Author Archives: sarathyt

About sarathyt

Disciple of SrImath paramahamsa ithyAdhi pattarpirAn vAnamAmalai jIyar (29th pattam of thOthAdhri mutt). Descendant of komANdUr iLaiyavilli AchchAn (bAladhanvi swamy, a cousin of SrI ramAnuja). Born in AzhwArthirungari, grew up in thiruvallikkENi (chennai), lived in SrIperumbUthUr, presently living in SrIrangam. Learned sampradhAyam principles from (varthamAna) vAdhi kEsari azhagiyamaNavALa sampathkumAra jIyar swamy, vELukkudi krishNan swamy, gOmatam sampathkumArAchArya swamy and many others. Full time sEvaka/servitor of SrIvaishNava sampradhAyam. Engaged in translating our AzhwArs/AchAryas works in Simple thamizh and English, and coordinating the translation effort in many other languages. Also engaged in teaching dhivyaprabandham, sthOthrams, bhagavath gIthA etc and giving lectures on various SrIvaishNava sampradhAyam related topics in thamizh and English regularly. Taking care of koyil.org portal, which is a humble offering to our pUrvAchAryas. koyil.org is part of SrI varavaramuni sambandhi Trust (varavaramuni.com) initiatives.

అంతిమోపాయ నిష్ఠ – 1

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః

మణవాళ మాముణుల తనియన్ (పెరియ పెరుమాళ్ సాయించినది)

శ్రీశైలేశ దయా పాత్రమ్ దీభక్త్యాది గుణార్ణవమ్
యతీంద్ర ప్రవణమ్ వందే రమ్య జామాతరమ్ మునిమ్

పొన్నడిక్కాల్ జీయర్ తనియన్ (దొడ్డ అయ్యంగార్ అప్పై సాయించినది)

రమ్య జామాత్రు యోగీంద్ర పాదరేఖా మయం సదా
తథా యత్తాత్మ సత్తాదిం రామానుజ మునిం భజే

పరవస్తు పట్టర్పిరాన్ జీయర్ తనియన్లు

రమ్య జామాత్రు యోగీంద్ర పాద సేవైక దారకం
భట్టనాథ మునిం వందే వాత్సల్యాది గుణార్ణవం

కాన్తోపయన్త్రుయమినః కరుణామ్రుతాబ్దేః
కారుణ్యశీతల కటాక్ష సుథానిథానం
తన్నామ మంత్రకృత సర్వహితోపదేశం
శ్రీభట్టనాథముని దేశికమ్ ఆశ్రయామి

ఉపనిషదత్ అమ్రుద్బ్దేరుద్ద్రుదామ్ సారవిద్భిః
మదురకవిముకైస్తాం అంతిమోపాయ నిష్టాం
ఉపదిసతి జనేభ్యో యో దయాపూర్ణద్రుష్టిః
భజహృదయ సదాత్వం భట్టనాథమ్ మునీంద్రం

రుచిర వరమునీంద్రేణాతరేణోపతిష్ఠాం
అకృత కృతివరిష్టాం అంతిమోపాయ నిష్ఠాం
తమిహ నికిల జంతు ఉత్తరణోత్యుక్తచిత్తం
ప్రతిదినం అబివందే భట్టనాధం మునీంద్రం

నమోస్తు భట్టనాథాయ మునయే ముక్తిదాయినే
యేనైవం అంతిమోపాయనిష్ఠా లోకే ప్రతిష్ఠితా

తాతొన్ఱుం తార్బుయత్తాన్ మణవాళ ముని తనతు
పాదం పరవుం పట్టర్ ప్పిరాన్ ముని పల్కలైయుం
వేదాంగళుం చిల పురాణంగళుం తమిళ్ వేదియరుం
ఓదుం పొరుళ్ అంతిమోపాయ నిష్టై ఉరైత్తవనే!

                    *****************************

అనువాదకుల గమనిక: గ్రంధము ఇచటనుండి మొదలు.

అంతిమోపాయ నిష్ఠాయా వక్తా సౌమ్యవరో మునిః
లేకస్యాన్వయో మే అత్ర లేకనీతాలపత్రవత్

మణవాళ మాముణుల ద్వారా అంతిమోపాయ నిష్ఠ మనకు తెలియజేయబడినది. ఇందులో నాప్రమేయము వారు శాయించిన విషయాలను పత్రముపై కలముతో లిఖించుట వరకు మాత్రమే.

