Author Archives: Sridevi

ఆళ్వార్ తిరునగరి  వైభవము – మణవాళ మామునుల చరిత్ర, వైభవము

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః

పూర్తి శ్రేణి

<< నమ్మాళ్వర్ల యాత్ర

తిరువాయ్ మొళిపిళ్ళై ఆళ్వార్ తిరునగరి ఎలా పునర్నిర్మించారో క్రిందట అనుభవించాము. నమ్మాళ్వార్లకు, ఆదినాథ పెరుమాళ్ళకు, ఎంబెరుమానార్లకు నిత్య కైంకర్యాల ఏర్పాట్లను ఎలా చేశారో కూడా అనుభవించాము. ఆ రోజుల్లో  తిరువాయ్ మొళిపిళ్ళై అనే ఆచార్యపురుషులు ఆళ్వార్ తిరునగరిలో సంప్రదాయ ప్రచారకులుగా ఉండేవారు.

కాలాంతరమున, ఆళ్వార్ తిరునగరిలో  ఆశ్వీయుజమాస (ఐప్పశి) మూలానక్షత్రమున ఆదిశేషుని అవతారమైన  రామానుజులే స్వయంగా తిరునావీఱుడైయపిరాన్ అనే స్వామికి  పుత్రునిగా జన్మిస్తారు.   ఆ బిడ్డ తేజస్సును చూసి పెద్దలు ఆ బిడ్డకు శ్రీరంగనాథుల తిరునామమైన ‘అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్’ అని నామకరణం చేస్తారు. అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ బాల్యలో తమ తాతగారి ఊరు ‘శిక్కిల్ కిడారం’ అనే గ్రామమున పెరుగుతారు. కాలానుగుణంగా తగిన వయసులో  ఉపనయనాది వైదికసంస్కారాలు వీరికి జరిగాయి. తమ తండ్రి వద్దనే శాస్త్రఅధ్యయనం అధికరించారు. తరువాత వివాహం జరిగింది. తమ తండ్రిగారివద్దనే ‘అరుళిచ్చెయల్’ (నాలాయిర దివ్యప్రబంధం), రహస్యార్థాలను నేర్చుకొని జ్ఞానభక్తి వైరాగ్యాలకు నిధిగా రూపుదిద్దుకుంటారు. వీరి తండ్రిగారు పరమపదించిన తర్వాత  తిరువాయ్ మొళిపిళ్ళై వైభవమును ఆలకించి, ఆళ్వార్ తిరునగరికి వచ్చి తిరువాయ్ మొళిపిళ్ళై దివ్యపాదాలను ఆశ్రయిస్తారు. నాయనార్ల కళ్యాణగుణాలను చూసి, తిరువాయ్ మొళి పిళ్ళై ఆనందించి సంప్రదాయార్థాలని వారికి అనుగ్రహిస్తారు. ‘ఎంబెరుమానార్ల తిరువడిగళే శరణం’ అని నాయనార్లకు ఉపదేశించి, వీరిని ఎంబెరుమానార్ల సన్నిధిలో నిత్యకైంకర్యం చేయమని నిర్దేశిస్తారు. నాయనార్లు కూడా ఎంబెరుమానార్ల పట్ల అపారమైన భక్తితో కైంకర్యం చేసి ‘యతీంద్రప్రవణులు’ (రామానుజుల యందు భక్తిప్రపత్తులు కలవారు) అనే తిరునామాన్ని సంపాదించుకొంటారు.

తిరువాయ్ మొళిపిళ్ళై తమ అవసానమున, “భవిష్యత్తులో సంప్రదాయ ప్రవర్తకులెవరు?”అనే విచారంలో ఉండగా , అంతట  నాయనార్లు ఆ బాధ్యత తాను నిర్వహిస్తానని హామి ఇస్తారు. కేవలం మాటలతో సరిపోకుండా తిరువాయ్ మొళిపిళ్ళై,  నాయనార్లతో ప్రమాణం చేయించుకొని , సంస్కృత శాస్త్రంపైనే ఎక్కువ దృష్ఠిపెట్టకుండా తిరువాయ్ మొళి తో పాటు ఇతర దివ్యప్రబంధాలు ప్రచారంచేయమని నాయనార్లను ఆదేశిస్తారు. కాలాంతరమున తిరువాయ్ మొళిపిళ్ళై పరమపదించగా  నాయనార్లు వారికి చరమ కైంకర్యాలన్ని శ్రద్ధతో నిర్వహిస్తారు.

వానమామలై దివ్యదేశానికి చెందిన ‘అళగియ వరదర్’ అనే ఆచార్యపురుషులు  నాయనార్లను ఆశ్రియిస్తారు. పిమ్మట వీరు సన్యాసాశ్రమాన్ని స్వీకరించి వానామామలై మఠాధిపతిగా అవుతారు. జీయర్ అయిన తరువాత కూడా వీరు నాయనార్లను విడువకుండా కైంకర్యాలు చేసేవారు. జీయరు అనుసరించి, అనేక మంది శ్రీవైష్ణవాచార్యులు  నాయనార్లను ఆశ్రయించి శిష్యులవతారు.

నాయనార్లు, శ్రీరంగంలో ఉండి సంప్రదాయాన్ని వృద్ధిపరచాలని సంకల్పించి ఆళ్వార్ తిరునగరిని  నుండి  శ్రీరంగానికి వెళ్ళుటకు నమ్మాళ్వార్లను అనుమతిని కోరుతారు. ఆళ్వార్  అనుమతించగా శ్రీరంగమునకు  చేరుకుంటారు. నాయనార్ల రాకకు పెరియపెరుమాళ్ (శ్రీరంనాథుడు) సంతోషించి ఒక ఉత్సవంలా జరుపుకుని, శాశ్వతంగా శ్రీరంగంలోనే ఉండమని నాయనార్లను ఆదేశిస్తారు. నాయనార్లు శ్రీరంగంలోనే ఉండి లుప్తమైపోయిన రహస్య గ్రంథాలను తిరిగి తెచ్చి, తాళపత్రాలను సరిచేసి, కాలక్షేపాలను నిర్వహిస్తుండేవారు. నంపిళ్ళై కృపతో అనుగ్రహించిన ఈడు వ్యాఖ్యానాన్ని  (తిరువాయ్ మొళికి వ్యాఖ్యానం) నాయనార్లు  బాగాప్రచారం కావించారు కావున ‘ఈడు పెరుక్కర్’ (ఈడు ప్రచారంచేసినవారు) అనే దివ్యనామాన్ని పొందుతారు.

తిరువేంకటనాథునికి మంగళాశాసనం చేయాలని నిర్ణయించుకొని, ఆ మార్గమద్యంలో ఉన్నఅనేక దివ్యదేశ పెరుమాళ్ళను దర్శించుకొని,  మంగళాశాసనాలు చేసి, తిరుమలకు చేరుకొని తిరువేంకటనాథునితో పాటు అనేక భాగవతుల మన్ననలను పొందుతారు. ఆ తర్వాత కాంచీపుర పెరుమాళ్ కోయిల్ (దేవ పెరుమాళ్ళ సన్నిధి) కు వెళ్లి దేవపెరుమాళ్ళకు మంగళాశాసనం చేసి,  అటు నుంచి ప్రయాణాన్ని ముందుకు సాగిస్తూ శ్రీపెరంబుదూర్ చేరుకొని అక్కడ ఎంబెరుమానార్లకు మంగళాశాసనం చేశారు. అటునుంచి తిరువెఃకా కు వెళ్లి ‘కిడాంబిఆచ్చాన్’ అనే ఆచార్యుల సన్నిధిన శ్రీభాష్యం సేవిస్తారు. నాయనార్ల తేజస్సుని సంప్రదాయ పరిజ్ఞానాన్ని పరికించిన కిడాంబి ఆచ్చాన్, తమ అసలు స్వరూపాన్ని వెల్లడించమని అడుగగా, నాయనార్లు తమ ఆదిశేషస్వరూపంతో దర్శనమిస్తారు. అనంతరం నాయనార్లు శ్రీరంగానికి తిరిగి చేరి సంప్రదాయాన్ని విస్తరించసాగారు.

ఇలా వీరు సంప్రదాయ కైంకర్యాలు నిర్విరామంగా కొనసాగిస్తున్న సమయంలో వీరి బంధువులలో ఒకరి మరణం వలన వీరికి అశౌచం ఏర్పడుతుంది. ఇక మీదట ఇలాంటి ఇబ్బందులేవీ ఉండకుండ సన్యాసాశ్రమాన్ని స్వీకరించాలని నిర్ణయించుకొంటారు. తన బాల్యసఖుడు,సహాధ్యాయి అయిన శఠకోప జీయర్ వద్ద నాయనార్లు సన్యాసాశ్రమాన్ని స్వీకరిస్తారు. పిదప, పెరియపెరుమాళ్ ను సేవించుకోగా పెరుమాళ్ వీరికి ‘అళగియ మణవాళ మామునులు’ అనే బిరుదునిచ్చి, పల్లవరాయమఠాన్ని బహూకరించి సత్కరిస్తారు. వానమామలై జీయర్ల సహకారంతో మామునులు పల్లవరాయ మఠాన్ని పునర్నిర్మించి, కాలక్షేపార్థం ‘తిరుమలై ఆళ్వార్ కూటం’ అనే  పెద్దమండపాన్ని నిర్మించి సంప్రదాయాన్ని విశిష్టరీతిలో విస్తరింపజేస్తారు. శ్రీరంగం మరియు ఇతర ప్రాంతాల నుండి అనేక విద్వాంనులు మామునుల వద్దకు వచ్చి, పంచ సంస్కారాలు పొంది, వీరి శిష్యులై తరించారు.

మామునులు అనేక రహస్య గ్రంథాలకు వ్యాఖ్యానాలు వ్రాయడమే కాకుండా, అనేక సంస్కృత -తమిళ ప్రబంధాలను కూడా అనుగ్రహించారు. కారణాంతరాలవల్ల సంవత్సరాలుగా నిలిచిపోయిన కైంకర్యాలను, స్థలత్తార్లను, ఆస్థాన మర్యాదలను పునః స్థాపించారు. తమ శిష్యుల ద్వారా, అనేక దేవాలయాలలో కైంకర్యాలు సక్రమంగా జరిగేలా కట్టుదిట్టం చేశారు. వానమామలై జీయర్ ను అఖండ భాతరదేశ సంచారం చేయమని ఆదేశించి, వారిద్వారా   దేశమంతటా సంప్రదాయాన్ని స్థాపించారు. అలా శ్రీరంగంలో ఎంబెరుమానార్ వలె విశేష ఆదరణలను అందుకుంటూ కాలం గడపసాగారు.

మామునుల కీర్తిని ప్రకటించాలని  పెరియపెరుమాళ్ శ్రీరంగంలో  సంవత్సర కాలంపాటు తమ  ఉత్సవాలన్ని  నిలుపు చేస్కొని, ఈడు వ్యాఖ్యానము (నంపిళ్ళై వారి తిరువాయ్  మొళి ఉపన్యాసాల ఆధారంగా వడక్కు తిరువీధిపిళ్ళై అనుగ్రహించిన వ్యాఖ్యానం) చేయమని మామునులను ఆదేశిస్తారు. పెరుమాళ్ళ శాసనం మేరకు, ఉభయ దేవేరులతో నంపెరుమాళ్, ఆళ్వారాచార్యులు వేచేంసి ఉండగా, వారి సమక్షంలో మామునులు అందరు ఆనందించేలా తిరువాయ్ మొళి –ఈడు  వ్యాఖ్యానమును కృపచేస్తారు. కాలక్షేపం చివరి రోజున, జేష్ఠ మాస(ఆణి) దివ్య మూలానక్షత్రంలో, పెరియ పెరుమాళ్  సన్నిధిఅర్చకుని కుమారుని రూపంతో వచ్చి “శ్రీశైలేశ దయాపాత్రం ధీభక్త్యాది గుణార్ణవం। యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిమ్!” అని తనియన్ ను మామునుల సన్నిధిన సమర్పించి, వారిని తమ ఆచార్యునిగా స్వీకరిస్తారు. అంతటితో ఆగకుండా, సంస్కృత-నాలాయరప్రబంధ సేవాకాల ఆరంభమున ఈ తనియన్ తప్పకుండా సేవించాలని నంపెరుమాళ్ నియమనం చేస్తారు.

అటువంటి వైభవం గల మణవాళమామునులు, వయస్సు పైబడడంతో తిరునాడుకు చేరుకుంటారు. వారి శిష్యులు మామునుల చరమ కైంకర్యాలు ఘనంగా నిర్వహిస్తారు.

మామునుల కొన్ని విశేషాలను ఇక్కడ అనుభవిద్దాము:

శిష్యులు:

అష్ట దిగ్గజములు (ఎనిమిది దిక్కులను కాపలాకాసే ఏనుగుల వంటి  ప్రధానశిష్యులు): పొన్నడిక్కాల్ జీయర్, కోయిల్ కందాడై అణ్ణన్, పతంగి పరవస్తు పట్టర్ పిరాన్ జీయర్, తిరువేంగడ జీయర్, ఎఱుంబియప్ప, అప్పిళ్ళై, అప్పిళ్ళార్,  ప్రతివాది భయంకరం అణ్ణ.

నవరత్నాలు: సేనైముదలియాండాన్ నాయనార్, శఠకోపదాసర్ (నాలూర్ శిఱ్ఱాతాన్), కందాడై పోరేఱ్ఱు నాయన్, ఏట్టూరి శింగరాచార్యులు , కందాడై అణ్ణప్పన్, కందాడై తిరుక్కోబురత్తు నాయనార్, కందాడై నారణప్పై, కందాడై తోళప్పరప్పై, కందాడై అళైత్తు, వాళ్విత్త పెరుమాళ్. వీరే కాకుండా ఎంబెరుమానార్లు నియమించిన 74 సింహాసనాధిపతుల తిరుమాలిగల వాళ్ళు, తిరువంశస్థులు అనేక మంది వీరి శిష్యులుగా ఉండేవారు.

పరమపదం పొందిన చోటు: శ్రీరంగం

కృపతో వీరు అనుగ్రహించిన గ్రంథాలు: దేవరాజమంగళం, యతిరాజవింశతి, ఉపదేశరత్నమాల, తిరువాయ్ మొళి నూత్తాందాది మరియు ఆర్తిప్రబంధం.

