యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 82

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 81

తనియన్ అవతరించిన మాసం, సంవత్సరం మొదలైన వివరణలు

తనియన్, వాళి తిరునామాలు ఆవిర్భవించిన నెల తిథుల గురించి అయోధ్య రామానుజ అయ్యంగార్లు ఇళైయాళ్వార్ పిళ్ళైని అడిగారు. ఇలైయాళ్వార్ పిళ్ళై ఈ క్రింది పాశురముల రూపంలో వివరించారు.

నల్లదోర్ పరితాబి వరుడందన్నిల్ నలమాన ఆవణియిన్ ముప్పత్తొన్ఱిల్
శొల్లరియ శోదియుడన్ విళంగువెళ్ళిత్ తొల్కిళమై వళర్పక్క నాలానాళిల్
శెల్వమిగు పెరియ తిరుమండపత్తిల్ శెళుం తిరువాయ్మొళి ప్పొరుళై చ్చెప్పుమెన్ఱు
వల్లియుఱై మణవాళర్ అరంగర్ నంగణ్ మణవాళ మాముని వళంగినారే

(ఈడు కలాక్షేపం ప్రారంభమైంది పరితాపి సంవత్సరం, ఆవని మాసం (శ్రావణ మాసం), 31వ దినము, స్వాతి నక్షత్రం, శుక్రవారం, శుక్ల పక్షం చతుర్థిలో ప్రారంభమైంది)

ఆనంద వరుడత్తిల్ కీళ్మై ఆండిల్ అళగాన ఆనిదనిన్ మూల నాళిల్
బానువారంగొండ పగలిల్ శెయ్య పౌరణమియినాళియిట్టు ప్పొరుంది వైత్తే
ఆనందమయమాన మండబత్తిల్ అళగాగ మణవాళరీడు శాత్త
వానవరుం నీరిట్ట వళక్కే ఎన్న మణవాళ మామునిగళ్ కళిత్తిట్టారే

(ఈడు శాఱ్ఱుముఱ (ఈడు చివరి పారాయణం) ప్రమాదీ నామ సంవత్సరం, జేష్ట్య మాసం (మిథున మాసం), మూల నక్షత్రం, ఆదివారం, పౌర్ణమి రోజున సంపూర్ణమైనది.) [పైన పేర్కొన్న ఈ రెండు పాశురములు అప్పిళ్ళర్ కృపతో రచించారు]. అయోధ్య రామానుజ అయ్యంగార్లు తమ స్వప్నంలో బద్రికాశ్రమ నారాయణుడు దర్శనమెలా ఇచ్చి, ఆ తనియన్ (శ్రీశైలేశ దయాపాత్రం) ను కంఠస్థం చేయించారో, సంప్రదాయం ప్రకారం పాశుర పారాయణం చివరిలో పఠించాలని పెరుమాళ్ళు ఎలా ఆదేశించారో వెల్లడించారు; ఆశ్చర్యపోయారు, పారవశ్యులైనారు. ఇక్కడ ఉన్న ప్రముఖులు, ఇళైయాళ్వార్లు, “ఈ తనియన్ భగవానుని ప్రసాదం కాదా!” అని సంతోషించి కీర్తించారు. కొంత సేపటి తరువాత కోలుకున్న రామానుజ అయ్యంగార్లు ఇళైయాళ్వార్ పాదాల మీద పడి, మణవాళ మాముణుల మహిమలను చెప్పమని వేడుకున్నారు. ఇళైయాళ్వార్ అంగీకరించి మఠంలో వివరిచెదమని చెప్పి, తిరుప్పావై పారాయణం పూర్తి చేసి, తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు. అనంతరం, ఇళైయాళ్వార్ రామానుజ అయ్యంగార్ల మఠానికి వెళ్లి, మణవాళ మాముణుల మహిమలను వివరించి వారికి ఎంతో ఆనందం కలిగించారు. మణవాళ మాముణుల గొప్పతనాన్ని విన్న రామానుజ అయ్యంగార్లు వారిని ప్రత్యక్షంగా దర్శించుకోవాలని ఆశించారు. శ్రీరంగం నుండి ఇళైయాళ్వార్ పిళ్ళైతో వచ్చిన రామానుజ దాసర్, అయోధ్య రామానుజ అయ్యంగార్ల మనస్సులోని కోరికను గ్రహించి,  తాను బద్రికాశ్రమం, ఇతర దివ్య దేశాలలో కొంత కాలం దేవర్వారి ఆదేశం ప్రకారం అడియేన్ కైంకర్యం చేస్తానని, దేవర్వారరు ఇళైయాళ్వార్ పిళ్ళైతో కలిసి జీయర్ తిరువడిని సేవించుటకై శ్రీరంగానికి వెళ్ళవచ్చని, అడియేన్ కొంత కాలం తరువాత జీయరుని దర్శనానికై శ్రీరంగానికి వస్తానని చెప్పారు. అయోధ్య రామానుజ అయ్యంగార్లు ఈ విషయం విని ఎంతో ఆనందించి, ఎంతో భక్తితో రామానుజ దాసుని స్తుతించారు. వారు జీయర్ దివ్య పాదుకలను సముచితమైన చోట ఉంచి, ఇళైయాళ్వార్ పిళ్ళైతో కలిసి శ్రీరంగానికి బయలుదేరారు. దారిలో, వారు తిరుమలకు వెళ్లి, తిరువెంకటేశ్వరుని దర్శించుకున్నారు. అప్పన్ (తిరువెంకటేశ్వరుడు) వారిపై కృపను కురిపించి, అయోధ్య రామానుజ అయ్యంగార్లకు కొన్ని కైంకర్యాలను నియమించారు, ఆ కారణంగా వారు తిరుమలలో ఉండిపోవలసి వచ్చింది. తిరుమలలో కైంకర్యం చేస్తున్నందుకు రామానుజ అయ్యంగార్లు ఎంతో సంతోషించారు, కానీ జీయర్ తిరువడిని ఇంకా దర్శించలేక పోయానే అని కూడా దుఃఖించసాగారు.

మూలము: https://srivaishnavagranthams.wordpress.com/2021/10/09/yathindhra-pravana-prabhavam-82/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s