ఎందై మణవాళ యోగి ఎనక్కురైత్త
అంతిమోపాయ నిష్ఠైయామతనై
శిందై చ్చెయ్తు ఇంగెల్లారుం వాళ ఎళుతి  వైత్తేన్ ఇప్పువియిల్
నల్ అఱి ఒన్ఱిల్లాద నాన్

నా ఆధ్యాత్మిక పితరులైన మనవాళమాముని ద్వారా లభించిన ఆంతిమోపాయనిష్ఠలోని దైవ సంబంధిత ఆదేశాలను పరిశీలించి నాకున్న పరిమిత జ్ఞానముతో సర్వజనులకు లబ్దిచేకూరాలని ఈ రచన చేశాను. (పరవస్తు పట్టరు పిరాన్ జీయర్ మనవాళ మహామునుల ఉపదేశ రత్తినమాల రెండవ పాశురము ఆధారముగా).

కఱ్ఱోర్గళ్ తాముగప్పర్ కల్వి తన్నిల్ ఆశైయుళ్ళోర్
పెఱ్ఱోం ఎన ఉగందు పిన్బు కఱ్పర్
మఱ్ఱోర్గళ్ మాచ్చర్యత్తాల్ ఇగళిల్ వందదు ఎన్ నెంజే
ఇగళ్గై ఆచ్చర్యమో తాన్ అవర్కు

పండితులు ఈ రచనను ఆదరించగలరు. ఆసక్తి గలవారు అవగాహన చేసికొని ఆస్వాదించగలరు. విషయాసక్తి లేని ఇతరులు ఈర్ష్యచే అవహేళన చేయవచ్చు, అవహేళన చేసినవారిపై అంతగా ఆశ్చర్య చెందనవసరము లేదు.  (ఏలనన , ఈ విషయ అవగాహనపై వారికి వున్నది స్వల్ప పరిణితి కాబట్టి).

 అనేక చిక్కులతో కూడివున్న ఈ భౌతిక జగత్తులో ప్రతి జీవి జనన మరణ చక్రములో పయనిస్తాడు. మన వల్ల జరిగే చిన్న పొరపాటు పర్యవసానాన్ని అనేకానేక జన్మల వరకు అనుభవించాల్సి వుంటుందని చెప్తారు. (మన వల్ల తెలియక హాని పొందిన సూక్ష్మజీవి ద్వారా సంక్రమించిన పాపాన్ని కూడా అనేక వేల సంవత్సరాలు అనుభవించాల్సి వుంటుంది.).   

సంసార కూపమనే అతి క్రూరమైన లంపటములో చిక్కుకున్న విషయలోలత్వం కల్గిన సంసారులు దానినుంచి నిలదొక్కుకుని ఆ చిక్కులను పారద్రోలి తప్పించుకొనుట దుర్లభము.

ఈ విధముగా తికమకపెట్టే జనన మరణ చక్రమును భేదించుట సంసారులకు మిక్కిలి కష్టతరము. అయితే దీనికి తరుణోపాయము మన ఆచార్యుల ద్వారా పొందవచ్ఛును. ఆచార్యులను ఆశ్రయించి నందువల్ల వారు దయతో వీరిని ఆశీర్వదించి భయాలను పారద్రోలి ఈ సంసార సాగరం నుంచి ఉద్ధరించ గలరు.     

అజ్ఞానులైన వీరిని ఆచార్యులు సంస్కరించి వారి జన్మ సార్ధకతను విశదీకరించి అపారమైన దయతో వీరిని ఉద్ధరించగలరు.                                                                     

వీరికి ఏది అవసరమో గుర్తించి ఆచార్యులు ఆ విషయమునే వీరికి బోధించగలరు. అట్టి ఆచార్య కృపకు పాత్రులైన శిష్యులు ఆచార్యుల పాదపద్మములను ఆశ్రయించి వారి మార్గనిర్దేశనములను పొందగలరు.     

అట్టి శిష్యులు ఆచరించవలసిన ముఖ్యమైన కర్తవ్యములను ఈ ప్రబంధము ద్వారా అంతిమోపాయనిష్ఠగా మనకు తెలియజేసారు.