వ్యాఖ్యానాలు: ముముక్షుప్పడి, తత్త్వత్రయం, శ్రీవచనభూషణం, ఆచార్య హృదయం, పెరియాళ్వార్ తిరుమొళి, మరియు ఇరామానుజ నూత్తందాది.

ప్రమాణ తిరట్టు: (అన్ని శ్లోకాలకు పదకోశం, శాస్త్రఉల్లేఖనాలు వీరి వ్యాఖ్యానాలలో కనిపిస్తాయి) ఈడు ముప్పత్తు ఆరాయిర ప్పడి, జ్ఞాన సారం, ప్రామేయసారం, తత్త్వ త్రయం, శ్రీవచనభూషణం.

మణవాళ మామునుల తనియన్:

శ్రీశైలేశ దయా పాత్రం ధీ భక్త్యాది గుణార్ణవమ్ |
యతీంద్ర ప్రవణం వందే రమ్య జామాతరం మునిమ్ ||

శ్రీ శైలేశులు (తిరువాయ్ మొళి పిళ్ళై) దయకు పాత్రులైన, యతీంద్రుల ప్రవణులనబడు, ఙ్ఞానము భక్తి మొదలైన కల్యాణ గుణములను కలిగిన రమ్య జామాతృలకు ( శ్రీ వరవరమునులకు) నమస్కరిస్తున్నాను.

మణవాళ మామునుల- వాళి తిరునామాలు

ఇప్పువియిల్ అరంగేశర్ క్కు ఈడళిత్తాన్ వాళియే
ఎళిల్ తిరువాయ్ మొళి పిళ్ళై ఇణైయడియోన్ వాళియే
ఐప్పశియిల్ తిరుమూలత్తు అవదరిత్తాన్ వాళియే
అరవరశ ప్పెరుంశోదియ అనందన్ ఎన్ఱుం వాళియే
ఎప్పుళుదుముం శ్రీశైలమేత్తవందోన్ వాళియే
ఏరారుం ఎతిరాశర్ ఎనఉదిత్తాన్ వాళియే
ముప్పిరినూల్ మణివడముం ముక్కోల్ దరిత్తాన్ వాళియే
మూదఱియ మణవాళ మామునివన్ వాళియే

(తిరునాళ్ పాట్టు – తిరునక్షత్రం – మూలా నక్షత్రం రోజున సేవించేది)

శెందమిళ్ వేదియర్ శిందై తెళిందు శిఱందు మగిళ్ందిడు నాళ్
శీర్ ఉలగారియర్ శెయ్ దరుళ్ నఱ్కలై తేశుపొలిందిడు నాళ్
మంద మదిప్పువి మానిడర్ తంగళై వానిల్ ఉయర్ త్తిడు నాళ్
మాశఱు జ్ఞానియర్ శేర్ ఎదిరాశర్ తం వాళ్వు ముళైత్తిడు నాళ్
కందమలర్ ప్పొళిల్ శూళ్ కురుగాదిపన్ కలైగళ్ విళంగిడు నాళ్
కారమర్ మేని అరంగక్కు ఇఱైకంగళ్ కళిత్తిడు నాళ్
అందమిల్ శీర్ మణవాళముని ప్పరన్ అవతారం  శెయ్ దుడునాళ్
అళగు తిగళందిడుం ఐప్పశియిల్ తిరుమూలం అదు ఎనునాళే

మూలం: https://srivaishnavagranthams.wordpress.com/2022/12/05/azhwarthirunagari-vaibhavam-4/

archived in https://srivaishnavagranthams.wordpress.com/

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org
pramAthA (preceptors) – https://guruparamparai.wordpress.com
SrIvaishNava Education/Kids Portal – http://pillai.koyil.org

ఆళ్వార్ తిరునగరి వైభవం – ఆళ్వార్ యాత్ర

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః

పూర్తి శ్రేణి

<< నమ్మాళ్వర్ల చరిత్ర, వైభవము

నమ్మాళ్వార్ల చరిత్రలో ఆళ్వా రునగరి దివ్య దేశం ఊరేగింపుకి ఎంతో ప్రాధాన్యత ఇవ్వబడింది. మ

నమ్మాళ్వార్ల చరిత్రలో ఆళ్వార్ తిరునగరి దివ్యదేశ యాత్రకి ఎంతో ప్రాధాన్యత ఉన్నది. మనం ఆ ప్రాధాన్యత గురించి కొంతవరకు ఇక్కడ అనుభవిద్దాం.

క్రిందటి వ్యాసంలో రామానుజుల అవతార రహస్యాన్ని నమ్మాళ్వార్,   మధురకవిఆళ్వార్లకు భవిష్యదాచార్యుల అర్చామూర్తి  ద్వారా ప్రకాశింపచేయడం గురించి తెలుసుకున్నాము. నమ్మాళ్వార్ల- రామానుజుల అవతారానికి మధ్యకాలంలో నాథమునులు మొదలైన పూర్వాచార్యులు ఎందరో ఈ లీలావిభూతిలో   అవతరించి మన శ్రీవైష్ణవసంప్రదాయాన్ని విస్తరింపచేశారు. శ్రీమన్నాథమునులు,  నమ్మాళ్వార్ల పాశురవైభవం విని ఆ పాశురాలను తెలుసుకోవాలనే ఆర్తితో ఆళ్వార్ తిరునగరికి చేరి తమ  యోగదృష్ఠిచే నమ్మాళ్వార్ల దర్శన భాగ్యం పొందుతారు. నమ్మాళ్వార్ల అనుగ్రహంతో శ్రీమన్నాథమునులకు వారి నాలుగు ప్రబంధాలతో పాటు ఇతర ఆళ్వార్ల ప్రబంధాలు, వాటి అర్థాలు కూడా ప్రసాదంలా పొందే భాగ్యం కలుగుతుంది. ఆచార్య పరంపరలో నమ్మాళ్వార్ల తర్వాతి స్థానాన్ని అలంకరించారు శ్రీమన్నాథమునులు.

శ్రీమన్నాథమునుల తరువాత కాలంలో కురుగైక్కావలప్పన్ , ఉయ్యక్కొండార్, మణక్కాల్ నంబి, ఆళవందార్, పెరియనంబి వంటి మహానుభావుల ద్వారా సంప్రదాయ వైభవం , ఆచార్యపరంపర  వృద్ధిచెందింది. ఆ తరువాత, ఆదిశేషుని అవతారమైన శ్రీరామానుజులు ఈ లీలావిభూతిపై అవతరించి, మోక్షాసక్తి ఉన్నవారందరికీ మోక్షం లభిస్తుందని నిరూపించారు. ఎంబెరుమానార్  (రామానుజులు) తమను తాము ‘మాఱన్ అడిపణిందు ఉయ్ న్దవన్’ అని భావించేవారు. అంటే ‘నమ్మాళ్వార్ల దివ్య తిరువడి అనుగ్రహంతో ఉజ్జీవింపబడ్డాను’ అని అర్థం. తమయందు  రామానుజులకు ఉన్న అపారమైన భక్తి ప్రపత్తులను చూసి ఆళ్వార్, రామానుజులకు తమ ‘తిరువడినిలై ‘(పాదుకలు) స్థానాన్ని ప్రసాదించారు. ఇతర దివ్యదేశాల సన్నిధులలో నమ్మాళ్వార్ల తిరువడినిలైని ‘మధురకవి ఆళ్వార్’గా పిలుస్తారు. కాని   ఆళ్వార్ తిరునగరిలో మాత్రం నమ్మాళ్వార్ల శ్రీశఠారిని/ తిరువడిని ‘శ్రీరామానుజులు’ అని భక్తుల శిరస్సుపైన అనుగ్రహిస్తారు. స్వయంగా నమ్మాళ్వార్లే ఇలా నియమనం చేశారు.

ఎంబెరుమానార్ల కాలం తరువాత, మన సంప్రదాయాన్ని ఎంబార్, భట్టర్, నంజీయర్, నంపిళ్ళై, వడక్కు తిరువీధి పిళ్ళై, పిళ్ళై లోకాచార్యుల వంటి ఆచార్యమహానుభావులెందరో ‘ఓరణ్‌ వళి’ని (ఆచార్యుని తరువాత శిష్యుడు ఆ పరంపరఙ్ఞానాన్ని తరువాతి వారికి వరకు అందించడం) వృద్ధిపరిచారు. పిళ్ళైలోకాచార్యుల అవసానములో, విదేశీయుల దాడులతో దక్షిణభారతం అనేక ఉపద్రవాలకు లోనైనది. మన సంప్రదాయానికి మూలకేంద్రమైన శ్రీరంగంలో పలుదాడులు జరిగాయి. అప్పుడు పిళ్ళైలోకాచార్యులు పెరియపెరుమాళ్ళ (శ్రీ రంగనాథ మూలవర్లు ) ఎదుట ఒక గోడను కట్టి నంపెరుమాళ్ళను (ఉత్సవ విగ్రహం) రక్షణ కై దక్షిణం వైపుకు తీసుకువెళతారు. వీరు నంపెరుమాళ్ళతో మధురై ప్రాంతంలో ఉన్న జ్యోతిష్కుడికి (ప్రస్తుతం – కొడిక్కుళం) చేరుకున్నారు. వయోవృద్ధులు కావడంతో అనారోగ్యం పాలయ్యారు. తమ శిష్యుడైన తిరుమలై ఆళ్వార్ ని  నియమించి సంప్రదాయాన్ని ముందుకు తీసుకువెళ్ళమని ఆజ్ఞాపించి వారు పరమపదానికి చేరుకుంటారు.

ఆ తరువాత, నంపెరుమాళ్  కేరళలోని కోళిక్కోడుకి చేరుకోగా, అదే సమయంలో  ఈ ఉపద్రవాలను తప్పించుకోడానికి నమ్మాళ్వార్లు కూడా ఆళ్వార్ తిరునగరి నుండి బయలుదేరి కోళిక్కోడుకి చేరుకుంటారు. ఆళ్వార్ తిరునగరిని వదిలి నమ్మాళ్వార్లు ఎంతోకాలం దూరంగా ఉండవలసి వస్తుంది. ఆళ్వార్ కోళిక్కోడుకి రాగానే నంపెరుమాళ్ ఆనందించి ఎంతో ఆశతో నమ్మాళ్వర్లని తమ దివ్యాసనముపై స్థానమిస్తారు. పోత్తిమార్లు, నంబూద్రి అర్చకులు నంపెరుమాళ్ తో పాటు నమ్మాళ్వార్లకు ఎంతో భక్తితో కైంకర్యాలు నిర్వహిస్తారు. ఇక కోళిక్కోడు నుండి బయలుదేరి తిరుక్కనాంబికి చేరుకుంటారు. అక్కడ కొంత కాలం గడిపిన తర్వాత నంపెరుమాళ్  తమ యాత్రను ముందుకు సాగిస్తారు. నమ్మాళ్వార్ల కైంకర్యపరులు మాత్రం సురక్షిత ప్రాంతాన్ని వెదుక్కుంటూ పశ్చిమం వైపు వెళుతూ ఎత్తుగా నిటారుగా ఉన్న ఒక కొండ దగ్గరకు చేరుకొంటారు.వారు  ఆళ్వార్ ను  అక్కడే దాచి ఉంచాలని నిశ్చయించుకొని ఆళ్వార్ ను  పెట్టెలో ఉంచి కొండ లోయలోకి దించుతారు.

ఇలా ఆళ్వార్ అర్చామూర్తిని భద్రపరచి తిరిగి వస్తుండగా, దొంగలు వారి దగ్గర నుండి అమూల్యమైన తిరువాభరణాలను దోచుకుంటారు. ఆ కైంకర్యపరులలో ఒకరైన తోళప్పర్ మధురైకి వెళ్ళి రాజాస్థానంలో మంత్రిగా ఉన్న తిరుమలైఆళ్వార్ ని సహాయం కోసం అభ్యర్థిస్తారు. వీరు పిళ్ళైలోకాచార్యుల ప్రధాన శిష్యులు. పిళ్ళైలోకాచార్యులు తమ తర్వాత వీరినే సంప్రదాయ పరంపరాధిపతిగా నియమించి పరమపదం చేరుకుంటారు. ఆళ్వార్ అర్చామూర్తిని తిరిగి పొందడానికి తిరుమలై ఆళ్వార్ తమ ఆంతరంగిక  సేవకులతో కేరళరాజు వద్దకు ఒక సందేశం పంపిస్తారు. సందేశం అందగానే కేరళరాజు ఆళ్వార్ ని  తిరిగి తీసుకురావడానికి తన సైన్యాన్ని పంపుతారు. తోళప్పర్ నాయకత్వంలో వీరందరు  బయలుదేరుతారు. ఆళ్వార్ ఉన్న చోటును వీరికి ఒక గరుడపక్షి సూచిస్తుంది. తోళప్పర్ ఇనుప గొలుసుతో కట్టిన  చెక్కపలకపై కూర్చొని ఆ ఏటవాలుగా ఉన్న కొండలోయలోకి దిగి, ఆళ్వార్ల అర్చామూర్తి ఉన్న పెట్టెను గైకొని ఆ చెక్కపలకపై ఆళ్వార్ ను ఉంచి పైకి పంపిస్తారు. తోళప్పర్ ని పైకితీసుకరావడానికి పైనున్నవారు మళ్ళీ పలకను దించుతారు. అలా వారు పైకివస్తుండగా అదుపును తప్పి లోయలోపడి పరమపదిస్తారు. ఇది తెలిసిన  తోళప్పర్ పుత్రుడు శోకిస్తారు. ఆళ్వార్  వారికి  ఇకమీదట తోళప్పర్  వంశస్థులకు ఆలయంలో గౌరవమర్యాదలు ఇవ్వబడతాయని ఓదార్చి నియమనంచేశారు . తరువాత, నమాళ్వార్లు మళ్లీ తిరుక్కనాంబికి చేరుకున్నారు. దొంగలు తమ తప్పిదమును  గ్రహించి, దోచుకున్న తిరువాభరణాలను తిరిగి ఆళ్వార్ కి సమర్పించుకుంటారు. పిమ్మట తిరుమలై ఆళ్వార్ తిరుక్కనాంబిలో ఆళ్వార్  ని సేవించుకుంటారు.

