో కలిసి కూర్చుని భోజనం చేసేవారు. వీటన్నింటిని చూసి, పిళ్ళై శిష్యులు కొందరు నాయనార్లను అసూయతో చూసేవారు. సర్వజ్ఞుడైన పిళ్ళై దీనిని గ్రహించి, నాయనార్ల పట్ల చెడు భావన పెరగక ముందే  ఆ మంటను మొదట్లోనే ఆర్పివేయాలనుకున్నారు. నాయనార్లు సాధారణ మనిషి కాదని, గొప్ప మహా పురుషులని పిళ్ళై తమ శిష్యులకు తెలిపెను. సూచనల ద్వారా నాయనార్ల విశిష్ట సామర్థ్యాలను వారికి వివరించి, నాయనార్లు ఎవరో కాదు ఆదిశేషుని అవతారమని వారికి అర్థమయ్యేలా వివరించెను. తరువాత పిళ్ళై శిష్యులు నాయనార్ల పట్ల విశిష్టమైన గౌరవముతో వ్యవహరించేవారు. నాయనార్లు కూడా, పిళ్ళైల దివ్య సంకల్పాన్ని  గ్రహించి, వారి పట్ల విధేయులై ప్రవర్తించేవారు. నాయనార్లు ఈ సమయంలో ఈడు ముప్పత్తారాయిరం (తిరువాయ్మొళి వ్యాఖ్యానం) అలాగే ఇతర వ్యాఖ్యానాములను నేర్చుకున్నారు.

నాయనార్లకు ఒక కుమారుడు జన్మించెను. వారు తిరువాయ్మొళి పిళ్ళై వద్దకు వెళ్లి, ఆ శిశువుకు తగిన పేరును తెలపమని కోరెను. “ఒక్కసారి కాదు, నూట ఎనిమిది సార్లు చెప్పపడింది కదా!” (ఇరామానుశ నూఱ్ఱందాదిని సూచిస్తూ) అని పిళ్ళై జవాబు చెప్పెను. నాయనార్లు తమ కుమారునికి ఎమ్మైయన్ ఇరామానుశ (నా స్వామి, రామానుజ) అని నామకరణము చేశారు. ఒకానొక తిరు ఆరుద్రా దినమున, ప్పిళ్ళైతో ఇతర ఆచార్యులు భోజనం చేస్తున్నప్పుడు, పిళ్ళై ఈ శ్లోకాన్ని పఠించారు.

ఇన్ఱో ఎదిరాశర్ ఇవ్వులగిల్ తోన్ఱియ నాళ్
ఇన్ఱో కలియిరుళ్ నీంగునాళ్

(ఇది యతిరాజు (రామానుజులు) అవతరించిన రోజు కాదా? కలి అంధకారము తొలగిన రోజు కదా?) వారు ఈ రెండు వాక్యాలను మళ్ళీ మళ్ళీ చెబుతూ మరొక మాట మాట్లాడలేదు. నాయనార్లు ఈ పాశురాన్ని ఇలా పూరించెను..

ఇన్ఱోదాన్
వేదియర్గళ్ వాళ విరైమగిళోన్ తాన్ వాళ
వాదియర్గళ్ వాళ్వడంగు నాళ్

(వేదమార్గాన్ని అనుసరించేవారికి అతి సంతోషాన్ని కలిగించినది ఈ రోజు; ఇది సుగంధబరితుడైన మగిళోన్ (నమ్మాళ్వార్) సంతోషించిన రోజు, వాద వివాదములు (వేదాలను నమ్మనివారు, వేదాలను వక్రీకరించువారు) చేసేవారి సంఖ్య తగ్గింది). అది విన్న పిళ్ళై ఎంతో ఆనందంతో తృప్తిగా భోజనం చేశారు. నాయనార్లు సంతోషంగా వారి శేష ప్రసాదాన్ని తీసుకున్నారు.