  • ఆచార్యుల దివ్య నామావళిని, విషయ పరిజ్ఞానాన్ని, ఆదరణని, వారి జన్మ కారణము, సత్కర్మలను నిరంతరమూ ధ్యానిస్తుండాలి.
  • ఏ దివ్యదేశములో వారి నివాసమో దానిని నిరంతరమూ ధ్యానిస్తూూ, కీర్తిస్తూ ఉండాలి.
  • వారి దివ్య చరణారవిందముల యందు శరణాగతి చేయుట శిష్యుల కర్తవ్యము.
  • ఆచార్యుల దివ్య స్వరూప ధ్యాస, వారి బాహ్య విషయములపై నిరంతర సేవ శిష్యులకు ఉపేయము అని అంతిమోపాయనిష్ఠ ద్వారా తెలియజేసారు.            
  • మనసా వాచా కర్మణా దైవ స్వరూపులైన ఆచార్యుని నిరంతరమూ సేవించుట వంటి విలువైన కైంకర్యములను అనుభవించుట.
  • శిష్యుని కైంకర్యములను స్వీకరించిన ఆచార్యునికి కలిగిన సంతృప్తికి ఆనందించి, తత్ఫలితంబుగా వారి నుంచి దీవెనలు పొందుట.
  • అందరికి శుభము జరగాలని వారి పరిపూర్ణ మంగళశాసనము లభించుట శిష్యునకు అమితానందదాయకము.

అనువాదకుని సూచన: ఈ గ్రంథంలోని తదుపరి భాగములలో, ఆచార్యుల దయా గుణ వైశిష్ట్యాన్ని, శిష్యుని ప్రవర్తనను సమర్ధిస్తూ అనేక ప్రమాణములు వరుసగా పొందుపరచబడినవి. అట్టి 8 పుటల దృశ్యాలు ఇందులో జత చేయబడినవి. ఈ భాగములలో పొందు పరచిన ప్రమాణముల వివరణ సంక్షిప్తముగా ఇవ్వబడినవి.

అనంత సారం బహువేదితవ్యం అల్పశ్చ కాలో బహవశ్చ విఙ్ఞాః |
యత్సారభూతం తదుపాసితవ్యం హంసో యదా క్షీరమివాంబుమిశ్రం ||

అసారమ్ అల్పసారంచ సారం సారతరం త్యజేత్ |
భజేత్ సారతమం శాస్త్రం రత్నాకర ఇవామ్రుతం ||

తత్కర్మ యన్న బంధాయ సావిద్యా యా విముక్తయే |
ఆయాసాయాపరం కర్మ విద్యాన్యా శిల్పనైపుణ్యం ||

శాస్త్ర ఙ్ఞానం బహుక్లేశం భుద్దేశ్చలనకారణం |
ఉపదేశాత్ హరిం బుద్ద్వా విరమేత్ సర్వకర్మసు ||

ఆద్యాణం సద్రుసే కతం విసదృసే దేహే భవత్యాత్మనః
సద్బుద్దేస్స చ సంగమాదపి భవేదౌశ్ణ్యం యతాపాతసి |
కో వా సంగతి హేతు రేవమనయోః కర్మాత సామ్యేత్ కుతః
తద్బ్రహ్మాదిగమాత్ స సిద్యతి మహాన్ కస్మాత్ సదాచార్యతః ||

అనాచార్యోపలబ్ధాహి విద్యేయం నస్యతి దృవం |
శాస్త్రాదిషు సుదృష్ఠాపి సాంగాసహ ఫలోదయా |
న ప్రసీదతి వై విద్యా వినా సదుపదేశతః ||

దైవాధీనం జగత్సర్వం మంత్రాధీనం తు దైవతం |
తన్మంత్రం బ్రాహ్మణాధీనం తస్మాద్బ్రాహ్మణదైవతం ||

పుత్రైవ భవతో యాతా భూయాసీ జన్మ సంతతిః |
తస్యామన్యతమం జన్మ సంచిన్త్య శరణం వ్రజ ||

పాపి ష్ఠః క్షత్ర బంధుశ్చ పుండరీకశ్చ పుణ్యకృత్ |
ఆచార్యవత్తయా ముక్తౌ తస్మాదాచార్యవాన్ భవేత్ ||
బ్రహ్మణ్యేవ స్థితం విశ్వం ఓంకారే బ్రహ్మ సంస్థితం |
ఆచార్యాత్ స చ ఓంకారః తస్మాదాచార్యవాన్ భవేత్ ||

ఆచార్యస్స హరిస్సాక్షాత్ చరరూపీ న సంశయః |
తస్మాద్భార్యాదయః పుత్రాస్తమేకం గురుమాప్నుయుః ||