తిరుమలైఆళ్వార్లు మధురకి వచ్చి, పిళ్ళైలోకాచార్యుల శిష్యులలో ఒకరైన కూరకులోత్తమదాసులను కలుసుకొని  వారికి ఆచార్యులతో ఉన్న అనుబంధాన్ని స్మృతి చేసుకుంటారు. కూరకులోత్తమ దాసులు వీరికి సంప్రదాయ విషయాలను ఉపదేశించి, తమ మంత్రి పదవికి రాజీనామాచేసి, కేవలం నమ్మాళ్వార్లకు మాత్రమే దాసుడిగా ఉండమంటారు. తిరుమలైఆళ్వార్ సంప్రదాయార్థాలను కూరకులోత్తమదాసులు, విళంజోలై పిళ్ళై, నాలూరాచ్చాన్ పిళ్ళై మొదలైన ఆచార్యుల ద్వారా పొంది  పిళ్ళైలోకాచార్యుల దివ్యసంకల్పానికి అనుగుణంగా సంప్రదాయాన్ని వృద్ధిపరుస్తారు. వీరి కారణంగానే ఆళ్వార్ తిరిగి ఆళ్వార్ తిరునగరిని చేరుకున్నారు. తిరుమలైఆళ్వార్లు ఆళ్వార్ తిరునగరికి వచ్చినపుడు ఆ ప్రదేశమంతా కలుపు మొక్కలతో అడవిలా ఉండటం చూసి, దానిని శుభ్రపరచి ఆదినాథ- ఆళ్వార్ల మందిరాన్ని పునర్నిర్మితం కావిస్తారు. తిరుప్పుళి ఆళ్వార్ల (దివ్య చింతచెట్టు) క్రింద తొవ్వి భవిష్యదాచార్యుల దివ్యఅర్చామూర్తిని వెలికితీస్తారు. ఆళ్వార్ తిరునగరికి పశ్చిమంలో రామానుజ-చతుర్వేదిమంగళవీధిని నిర్మింపజేసి, భవిష్యదాచార్యులకు అక్కడ ఒక ఆలయాన్ని నిర్మింపచేసి ఆదినాథ-ఆళ్వార్-ఎంబెరుమానార్లకు నిత్యం కైంకర్యాలు జరిగేలా ఏర్పాట్లు చేస్తారు. నమ్మాళ్వార్ల యందు, తిరువాయ్ మొళి యందు వీరికున్న ఆర్తి, ఎనలేని భక్తి కారణంగా వీరిని ‘శఠగోపదాసుల’ని ‘తిరువాయ్ మొళిపిళ్ళై’ అనే తిరునామాలతో వ్యవహరించేవారు. ఇప్పటికిని వీరి వంశస్థులు ఈ క్షేత్రంలోనే కాకుండా పరిసర దివ్యదేశాలలో కైంకర్యములు నిర్వహిస్తున్నారు.మన పూర్వాచార్యులు ఈ చరిత్రను “నమ్మాళ్వార్ల -యాత్ర” అని వ్యవహరిస్తారు.

తరువాత కాలంలో ఈ దివ్యదేశంలో అవతరించి స్వయంగా శ్రీరంగనాథునికే ఆచార్యులై, ఆచార్యునిగా తిరువాయ్ మొళిపిళ్ళైవారిని స్వీకరించి, ప్రప్రధమంగా ఆళ్వార్ తిరునగరిలో కైంకర్యం చేసిన మణవాళ మామునుల చరిత్రను తర్వాతి వ్యాసంలో అనుభవిద్దాం.

మూలము: https://srivaishnavagranthamstamil.wordpress.com/2021/12/08/azhwarthirunagari-vaibhavam-3/

పొందుపరిచిన స్థానము – https://srivaishnavagranthams.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

ఆళ్వార్తిరునగరి వైభవము – నమ్మాళ్వర్ల వైభవము, చరిత్ర

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః  శ్రీ వానాచల మహామునయే నమః

పూర్తి శ్రేణి

<< ఆళ్వార్ తిరునగరి  వైభవము – చరిత్ర

నమ్మాళ్వార్లు అవరించిన తరువాత ఆదిక్షేత్రం అని పిలువబడే ఈ తిరుక్కురుగూర్ క్షేత్రం ఆళ్వార్తిరునగరిగా ప్రసిద్ధిచెందింది. ఇప్పుడు మనం నమ్మాళ్వార్ల చరిత్రను వైభవాన్ని అనుభవిద్దాము.

ఈ సంసారంలో బాధలను అనుభవిస్తున్న ఆత్మలను నిత్య విభూతి శ్రీ వైకుంఠానికి చేర్చడానికి పెరుమాళ్ళు ఎన్నో లీలలాడుతుంటాడు. ప్రళయకాలంలో అన్ని లోకాలను నశింపజేసి, మరలా సృష్టించి, ఆత్మలకు దేహాన్ని, ఇంద్రియాలను ప్రసాదించి, వారికి శాస్త్రాల నిచ్చి, ఋషుల ద్వారా ఆ శాస్త్రార్థాలను విశదపరచి, స్వయంగా తాను అనేక అవతారాలను ఎత్తి, ఎన్నో లీ

ఆదిక్షేత్రం అని పిలువబడే ఈ తిరుక్కురుగూర్ నమ్మాళ్వార్లు అవతరించిన తరువాత ‘ఆళ్వార్ తిరునగరి’ గా ప్రసిద్ధిచెందినది. ఇప్పుడు మనం నమ్మాళ్వార్ల  వైభవాన్ని అనుభవిద్దాము.

ఈ సంసారబాధలను అనుభవిస్తున్న ఆత్మలను,  నిత్యవిభూతియైన శ్రీవైకుంఠానికి చేర్చడానికి భవవానుడు ఎన్నో లీలలను ప్రదర్శిస్తుంటాడు. భగవానుడు ప్రళయకాలంలో లోకాలన్నింటిని నశింపజేసి, మరలా సృష్ఠించి, ఆత్మలకు దేహాన్ని, ఇంద్రియాలను ప్రసాదించి, వారికి శాస్త్రాలనిచ్చి, ఋషుల ద్వారా ఆ శాస్త్రార్థాలను విశదపరచి, స్వయంగా తాను అనేక అవతారాలను ఎత్తి, ఎన్నో లీలలను చూపి, జీవాత్మలను ఈ సంసారబంధం నుండి విముక్తులను చేయాలని ప్రయత్నిస్తుంటాడు. ఇంత ప్రతయ్నం చేసినా  జీవులు ఆత్మోజ్జీవనం పొందలేకపోతే, మరలా వారిని ఉద్దరింపచేయుటకు,  వేటగాడు జింకను పట్టుకోవడానికి మరొక జింకను ఎరవేసినట్లు, భగవానుడు ఈ జీవాత్మలను ఉద్ధరించడానికి ఇక్కడి ఆత్మలనే(జీవాత్మ) ప్రయోగించాలని నిర్ణయించుకొని, కొన్ని ప్రత్యేక ఆత్మలను ఎంచుకొని, శుద్ధజ్ఞానాన్ని వారికి ప్రసాదించి, వారినే ఆళ్వార్లుగా  అవతరింప చేశాడు. ఆ విధంగా అజ్ఞానశూన్యులైన ఆళ్వార్లకు, భగవానుడు కృపతో శుద్దభక్తిజ్ఞానాలను అనుగ్రహించి, వారిచే దివ్యపాశురాలను రచింపజేసి, వీరి ద్వారా ఈ లోకంలోని సమస్త  ఆత్మలకు జ్ఞానోదయం కలిగించి, తద్వారా వారు మోక్షం (శ్రీవైకుంఠం) పొందాలని భగవానుడు సంకల్పింస్తాడు. అటువంటి ఆళ్వార్లలో నమ్మాళ్వార్లను ప్రధానులుగా భావిస్తారు మన పెద్దలు.

నమ్మాళ్వార్లకు  మాఱన్, మగిళ్ మాఱన్, శఠకోపులు, నావీఱులు, పరాంకుశులు, వకుళాభరణులు, శఠజిత్, మరియు కురుగూర్ నంబి అనే తిరునామాలున్నవి.

కలియుగం ప్రారంభమున  ఆళ్వార్ తిరునగరి సమీపములోని ‘అప్పన్ కోయిల్’ అనే క్షేత్రమున  కారియార్ ఉడైయనంగై అనే దివ్యదంపతులకు వైశాఖ(వైగాశి)మాస విశాఖానక్షత్రంలో అవతరించారు నమ్మాళ్వార్. ఉడైయనంగైకారియార్ల  ఇరువురి కుటుంబం వారు పరంపరగా భగవత్కైకర్యమున తమ జీవితాలను కృతార్థం చేసుకున్నారు. ఈ దంపతులిద్దరు సంతానార్థం తిరుక్కురుంగుడినంబిపెరుమాళ్ళను ప్రార్థించారు. పెరుమాళ్  తానే వారికి సంతానంగా పుడతానని వరమిస్తాడు. మనం గురుపరంపర గ్రంథంలో ఈ విషయం గురించి చర్చించుకున్నాము (ఆళ్వారాచార్యుల చరిత్రలు). నమ్మాళ్వార్ల మహిమను గ్రహించిన మన పూర్వాచార్యులు, భగవానుడే స్వయంగా అవతారించారా లేక నిత్యసూర్యులలోని వారా అని ఆశ్చర్యపోయేవారు.

తల్లి  గర్భంలో శిశువు ఉన్నప్పుడు అజ్ఞానాన్నికలిగించే ‘శఠం’ అనే వాయువు / ఉమ్మనీరు ఆ శిశువును ఆవహించి జ్ఞానభ్రాంతి కలిగించును. అలాంటి ‘శఠం’ శిశువుగా ఉన్న  నమ్మాళ్వార్లను ఆవహించబోగా వారు శఠాన్ని ధిక్కరించారు.  అందువల్ల వీరికి  ‘శఠకోపన్’ (శఠమును కోపించిన వారు)అనే తిరునామం కలిగినది.  నమ్మాళ్వార్లు అందరి పిల్లల వలె పుట్టగానే ఏడవలేదు, పాలు తాగేవారు కాదు. వీరి తల్లిదండ్రులు నమ్మాళ్వార్లను తిరుక్కురుగూర్ ఆదినాథుడికి సమర్పించి ‘తిరుప్పుళి ఆళ్వార్’ అనే చింతచెట్టు  క్రింద వదిలేస్తారు. చింతచెట్టు  తొర్రలో నమ్మాళ్వార్లు నిద్రాహారాలు లేకుండ దివ్యతేజంతో 16 సంవత్సరాల కాలం పాటు పద్మాసీనులై  భగవత్ ధ్యానంలో ఉండిపోతారు.

ఇది ఇలా ఉండగ, నమ్మాళ్వార్ల అవతారానికి ముందు ఆళ్వార్ తిరునగరికి సమీపములో ఉన్న తిరుక్కోళూర్   అనే దివ్యదేశములో  మధురకవి ఆళ్వార్ అనే బ్రాహ్మణోత్తముడు జన్మిస్తాడు. వీరు ఉత్తరభారతదేశ యాత్ర  చేస్తుండగా దక్షిణదిశ నుండి ఒక దివ్యమైన  తేజస్సుని చూస్తారు. ఆ జ్యోతిని అనుసరిస్తూ వారు ‘తిరుప్పుళి ఆళ్వార్’ అనే చింత చెట్టు క్రింద పద్మాసీనులైఉన్న నమ్మాళ్వార్ల వద్దకు చేరుకుంటారు.

నమ్మాళ్వార్లు ప్రబంధాలను అనుగ్రహించగా మధురకవి ఆళ్వార్లు వాటిని తాళపత్రాలపై వ్రాసినారు. నమ్మాళ్వార్ల అనుగ్రహించిన  నాలుగు ప్రబంధాలు.

  • తిరువిరుత్తం (ఋగ్వేద సారం)
  • తిరువాశిరియం (యజుర్వేద సారం)
  • పెరియ తిరువందాది (అధర్వవేద సారం)
  • తిరువాయ్ మొళి (సామవేద సారం)

నమ్మాళ్వార్ల ఈ నాలుగు ప్రబంధాలు నాలుగు వేదాలకు సమానమైనవి. అందుకనే వీరికి  ‘వేదం తమిళ్ శెయ్ ద మాఱన్’ అనే తిరునామం కలిగినది.   అంటే వేదాలను తమిళంలో వ్రాసిన మాఱన్ అని అర్థం. సంస్కృత వేదార్థాలను అందరికి అర్థమైయ్యేలా సులువుగా తమిళభాషలో వెలికి తెచ్చారు. ఇతర ఆళ్వార్ల ప్రబంధాలు వేదాలకు ఉపాంగాలుగా పరిగణించారు మన పూర్వాచార్యులు. పన్నిద్దరాళ్వార్లు కృపచేసిన  నాలుగువేల పాశురాల (నాలాయిర దివ్యప్రబంధం) సారమంతా తిరువాయ్ మొళిలో ఇమిడి ఉందని పూర్వాచార్యులు కీర్తిస్తారు. మన పూర్వాచార్యులు తమతమ వ్యాఖ్యానాలను, రహస్యగ్రంథాలన్నీ తిరువాయ్ మొళిని ఆధారంగానే అనుగ్రహించారని పూర్వుల నిర్వాహకం. భగవానుని  అనుగ్రహంతో పూర్వాచార్యులు  తిరువాయ్ మొళి శ్రీసూక్తులకు ఐదువ్యాఖ్యానాలు కృపచేశారు. ప్రస్తుతం ఇవి లభ్యం.

ఆళ్వార్ [ఈ పదం కేవలం నమ్మాళ్వార్లను మాత్రమే సూచిస్తుంది] ఈ లీలావిభూతిలో ముప్పైరెండు సంవత్సరాలు జీవించారు. ఆళ్వార్ సాంసారిక బంధాలతో ఎటువంటి అనుబంధం లేకుండా నిరంతరం భగవధ్యానంలో ఉండేవారు. ఆ చింతచెట్టు క్రింద పద్మాసీనులై ఆయా దివ్యదేశాల పెరుమాళ్ళను స్తుతిగా  పాశురాల ద్వారా మంగళాశాసనం కృపచేశారు. దివ్యదేశాల నుండి పెరుమాళ్ళు తామే  స్వయంగా ‘తిరుప్పుళియాళ్వార్’ వద్దకు వచ్చి వీరి పాశురాల ద్వారా మంగళాశాసనాలు అందుకునేవారు. పెరుమాళ్ళ దివ్యానుగ్రహంతో శాస్ర్తార్థాలను ఆళ్వార్  తమ ప్రబంధాలలో స్పష్టంగా కృపచేశారు. ఇంతటి  విశేష వైభవం  కలిగిన  తిరువాయ్ మొళి సేవిస్తున్నప్పుడు, ఫలశృతి పాశురాలలో ‘కురుగూర్’ అన్న నామాన్ని ఉచ్ఛరించినప్పుడల్లా మనం దక్షిణదిక్కుకి తిరిగి ఆళ్వార్ తిరునగరికి చేతులెత్తి నమస్కరించాలని మన పూర్వాచార్యులు నియమనం చేశారు .