ఆ విధంగా ఆచార్యులు (పిళ్ళై) మరియు శిష్యుడు (నాయనార్లు) మధ్య క్రమబద్ధత బాగా సాగింది. ఎలాగైతే పెరియ నంబిని ఆశ్రయించిన తర్వాత ఎంబెరుమానార్లు విశిష్టతను పొందారో, పిళ్ళైల ఆశ్రయం పొందిన తర్వాత నాయనార్లు కూడా విశిష్టతను పొందారు. అందరూ వీరిని ఉడయవర్ల పునరవతారముగా కీర్తించడం ప్రారంభించారు. పిళ్ళై కోసం నాయనార్లు ఈ తనియన్లను రచించారు:

వడమామలైముదల్ మల్లనంతపురియెల్లై మల్గిత్
తిడమాగ వాళుం తిరువుడైయ మన్నరిల్ తేశుడైయోన్
తిడమాన జ్ఞాన విరక్తి పరమ్ ఇవై శేరనిన్ఱ
శటకోపతాదర్ కురుగూర్వాళ్ పిళ్ళైయై చ్చేరు నెంజే

(ఓ నా హృదయమా! తిరుక్కురుగూర్ నివాసులైన శఠగోప దాసులు అని కూడా పిలువబడే పిళ్ళైల దివ్య తిరువడిని చేరాలని ప్రయత్నించుము; వీరు భగవత్ విషయాలలో దృఢమైన జ్ఞానము ఉండి ప్రాపంచిక విషయాల పట్ల నిర్లిప్తత ఉన్నవారు; తిరుమల నుండి తిరువనంతపురము వరకు వీరి ప్రకాశము గోచరించుచున్నది) మరియు

శెందమిళ్ వేద త్తిరుమలైయాళ్వార్ వాళి
కుంతినగర్ క్కు అణ్ణల్ కొడై వాళి – ఉందియ శీర్
వాళియవన్ అముదవాయ్ మొళి కేట్టు అప్పొరుళిల్
తాళుం మఱ్ఱంబర్ తిరుత్తాళ్

(ద్రావిడ వేదం (నాలాయిర దివ్య ప్రబంధం) లో గొప్ప పండితులైన తిరుమలై ఆళ్వార్లు చిరకాలం వర్ధిల్లాలి; కుంతీనగర నాయకుడి (తిరువాయ్మొళి ప్పిళ్ళై జన్మస్థలం) మహిమకి జోహార్లు); వారి బోధనలను అనుసరించి వాటికి అనుగుణంగా జీవించిన వారందరి దివ్య చరణాలకు జోహార్లు). వారి కాలములో, పిళ్ళై శిష్యులు వారి గొప్పతనాన్ని మహిమ పరచుచూ ఈ శ్లోకాలను రచించారు:

అప్యర్సయ నందతనయం కరపంకజాత్త వేణుం తదీయచరణ ప్రవణార్ త్రచేతాః
గోధాబిదుర్గహన సూక్తినిబంధనస్య వ్యాక్యాం వయదాత్ ద్రావిడ వేదగురుః ప్రసన్నాం

(ఎర్రటి పద్మాల వంటి పాదాలతో, చేతిలో మురలిని పట్టుకొని ఉన్న ఆ గొల్ల బాలుడు శ్రీ కృష్ణుడి దివ్య తిరువడి యందు నిత్యభక్తిలో మునిగి ఉన్న తిరువాయ్మొళి ప్పిళ్ళై, పెరియాళ్వార్ల పాశురములకు స్పష్టమైన వ్యాఖ్యానము వ్రాశారు).

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము: https://srivaishnavagranthams.wordpress.com/2021/08/12/yathindhra-pravana-prabhavam-27/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 26

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 25

తిరువాయ్మొళి పిళ్ళై నాయనార్ ను ఉడయవర్ల (రామానుజుల) దివ్య తిరువడితో ముడిపెట్టి ఉంచుట.

