యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 54

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 53

అనంతరం, ఈ శ్లోకములో చెప్పినట్లుగా మాముణులు…..

తతః సజమూలజీతశ్యామ కోమలవిగ్రహే
పీతకౌశేయసం విధే పీనవృత్త చతుర్భుజే
శంఖచక్ర గదాధరే తుంగ రత్న విభూషణే
కమలా కౌస్తుభోరస్కే విమలాయత లోచనే
అపరాధసహే నిత్యం దహరాకాశ గోచరే
రేమేధామ్ని యథాకాశం యుజ్ఞానోధ్యాన సంపదా
సతత్ర నిశ్చలం చేతః చిరేణ వినివర్తయన్

(నల్లని మేఘ వర్ణుడు, అతి సౌందర్యవంతుడు, పట్టు పీతాంబరం ధరించి, తమ దివ్య చతుర్భుజాలలో శంఖం, చక్రం, గదా మొదలైన దివ్యాయుధాలను ధరించి, అరుదైన రత్నాభరణాలతో అలంకృతుడై, వక్షస్థలములో పిరాట్టి, కౌస్తుభ మణి భూషితుడై, మచ్చలేని విశాల దివ్య నేత్రాలు కలిగి, తన భక్తుల అపరాధాలను క్షమించి సహిస్తూ, చేతనుల హృదయాలలో ఆనందంగా నివాసుడై ఉన్న పరమ ప్రాప్య పరమ పురుషునితో మాముణులు ఐక్యమై తమ ధ్యాన సమృద్ధి ద్వారా ధ్యానిస్తున్నారు. ఇలా సంతోషంగా ఉండే మాముణులు, సమయం దొరికినప్పుడల్లా, ఆ పెరుమాళ్ళతో ఐక్యమై సుస్థిరంగా ఉన్న తమ దివ్య మనస్సుని మరలా తిరిగి తెచ్చుకునేవారు). తమ అంతర్యామితో సుస్థిరంగా మునిగి ఉన్న తమ దివ్య మనస్సుని తిరిగి తెచ్చుకునేవారు. అనంతరం తమ దివ్య మనస్సుని యతీంద్రుల (రామానుజులు) భక్తిలో లీనం చేసేవారు. లీనం చేసి యతిరాజ వింశతి (రామానుజులపై మాముణులు కూర్చిన ఇరవై శ్లోకాలు) పఠించేవారు; ఆ తర్వాత శ్రీ వచన భూషణం (పిళ్ళై లోకాచార్యులు స్వరపరిచిన దివ్య ప్రబంధం) పై వ్యాక్యానించేవారు. సాయంత్రం వేళ కూడా, వారు మధ్యాహ్నం నిర్వహించిన అన్ని అనుష్టానామాలను అనుసరించి, సన్నిధికి తిరిగి వెళ్లి, తిరుప్పల్లాండు (నాలాయీర దివ్య ప్రబంధంలో పఠించాల్సిన మొదటి పాశురములు) సేవించి, మంగళాశాసనములు సమర్పించుకుని ఈ క్రింది శ్లోకములో పేర్కొన్నట్లుగా శయనించుటకు సిద్ధమైయ్యేవారు.

తతః కనకపర్యంకే తరుణ ధ్యుమణిధ్యుతౌ
రత్నదీపద్వయోతస్త మహతః స్తోమస మేదినే
సోపదానే సుఖాసీనం సుకుమారే వరాసనే
అనంతహృదయైర్ తన్యైర్ అంతరంగైర్ నిరంతరం
శుశృషమాణైః శుచిబిః ద్విద్రైర్భృత్యైః ఉపాసితం
ప్రాచాం ఆచార్యవర్యాణాం సూక్తివృత్యనువర్ణనైః
వ్యాచక్షాణాం పరంతత్వం వక్తం మందతియామపి

(మాముణులు తప్పా మరే ఇతర ధ్యాస లేని, ఇద్దరు ముగ్గురు అంతరంగ శిష్యులతో నిరాటకంగా సేవలందుకునే మాముణులు, సూర్యకాంతి వలె మెరిసే రెండు మాణిక్య దీప కాంతుల మధ్య మేలిమి బంగారంతో చేసిన అందమైన మంచంపైన, మృదువైన ఒరుగుదిండ్లతో అలంకరించి ఉన్న ఆసనంపై ఆసీనులై కృపతో పూర్వాచార్యుల దివ్య వ్యాక్యానాలను అతి సరళంగా జ్ఞానములేని వ్యక్తులకు కూడా అర్థమైయ్యే విధంగా వివరించేవారు), తమ దివ్య విశ్రాంతి గదిలోకి ప్రవేశించి, మంచంపైన పడుకొని పూర్వాచార్యుల బోధమనుష్టానములను (వారు బోధించి ఆచరించిన) వివరించేవారు. అటువంటి లోతైన వివరణలను ఆస్వాదిస్తూ, అదే సమయంలో మాముణుల సంరక్షణ గురించి అక్కరలేని చింత చేస్తూ, వారి అంతరంగ శిష్యులు వారిని కీర్తించేవారు.

మంగళం రమ్యజామాతృ మునివర్యాయ మంగళం
మంగళం పన్నకేంద్రాయ మర్త్యరూపాయ మంగళం
ఏవం మంగళవానీపిరేనం సాగ్యలి పంతనాః
సకృత్య సంప్రసీదంతం ప్రనేముః ప్రేమ నిర్భరాః

(ఆచార్యోత్తముడైన మణవాళ మాముణులకు శుభం జరగాలి; మణవాళ మాముణుల స్వరూపంలో అవతరించిన ఆదిశేషునికి శుభం జరగాలి; చేతులు జోడించి ఇలా భక్తితో నమస్కరించి మంగళం పాడిన తమ శిష్యుల అరాధనలను మణవాళ మాముణులు సంతోషంగా స్వీకరించారు). ఉప్పొంగుతున్న భక్తితో శిష్యులు రెండు చేతులు జోడించి అంజలి ముద్రలో వారి ఎదుట సాష్టాంగములు సమర్పించారు. ఈ క్రింది శ్లోకములో చెప్పినట్లు, ఇక సెలవు తీసుకోండని వారికి అనుమతి ఇచ్చారు.

తతః సజ్జీకురుతం బృత్యైః శయనీయం విభూషయన్
యుయోజ హృదయం ధామ్ని యోగిత్యేయ పదద్వయే

(తరువాత తమ శిష్యులు సిద్ధం చేసిన పరుపుపై ​​పడుకుని, పరమ యోగులు ధ్యానించే ఆ పరమ పురుషుని దివ్య పాదాలపై తమ మనస్సును ఉంచారు), భగావానునికి పరుపుగా ఉన్న మణవాళ మాముణులు, స్వయంగా తాను ఒక పరుపు మంచం మీద పడుకున్నారు. నిద్రకి సిద్ధమవుతూ, శ్వేత వర్ణుడైన ఆదిశేషునిపై ఆశ్రయించి ఉన్న వాని దివ్య తిరువడి యందు తమ దివ్య మనస్సును ఉంచారు.

మూలము: https://srivaishnavagranthams.wordpress.com/2021/09/07/yathindhra-pravana-prabhavam-54/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s