ఆళ్వారు ముప్పైరెండు సంవత్సరాల కాలంపాటు ఈ లీలావిభూతిలో ఉన్న తర్వాత, ఇక పరమపదానికి వెళ్ళాలని నిశ్చయించుకుంటారు. ఈ విషయం తెలుసుకున్న మధురకవిఆళ్వార్లు తమ ఆచార్యులు ఈ లీలావిభూతిని వదలి వెళ్ళుతున్నారని తెలిసి కలతచెంది తమ నిత్యతిరువాధన కోసం ఒక అర్చామూర్తిని  ప్రసాదించమని ప్రార్థించారు. మధురకవిఆళ్వార్లకు తామ్రపర్ణి నదీజలాన్ని కాచితే తమ అర్చామూర్తి లభిస్తుందని ఆళ్వార్ అనుగ్రహిస్తారు. మధురకవి ఆళ్వార్లు తమ ఆచార్యుల ఆదేశంమేరకు తామ్రపర్ణి నదీజలాన్ని కాచి ఒక అర్చామూర్తిని పొందుతారు. అంజలి ముద్రలో ఉన్న ఆ అర్చామూర్తిని సేవించిన  మధురకవి ఆళ్వార్లు , “మీరు దాసునికి ఆచార్యులు కాబట్టి,  ఉపదేశముద్రతో ఉన్న అర్చామూర్తిని ఆరాధించాలని ఆశించాను, కాని  ఈ అంజలిముద్రకు కారణం ఏమిటి స్వామి?” అని అడిగారు. దానికి నమ్మాళ్వార్లు బదులిస్తూ “ఆ అర్చామూర్తిని (భవిష్యదాచార్య రామానుజులును) చూపిస్తు, వీరు నాలుగువేలసంవత్సరాల తర్వాత అవతరించబోయే ఒక గొప్ప మహానుభావుడు” అని సూచిస్తారు.

ప్రస్తుతం మనం ఆళ్వార్ తిరునగరిలో ప్రధానసన్నిధికి పడమరవైపు ఉన్న ‘రామానుజ చతుర్వేదిమంగళం’అనే  వీధిలో భవిష్యదాచార్యుని  (రామానుజుల) దివ్య అర్చామూర్తిని  సేవించుకోవచ్చు. మధురకవిఆళ్వార్లను మళ్ళీ తామ్రపర్ణి నదీజలాన్ని కాయమని నమ్మాళ్వార్లు ఆదేశిస్తారు. ఈసారి వీరు నమ్మాళ్వార్ల వంటి అర్చామూర్తిని  పొందుతారు. మధురకవి ఆళ్వార్లు పరమానందంతో స్వీకరించి ఆ అర్చామూర్తిని ఆరాధిస్తారు.   ఆళ్వార్ తిరునగరిలో. ప్రస్తుతం మనం సేవిస్తున్న మూర్తి ఈ అర్చామూర్తియే.

కాలానంతరం, భగవానుడు స్వయంగా వచ్చి నమ్మాళ్వార్లను పరమపదానికి తీసుకువెళతారు. అనంతరం మధురకవిఆళ్వార్లు,  ఆదినాథ పెరుమాళ్ళ ఆలయంలోపల నమ్మాళ్వార్ల అర్చామూర్తిని ప్రతిష్ఠించి, దివ్య గోపురప్రాకారమండపాదులను నిర్మింపజేశారు. నిత్యం వివిధరకపు పూలమాలతో నమ్మాళ్వార్ల అర్చామూర్తిని అలంకరించి ఆనందాన్ని పొందేవారు. నమ్మాళ్వార్ల పాశురాలను నలుమూలలా వ్యాపించే విధంగా పాడుతూ ఉండేవారు. వీరు భక్తి పారవశ్యంతో నమ్మాళ్వార్లను స్తుతిస్తూ పదకొండు పాశురాల ‘కణ్ణినుణ్ శిఱుత్తాంబు’ అనే ప్రబంధాన్ని అనుగ్రహిస్తారు.  ఇప్పటికిని ఆళ్వార్ తిరునగరిలో “అణ్ణావియర్” అనే తిరునామంతో మధురకవిఆళ్వార్ల వంశస్థులు నిత్యకైంకర్యం చేస్తున్నారు.

కొంత వరకు మనము ఆళ్వార్ల వైభవాన్ని అనుభవించాము.

నమ్మాళ్వా ర్ల తనియన్:

మాతాపితా యువతయ స్తనయా విభూతిః

సర్వం య దేవ నియమేన మదన్వయానామ్|
ఆద్యస్య నః కులపతేర్వకుళాభిరామమ్
శ్రీమత్తదంఘ్రియుగళం ప్రణమామి మూర్ధ్నా||

నమ్మాళ్వా ర్ల వాళి తిరునామాలు

తిరుక్కురుగై ప్పెరుమాళ్ తన్ తిరుత్తాళ్గళ్ వాళియే
తిరువాన తిరుముగత్తు చ్చెవ్వి ఎన్ఱుం వాళియే
ఇరుక్కుమొళి ఎన్ నెంజిల్ తేక్కినాన్ వాళియే
ఎందై ఎదిరాశర్కు ఇఱైవనార్ వాళియే
కరుక్కుళియిల్ పుగావణ్ణం కాత్తు అరుళ్వోన్ వాళియే
కాశినియిల్ ఆరియనాయ్ క్కాట్టినాన్ వాళియే
వరుత్తం అఱ వందు ఎన్నై వాళ్విత్తాన్ వాళియే
మధురకవి తంబిరాన్ వాళి వాళి వాళియే

ఆన తిరువైరుత్తం నూఱుం అరుళినాన్ వాళియే
ఆశిరియం ఏళు పాట్టు అళిత్త పిరాన్ వాళియే
ఇనం అఱ అందాది ఎణ్బత్తు ఏళు ఇందాన్ వాళియే
ఇలగు తిరువాయ్మొళి ఆయిరత్తు నూఱ్ఱు ఇరండు ఉరైత్తాన్ వాళియే
వాన్ అణియుం మామాడక్కురుగై మన్నన్ వాళియే
వైగాశి విశాగత్తిల్ వందు ఉదిత్తాన్ వాళియే
సేనైయర్కోన్ అవదారం శెయ్ద వళ్ళల్ వాళియే
తిరుక్కురుగై చ్చటకోపన్ తిరువడిగల్ వాళియే

మేదినియిల్ వైగాశి విశాగత్తోన్ వాళియే
వేదత్తై చ్చెందమిళాల్ విరిత్తు ఉరైత్తాన్ వాళియే
ఆది గురువాయ్ అంబువియిల్ అవదరిత్తోన్ వాళియే
అనవరదం సేనైయర్ కోన్ అది తొళువోన్ వాళియే
నాదనుక్కు నాలాయిరం ఉరైత్తాన్ వాళియే
నన్ మధురకవి వణంగుమ్ నావీఱన్ వాళియే
మాధవన్ పోఱ్పాదుగైయార్ వళర్ న్దరుళ్వోన్ వాళియే
మాగిళ్ మాఱన్ శడగోపన్ వైయగత్తిల్ వాళియే

మూలము: https://srivaishnavagranthams.wordpress.com/2022/12/03/azhwarthirunagari-vaibhavam-2/

పొందుపరిచిన స్థానము – https://srivaishnavagranthams.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 94

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 93

అష్టదిగ్గజులటువంటి శిష్యులచే ఆరాధించబడుతున్న పెరియ జీయర్, ఈ ప్రపంచ వాసులందరినీ అర్థ పంచకం (తన గురించి తెలుసుకోవడం, భగవానుని గురించి తెలుసుకోవడం, ఆ భగవానుని పొందే మార్గాల గురించి తెలుసుకోవడం, పురుషార్థం గురించి తెలుసుకోవడం, ఈ ప్రయాణంలో ఎదురైయ్యే అవరోధాల గురించి తెలుసుకోవడం అనే ఐదు సూత్రాలు) తో ముడిపడి ఉండేలా చేశారు. అత్యోన్నత లక్ష్యం మార్గములోకి (ఆచార్యుని ఆశ్రయించడం) వారిని మరలించారు. తిరువాయ్మొళి ఈడు, శ్రీభాష్యాన్ని నాయనారుకి బోధించమని కందాడై అణ్ణన్ ను, ప్రతివాది భయంకరం అణ్ణాను పురమాయించారు.

వారు ఇలా జీవిస్తుండగా, ప్రతి ఒక్కరినీ, స్థావరాలను (మొక్కలు) కూడా ఉద్ధరిస్తూ (చింత చెట్టుకు కూడా మోక్షం ప్రసాదించారు) తమ నిష్కామ కృపను కురిపిస్తున్న కాలంలో, వారి గుణాలను వెలికితీస్తూ జీయర్ ఈ పాశురాన్ని పఠించారు:

తెన్నరంగర్ శీరారుళుక్కు ఇలక్కాగ ప్పెఱ్ఱోం
  తిరువరంగ త్తిరుప్పదియే ఇరుప్పాక ప్పెఱ్ఱోం
మన్నియ శీర్ మాఱన్ కలై ఉణవాగ ప్పెఱ్ఱోం
  మధురకవి శొఱ్పడియే నిలైయాగప్పెఱ్ఱోం
మున్నవరాం నం కురవర్ మొళిగల్ ఉళ్ళప్పెఱ్ఱోం
  ముళుదుం నమక్కివై పొళుదుపోక్కాగ ప్పెఱ్ఱోం
పిన్నై ఒన్ఱుదనిల్ నెంజం పోరామఱ్ ప్పెఱ్ఱోం
  పిఱర్మినుక్కం పొఱామై ఇల్లా ప్పెరుమైయుం ప్పెఱ్ఱోమే

(శ్రీ రంగనాధుని కరుణకు పాత్రులు కావడం మన భాగ్యం; శ్రీరంగ దివ్య దేశం మన నివాస స్థలం కావడం మన భాగ్యం; నమ్మాళ్వార్ల తిరువాయ్మొళిని అనుభవం మన భాగ్యం; ఆచార్య నిష్ఠను బోధించే మధురకవి ఆళ్వార్ల సూచనలు మన భాగ్యం; మన పూర్వాచార్యులు అనుగ్రహించిన ఈ గ్రంథ ఉపాకారం మన భాగ్యం; అన్య విషయాలపై ఆసక్తి లేకపోవడం మన భాగ్యం; ఇతరుల సామర్థ్యం చూసి అసూయపడని గొప్పతనం ఉండటం మన భాగ్యం.

‘యంయం స్పృశతి పాణిభ్యాం’ (తమ దివ్య హస్తాలతో తాకిన వారందరూ) అన్న వాఖ్యంలో పేర్కొన్నట్లుగా, వారి దివ్య స్పర్శతో మొక్కలు వృక్షాలు కూడా ఉద్ధరించబడినప్పుడు, మనుషుల గురించి వేరే చెప్పాలా? మణవాళ మాముణుల వల్ల అందరూ పొందిన ఫలాలను ఈ క్రింది శ్లోకము తెలియజేస్తుంది:

తత్పాదపద్మ సంస్పర్శపావనం సలివం జనాః
  స్వీకుర్వంతః సుఖేనైవ స్వరూపం ప్రతిభేదిరే
ఆలోకైర్ అనుకంపాధ్యైర్ ఆలాపైర్ అమృతచ్యుతైః
  అన్వహం పాణిపాదస్యస్పర్శన్యాసైశ్చ పావనైః
మంత్ర రత్న ప్రధానేన తదర్థ ప్రతిపాదనాత్
  ఆత్మార్పణేన కదిచిత్ అజ్ఞాపనే నచ
కేచిత్ క్షేమం యుయుస్తస్య పాదపద్యస్య సంశ్రయాన్
  అన్యే తద్రూపనినాతగ్యే తన్నామ కీర్తనాత్
శృత్వా తస్యగుణాన్ దివ్యాన స్తుత్వాతానేవ కేచన
  నత్వాతాం ధీశముద్దిశ్య స్మృత్వా తద్ వైభవం పరే
అపతిశ్యగమప్యేనమన్యే ప్రతిత వైభవం
  అన్యేతద్ బృత్య బృత్యానమలోక స్పర్శనాతపి
అన్యేతద్ పాదసంస్పర్శ తన్యేసంభూయ భూతలే
  అభవన్ భూయసా తస్య మునేః పాత్రం కృపాద్రుశం
ఏవం సర్వే మునీందరేణ బభూవుస్ స్రస్త బంధనాః

(మణవాళ మాముణుల దివ్య తిరువడితో ఉన్న అనుబంధం కారణంగా, వారి శిష్యులు ఆచార్య శ్రీపాద తీర్థాన్ని స్వీకరిస్తూ తమ స్వరూపాన్ని (శేషత్వం) సులభంగా అర్థం చేసుకున్నారు; మరి కొందరు అమృతంలా ప్రవహించే కరుణాపూరితమైన వారి దృష్టి, వాళ్ళ మీద పడి ఉద్ధరణ పొందారు. మరి కొందరు వారి దివ్య పాద స్పర్శతో, ఆ దివ్య పాదాలకు శరణాగతి చేయడంతో, మంత్ర రత్నంగా పరిగణించబడే ద్వయ మహామంత్రాన్ని వారి ద్వారా పొందడంతో, వారి నుండి ఆ అర్థాలను తెలుసుకోవడం ద్వారా ఉద్దరణ పొందారు; మరికొందరు తమ అజ్ఞానాన్ని వ్యక్తం చేస్తూ వారికి శరణాగతి చేయడం ద్వారా, కొందరు ఆ మహాముని దివ్య స్వరూపాన్ని ధ్యాన కేంద్ర బిందువుగా ఆపాదించుకున్నారు. మరికొందరు వారి దివ్యనామాలను పఠించారు, కొందరు ఆతని దివ్య మంగళ గుణాల శ్రవణం చేశారు, ఆ గుణాలను స్తుతించారు; మరి కొందరు వారు ఉన్న దిశ వైపు సాష్టాంగ నమస్కారం చేసి ఆరాధించారు; కొందరు వారి కీర్తిని మననం చేస్తూ అనందించారు; కొందరు, ఈ భూమండలంపైన అవతరించిన అంతటి మహిమగల మణవాళ మాముణుల దాసదాసర్ల (దాసులకు దాసులు) దివ్య స్పర్శతో పునీతులై వారి దివ్య కటాక్షానికి పాత్రులై ఉద్ధరించబడ్డారు; ఇలాగ ఆ మునీంద్రులైన (యతులకు రాజు) మణవాళ మాముణుల దయతో ప్రతి ఒక్కరూ బంధ విముక్తులైనారు). ఆ విధంగా, వారి శ్రీపాద తీర్థం తీసుకున్న వారితో ప్రారంభించి, వారి దృష్టి కటాక్షానికి పాత్రమయ్యే భాగ్యం కలిగిన వారు, వారిని ధ్యానించిన వారు, వారి పరిచయం ఉన్న వారి వరకు, తమ దగ్గరున్న వాళ్ళు, తమకు దూరంగా ఉన్న వాళ్ళు, తర్వాతి కాలంలో ఈ భూమిపైన జన్మించే వాళ్ళు, రాబోతున్న వాళ్ళ మధ్య ఎటువంటి భేదం లేకుండా, సంసారం పరమపదం అనే తేడా లేకుండా సమస్త లోకాలను బంధ విముక్తులను చేశారు. ఎంత మేరకు అంటే ఉద్దరణ ఎవరికైనా అవసరముందా అని వారిని అన్వేషించేటంత స్వర్ణ మయం చేశారు.