(ఇకపై, పిళ్లై అనే పదం తిరువాయ్మొళి పిళ్లైని సూచిస్తుంది, నాయనార్ అనే పదం అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ ను సూచిస్తుంది, ఇది మామునిగళ్ (మాముణులు) ల పూర్వాశ్రమ నామము). పిళ్లై సంతోషంతో ఉడయవర్ల దివ్య తిరువడిని నాయనార్ కు చూపించెను. ఇరామానుశ నూఱ్ఱందాది పాశురము “అన్పదయుగమే కొండ వీట్టై ఎళిదినిల్ ఎయ్దువన్” (మీ దివ్య పాదాల దివ్య నివాసాన్ని సులభంగా పొందుతాను) లో పేర్కొన్నట్లుగా, పరమ పురుషార్థాన్ని పొంది ఆనందించెను. నమ్మాళ్వార్ల దివ్య తిరువడి యందు ప్రగాఢమైన భక్తి ప్రపత్తులతో ఉన్న పిళ్ళై కూడా, రామానుజుల కమలముల వంటి దివ్య పాదాలకు కైంకర్యం చేయాలనుకున్నారు. వారు దానిని తమ ధారక (జీవనము, పోషణకు మూలం) గా భావించి కైంకర్యం కొనసాగించెను. వీరు ఉడయవర్లకై  ఒక ప్రత్యేక ఆలయాన్ని నిర్మించి, చుట్టూ నాలుగు వీధులను నిర్మింపజేసి, ఆ వీధుల్లో పండితులు నివసించేలా చేసి, తద్వారా వారు నిరాటంకంగా రామానుజులకు సేవలు అందించేలా చేసి ఆ ప్రదేశాన్ని రామానుజ చతుర్వేది మంగళం అని నామకరణము చేసి పిలిచేవారు. ఇవన్నీ సుసంపన్నము చెసిన తర్వాత తృప్తిగా జీవించసాగారు.

నాయనార్లచే యతిరాజ వింశతి రచించన

దయతో పిళ్లై ద్వారా చూపిన ఉడయవర్ల దారిలో ముందుకు వెళుతూ నాయనార్, యతీంద్ర ప్రవణర్ (రామానుజరుల పట్ల ప్రగాఢమైన భక్తి ప్రపత్తులు గలవాడు) అని పిలవబడేంత మేరకు రామానుజుల తిరువడికి అంకితమైయ్యెను. వారి ప్రీతి ఫలితంగా, రామానుజులను వర్ణిస్తూ వారు యతిరాజ వింశతి రంచించెను. ఈ క్రింద పాశురంలో చెప్పినట్లు, రాబోయే తరాలవారికి కూడా ప్రయోజనం చేకూర్చే ఈ పరోపకార కార్యానికి వారు ఎంతో ప్రశంసలు అందుకున్నారు.

వల్లార్గళ్ వాళ్ త్తుం కురుకేశర్ తమ్మై మనత్తు వైత్తు
చొల్లార వాళ్ త్తుం మణవాళ మాముని తొండర్ కుళాం
ఎల్లాం తళైక్క ఎదిరాజవింజది ఇన్ఱళిత్తోన్
పుల్లారవింద త్తిరుత్తాళ్ ఇరండైయుం పోఱ్ఱు నెంజే

(మహా పండితులచే స్తుతింపబడే నమ్మాళ్వార్ని తమ మనస్సులో ఉంచుకొని మణవాళ మాముణులు తమ శబ్దాల ద్వారా స్తుతించారు. అటువంటి మణవాళ మాముణులు భక్త గణ శ్రేయస్సు కొరకు ఇరవై శ్లోకములతో కూడిన యతిరాజ వింశతిని రచించారు. ఓ నా హృదయమా! అటువంటి మణవాళ మాముణుల దివ్య పాద పద్మాలను స్తుతించుము).

