యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 94

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 93

అష్టదిగ్గజులటువంటి శిష్యులచే ఆరాధించబడుతున్న పెరియ జీయర్, ఈ ప్రపంచ వాసులందరినీ అర్థ పంచకం (తన గురించి తెలుసుకోవడం, భగవానుని గురించి తెలుసుకోవడం, ఆ భగవానుని పొందే మార్గాల గురించి తెలుసుకోవడం, పురుషార్థం గురించి తెలుసుకోవడం, ఈ ప్రయాణంలో ఎదురైయ్యే అవరోధాల గురించి తెలుసుకోవడం అనే ఐదు సూత్రాలు) తో ముడిపడి ఉండేలా చేశారు. అత్యోన్నత లక్ష్యం మార్గములోకి (ఆచార్యుని ఆశ్రయించడం) వారిని మరలించారు. తిరువాయ్మొళి ఈడు, శ్రీభాష్యాన్ని నాయనారుకి బోధించమని కందాడై అణ్ణన్ ను, ప్రతివాది భయంకరం అణ్ణాను పురమాయించారు.

వారు ఇలా జీవిస్తుండగా, ప్రతి ఒక్కరినీ, స్థావరాలను (మొక్కలు) కూడా ఉద్ధరిస్తూ (చింత చెట్టుకు కూడా మోక్షం ప్రసాదించారు) తమ నిష్కామ కృపను కురిపిస్తున్న కాలంలో, వారి గుణాలను వెలికితీస్తూ జీయర్ ఈ పాశురాన్ని పఠించారు:

తెన్నరంగర్ శీరారుళుక్కు ఇలక్కాగ ప్పెఱ్ఱోం
  తిరువరంగ త్తిరుప్పదియే ఇరుప్పాక ప్పెఱ్ఱోం
మన్నియ శీర్ మాఱన్ కలై ఉణవాగ ప్పెఱ్ఱోం
  మధురకవి శొఱ్పడియే నిలైయాగప్పెఱ్ఱోం
మున్నవరాం నం కురవర్ మొళిగల్ ఉళ్ళప్పెఱ్ఱోం
  ముళుదుం నమక్కివై పొళుదుపోక్కాగ ప్పెఱ్ఱోం
పిన్నై ఒన్ఱుదనిల్ నెంజం పోరామఱ్ ప్పెఱ్ఱోం
  పిఱర్మినుక్కం పొఱామై ఇల్లా ప్పెరుమైయుం ప్పెఱ్ఱోమే

(శ్రీ రంగనాధుని కరుణకు పాత్రులు కావడం మన భాగ్యం; శ్రీరంగ దివ్య దేశం మన నివాస స్థలం కావడం మన భాగ్యం; నమ్మాళ్వార్ల తిరువాయ్మొళిని అనుభవం మన భాగ్యం; ఆచార్య నిష్ఠను బోధించే మధురకవి ఆళ్వార్ల సూచనలు మన భాగ్యం; మన పూర్వాచార్యులు అనుగ్రహించిన ఈ గ్రంథ ఉపాకారం మన భాగ్యం; అన్య విషయాలపై ఆసక్తి లేకపోవడం మన భాగ్యం; ఇతరుల సామర్థ్యం చూసి అసూయపడని గొప్పతనం ఉండటం మన భాగ్యం.

‘యంయం స్పృశతి పాణిభ్యాం’ (తమ దివ్య హస్తాలతో తాకిన వారందరూ) అన్న వాఖ్యంలో పేర్కొన్నట్లుగా, వారి దివ్య స్పర్శతో మొక్కలు వృక్షాలు కూడా ఉద్ధరించబడినప్పుడు, మనుషుల గురించి వేరే చెప్పాలా? మణవాళ మాముణుల వల్ల అందరూ పొందిన ఫలాలను ఈ క్రింది శ్లోకము తెలియజేస్తుంది:

తత్పాదపద్మ సంస్పర్శపావనం సలివం జనాః
  స్వీకుర్వంతః సుఖేనైవ స్వరూపం ప్రతిభేదిరే
ఆలోకైర్ అనుకంపాధ్యైర్ ఆలాపైర్ అమృతచ్యుతైః
  అన్వహం పాణిపాదస్యస్పర్శన్యాసైశ్చ పావనైః
మంత్ర రత్న ప్రధానేన తదర్థ ప్రతిపాదనాత్
  ఆత్మార్పణేన కదిచిత్ అజ్ఞాపనే నచ
కేచిత్ క్షేమం యుయుస్తస్య పాదపద్యస్య సంశ్రయాన్
  అన్యే తద్రూపనినాతగ్యే తన్నామ కీర్తనాత్
శృత్వా తస్యగుణాన్ దివ్యాన స్తుత్వాతానేవ కేచన
  నత్వాతాం ధీశముద్దిశ్య స్మృత్వా తద్ వైభవం పరే
అపతిశ్యగమప్యేనమన్యే ప్రతిత వైభవం
  అన్యేతద్ బృత్య బృత్యానమలోక స్పర్శనాతపి
అన్యేతద్ పాదసంస్పర్శ తన్యేసంభూయ భూతలే
  అభవన్ భూయసా తస్య మునేః పాత్రం కృపాద్రుశం
ఏవం సర్వే మునీందరేణ బభూవుస్ స్రస్త బంధనాః