సర్వావస్థా సదృశవిభవా శేషకృత్వం రమయాభర్తుః
  త్యక్త్వా తదపి పరమం ధామతత్ప్రీతి హేతోః
మగ్నానగ్నౌ వరవరమునే మాదృశానున్నినీషన్
  మర్త్యావాసే భవసి భగవన్ మంగళం రంగధామ్నః

(మంగళ గుణాలు కలిగిన మణవాళ మాముని! శ్రీమహాలక్ష్మికి పతి అయిన భగవానునికి అన్ని కాలములలో, స్థితులలో, మహిమాన్వితమైన సేవలందింస్తున్నారు. సంసారం అనే అగ్నిలో కొట్టు మిట్టాడుతున్న అడియేన్ వంటి వారిని ఉద్ధరించడానికి, భగవత్ ప్రీతి కారణంగా ఆ పరమపదాన్ని (శ్రీవైకుంఠం) విడిచి వచ్చారు. ఈ లోకంలో ఈ దివ్య దేశమైన తిరువరంగంలో దేవర్వారు దివ్య దీపమువలెనున్నారు). అలా తాను అవతరించిన లక్ష్యాన్ని పూర్తి చేశారు.

మూలము: https://srivaishnavagranthams.wordpress.com/2021/10/20/yathindhra-pravana-prabhavam-94/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 93

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 92

ఆచర్య హృదయం గ్రంథానికి వ్యాఖ్యానం వ్రాసిన జీయర్ 

జీయర్ తమ శరీరం బలహీనతను కూడా లెక్కచేయకుండా, ఆచార్య హృదయం (పిళ్ళై లోకాచార్యుల తమ్ముడు అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ రచించిన రహస్య ప్రబంధం) గ్రంథానికి వ్యాఖ్యానం వ్రాయాలని సంకల్పించారు. వారి మెడ భాగం నొప్పి కారణంగా, తమ ఆసనంపై పడుకుని వ్యాఖ్యానం వ్రాసేవారు. అది చూసి, కందాడై అణ్ణన్ “దేవర్వారు ఎందుకు అంత శ్రమ తీసుకుంటున్నారు?” అని ప్రశ్నించగా, జీయర్ ప్రతిస్పందిస్తూ “అడియేన్ దేవర్వారి పుత్రులు మనుమల కోసం ఈ కృషి చేస్తున్నాను” అని చెప్పి వ్యాఖ్యానం పూర్తి చేశారు.

జీయర్ను ఆశ్రయించిన ఏట్టూర్ శింగరాచారియర్; ఎనిమిది గోత్రముల క్రమం

ఆ సమయంలో, పెరియ తిరుమలై నంబి దివ్య వంశస్థులైన ఏట్టూర్ శింగరాచారియర్ [రామానుజుల పంచ ఆచార్యులలో ఒకరు, వారి మేనమామ], జీయర్ మహిమను గురించి విని, తన అకించన్యం [తనకంటూ ఒకటి ఉన్నదని చెప్పుకోడానికి ఏమీ లేకపోవడం], అనన్య గతిత్వం [ఇక వేరే ఎక్కడికి వెళ్ళే ఆస్కారం లేని] (ఇవి ఒక వ్యక్తి శరణాగతులు కావడానికి కావలసిన ప్రాథమిక అవసరాలు) తన అహంకారములు సిగ్గులను విడిచిపెట్టి, జీయర్ తిరువడి యందు ఆశ్రయం పొందాలని వచ్చెను. ఏట్టూర్ శింగరాచారియర్ సమర్పించిన సంపదతో, తిరునగరిలో ఆళ్వార్ కోసమై దివ్య గోపురం మరమ్మత్తు కైంకర్యాన్ని జీయర్ చేపట్టారు. ఆ కైంకర్యాన్ని పూర్తి చేయడంలో కొంత నిధుల కొరత ఏర్పడినప్పుడు, జీయర్ నాయనార్ [జీయర్ పూర్వాశ్రమ మనవడు] ఆ కొరతను సరిచేసి, పనిని పూర్తి చేశారు. తరువాత జీయర్ పొళిప్పాక్కం నాయనారుకి కబురు పంపి, సప్త గోత్ర నిబంధన (ఏడు వంశీయులను క్రమబద్ధం చేయడం), ఆ ఏడు వంశాలకు ఏట్టూర్ శింగరాచారియర్ ను కూడా చేర్చి, అష్ట గోత్ర సంఖ్యగా మార్చారు. ఈ క్రింది శ్లోకంలో చెప్పినట్లు…

జగత్రక్షయాపరో’నందో జనిష్యత్యపరోమునిః
తదారశ్యాస్ సదాచరాస్ సాత్వికాస్ తత్వ దర్శినః

(లోక సంరక్షణలో మునిగి ఉన్న తిరువంతాళ్వాన్ (రామానుజ మునిగా అవతారం కాకుండా) మరొక మునిగా అవతరించబోతున్నాడు (అందరి అభ్యున్నతి కోసం ధ్యానం చేసేవాడు); వారి ఆశ్రయం పొందిన వారు (ఆ సమయంలో) మంచి నడవడిక, సత్గుణాలను కలిగి ఉంటారు, తత్వార్థాలను సరిగ్గా తెలుసుకుంటారు), జీయర్ ఆశ్రయం పొందిన వ్యక్తులు సత్ప్రవర్తన కలిగి, కైంకర్యములలో నిమగ్నమై ఉన్నారు, మన తత్వశాస్త్రార్ధాలను పూర్తిగా తెలుసుకుంటున్నారు, నిరంతరం జీయర్ను ధ్యానిస్తూ ఉన్నారు.

అష్టదిగ్గజులు

ఈ పాశురములో చెప్పబడినట్లు…

పారారుమంగై తిరువేంగడముని భట్టర్పిరాన్
ఆరామమ్ శూళ్ కోయిల్ కందాడై అణ్ణన్ ఎఱుంబియప్పా
ఏరారుమప్పిళ్ళై అప్పిళ్ళార్ వాది భయంకరరెన్
పేరార్ంద దిక్కయన్ జూళ్ వరయోగియై చ్చిందియుమే

జీయరుకి ఎనిమిది ప్రాథమ శిష్యులు ఉండేవారు. వారు వానమామలై జీయర్, తిరువెంగడం జీయర్, భట్టర్పిరాన్ జీయర్, కందాడై అణ్ణన్, ఎఱుంబియప్పా, అప్పిళ్ళై, అప్పిళ్ళార్, ప్రతివాధి భయంకరం అణ్ణ. ఈ అష్టదిగ్గజులు కాకుండా మరి కొందరు తిరుప్పాణాళ్వార్ దాసర్, ఏట్టూర్ శింగరాచార్యర్, వరం తరుమ్ పెరుమాళ్ పిళ్ళై, మేనాట్టు త్తోళప్పర్, అళగియ మణవాళ ప్పెరుమాళ్ నాయనార్, జీయర్ నాయనార్, అణ్ణరాయ చక్రవర్తులు మొదలైనవారు మునుపు చూసిన ‘జగత్రక్షయాపరో నందో…….తత్వ దర్శినః’ శ్లోకానికి అణుగుణంగా ఉన్న మహా పురుషులు, సత్ ప్రవర్తనతో, దర్శన సూత్రాల అనుసంధానం చేస్తూ లోకోద్ధారణకై జీవిస్తుండేవారు.

శిష్యులకు కైంకర్యం

పైన పేర్కొన్న శిష్యులలో, అష్టదిగ్గజులతో సహా, ఈ కింద పేర్కొన్న వాళ్ళు జీయర్ తిరువడి వద్ద నిత్య కైంకర్యాలు చేస్తుండేవారు:

  1. వానమామలై జీయర్ – జీయర్ ప్రారంభ రోజుల నుండి భక్తి ప్రపత్తులతో నిత్యం జీయరుతో ఉన్న ఒక పేరుగాంచిన వ్యక్తి.
  2. కందాడై అణ్ణన్ – ‘రామానుజ మునిద్రస్య శ్రీమన్ దాశరథిర్యతా’ అనే వ్యాక్యంలో రామానుజులకు ముదళియాండాన్ ఎలాగో, అలాగే, అణ్ణన్ జీయర్ పట్ల పరమ భక్తితో ఉండేవారు. జీయర్ భద్రతను చూసుకునే కైంకర్యం చేసేవారు.
  3. ఎఱుంబియప్పా – ‘దేవుమఱ్ఱఱియేన్’ (మరొక దేవుణ్ణి ఎరుగను) అని అన్నట్లు, రామానుజుల పట్ల వడుగ నంబి ఎలా ఉండేవారో, అల్లగే జీయర్ పట్ల నిష్ఠతో ఉండేవారు.
  4. ప్రతివాది భయంకరం అణ్ణన్ – రామానుజులకు కూరత్తాళ్వాన్ ను పోలి; వీరు ప్రజలను ఇతర తత్వాల బారి నుండి దూరంగా ఉంచడం, శ్రీభాష్యంలో జీయరుకి నిరంతర సహచరుడిగా ఉండేవారు.
  5. సేనై ముదల్లియార్ అణ్ణన్, శఠగోప దాసర్, అప్పిళ్ళై, తిరుప్పాణాళ్వార్ దాసర్ – ఈ శిష్యులందరూ జీయరుకి తిరువాయ్మొళి దివ్య ప్రబంధ సహచరులు. ప్రత్యేకించి, అప్పిళ్ళై జీయర్ ఆదేశానుసారం, ఐదు తిరువందాదులకు [ముదల్, ఇరండాం, మూన్ఱాం, నాన్ముగ, పెరియ తిరువందులు] గమనికలు వ్రాసారు; అదీ కాకుండా యతిరాజ వింశతి (జీయర్ స్వరపరచినది) కి వ్యాఖ్యానం కూడా రాశారు.
  6. అప్పిళ్ళార్ – వీరు మఠ కార్యనిర్వహణ విషయాలు చూసుకునేవారు. కాల రితులకు అణుగుణంగా కూరగాయలు, పాలు, నెయ్యి, పెరుగు, పప్పులు, ఉప్పులు మొదలైన వంటకు సంబంధించిన సరుకుల ఏర్పాట్లను చూసుకునేవారు.
  7. భట్టర్పిరాన్ జీయర్ – రామానుజులకు ఎంబార్ లాగానే, జీయర్ దివ్య పాదాలకు నీడగా భట్టర్పిరాన్ జీయర్ ఉండేవారు. జీయరుని వీడి ఉండలేక, వారికే అన్ని సేవలు చేస్తూ, జీయర్ తప్పా మరేమీ ఎరగని వారు.
  8. జీయర్ నాయనార్ – ఒక యువరాజు వలె అందరికీ నచ్చినవాడు; రామానుజులకు తిరుక్కురుగై ప్పిరాన్ పిళ్ళాన్ వలె, వీరు జీయరుకి ఎంతో ఆసరాగా ఉండేవారు.