యతిరాజ వింశతి విన్న పిళ్లై ఎంతో సంతోషించి, తిరుప్పుళియాళ్వార్ (నమ్మాళ్వార్లు నివాసమున్న దివ్య చింత చెట్టు) వద్ద తమకు లభించిన ఉడవర్ల దివ్య మూర్తి (విగ్రహాన్ని) వారికి ప్రసాదించెను. చతుర్వేది మంగళంలోని భవిష్యదాచార్య సన్నిధిలో ప్రతిష్టించబడిన ఉడయవర్ల ఉత్సవ మూర్తి గురించి తరతరాలుగా పెద్దల నుండి విన్న ఒక కథనం ఉంది. ఇది మధురకవి ఆళ్వార్ (నమ్మాళ్వార్ల విగ్రహాన్ని పొందాలనే కోరికతో) తమ స్వప్నములో నమ్మాళ్వార్ల నిర్దేశానుసారంగా, తామ్రపర్ణి నది జలాన్ని కాచారు. మొట్ట మొదట, ఉడయవర్ల విగ్రహం వ్యక్తమైంది. మధురకవి ఆళ్వారు తమ దివ్య మనస్సులో నమ్మాళ్వారుకి “ఈ విగ్రహం మీ దివ్య స్వరూపం కాదు” అని అనుకున్నారు. మధురకవి ఆళ్వార్తో నమ్మాళ్వార్ “ఇది తిరువాయ్మొళి 4.3.1 పొలిగ పొలిగ పాశురానికి సంబంధించిన భవిష్యధాచార్య విగ్రహం. పాశురం ‘కలియుం కెడుం కండుకొన్మిన్” లో పేర్కొన్న విధంగా కలి పురుషుడు కూడా భయపడి పారిపోయేలా వీరు అవతారం ఎత్తబోతున్నాడు. ఆయనను సేవించుము, తామ్రపర్ణి నది జలాన్ని మళ్లీ కాచుము, నా అర్చా విగ్రహము మీకు లభించును” అని ఆళ్వారు తెలిపెను.  నమ్మాళ్వార్ చెప్పినట్లే మధురకవి ఆళ్వార్ తామ్రపర్ణి నది జలాన్ని మళ్లీ కాచారు. ఆళ్వార్ తిరునగరి ఆలయంలో ఉపదేశ ముద్రతో దర్శనమిచ్చే నమ్మాళ్వార్ల దివ్య మూర్తి తమకు తాముగా వ్యక్తమైందని పెద్దలు చెబుతారు. ఆక్రమణదారులు దాడిచేయుటకు వచ్చినప్పుడు ఆళ్వార్ తిరునగరి ఆలయంలోని చింత చెట్టు దగ్గరే ఉడయవర్ల విగ్రహాన్ని తవ్వి పాతి దాచి ఉందబడిందని, నమ్మాళ్వార్లు ఆలయం విడిచి వలస వెళ్ళవలసి వచ్చిందని స్థల చరిత్ర చెబుతుంది. తరువాత తిరువాయ్మొళి పిళ్ళై ఆ ఆలయాన్ని శుభ్రం చేస్తుండగా వెలికి వచ్చిన ఉడయవర్ల ఈ దివ్య మూర్తిని ఆళ్వార్ సన్నిధిలో నమ్మాళ్వార్లతో పాటు సేవించాలని పెద్దలు నిర్దేశించారు. .

అటువంటి విగ్రహాన్ని పొందినందుకు నాయనార్లు కూడా పారవశ్యంతో పొంగిపోయెను. యతిరాజ వింశతి 19 లో చెప్పినట్లుగా “శ్రీమాన్ యతీంద్ర! తవదివ్య పాదాబ్జ సేవాం శ్రీ శైలనాథ కరుణాపరిణామదత్తాం” (ఓ ప్రముఖ రామానుజా! మీ దివ్య పాద పద్మాలకు చేసే సేవ శ్రీ శైలనాథ (తిరువాయ్మొళి పిళ్ళై) వారి దివ్య కృప వల్లనే సాధ్యమైనది). “యతీంద్రమేవ నీరంత్రం నిషేవే దైవతం పరం” అన్న శ్లోకములో పేర్కొన్నట్లుగా, ఎంబెరుమానార్ల (రామానుజుల) ని అత్యున్నతమైన వ్యక్తిగా భావించి వీరు సేవలు అందించెను. నమ్మాళ్వార్ మరియు ఎంబెరుమానార్లకు సేవ చేయడమే అత్యున్నత ఫలముగా భావించిన పిళ్ళై, నాయనార్ల జ్ఞానభక్త్యాధిని (జ్ఞానం, భక్తి మొదలైనవి) చూసి ఆలకిస్తూనే ఉండి, వారికి సహకారం అందిస్తూ ఉండేవారు.

