అంతిమోపాయ నిష్ఠ – 8

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్ వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః

అంతిమోపాయ నిష్ఠ

మునుపటి వ్యాసములో, (https://srivaishnavagranthamstelugu.wordpress.com/2022/04/10/anthimopaya-nishtai-7/), మనము నంపిళ్ళై యొక్క విశిష్ఠతను వారి జీవితములోని పెక్కు సంఘటనల ద్వారా గమనించితిమి. ఇంక మనము మన పూర్వాచార్యుల జీవితములలోని మిక్కిలి అద్భుతమైన సంఘటనలను పరిశీలించెదము.

మలై కునియ నిన్ఱ పెరుమాళ్ (ఆళ్వాన్ / భట్టర్ వంశీకులు) మన సంప్రదాయమునకు నాయకులుగా ఉండి, ప్రస్తుతము శ్రీరంగములో నివసించుచున్నారు. వారి తండ్రి గారికి మన జీయర్ (మాముణులు) తో ప్రత్యేక అనుబంధము కలదు. మాముణులు తిరువాయ్మొళిలోని ఈడు 36000 పడి వ్యాఖ్యానమును, ఇతర వ్యాఖ్యానములను పూర్తిగా కంఠస్థము చేసిరి. వారు మన జీయరును ప్రేమతో ” 36000 పెరుక్కార్ ” (ఈడు 36000 పడి వ్యాఖ్యానమును పోషించిన వారు) అని సంభోదించిరి, మాముణులు చేసిన కాలక్షేపమును ఆనందముగా ఆస్వాదించిరి. అదే సమయమున, పరీతాపి నామ సంవత్సరము శ్రావణమాసములో, నంపెరుమాళ్ తిరుపవిత్రోత్సవ మండపమునకు వేంచేసిరి. ఆ పెద్ద సభ ముందు నంపెరుమాళ్, తానే స్వయముగా మన జీయరును (మామునులు) ప్రత్యేకముగా ఆహ్వానించి, శ్రీ శఠగోపము మరియు వారి పూమాలలు, తీర్థము, ప్రసాదము మొదలైన వానితో ఆశీర్వదించిరి. తదుపరి మామునులతో “రేపటి నుంచి మన పెరియ తిరుమండపము (పెరియ పెరుమాళ్ తిరు సన్నిధి అభిముఖముగా) లో మీరు నంపిళ్ళై యొక్క ఈడు 36000 పడి వ్యాఖ్యానమును అనుసరించి, తిరువాయ్మొళి దివ్య అర్ధమును వివరించగలరు” అని ఆదేశించిరి. తదుపరి దినము, నంపెరుమాళ్ ఉభయ నాచ్చియార్లతో కూడి, సేనై ముదలియార్, నమ్మాళ్వార్, యతిరాజులు (ఇతర ఆళ్వార్లు మరియు ఆచార్యులు) తో కలిసి మండపమునకు వేంచేసిరి, పెరియ ఇళ్యార్ కాలక్షేపమును మండపములో గల గొప్ప శ్రీవైష్ణవులతో కూడి ఆలకించసాగిరి. ఈ సంఘటనను ఈ క్రింది పాశురములో వివరించిరి.

నల్లతోర్ పరీతాపి వరుడన్తన్నిల్ నలమాన ఆవణియిన్ ముప్పత్తొన్ఱిల్
చొల్లారియ చోతియుడన్ విళన్గు వెళ్ళిక్కిళమై వళర్పక్కమ్ నాలామ్నాళిల్
చెల్వమిగు పెరియ తిరుమణ్డపత్తిల్ చెళుం తిరువాయ్మొళిప్పొరుళైచ్ చెప్పుమెన్ఱు
వల్లియుడై మణవాళర్ అరన్గర్ నన్గళ్ మణవాళ మునిక్కు వళంగినార్.

ఆ విధముగా, నంపెరుమాళ్ మరియు తదితరులు తిరువాయ్మొళి కాలక్షేపమును (36000 పడి, ఇతర 4 వ్యాఖ్యానములు) ఎట్టి అవరోధము లేకుండా ఒక సంవత్సరము (10 మాసములు) పాటు పూర్తిగా ఆలకించిరి. మరల, చివరి రోజున ఆణి మూలము రోజున, నంపెరుమాళ్ అందరితో కలసి మండపమునకు చేరిరి. జీయర్ అద్భుతముగా సాయించుచున్న శాత్తుముఱైను శ్రవణము చేసిరి. ఆ తదుపరి నంపెరుమాళ్ మిక్కిలి ఆనందముతో, జీయరును గొప్పగా గౌరవించిరి. (అనువాదకుని గమనిక : మాముణులకు తమ శేష పర్యంకమునే గాక, శ్రీశైలేశ దయా పాత్రము అను తనియన్ ను అనుగ్రహించి, వారిని తమ ఆచార్యులుగా అంగీకరించిరి. ఈ తనియన్ను అన్ని దివ్య దేశములలో ప్రచారము చేసిరి). ఇట్టి గొప్ప కైంకర్యమును నంపెరుమాళ్ తనకు అనుగ్రహించుటచే, వారి దివ్య / ప్రత్యేక ఆశీర్వచనమునకు, జీయర్ వారిపై సదా వినయముతో మరియు కృతజ్ఞతగా ఉండిరి.