మూలము: https://srivaishnavagranthams.wordpress.com/2021/10/19/yathindhra-pravana-prabhavam-93/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 92

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 91

శిష్యుల ద్వారా దివ్యదేశాలలో కైంకర్యములు నిర్వహించారు

జీయర్ శ్రీ పాదాల ఆశ్రయం పొందిన మహాబలి వాణనాథన్, తిరుమలై తందాన్ తోళప్పర్ (తిరుమలై తోళప్పర్) ని తమ ప్రధాన అధికారులుగా నియమించి, వారి ద్వారా తిరుమాలిరుంజ్యోలై దివ్యదేశంలో అనేక కైంకర్యములను నిర్వహింప జేశారు. వారి కృషి వల్ల అళగర్కోయిల్లో కైంకర్యం సంపద అంచలంచలుగా పెరిగింది. కోయిల్ (శ్రీరంగం), తిరుమల మొదలైన దివ్యదేశాలలో ఏ లోటు లేకుండా కైంకర్యాలు జరుగుతూ అందరూ అనందించే సమయంలో తుళవ వంశంలో జన్మించిన ఒక వ్యక్తి ఆ ప్రాంతాలలో సంచరిస్తూ జీయర్ వద్దకు వచ్చి వారి ఆశ్రయం పొందారు. జీయర్ అతనిపై తమ కృపను కురిపించి, అతనికి “శ్రీరామానుజ దాసర్” అను దాస్య నామాన్ని అనుగ్రహించారు. జీయర్ కృప కారణంగా, శ్రీరంగంతో మొదలు పెట్టి అనేక దివ్యదేశాలలో కైంకర్యం చేసే భాగ్యం వారికి కలిగింది. తరువాత, ఈ క్రింది శ్లోకంలో చెప్పబడినట్లు

దివ్యోత్సవప్రసంగేషు దేవదేవమతంత్రితః
ఆశాసానస్సమాసీతన్నత్రాక్షీత్ రంగభూషణం

(ప్రత్యేక ఉత్సవాల సమయాల్లో, అత్యోన్నత స్వరూపుడైన శ్రీరంగనాధుని సేవించి, వారి నిజమైన భక్తుడిగా మంగళాశాసనం చేశారు), ఉత్సవాల సమయాలలో జీయర్ నంపెరుమాళ్ళకు మంగళాశాసనాన్ని నిర్వహించి, చెయ్దవక్కారం నఱు నెయ్ పాలాల్ (ఎర్రటి బియ్యం, పప్పు, పంచదార, నెయ్యి పాలతో తయారు చేసిన తీపి వంటకం) మొదలైన అనేక రకాల ప్రసాద నివేదనలను అర్పించారు. అంతకు మించి, ప్రతి ఏడాది ‘ఒన్ఱుం దేవుం, కణ్ణినుణ్ శిఱుఱ్ఱాంబు, ఇరామానుజ నూఱ్ఱందాది మొదలైన విశేష పాశురాలను పఠించేవారు, ప్రతి నిత్యం వ్యాఖ్యానాలతో పాటు ఆళ్వార్ అరుళిచ్చెయల్ పఠించేవారు. ఈ క్రింది శ్లోకంలో చెప్పినట్లుగా…

కస్తూరి హిమకఱ్పురా స్రక్ తాంబూలా’నులేపనైః
దివ్యైరప్యభజత్ భోజ్యైః రంగనాథం దినే దినే

(ప్రతిరోజూ శ్రీ రంగనాధునికి కస్తూరి, కర్పూరం, మాలలు, తమల పాకులు, సుగంధ ద్రవ్యాలు మొదలైనవి నివేదించే కైంకర్యం వీరు చేసే వారు. మార్గళి (ధనుర్మాసం) మాసంలో…

కాలేకోతండ మార్తాండే కాంక్షంతే వారునోదయం
న్యషేవతవిశేషేణ శేషిణం శేషశాయినం
మంగళానిప్రయుజ్ఞానో మాధవం ప్రత్యభోదయత్
సంయకేనం సమప్యర్చ్య సర్వధానుకతైః క్రమైః
స్వస్వకాలోచితైర్దిన్యై స్వసంకల్పోపలంబితైః
అభోజయతయం భోజ్యైః శాకమూలపలాధిపిః
సూభాభూప కృతక్షీర చర్కరా సహితం హవిః 

(ప్రాతఃకాలంలో, శేష శయ్యపై ​​శయనించి ఉన్న పెరుమాళ్ళకు విశేష ఆరాధనలు చేసేవారు. దివ్య పాశురాలను సేవిస్తూ మేల్కొనే సమయం ఆసన్నమైనదని శ్రీ మహాలక్ష్మి పతిని మేల్కొలుపేవారు. శాస్త్ర విధిని నిష్ఠగా అనుసరించి పెరుమాళ్ళకు తిరువారాధన చేసేవారు. వారు స్థాపించిన పద్ధతి ప్రకారం, వివిధ రితులలో లభించే ప్రత్యేక కూరగాయలు, దుంపలు, పండ్లు మొదలైన కాలానుగుణంగా లభించే పదార్థాలతో పాటు వడలు, పప్పు, నెయ్యి, పాలు, పంచదార, అన్నం మొదలైనవి నివేదించేవారు).

పెరియాళ్వార్ తిరుమొళికి వ్యాఖ్యానము రచించారు

పెరియాళ్వార్ తిరుమొళికి పెరియవాచ్చన్ పిళ్ళై రచించిన వ్యాఖ్యానం దురదృష్టవశాత్తు ఆఖరి నలభై పాశురాలు మినహా అన్నీ నశించిపోయాయి [తాళపత్రాలకు చెదలు పట్టడం వల్ల]. నష్ట పోయిన భాగానికి వ్యాఖ్యానం వ్రాయాలని సంకల్పించి పాశురంలో పేర్కొన్న విధంగా ఆళ్వార్ తిరునగరిలో కైంకర్యం నిర్వహిస్తున్న తిరుప్పాణాళ్వార్ దాసర్‌ కు సందేశం పంపారు.

శెందమిళిల్ ఆళ్వార్గళ్ శెయ్ద అరుళిచ్చెయలై
శిందై సెయల్ తన్నుడనే శెప్పలుమాం – అందో
తిరుప్పాణాళ్వార్ తాదర్ నాయనార్ శేర
విరుప్పారాగిల్ నమక్కీడావార్ యార్ 

(అందమైన తమిళ భాషలో దయతో ఆళ్వార్లు రచించిన ఆరుళిచ్చెయల్ కు, మనసా వాచా కర్మనా నేను వ్యాఖ్యానం వ్రాయాలని ఆశిస్తున్నాను. అయితే, ఈ కార్య సిద్ధి కోసం తిరుప్పాణాళ్వార్ దాసర్ సహకారం కోరుతున్నాను) తిరునగరిలో తిరుప్పాణాళ్వార్‌ కు ఈ సందేశం లభించిన వెంటనే ఎంతో సంతోషించి, ఆ సందేశాన్ని తమ శిరస్సుపై పెట్టుకుని, తమ తిరునందనవన కైంకర్యాన్ని (పెరుమాళ్ల పూల తోటను చూసుకునే) విడిచిపెట్టి, వెంటనే తిరునగరి నుండి బయలుదేరి, వేగాతివేగంగా శ్రీరంగం చేరుకుని జీయర్ దివ్య పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశారు. తిరుప్పాణాళ్వార్‌ యత్నాలను, తనను చూడలేకపోయానన్న తపనను గ్రహించి, జీయర్ తమ చల్లని దృష్ఠితో అతనిని ఆదరించి, “మీరు ఎంతో జ్ఞానవంతులయ్యారు” అని చెప్పి, మర్నాడే, పెరియాళ్వార్ తిరుమొళి వ్యాఖ్యానం రచించడం ప్రారంభించారు, చివరి నలభై పాశురాల వరకు [మిగిలిన భాగానికి పెరియవాచ్చాన్ పిళ్ళై వ్యాఖ్యానమ్ ఉంది) రాగనే ఆపివేసి, ఈ రెండు భాగాలను జోడించారు.

జీయర్ రచించిన వ్యాఖ్యానాన్ని కీర్తించిన కందాడై నాయన్

అప్పుడు చిన్నవాడైన కందాడై నాయన్ అక్కడికి వచ్చి,  జీయర్ వ్యాఖ్యానం మరియు అభయప్రదరాజర్ వారి (పెరియ వచ్చన్ పిళ్ళై) వ్యాఖ్యానం విశ్లేషించాడు. అతను పెరియ వాచ్చన్ పిళ్ళైల నలభై పాశురాల వ్యాఖ్యానాన్ని క్రింద ఉంచి, జీయర్ వ్యాఖ్యానాన్ని తన చేతిలోకి తీసుకుని, “మిగతా నలభై పాసురములు లేకుండా, ఇది సంపూర్ణం కాదు” అని అన్నాడు. ఇది విన్న జీయర్, “ఇంత చిన్న వయస్సులో, ఎంతటి జ్ఞాన పరిపూర్ణతను సొంతం చేసుకున్నాడితడు!” అని భావించి, కందడై నాయన్ ను తమ కృపా దృష్ఠితో చూసి, నాయన్‌ ను ఆశీర్వదించి, “ఒకరిని తిరస్కరించి మరొకరిని ఆదరించుట సమంజసమేనా? అటువంటి భేదం అసలు ఉందా?” అని నాయన్ ను ప్రశ్నించారు. నాయన్ బదులిస్తూ, “చిలక కొరికిన పండు ఎంత తియ్యగా ఉంటుందో, మాముణులు అందించినప్పుడు పెరియవాచ్చాన్ పిళ్ళై వ్యాఖ్యానం తీయగా మారుతుంది. జ్ఞానాన్ని కొలవడం అంటే, ముఖ్య అంశాలను స్వీకరించి, అముఖ్యమైనవి విస్మరించుట. అంతేకాక, ఈ వ్యాఖ్యానములో అద్భుతమైన సారం ఇమిడి ఉంది” అని అన్నారు. అది విన్న జీయర్ సంతోషించి నాయన్ ను ఆలింగనం చేసుకున్నారు. ఆ విధంగా, జీయర్ ప్రతి ఒక్కరు సంతోషపడే విధంగా పెరియాళ్వార్ తిరుమొళికి వ్యాఖ్యానం రచించారు. అంతే కాకుండా తమ వద్ద ఉన్నపెరియవాచ్చాన్ పిళ్ళైల దివ్య స్పర్ష కలిగిన శ్రీ రంగరాజుల విగ్రహాన్ని తిరుప్పాణాళ్వార్ దాసర్‌ను తన తిరువారాధన పెరుమాళ్ళుగా ఇచ్చి వారికి ఆళ్వార్ తిరునగరికి వెళ్ళమని అనుమతిని ఇచ్చారు.

మూలము: https://srivaishnavagranthams.wordpress.com/2021/10/18/yathindhra-pravana-prabhavam-92/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 91

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 90

కోయిల్ కు తిరిగివచ్చిన జీయర్

తిరుమాలిరుంజోలై నుండి బయలుదేరి, ప్రతి నిత్యం తిరుమాలిరుంజోలై భగవానుడు శయనించే దేశమైన శ్రీరంగానికి [అన్ని దివ్యదేశాల పెరుమాళ్ళు రాత్రికి శయనించడానికి శ్రీరంగానికి వస్తారు] చేరుకున్నారు. తిరువాయ్మొళి 10-9-8 వ పాశురము “కొడియణి నేడుమదిళ్ గోపురం కుఱుగినర్” (ఎత్తైన ప్రహరీ గోడలు, రంగురంగుల ధ్వజాలతో అలంకరించబడిన ప్రదేశంలోకి ప్రవేశించాను) అని నమ్మాళ్వార్ చెప్పినట్లు, శ్రీరంగంలోకి ప్రవేశించగానే, అక్కడి స్థానికులు ఎదురు వచ్చి, వారి పాదాలపై పడి, భక్తితో ఈ శ్లోకాన్ని పఠించారు

వకుళతరసవిత్రీం యాతియస్మిన్ ధరిద్రీం మధుమథన నివాసో రంగమాసీతసారం
పునరపి సుసమ్రుద్దం భూయసా సంప్రవిష్టే వరవరమునివర్యో మానుషః స్యాద్కిమేషః

(మొగళి పుష్పమాలలను తమ వక్షస్థలంలో ధరించే నమ్మాళ్వర్ల స్వస్థలమైన ఆళ్వార్తిరునగరికి మణవాళ మాముణులు వెళ్ళిన సమయంలో, క్షీరసాగరాన్ని మథనం చేసిన పెరుమాళ్ళు కొలువై ఉన్న శ్రీరంగం, తన శోభను కోల్పోయింది. మణవాళ మాముణులు తిరిగి శ్రీరంగంలోకి ప్రవేశించిన వెంటనే శ్రీరంగం తన శోభను సంతరించుకుంది. ఈ మణవాళ మాముణులను సాధారణ మనిషిగా భావించాలా?). వచ్చిన వారందరిపై జీయర్ తమ అనుగ్రహం కురిపించి, వారందరితో కలిసి మొదట ఎంబెరుమానార్ల సన్నిధికి వెళ్ళి, వారి తిరువడిని సేవించి, వారి పురుషకారంతో శ్రీరంగ నాచ్చియార్, పెరియ పెరుమాళ్ళను దర్శించుకున్నారు. విశేష ప్రసాదాలను స్వీకరించి తమ మఠానికి చేరుకున్నారు. ‘రంగే ధామ్ని సుఖాసీనం’ (శ్రీరంగంలో ఆసీనులై) అని చెప్పినట్లు, జీయర్ తిరుమలైయాళ్వార్లో ఆసీనులైనారు. తమ యథావిధి వ్యాఖ్యానాలు (వివిధ ప్రబంధాలు, శ్రీసూక్తుల వ్యాఖ్యానాలు) నిర్వహించి అందరినీ ఆనందపరిచారు. సందర్భానికి అనుగుణంగా వారి శిష్యులు ఈ క్రింది శ్లోకాన్ని పఠించారు.

జయతౌ యశసా తుంగం రంగం జగత్రయ మంగళం
జయతు సుచిరం తస్మిన్ భూమా రమామణి భూషణం
వరదగురుణార్థం తస్మై శుభాన్యపి వర్ధయన్
వరవరమునిః శ్రీమాన్ రామానుజో జయతు క్షితౌ

(ముల్లోకాలకు మంగళ కరమైన కేంద్ర బిందువుగా మహోన్నత కీర్తిని సంతరించుకున్న శ్రీరంగం దివ్యంగా ప్రకాశించాలి. పెరియ పిరాట్టియార్ (శ్రీమహాలక్ష్మి), శ్రీ కౌస్తుభం [సమస్థ చిత్ తత్వాలను సూచించే రత్నం] ఆభరణాలుగా కలిగి ఉన్న భగవాన్ చిరకాలం వర్ధిల్లాలి. వరదగురు అణ్ణన్ తో పాటు, ఆ పెరుమాళ్ళకు మరింత మంగళం కలిగించే, రామానుజుల పునరవతారమైన మణవాళ మాముణులు ఈ భూమిపై దివ్యంగా ప్రకాశించాలి).

అళగర్ కోయిల్ కు నిర్వాహకులుగా ఒక జీయరుని పంపిన మణవాళ మాముణులు

తిరుక్కురుంగుడిలో జీయర్ చేసిన మంగళాశాసనం ఫలించి, అళగర్ తిరుక్కురుంగుడి నుండి  తమ స్వస్థళానికి  తిరిగి చేరుకున్నారు. అళగర్ తరపు నుండి ఒక దివ్య సందేశం వచ్చింది. ‘నంగళ్ కున్ఱం కైవిడాన్’ (ఈ కొండను వదిలి వెళ్ళనివ్వము) అన్న దేవర్వారి సంకల్పానికి అనుగుణంగా మేము మా క్షేత్రానికి తిరిగి వచ్చాము. మా ఈ గృహంలో సక్రమంగా కార్యములు నిర్వహించుకోడానికి ఎవరినైనా పంపండి” అని సందేశం పంపారు. జీయర్ దీనిని చదివి ఎంతో సంతోషించి, మహా విరక్తర్ (అన్నింటినీ సంపూర్ణంగా త్యాగం చేసినవాడు), మంగళాసన పరర్ (నిష్ఠగా పెరుమాళ్లకు మంగళాశాసనం చేసేవారు) అయిన యతిరాజ జీయర్ అనే దివ్య నామంతో ఉన్న ఒక జీయరుని అళగర్ శ్రీకార్యం (అళగర్ ఆలయంలో కార్య నిర్వాహం చేసే వ్యక్తి) గా పంపారు. యతిరాజ జీయర్ అక్కడికి వెళ్లి, అళగర్ ను సేవించుకొని, తన ఆచార్య నిష్ఠకు ప్రతీకగా అన్ని కైంకర్యాలను శ్రద్ధతో నిర్వహించారు.