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము: https://srivaishnavagranthams.wordpress.com/2021/08/10/yathindhra-pravana-prabhavam-26/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 25

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 24

అళగియ మణవాళ పెరుమాళ్ తిరుమలై ఆళ్వారుని ఆశ్రయించుట

తిగళక్కిడందాన్ తిరునావీఱుడైయ పిరాన్ తాదరణ్ణర్ తమ దివ్య తిరు కుమారుడైన అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ కు సుమారు ఆ రోజుల్లోనే వివాహం చేయించారు. వారు అతనికి అరుళిచ్చెయల్ (నాలాయిర దివ్య ప్రబంధం), రహస్యాలు (నిగూఢమైన అర్థ విషయాలు) మొదలైనవి బోధించారు. నాయనార్లు కూడా భక్తి శ్రద్దలతో తమ తండ్రి వద్ద ఉండి ఈ ఫలాన్ని స్వీకరించెను. వారు తమ తండ్రిగారిపై కూర్చిన తనియన్…

శ్రీ జిహ్వావదధీశధాసం అమలం అశేష శాస్త్రవిదం
సుందరవరగురు కరుణా కందళిత జ్ఞానమందిరం కలయే

(మొదటి పదానికి శ్రీ జిహ్వార్క్యాధీశం అని కూడా అంగీకరించబడింది; తనియన్ యొక్క అర్థం: కోట్టూర్ అళగియ మణవాళ ప్పెరుమాళ్ పిళ్ళై కృపకు పాతృలై, శాస్త్రాధ్యయనము చేసి నిష్కలంకమైన జ్ఞానానికి నిధి అయిన తిరునావీఱుడైయ పిరాన్ తాదరణ్ణర్ ను నేను ఆరాధిస్తున్నాను).

వాళి తిరునావీఱుడైయ పిరాన్ తాదనరుళ్
వాళియవన్ మామై వాక్కిన్బన్ – వాళియవన్
వీరన్ మణవాళన్ విరైమలర్ త్తాళ్ శూడి
బారమదై త్తీర్థళిత్త పణ్బు

(తిరునావీఱుడైయ పిరాన్ తాదరణ్ణర్ దయామహిమ; వారి పద సౌందర్య మాధుర్యానికి జోహార్లు; అళగియ మణవాళుని (శ్రీ రంగనాధుడు) దివ్య తిరువడి సౌందర్యీకరించినందుకు జోహార్లు, అడ్డంకులను తగ్గించే వారి స్వభావానికి జోహార్లు అని అర్థము).