(మణవాళ మాముణుల దివ్య తిరువడితో ఉన్న అనుబంధం కారణంగా, వారి శిష్యులు ఆచార్య శ్రీపాద తీర్థాన్ని స్వీకరిస్తూ తమ స్వరూపాన్ని (శేషత్వం) సులభంగా అర్థం చేసుకున్నారు; మరి కొందరు అమృతంలా ప్రవహించే కరుణాపూరితమైన వారి దృష్టి, వాళ్ళ మీద పడి ఉద్ధరణ పొందారు. మరి కొందరు వారి దివ్య పాద స్పర్శతో, ఆ దివ్య పాదాలకు శరణాగతి చేయడంతో, మంత్ర రత్నంగా పరిగణించబడే ద్వయ మహామంత్రాన్ని వారి ద్వారా పొందడంతో, వారి నుండి ఆ అర్థాలను తెలుసుకోవడం ద్వారా ఉద్దరణ పొందారు; మరికొందరు తమ అజ్ఞానాన్ని వ్యక్తం చేస్తూ వారికి శరణాగతి చేయడం ద్వారా, కొందరు ఆ మహాముని దివ్య స్వరూపాన్ని ధ్యాన కేంద్ర బిందువుగా ఆపాదించుకున్నారు. మరికొందరు వారి దివ్యనామాలను పఠించారు, కొందరు ఆతని దివ్య మంగళ గుణాల శ్రవణం చేశారు, ఆ గుణాలను స్తుతించారు; మరి కొందరు వారు ఉన్న దిశ వైపు సాష్టాంగ నమస్కారం చేసి ఆరాధించారు; కొందరు వారి కీర్తిని మననం చేస్తూ అనందించారు; కొందరు, ఈ భూమండలంపైన అవతరించిన అంతటి మహిమగల మణవాళ మాముణుల దాసదాసర్ల (దాసులకు దాసులు) దివ్య స్పర్శతో పునీతులై వారి దివ్య కటాక్షానికి పాత్రులై ఉద్ధరించబడ్డారు; ఇలాగ ఆ మునీంద్రులైన (యతులకు రాజు) మణవాళ మాముణుల దయతో ప్రతి ఒక్కరూ బంధ విముక్తులైనారు). ఆ విధంగా, వారి శ్రీపాద తీర్థం తీసుకున్న వారితో ప్రారంభించి, వారి దృష్టి కటాక్షానికి పాత్రమయ్యే భాగ్యం కలిగిన వారు, వారిని ధ్యానించిన వారు, వారి పరిచయం ఉన్న వారి వరకు, తమ దగ్గరున్న వాళ్ళు, తమకు దూరంగా ఉన్న వాళ్ళు, తర్వాతి కాలంలో ఈ భూమిపైన జన్మించే వాళ్ళు, రాబోతున్న వాళ్ళ మధ్య ఎటువంటి భేదం లేకుండా, సంసారం పరమపదం అనే తేడా లేకుండా సమస్త లోకాలను బంధ విముక్తులను చేశారు. ఎంత మేరకు అంటే ఉద్దరణ ఎవరికైనా అవసరముందా అని వారిని అన్వేషించేటంత స్వర్ణ మయం చేశారు.

సర్వావస్థా సదృశవిభవా శేషకృత్వం రమయాభర్తుః
  త్యక్త్వా తదపి పరమం ధామతత్ప్రీతి హేతోః
మగ్నానగ్నౌ వరవరమునే మాదృశానున్నినీషన్
  మర్త్యావాసే భవసి భగవన్ మంగళం రంగధామ్నః

(మంగళ గుణాలు కలిగిన మణవాళ మాముని! శ్రీమహాలక్ష్మికి పతి అయిన భగవానునికి అన్ని కాలములలో, స్థితులలో, మహిమాన్వితమైన సేవలందింస్తున్నారు. సంసారం అనే అగ్నిలో కొట్టు మిట్టాడుతున్న అడియేన్ వంటి వారిని ఉద్ధరించడానికి, భగవత్ ప్రీతి కారణంగా ఆ పరమపదాన్ని (శ్రీవైకుంఠం) విడిచి వచ్చారు. ఈ లోకంలో ఈ దివ్య దేశమైన తిరువరంగంలో దేవర్వారు దివ్య దీపమువలెనున్నారు). అలా తాను అవతరించిన లక్ష్యాన్ని పూర్తి చేశారు.

మూలము: https://srivaishnavagranthams.wordpress.com/2021/10/20/yathindhra-pravana-prabhavam-94/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s