నామార్! పెరియ తిరుమణ్డపమార్!
నమ్పెరుమాళ్ తామాగ నమ్మైత్ తనిత్తళైత్తు
నీ మాఱన్ చెన్తమిళ్ వేదత్తిన్ చెళుం పొరుళై నాళుమిన్గే వన్తురై
ఎన్ఱేవువతే వాయ్ంతు

నేను ఎవరిని? ఈ పెరియ తిరుమండపము యొక్క మహిమలు ఏమిటి? నన్ను ఈ ద్రావిడ వేదము (తిరువాయ్మొళి 36000 పడి ద్వారా) యొక్క దివ్య అర్ధములను ప్రతి రోజు (సంవత్సరము పూర్తిగా) వివరించుడని, నంపెరుమాళ్ శాసించుట, అది వారికే ఒక గొప్ప ఆశీర్వాదము.

అదే విధముగా, మాముణులతో అనుబంధము గల ఆ నాటి గొప్ప ఆచార్యులు / శ్రీవైష్ణవులు, ఈ విధముగా ప్రకటించిరి.

వలంపురియాయిరమ్ చూళ్ తరవాళి మరున్గొళురు చెలమ్చెలనిన్ఱు ముళుంగుగ పోల్
తనతు తొణ్డర్ కులమ్ పల చూళ్ మణవాళ మాముని కోయిలిల్ వాళ
నలన్గడల్ వణ్ణన్ మున్నే తమిళ్ వేదమ్ నవిఱ్ఱననే.
తారార్ అరంగర్ మున్నాళ్ తన్తామళిత్తార్ చీరార్ పెరియ తిరుమణ్డపత్తుచ్ చిఱంతై
ఎన్ ఆరావముతనైయాన్ మణవాళ మామునియైయళైత్తు ఏరార్ తమిళ్ మఱై ఇంగేయిరుంతు చొల్ ఎన్ఱననే

శ్రీరంగములోని నివసించే తమ వేలాది శిష్యులు గుమిగూడి ఉండగా, మాముణులు తమిళ్ వేద అర్ధములను ఎంపెరుమాన్ ఎదురుగా వివరించిరి. ఇటుల చేయుటకై, సుందరుడైన శ్రీరంగనాథుడు, మణవాళ మాముణులను తమ పెరియ తిరుమండపమునకు ఆహ్వానించి, తిరువాయ్మొళి యొక్క అందమైన అర్ధములను అచ్చట అనుగ్రహించమని దీవించారు.

మాముణుల శిష్యులు, ఆ విధముగా వారిపై గల కృతఙ్ఞతను చూపిరి, తమ జీయర్ (మాముణులు) పైన తప్ప ఇతరులెవరి పైనను చూపని ఈ ఆదరణను, నంపెరుమాళ్ కృప చేసిన ఇట్టి దైవిక చర్యను ఆదరించిరి.

ఇప్పుడు, నేను (పరవస్తు పట్టర్పిరాన్ ఇళ్యార్) నా ఆచార్యుని కీర్తిని గురించి (మధ్యలో నంపిళ్ళై వైభవముతో) మాట్లాడుట ప్రారంభించాను, ఎందుకంటే, గురువు నిత్యము ప్రకాశించును.

  •  ప్రతి ఒక్కరు తమ ఆచార్యుని / గురువుని సదా కీర్తించాలి
  • కణ్ణినుణ్ శిఱుత్తాంబు – ‘ఎండిశైయుం అఱియ్అ ఇయంబుకేన్ ఒణ్ తమిళ్ చ్చటగోపన్ అరుళైయే’ – నేను (మధురకవి ఆళ్వార్), నమ్మాళ్వార్ యొక్క దయను తెలిపి వారిని అన్ని మార్గములలో (ప్రతి చోట) కీర్తించెదను 
  • శ్రీ వచన భూషణం – వ్యాక్యానం అచ్చర్య వైభవం – ఆచార్యుని ఉత్కృష్టతను తెలియజేయుట అందరి యొక్క బాధ్యత.

అనువాదకుని గమనిక: ఆ విధముగా ఆణి తిరుమూలం రోజున, పెరియ జీయరును నంపెరుమాళ్ కీర్తించుట / ఆదరించుట అను దైవ ఘటనను మనము తిలకించాము, వారిని తమ ఆచార్యునిగా అంగీకరించుట, వారికి తమ శేష పర్యంకమును బహుకరించుట, ఇంకను గొప్ప విశేషము “శ్రీశైలేశ దయా పాత్రమ్ ధీభక్త్యాది గుణార్ణవం, యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిమ్” అను తనియన్ను అనుగ్రహించుట, అన్ని దివ్య దేశములలో ప్రచారము చేయుట, మొ || అనునవి నంపెరుమాలే స్వయముగా తమ ఆచార్యునిపై అంతిమోపాయ నిష్ఠను ప్రదర్శించుటగా చెప్పవచ్చును మరియు జగత్తు అంతయు దీనిని తిలకించి, అనుసరించగలదు.

సశేషం….

అడియేన్ బొమ్మకంటి గోపిక్రిష్ణమాచార్యులు రామానుజ దాసన్.

మూలము: http://ponnadi.blogspot.com/2013/06/anthimopaya-nishtai-8.html

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

Leave a comment