కొంత కాలము తరువాత, అణ్ణర్ దివ్య వైకుంఠ లోకానికి చేరుకున్నారు. అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్లు వారికి చరమ కైంకర్యాలను పూరించారు. ఇదిలా ఉండగా, ఆళ్వార్ తిరునగరిలో, దర్శనానికి నాయకత్వం వహిస్తున్న తిరుమలై ఆళ్వార్, ఇకపై ఎవరు నిర్వహిస్తారోనని యోచించు చుండెను. వీరు తిరువాయ్మొళి యొక్క పద మాలలు, వాటి అర్థాల అనుసంధానములో నిరంతరం లీనమై ఉండి జీవనం కొనసాగిస్తుండేవారు. వీరు కేవలం తిరువాయ్మొళితో  మాత్రమే ముడిపడి ఉండి, ఇతర గ్రంథాలను గడ్డి పోచతో సమానంగా చూసేవారు. తిరువాయ్మొళితోనే ఉన్న సంబంధాన్ని వారి గుర్తింపుగా చేసుకున్నందువల్ల వీరు తిరువాయ్మొళి పిళ్ళైగా ప్రసిద్ధి గాంచెను. వీరు ఆళ్వార్ (నమ్మాళ్వార్) దివ్య తిరువడి సేవను కొనసాగించు చుండెను. అటువంటి తిరువాయ్మొళి పిళ్ళైల దివ్య అనుగ్రహ ఛత్ర ఛాయలో అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్లు ఆశ్రయము పొందెను. “తిరువనంత ఆళ్వాన్ సకందన్నై త్తిరుత్త మరువియ కురుగూర్ వాళనగర్ వందు” (ఈ ప్రపంచాన్ని సరిదిద్దడానికి ఆదిశేషుడు తిరుక్కురుగూర్ నివాసానికి చేరుకున్నారు) అని చెప్పబడినట్లుగా, అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్లు సిక్కల్ కిడారంలోని తమ తాతగారి ఇంటిని విడిచిపెట్టి తమ జన్మ స్థలమైన ఆళ్వార్ తిరునగరిని వచ్చారు. “పొరునర్సంగణిత్ తుఱైయిలే సంగుగళ్ సేరుమాపోలే”  (సంగణిత్ తుఱై అనే దివ్య స్థలానికి సమీపంలో ఉన్న తామిరపరణిలో శంఖాలు చేరినట్లు), శుద్ధ స్వభావము, శంఖం వర్ణముతో ఆదిశేషుడు అళగియ మణవాళ పెరుమాళ్ గా అవతరించి శుద్ధ జ్ఞానులైన తిరువాయ్మొళి పిళ్ళైల దివ్య తిరువడిని ఆశ్రయించెను. “అశిశ్రియతయం భూయః శ్రీ శైలాధీశ దేశికం” అనే శ్లోకములో చేప్పినట్లుగా వీరు తిరువాయ్మొళి పిళ్ళైతో విశేష సంబంధాన్ని ఏర్పరచుకొనెను మరియు “దేశం తిగళుం తిరువాయ్మొళి పిళ్ళై వాసమలర్ త్తాల్ అడైందు” (ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరువాయ్మొళి పిళ్ళైల సువాసన భరితమైన దివ్య తిరువడిని చేరెను) అని అర్థము.

ఆ తరువాత, ఇలా చెప్పబడినట్లు…

తదశ్ శృతితరస్సోయం తస్మాద్ తస్య ప్రసాదనః
అశేషనశృణోద్దివ్యాన్ ప్రబంధం బంధనచ్చిదః

(తరువాత, వీరు వేదాంగములను నేర్చుకున్నారు,  తిరువాయ్మొళి పిళ్ళైల అనుగ్రహముతో అళగియ మణవాళ పెరుమాళ్ సంసార సంబంధాన్ని తెంచే అరుళిచ్చేయల్ (నాలాయిర దివ్య ప్రబంధం) అర్థాలను కూడా నేర్చుకొనెను. వీరు ద్రావిడ వేదం (నాలాయిర దివ్య ప్రబంధం) వాటి అంగములు, ఉపాంగములను తిరువాయ్మొళి పిళ్ళైల సూచనల ద్వారా వాటి అర్థాలను నేర్చుకొనెను. వీరు శేషి, శరణ్యం, ప్రాప్యన్ అనే మూడు గుణాలతో తిరువాయ్మొళి పిళ్ళైపై ధ్యానం చేసే చరమ పర్వ నిష్ఠలో గాఢంగా స్థిరమై ఉండెను. “మిక్క వేదియర్ వేదత్తిన్ ఉట్పొరుళ్” (వేదాల యొక్క అంతర్గతార్థాలు) లో చెప్పబడినట్లు ఇదే సమస్థ వేదాల సారము.