మూలము: https://srivaishnavagranthams.wordpress.com/2021/10/17/yathindhra-pravana-prabhavam-91/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

ఆళ్వార్ తిరునగరి   వైభవము – ప్రాచీన చరిత్ర

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమద్వరవర మునయే నమః  శ్రీవానాచల మహామునయే నమః

పూర్తి శ్రేణి

ఆళ్వార్ తిరునగరిని  శ్రీకురుగాపురిక్షేత్రం అని , ఆదిక్షేత్రమని కూడా అంటారు. జగత్పతి అయిన శ్రీమన్నారాయణుడు తన లీల కోసం సృష్టించిన గొప్ప దివ్యదేశమిది. సృష్టి ఆదిలో భగవానుడు,  చతుర్ముఖబ్రహ్మను సృష్టించి అతని ద్వారా ఈ జగత్తును సృష్టించాలని సంకల్పిస్తాడు. ఆ బ్రహ్మ సృష్టికార్యాన్ని పూర్తిచేసుకొని, భగవానుడి దర్శనం పొందాలనే కోరికతో వెయ్యి సంవత్సరాల కఠోరతపస్సు చేసి దర్శనం పొంది అనేక విధాలుగా స్తుతిస్తాడు. ఆ సమయంలో, భగవానుడు బ్రహ్మతో ఒక రహస్యం చెబుతాడు. భూలోకంలో భరతదేశం దక్షిణభాగంలో మలయమలై అనే పర్వతాలు ఉన్నాయని, ఆ మలయమలై పర్వతాల నుండి తామ్రపర్ణినది ఉద్భవించిందని, దానికి దక్షిణ భాగములో ఆదిక్షేత్రం ఉందని, తాను ఆదినాథుడిగా అందమైన స్వరూపాన్ని ధరించి ఎవరికీ కనిపించకుండా శ్రీమహాలక్ష్మితో ఆనందంగా కొలువై ఉన్నానని తెలుపుతాడు. బ్రహ్మను ఆ క్షేత్రానికి వెళ్ళి తనను ఆరాధించమని నిర్దేశిస్తాడు. ఈ క్షేత్రమహిమను తెలుసుకున్న బ్రహ్మ సంతోషించి ఆ క్షేత్రాన్ని ‘కురుగా క్షేత్రం’ అని పిలవాలని కోరతాడు. పిదప బ్రహ్మ ఆదిక్షేత్రం చేరుకుని చాలాకాలం పెరుమాళ్ళను ఆరాధిస్తాడు. ఈ క్షేత్రం, ఇక్కడ ప్రవహించే తామ్రపర్ణినది భగవానుడికి అత్యంత ప్రియమైనవని మన పూర్వాచార్యులు స్తుతించారు.

ఈ క్షేత్రంలో జరిగిన సంఘటనలు
మహర్షులు ఎందరో ఈ క్షేత్రాన్ని,  ఇక్కడి పెరుమాళ్ళను సేవించుకున్నారు. ఆ కాలమున ఒక ఏనుగుకి  వేటగాడికి  మధ్య పోరాటం జరిగి ఇద్దరు ఒకరినొకరు చంపుకున్నారు. విష్ణుదూతలు వచ్చి ఆ ఇద్దరి ఆత్మలను విష్ణులోకానికి తీసుకొని వెళతారు. ఇది చూసిన మహర్షులు ఇక్కడి క్షేత్రమహిమ వలననే ఇలా  జరిగిందని గ్రహించి ఈ క్షేత్రాన్ని కీర్తించారు.

ఇక్కడ మనము ‘దాంతన్’ చరిత్రను కూడా అనుభవిద్దాము. ఉత్తరదేశంలోని శ్రీసాలగ్రామంలో ఒక బ్రాహ్మణుడి వద్ద శిష్యుడు వేదాధ్యయనం చేస్తుండేవాడు. అతనికి తగినంత జ్ఞానం లేకపోవడం వలన వేదాధ్యయనం సరిగ్గా చేయలేకపోతాడు. ఆ బ్రాహ్మణుడు “నీవు వేదాలను సరిగ్గా నేర్చుకోలేదు కాబట్టి, వచ్చే జన్మలో శూద్రుడిగా పుడతావని”  ఆ శిష్యున్ని శపిస్తాడు. అయితే ఆ శిష్యుడు శాపభయానికి లోనవకుండా, సమీపంలో ఉన్న విష్ణ్వాలయంలోని  గడ్డిని కోసి అమ్ముతు జీవనం సాగిస్తుండేవాడు. క్రమేణా అతడు విష్ణుకృపకు పాత్రుడై మరుసటి  జన్మలో ఆదిక్షేత్రంలో శూద్రుడిగా జన్మిస్తాడు. భగవత్ కృపతో అతను ‘దాంతన్’ అనే పేరుతో  పెరుమాళ్ళను సేవిస్తూంటాడు.  సురాసురుల యుద్ధం సమయాన దేవేంద్రుడు, దేవతలతో ఇక్కడికి వచ్చి పెరుమాళ్ళను పూజిస్తారు. కానీ, దాంతన్ పట్ల చేసిన అపరాధ కారణంగా, వాళ్ళు తమ దృష్టిని కోల్పోగా దాంతన్ వారి అపరాధాన్ని మన్నించి, వారికి దర్శనమీయమని భగవానుని ప్రార్థిస్తాడు. దాంతన్ కోరిక ప్రకారం భగవానుడు వారికి తన దర్శనభాగ్యం కల్పిస్తాడు.ఇలా దాంతన్ ఈ క్షేత్రపెరుమాళ్ళను సేవిస్తు,  సంసార విముక్తిని పొందుతాడు.

పూర్వ కాలంలో, శంఖమునివన్ అనే ఒక ఋషి ఇంద్రపదవిని పొందాలనే కోరికతో తపస్సు చేస్తాడు. ఇంతలో నారదముని అక్కడికి వచ్చి తపస్సు ఎందుకు చేస్తున్నావని ఋషిని అడుగుతాడు. విష్ణువుని  ఇతర దేవతలతో సమానుడిగా  భావించానని నారదునికి తన తప్పిదమును చెపుతాడు. నారదుడు అతనితో “నువ్వు ఘోరమైన తప్పు చేశావు కావున  ఈ తప్పిదము వలన నీవు సముద్రంలో శంఖములా జన్మిస్తావని” శపిస్తాడు. శంఖమునివన్ తన తప్పిదమును గ్రహించి, నారదుడిని శాపవిముక్తి పొందే మార్గాన్ని కోరుతాడు. నారాదుడు అతనితో “ఆదిక్షేత్రంలోని పెరుమాళ్ళ దయతో నీవు శాపవిముక్తి పొందుతావు” అని అభయమిస్తాడు. శంఖమునివన్ సముద్రంలో శంఖములా  జన్మించి, తపస్సు చేస్తూ తామ్రపర్ణికి చేరుకుంటాడు. అతను ఉన్న తీరాన్ని శంగణిత్తుఱై అని అంటారు. శంఖరూపంలో ఉన్న శంఖమునివననుని తో పాటు ఇతర శంఖాలకు భగవానుడు కృపతో ముక్తిని ప్రసాదించి తన దివ్యస్వరూపంతో ఈ దివ్యదేశంలో వెలిశాడు.  బ్రహ్మ ద్వారా భగవానుడు శ్రీభూనీళా దేవేరులను, వరహమూర్తి మరియు  గరుడున్ని  ఈ దివ్యదేశానికి తీసుకువచ్చాడు.

అంతేకాకుండా,  భృగుమార్కండేయ మహర్షులకు, కార్తవీర్యార్జునునికి, పంచపాండవులలో అర్జునునికి  ఈ దివ్యదేశంలో భగవత్ దర్శనప్రాప్తి కలిగింది.

కురుగాపురి మహాత్మ్యంలో వేదవ్యాసుడు తన పుత్రుడైన శ్రీశుకుడికి, బ్రహ్మవశిష్టులకు ఈ ఆదిక్షేత్ర మహిమను తెలిపారని స్పష్టంగా వివరించబడి ఉంది.

ఇలా ఈ క్షేత్ర చరిత్రవైభవమును అనుభవించాము.

మూలం – కురుగాపురి క్షేత్ర వైభవం పై ఆదినాథ ఆళ్వార్ దేవస్థానం ప్రచురించిన పుస్తకం.

మూలము: https://srivaishnavagranthams.wordpress.com/2022/12/02/azhwarthirunagari-vaibhavam-1/

పొందుపరిచిన స్థానము – https://srivaishnavagranthams.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 90

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 89

కోయిల్ విరహంతో బాధపడుతున్న జీయర్

ఈ విధంగా ఆళ్వార్ తిరునగరిలో జీయర్ ఉండగా, మార్గళి మాసం (ధనుర్మాసం) ఆసన్నమైంది. ఎమ్పెరుమానార్ల తిరుప్పావై గొప్పతనాన్ని విని జీయర్, సేవించలేక పోతున్నానే అని బాధ పడ్డారు. [తిరుప్పావైతో ఎమ్పెరుమానార్లకు ప్రగాఢ అనుబంధం ఉండేది; వారిని తిరుప్పావై జీయర్‌ గా సూచిస్తారు, జీయర్ వారిని ఎంబెరుమానార్ల తిరుప్పావై అని పిలుస్తారు]; ఈ పాశురాన్ని రచించారు..

ఎందై ఎదిరాశర్ శిఱప్పై ఎళిల్ అరంగా
శిందై మగిళ్ందు అముదు శెయ్య – అంద నిలం
శెన్ఱు నిన్ఱు సేవిక్కుం సెల్వం ఇన్ఱు పెఱ్ఱిలమే
ఎన్ఱు సేవిక్కుం ఇని యాం?

(ఓ సుందరమైన శ్రీరంగనాధా! ఈనాటి రోజున నేను శ్రీరంగ కోయిల్ కు వెళ్ళి, ఆలయంలో నిలబడి, నా స్వామి అయిన రామానుజులను స్తుతించి, సంతోషించి, అదే భోగ్యంగా భావించి, దర్శించుకునే భాగ్యం నాకు లేకపోయింది. ఇక ఎప్పుడు దర్శిస్తానో? )

సంక్రమణం (దక్షినాయనం నుండి ఉత్తరాయణం సంక్రమణం, తై మాసం (మకర మాసం) ప్రారంభంతో) ప్రారంభమైనప్పుడు, జీయర్ నిరుత్సాహంతో ఈ పాశురాన్ని పఠించారు.

శీరరంగర్ తం దేవియరోడు శిఱప్పుడనే
ఏరారుమాఱన్ కలియన్ ఎదిరాశనోడు అమర
ప్పారోర్ మగిళ్ందేత్తుం తట్టుక్కళ్ తన్నుడన్ పోఱ్ఱ మంద
ప్పేరార వార్ త్తై ఇన్ఱు కండు ఇన్బుఱ ప్పెఱ్ఱిలమే

(నమ్మాళ్వార్, తిరుమంగై ఆళ్వార్, రామానుజులు, ఉభయ దేవేరులతో కలిసి ఆసీనులై ఉన్న శ్రీ రంగనాధుని దర్శించుకునే భాగ్యం నాకు లేకపోయింది. అందరు ఎంతో ఆనందంతో అడుగులు వేస్తూ, వారిని గొప్పగా స్తుతించే ఆ దృశ్యాన్ని నేను వీక్షించ లేక పోతున్నాను)

తై త్తిరునాళ్ (శ్రీ రంగంలో మకర మాస ఉత్సవాలు) ఉత్సవాలను గుర్తు చేసుకుంటూ ఈ పాశురాన్ని పఠించారు.

దేవియరుం తాముం తిరుత్తేరిన్ మేల్ అరంగర్
మేవి విక్కిరమన్ వీధి తనిల్ – సేవై శెయుం
అంద చ్చువర్ క్కత్తై అనుబవిక్క ప్పెఱ్ఱిలమే
ఇంద త్తిరునాళిలే నాం

(ఈ పవిత్రమైన రోజున, ఉభయ దేవేరులతో కలిసి నంపెరుమాళ్ళు దివ్య రథంపై ఆసీనులై తిరువిక్కిరమన్ వీధి (శ్రీరంగం ఆలయం ఏడు ప్రాకారాలలో ఒకటి) విహార అద్భుత దర్శనం నాకు కాలేదే!)

‘అణియరంగం ఆడుధుమో’, ‘తిరువరంగ ప్పెరునగరుళ్ తెణ్ణీర్ ప్పొన్ని తిరైక్కియాల్ వరుడి ప్పళ్ళి కొళ్ళుం కరుమణియై క్కోమళత్తై క్కణు కొండు ఎన్ కైణ్ణిణైగళ్ ఎన్ఱు కొలో కళిక్కుం నాళే’ (కులశేఖర ఆళ్వర్ల పెరుమాళ్ తిరుమొళి పాశురం 1.1.1), ‘ఊరరంగం ఎన్బదు ఇవళ్ తనక్కు ఆశై’ మొదలైన ఆళ్వార్ల పాశురాల మననం చేసుకుంటూ, శ్రీరంగ ఉత్సవ రోజులను అనుభవించ లేకపోతున్నానేనని దుఃఖించారు. జీయర్ తమ మనస్సులో ఆర్తితో, ఆళ్వార్ సన్నిధికి వెళ్లి ఈ పాశురాన్ని పఠిస్తూ మంగళాశాసనం చేసారు.