సాక్షాన్నారాయణో దేవాః కృత్వా మర్త్య మయీం తనుం |
మగ్నానుద్ధరతే లోకాన్ కారుణ్యాచ్చ అస్త్రపాణినా ||

తస్మాత్ భక్తిర్ గురౌ కార్యా సంసార భయ భీరుణా ||

గురురేవ పరం బ్రహ్మ గురుఏవ పరా గతిః |
గురురేవ పరావిద్యా గురురేవ పరం ధనం||

గురురేవ పరఃకామో గురురేవ పరాయణం|
యస్మా   తదుపదేష్టాసౌతస్మాత్  గురుతరో గురుః ||

అర్చనీయశ్చ  పూజ్యశ్చ కీర్తనీయశ్చ సర్వదా |
ధ్యాయేజ్జపేన్నమేద్భక్త్యా భజేదభ్యర్చయేన్ముదా ||

ఉపాయోపేయభావేన తమేవ శరణం వ్రజేత్ |
ఇతి సర్వేషు వేదేషు సర్వశాస్త్రేషు సమ్మతం ||

యేన సాక్షాద్భగవతి ఙ్ఞానదీప ప్రదే గురౌ |
మర్త్యబుద్ధిఃకృతా తస్య సర్వం కుంజరసౌచవత్ ||

యో దద్యాద్భగవద్ ఙ్ఞానం కుర్యాత్ ఆర్యోపసేవనం |
కృత్సం వా పృథివీం దద్యాన్న తతుల్యం కథంచన ||

ఐహికాముష్మికం సర్వం గురురష్ఠాక్షరప్రదం |
ఇత్యేవం యేన మన్యన్తే త్యక్తవ్యాస్తే మనీషిభిః ||

యేనైవ గురుణాయస్య న్యాసవిద్యా ప్రదీయతే |
తస్య వైకుంఠ దుగ్దాబ్ధిద్వారకాస్సర్వ ఏవ సః ||

యత్ స్నాతం గురుణా యత్ర తీర్ధం నాన్యత్ తతోదికం |
యచ్చ కర్మ తదర్ధం  తద్విష్ణో ఆరాధనాత్పరం ||

పశుర్మనుష్యః పక్షీ వా యే చ వైష్ణవసంశ్రయాః |
తేనైవ తే ప్రయాశ్యన్తి తద్విష్ణోః పరమం పదం

బాలమూకజడాంధాశ్చ పంగవో బదిరాస్తదా |
సదాచార్యేణ సంతుష్ఠాః ప్రాప్నువంతి పరాంగతిం ||

యం యం స్ప్రుశతి పాణిభ్యాం యం యం పశ్యతి చక్షుషాః |
స్థావరాణ్యపి ముచ్యంతే కింపునర్బాంధవాజనాః ||

అందోనందగ్రహణవసగో యాతి రంగేశ యద్వత్
పంగుర్నౌకాగుహరనిహితో నీయతే నావికేన |
భుంక్తే భోఘానవిదితన్రూపస్సేవకస్యార్భకాదిః
త్వత్సంప్రాప్తౌ ప్రభవతి తధా దేశికో మే దయాళుః ||

సిద్దం సత్సంప్రదాయే స్తిరదియమనగం శ్రోత్రియం బ్రహ్మనిష్ఠం
సత్వస్తం సత్యవాచం సమయనియతయా సాధువృత్యా సమేతం |
డంభాసూయాదిముక్తం జితవిషయగుణం దీర్ఘ బంధుం దయాళుం
స్ఖాలిత్యే శాసితారం స్వపరహితపరం దేశికం భూశ్నురీప్సేత్ ||

ఉత్పాదకబ్రహ్మపిత్రోర్గరీయాన్ బ్రహ్మదఃపితా |
స హి విద్యాతస్తం జనయతి తత్ శ్రేష్ఠం జన్మ |
శరీరమేవ మాతాపితరౌ జనయతాః |
దేహకృత్ మంత్ర గ్రుణ్ణ స్యాత్ మంత్రసంస్కారక్రుత్ పరః |
తౌ చేన్నాత్మవిదౌ స్యాతాం అన్యస్త్వాత్మ విదాత్మ క్రుత్ ||

నాచార్యః కులజాతోపి ఙ్ఞానభక్త్యాది వర్జితః |
న వయోజాతిహీనశ్చ ప్రకృష్ఠానామనాపది ||

కిమపి అత్రాభిజాయంతే యోగినః సర్వయోనిషు |
ప్రత్యక్షిత  ఆత్మనాత్మానాం నైశాం చిన్త్యం కులాదిగం ||