అడియేన్ శ్రీదేవి రామానుజ దాసి

మూలము: https://srivaishnavagranthams.wordpress.com/2021/08/09/yathindhra-pravana-prabhavam-25/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 24

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 23

ఇప్పుడు శ్రీరంగం కథనం

ఆ రోజుల్లో, శ్రీరంగంలో ఉండే మహాత్ములు ప్రతిరోజూ “శ్రీమన్ శ్రీరంగ శ్రీయం అనుపద్రవాం అనుదినం సంవర్ధయ” (ఏ ఆటంకం లేకుండా ప్రతి దినము శ్రీరంగ సంపద (దాస్యం) పెరగాలి) అనే శ్లోకాన్ని పఠించేవారు.” దానితో పాటు పెరియాళ్వార్ల “తిరుప్పల్లాండు” (పెరియ పెరుమాళ్ చిరకాలము వర్ధిల్లాలి), తిరుమంగై ఆళ్వార్ల శ్రీరంగ పాశురమైన “ఏళై ఏదలన్” (ఈ అల్పమైన వ్యక్తి…), నమ్మాళ్వార్ల 7.4.1 పాశురం “ఆళి ఎళచ్చంగుం” (ఆ దివ్య శంఖ చక్రములు వర్ధిల్లాలి) అని పెరుమాళ్ళకు శరణాగతి చేస్తూ మంగళాశాసనాలు చేసేవారు. వారి మంగళాశాసనాలు సెంజి (తిరువణ్ణామలై) కి రాజైన గోపణార్యన్ గా ఫలించింది. వారు తిరుపతికి వెళ్లి, అక్కడ నంపెరుమాళ్ళను సేవించి, తిరుగు ప్రయాణంలో, దయతో నంపెరుమాళ్ళను సెంజికి సమీపంలోని సింగరాయపురం పట్టణానికి తీసుకువచ్చారు. వారు శ్రీరంగంలో పాతుకొని ఉన్న దుష్ఠ శక్తులపై దాడి చేసేందుకు అనువైన సమయం కోసం ఎదురుచూస్తూ ఎంతో భక్తిశ్రద్ధలతో నంపెరుమాళ్ళను ఆరాధించుచుండెను. దాడి చేయడానికి సరైన సమయము చుసి  తిరుమణత్తూన్ నంబికి సైగనిచ్చారు. గోపణార్యన్, అపార సైన్య బలంతో వెళ్లి పోరాడి, ఆక్రమణదారుల బారి నుండి శ్రీరంగాన్ని విడిపించి, ఈ శ్లోకంలో చెప్పబడినట్లుగా, పెరియ పెరుమాళ్ళ సన్నిధిలో శ్రీదేవి మరియు భూదేవులతో కూడి నంపెరుమాళ్ళను ప్రతిష్టించారు.

ఆనీయానీలశృంగత్యుదిరచిత జగద్రంజనాతంచనాత్రేశ్ సెంజ్యాం
ఆరాద్య కంచిత్ సమయమత నిహద్దయోత్తనుష్టాన్ తురుష్కాన్
లక్ష్మీ క్షమాప్యాముపాప్యాం సహ నిజనిలయే’స్థాపయత్ రంగనాథం
సమ్యక్చర్యాం సపర్యామకృత నిజయశో దర్పనో గోపణార్యః

(అద్దంలా ప్రకాశించే కీర్తి కలిగిన గోపణార్యన్, అంజనాచలం అని కూడా పిలువబడే తిరువేంగడం నుండి నంపెరుమాళ్ళను దయతో వారి స్వస్థలమైన సెంజికి తీసుకువచ్చారు. కొంత కాలము అక్కడ వారు పెరుమాళ్ళని సేవిస్తూ, తమ విల్లు బాణాలతో తుర్కులపై దాడిచేసి చంపి, ఉభయ దేవేరులతో శ్రీరంగనాథుని వారి నివాసమైన శ్రీరంగంలో ప్రతిష్టించి, సముచితమైన సేవలు నిర్వహించెను).