తిరుక్కురుగై ప్పెరుమాళ్ తన్ తిరుత్తాళ్గళ్ వాళియే
తిరువాన తిరుముగత్తు చ్చెవి ఎన్ఱుం వాళియే
ఇరుక్కుమొళి ఎన్ నెంజిల్ తేక్కినాన్ వాళియే
ఎందై ఎదిరాశర్ క్కు ఇఱైవనార్ వాళియే
కరుక్కుళియిల్ పుగావణ్ణం కాత్తరుళ్వోన్ వాళియే
కాశినియిల్ ఆరియనాయ్ క్కాట్టినాన్ వాళియే
వరుత్తం అఱ వందు అన్నై వాళ్విత్తాన్ వాళియే
మధురకవి తం పిరాన్ వాళి వాళి వాళియే

(తిరుక్కురుగూర్ స్వామి దివ్య తిరువడి చిరకాలం వర్ధిల్లాలి! ఆ దివ్య ముఖ తేజస్సు చిరకాలం వర్ధిల్లాలి! ఋగ్వేదం దివ్య వాక్కులు నా హృదయంలో నిలిచిపోయేలా చేసిన ఆ తీరు చిరకాలం వర్ధిల్లాలి! నా స్వామి అయిన రామానుజుల స్వామి చిరకాలం వర్ధిల్లాలి! మరొక గర్భంలో పడకుండా నన్ను కాపాడిన తీరు చిరకాలం వర్ధిల్లాలి! ఆ మహోన్నత వ్యక్తి చూపిన ఈ బాట చిరకాలం వర్ధిల్లాలి! ఏ పశ్చాత్తాపం లేకుండా జీవించడంలో నాకు తోడ్పడిన తీరు చిరకాలం వర్ధిల్లాలి! మధురకవి ఆళ్వార్ల ఉద్ధరణ పొందినవారు చిరకాలం వర్ధిల్లాలి!)

జీయర్ నమ్మాళ్వార్ల అనుమతి తీసుకుని తిరుక్కురుగూర్ నుండి బయలుదేరి, శ్రీవిల్లిపుత్తూర్ చేరుకుని, ఆలయంలోకి ప్రవేశించి, భట్టర్పిరాన్ (పెరియాళ్వార్, పొంగుం పరివు (పెరుమాళ్ పట్ల పొంగిపోతున్న భక్తి) ఉన్నవాడు) అలాగే వడపెరుం కోయిలుడైయాన్ (విశాల మందిరంలో ఒక మర్రి ఆకుపై కొలువై ఉన్నవాడు)ని సేవించుకున్నారు. ఆ తర్వాత వారు నాచ్చియార్ నివాసంలోకి ప్రవేశించి, ‘ఆళ్వార్ తిరుమగళార్ ఆండాళ్’ (పెరియాళ్వార్ దివ్య కుమార్తె అయిన ఆండాళ్) దివ్య చరణాలను దర్శించుకున్నారు. కోదై (ఆండాళ్‌ కు ఉన్న మరో పేరు, పెరుమాళ్‌ను అలంకరించే ముందు తాను ఆ మాల ధరించినందుకు ఆ పేరుతో పిలుస్తారు) వీరిపై తన కృపను కురిపిస్తూ, “కోయిలణ్ణన్ పునరవతారము కాదా నీవు!” అని పలికెను. ఆండాళ్ అనుగ్రహంతో, ‘అళగన్ అలంగారన్ మలైయాన్ సుందరత్తోలుడైయాన్’ (అందమైన భుజాలు గలవాడు, తిరుమాలిరుంజోలైలో కొలువై ఉన్నవాడు) దర్సించుకోడానికి అళగర్ కోయిల్‌ కు బయలుదేరారు. ఆండాళ్ అనుగ్రహంతో, అందంగా అలంకరింపబడిన ‘అళగన్ అలంగారన్ మలైయాన్ సుందరత్తోలుడైయాన్’ (అందమైన భుజాలు గలవాడు, తిరుమాలిరుంజోలైలో కొలువై ఉన్నవాడు) దర్శించుకోడానికి అళగర్ కోయిల్‌ కు బయలుదేరారు. పరమ స్వామిని (తిరుమాలిరుంజోలై మూలవర్ల పేరు) సేవించుకున్నారు. ‘అళగర్’ ఉత్సవర్లను తిరుక్కురుంగుడికి తరలించారని తెలిసింది. పెరియాళ్వార్ల పాశురం “నల్లాదోర్ తమరై ప్పొయ్గై నాణ్మలర్మేల్ పనిశోర అల్లియుం తాదుం ఉదిర్ందిట్టు అళగు అళిందాలొత్తదాలో, ఇల్లం వెఱిచ్చోడిఱ్ఱాలో ఎన్ మగళై ఎంగుం కాణేన్” (అందమైన సరస్సులో నిండుగా వికసించిన తామర పుష్పం పైన మంచు పడితే, ఆ పుష్పం లోపలి, బయటి రేకులు పడిపోతాయి; అలాంటిది జరిగినప్పుడు, కమలం దాని అందాన్ని కోల్పోతుంది. నా కూతురు ఎక్కడా కనిపించనందుకు, అందం కోల్పోయిన కమలం వలెనున్నది నా ఇల్లు ఇప్పుడు), అలాగే, అళగర్ ఆలయంలో లేనందుకు, ఈ ఆలయం కూడా అందం కోల్పోయినట్లుగా కనిపించింది. “పుత్ర ద్వయ విహీనం తత్” (రామ లక్ష్మణులద్దరు లేని ఇల్లు వంటిది) అని చెప్పినట్లుగా భావించి బాధపడ్డారు. ఆండాళ్ నాచ్చియార్ తిరుమొళి 9-6 వ పాశురంలో “నాఱు నఱుం పొళిల్ మాలిరుంజోలై నంబిక్కు” (సువాసనలు వెదజల్లే తోటలున్న తిరుమాలిరుంజోలైలో నివాసమున్న ఆ పెరుమాళ్ళు) అని పలికినట్లుగా, రామానుజుల మాదిరిగానే, వీరు అన్ని పదార్థాలను తెచ్చి వాటితో ప్రసాదాన్ని తయారు చేసి, పెరుమాళ్లకు సమర్పించారు. ఆ ప్రసాదాన్ని భుజించినందుకు ‘కైక్కూలి’ (లంచం) గా, వీరు నాచ్చియార్ తిరుమొళి 9-7 వ పాశురం “పిన్నుమ్ ఆలుమ్ సెయ్వన్”, పెరియాళ్వార్ తిరుమొళి 5-3 పాశురం ‘ఉన్ పొన్నడి వాళ్గ’ పఠించి పెరుమాళ్ళకు మంగళాశాసనం చేసారు. పరమస్వామి యొక్క దివ్య ముఖారవిందాన్ని సేవించి, సత్య పలుకులు చెప్పే ఆళ్వార్ల పాశురం “నంగల్ కున్ఱం కైవిడాన్” (మా నివాసాన్ని విడిచివెళ్ళ నివ్వకుండా) సత్యంగానే ఉండాలని ప్రార్థించారు [ఉత్సవ మూర్తి త్వరగా తిరిగి రావాలని పెరుమాళ్‌ను ప్రార్థించారు).

మూలము: https://srivaishnavagranthams.wordpress.com/2021/10/16/yathindhra-pravana-prabhavam-90/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 89

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 88

జీయర్ను ఆశ్రయించిన మహాబలి వాణనాథరాయన్

మధురలో జీయర్ ఉన్న కాలంలో , ఆ ప్రాంతపు రాజైన మహాబలి వాణనాథ రాయులు జీయర్ తిరువడి సంబంధం కోరి వారి దివ్య పాదాలను ఆశ్రయించారు. జీయర్ ఆ రాజుపై తమ విశేష కృపను కురిపించి, వారికి పంచ సంస్కారములు గావించి తమ పాదాల యందు ఆశ్రయం కలిపించారు. జీయర్ ఆ రోజు, మరుసటి రోజు అక్కడే గడిపి, రెండవ రోజు అర్ధ రాత్రిలో, ఈ పాశురములో చెప్పినట్లు

మణికాంచన సంజన్నాం చిపికాం తద్ అతిష్టితాం
అస్పన్నయంత స్వస్గందే కృత్వా కేచిత్ ప్రతస్థిరే

(మణవాల మాముణులు కరుణతో ఆసీనులై ఉన్న ఆ కెంపులతో పొదగబడిన స్వర్ణ పల్లకిని కొందరు శ్రీవైష్ణవులు అలుపు లేకుండా తమ భుజాలపైన మోసుకువెళ్ళారు) ఆ రాజు సమర్పించిన నవరత్నాభరితమైన అమూల్య పల్లకీలో బయలుదేరారు. చల్లని మంచు కురుస్తున్న రాత్రి అయినందున, ఆ పల్లకీని కప్పి శ్రీవైష్ణవులు మోసుకెళ్లారు. క్రింది శ్లోకములో పేర్కొనబడి ఉంది..

చత్రంచిత్రం తదుః కేచిత్ చామరే తదిరేపరే
బ్రుంగారమవరే’బిప్రన్ కళాఙ్ఞమపికేచన
తద్ పాదబ్జ రజస్పర్శ పావనీం ఆత్మ భావినీం
సంతస్సంతారయంతిస్మ మౌళినామణి పాదుకాం
అకాయన్నగ్రతః కేచితత నృన్యంతి కేచన

((శ్రీవైష్ణవులలో) కొందరు వైభవపూర్ణమైన స్వేత గొడుగును పట్టుకున్నారు; కొందరు చామరను ఊపుతున్నారు; కొందరు పడిక్కం (విగ్రహాల స్నానం కొంసం ఉపయోగించే నీటి బిందెలు/పాత్రలు) మోసుకెళుతున్నారు, కొందరు కళంజి (తమలపాకులు, వక్కలు పెట్టుకునే పాత్ర); మరికొందరు జీయర్ పాదుకలు పట్టుకెళుతున్నారు. ఎందుకంటే వారి దివ్య పాద ధూళి వాటిపై పడి పవిత్రం చేస్తుంది కాబట్టి; కొందరు ముందుకు సాగారు (వెనక వచ్చేవారి సౌకర్యార్థం); మరికొందరు నృత్యం చేశారు), జీయర్ ఆసీనులైన దివ్య పల్లకిని మోసుకెళుతూ, అనేక శ్రీవైష్ణవులు తమకు అనుగుణమైన కైంకర్యాన్ని – దివ్య ఛత్ర చామరలు మొదలైన వివిధ ఉపకరణాలను పట్టుకొని పరమానందంతో పాడుతూ నృత్యం చేస్తూ, మరికొందరు ఆనందంగా వింటూ ముందుకు సాగారు. ఇలా వాళ్ళు దాదాపు 20 మైళ్ళు వెళ్ళిన తరువాత, తెల్లవారింది. వైగై నది ఒడ్డున నిత్యానుష్టానము నిర్వహించేదుకు ఆగారు. పల్లకీ మోసేవానిగా వేషం ధరించిన రాజు, జీయర్ పాదాలను సేవించుట గమనించిన జీయర్ ఆశ్చర్యపోయి, “నీవిలా చేయవచ్చా?” అని అడిగారు. వాళ్ళు అప్పుడు చేరుకున్న కుగ్రామం ‘ముత్తరసన్’ పై తమ కృపను కురిపించమని రాజు జీయర్‌ ను వేడుకున్నారు. జీయర్ ఆ గ్రామాన్ని ఆశీర్వదించి, వారి విన్నపం మేరకు ఆ గ్రామానికి “అళగియ మణవాళ నల్లూర్” అనే నామాన్ని పెట్టారు. ఆ తర్వాత రాజుకి వెళ్ళమని అనుమతినిచ్చి, వీళ్ళందరూ తిరుప్పుళ్ళాణి మీదుగా ముందుకు వెళ్లి కాసేపు విశ్రాంతి తీసుకునేందుకు చోటు వెతుకుతున్నారు. మంచి నీడనిచ్చే ఒక చింత చెట్టును చూశారు. వారంతా ఆగి ఆ చెట్టు నీడలో తమ అలసటను తీర్చుకున్నారు.

చింతచెట్టుకి మోక్షాన్ని ప్రసాదించిన జీయర్

జీయర్ శిష్యులు ఒక చింతచెట్టు తమందరికీ ఎంతో మేలు చేసిందని, ఆ చెట్టుపై తమ కరుణను కురిపించమని అభ్యర్థించారు. జీయర్ అద్భుతమైన దయతో, తమ దివ్య హస్తాలతో ఆ చెట్టును తాకి, “నేను పొందిన ఫలాన్నే నీవు పొందుగాక” అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయారు. ఆ చెట్టు వెంటనే తాజాదనం కోల్పోయి వ్రాలి కనుమరుగై పోయింది. అది చూసి శిష్యులు ఇలా అన్నారు..

యంయం స్పృశతి పాణిభ్యాం యంయం పశ్యతి చక్షుషా
స్థావరాణ్యపి ముచ్యంతే కింపునర్ బాంధవాజనాః

(పరమ సాత్వికులెవరైనా తమ దివ్య హస్తాలతో తాకినా, వారి దృష్థి పడినా, చెట్లు అయినా సరే, మోక్షాన్ని పొందుతుంది; అలాంటప్పుడు, జీయర్ తిరువడి సంబంధము ఉన్న వారి గురించి వేరే చెప్పాలా?).

అనంతరం జీయర్ బృందం తిరుప్పుల్లాణి చేరుకుని, తిరుప్పుల్లాణి పెరుమాళ్ళను దర్శించుకొని, అక్కడి నుండి బయలుదేరి తమ ప్రయాణాన్ని కొనసాగిస్తూ తిరునగరి చేరుకున్నారు. అందరు శాస్త్ర విధిని అనుసరించి ‘ఆళ్వార్’ ను, ‘పోలిందు నిన్ఱ పిరాన్ (తిరునగరి పెరుమాళ్ళ తిరునామము) ని దర్శించుకొని మంగళాశాసనం చేసారు. అక్కడ అనేక మందిని సంస్కరించి, తిరుమగళ్ కేళ్వన్ (శ్రీమహాలక్ష్మికి పతి) దాసులుగా మార్చారు. వాళ్ళకి తిరువాయ్మొళి వంటి దివ్యప్రబంధాలను ఉపదేశించి, వారు నిత్యం ఆళ్వార్ తిరుమంజనం, ఇతర దివ్య ఉత్సవాలను అనుభవించారు.

మూలము: https://srivaishnavagranthams.wordpress.com/2021/10/15/yathindhra-pravana-prabhavam-89/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org