“కొంగుం కుడందైయుమ్ కోట్టియూరుం పేరుం ఎంగుం తిరిందు విళైయాడుం…” (కొంగు నాడు [తమిళనాడు పశ్చిమ ప్రాంతం], తిరుక్కోట్టియూర్, తిరుప్పేర్  మొదలైన) అనే పాశురంలో చెప్పినట్లుగా, “మయల్మిగు పొళిళ్ శూళ్ మాలింజోలై” (మంత్ర ముగ్ధులను చేసే పండ్ల తోటలతో చుట్టుముట్టబడి ఉన్న), “వీరైయార్ పొళిళ్ వేంగం” (పరిమళంతో కూడిన తోటలతో నిండిన తిరుమల), ఈ చోట్లంన్నింటికీ వెళ్లి శత్రువులు సంహరించబడిన తరువాత, సకాప్తం 1293, పరితాపి సంవత్సరం, వైకాసి మాసం (ఋషభ మాసం) 17వ రోజున “కోయిఱ్పిళ్ళాయ్ ఇంగే పోదరాయే” (ఓ! కోయిల్ నివాసి, ఇక్కడికి రా!) పాశురములో చెప్పబడినట్లు శ్రీరంగానికి  తిరిగివచ్చెను. “రామస్సీతామనుప్రాప్య రాజ్యం పునరవాప్తవాన్” (శ్రీరాముడు సీతను గెలిచి రాజ్యాన్ని పొందాడు) అని అయోధ్య వలె శ్రీరంగము కూడా ఉత్సవాలు మరియు సంబరాలు చేసుకుంది. “తిరుమగళోడు ఇనిదు అమర్ంద సెల్వన్” (ఎమ్పెరుమాన్, శ్రీమహాలక్ష్మితో ఆసీనులై ఉన్నారు), “వీఱ్ఱిర్ఉంద మణవాళర్ మన్ను కోయిల్” (అళగియ మణవాళన్ (నంపెరుమాళ్) కొలువై ఉన్న ఆలయము) అని చెప్పినట్లు), అళగియ మణవాళన్ తమ ఉభయ నాయ్చిమారులతో సేరపాణ్డియన్ పైన ఆసీనులై తమ వైభవముతో శ్రీరంగంపై తన దొరతనాన్ని తెలియజేసే ఆ దృశ్యం చూడదగ్గది.

సుదూర ప్రాంతాలలో నివసించే శ్రీవైష్ణవులు కూడా ఈ సంఘటన గురించి విని, ఈ శ్లోకములో  చెప్పినట్లే పరమానందభరితులైనారు.

బహూనినామ వర్షాణి గతస్య సుమత్వనం
శృనోమ్యహం ప్రీతికారం మమనాథస్య కీర్తనం

(ఎంతో కాలం పాటు అడవులలో బస చేసిన నంపెరుమాళ్ తిరిగివచ్చారన్న గొప్ప వార్త విన్నాను), చాలా కాలం తర్వాత నంపెరుమాళ్ తిరిగి రావడం తమ అదృష్టమని భావించారు. వెంటనే, అందరూ అక్కడికి వచ్చి, నంపెరుమాళ్ళ దివ్య పాదాలను సేవించి, “ప్రహృష్టం ఉత్తీర్ణలోకం” (ప్రజలు ఎంతో ఆనందించారు) లో చెప్పినట్లు ఎంతో సంతోషించారు. పెరుమాళ్ (ఎమ్పెరుమాన్) కూడా, శ్రీ రామాయణ శ్లోకంలో “విజ్వరః ప్రముమోతః” (భయ జ్వరాలు తొలగిన తర్వాత సంతోషంగా ఉన్నట్లు) చెప్పినట్లు ప్రతి ఒక్కరినీ చల్లగా చూస్తూ వారిపై తన కరుణను కురిపించారు. దక్షిణం వైపు చూస్తూ అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్లపై తమ కరుణను కురిపించారు.

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము: https://srivaishnavagranthams.wordpress.com/2021/08/08/yathindhra-pravana-prabhavam-24/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org