భిన్ననావస్రితో జంతుర్ యధా పారం నగచ్ఛతి |
అంధశ్చ  అందకర  ఆలంబాత్ కూపాంతే పతితోయతా ||

ఙ్ఞానహీనం గురుం ప్రాప్య కుతో మోక్షమవాప్నుయాత్ |
ఆచార్యో వేదసంపన్నో విష్ణు  భక్తో విమత్సరః |
మంత్రఙ్ఞో మంత్రభక్తశ్చ సదా మంత్రాశ్రయసూసిం ||

సత్సంప్రదాయ సమ్యుక్తో బ్రహ్మవిద్యావిశారదః|
అనన్యసాధన శ్చైవ తత్ అనన్యప్రయోజనః ||

బ్రాహ్మణో వీతరాగశ్చ క్రోధలోభవివర్జితః |
సత్ వృత్తశాసితా చైవ ముముక్షుః పరమార్థవిత్ ||

ఏవమాదిగుణోపేత ఆచార్యస్స ఉదాహృతః |
ఆచార్యోపి తతా శిష్యం స్నిగ్దో హితపరస్సదా ||

ప్రబోద్య భోదనీయాని ఉత్తమాచారయేత్ స్వయం |
ఉత్తారయతి సంసారాత్ తదుపాయప్లవేన తు ||
గురుమూర్తిస్తిత స్సాక్షాత్ భగవాన్ పురుషోత్తమః |
త్రిరూపో హితమాచష్ఠే దృఢ మనుష్యాణాం కలౌ హరిః ||

గురుశ్చ స్వప్నదృష్టశ్చ పూజాంతే చార్చకాననాత్ |
ఈశ్వరస్య వశస్సర్వం మంత్రస్య వస ఈశ్వరః |
మంత్రో గురువసే నిత్యం గురురేవేస్వరస్తితిః ||

యేష వై భగవాన్ సాక్షాత్ ప్రధాన పురుషేశ్వరః |
యోగీస్వరైర్ విమ్రుఖ్యాంఘ్రిర్ లోకో యం మన్యతే నరం ||

నారాయణాశ్రయో జీవస్సోయమష్టాక్షరాశ్రయః
అష్ఠాక్షర స్సదాచార్యే స్తితితస్తస్మాద్గురుం  భజేత్ ||

దయాదమసమోభేతం దృఢ భక్తిక్రియాపరం |
సత్యవాక్ శీలసంపన్న మేవ కర్మసుకౌశలం||

జితేంద్రియం సుసంతుష్టం కరుణాపూర్ణమానసం |
కుర్యాల్లక్షణ సంపన్నం ఆర్జవం చారుహాసినం |
ఏవంగుణైశ్చ సంయుక్తం గురుం విద్యాత్తు వైష్ణవం |
సహస్రసకాత్యాయి చ సర్వయత్నేషు దీక్షితాః |
కులే మహతి జాతోపి న  గురుస్స్యాతవైష్ణవః|
అఙ్ఞాన తిమిరాందస్య ఙ్ఞానాంజన సలాకయా |
చక్షుర్నిమీలితం యేన తస్మై శ్రీ గురవే నమః ||

మంత్రః ప్రకృతిరిత్యుక్తో హ్యర్తః ప్రాణ ఇతి స్మ్రుతః|
తస్మాన్మంత్రప్రదాచార్యాద్గరీయానర్తతో గురుః ||

గు శబ్దస్త్వందకారస్స్యా ద్రు శబ్దస్ తన్నిరోదకః |
అందకారనిరోధిత్వాత్ గురురిత్యభీదీయతే ||
శిష్యమఙ్ఞాన సంయుక్తం న శిక్షయతి చేద్గురుః |
శిష్యాఙ్ఞాం ఆకృతం పాపం గురోర్భవతి నిశ్చయః ||

లోభాద్వాయది వా మోహాత్ శిష్యం శాస్తి నయో గురుః |
తస్మాత్ సంశ్రుణుతే యశ్చ ప్రచ్యుతౌ తావుభావపి ||

రవిసన్నిదిమాత్రేణ సూర్యకాంతో విరాజతే |
గురుసన్నిదిమాత్రేణ శిష్య ఙ్ఞానం ప్రకాశతే ||

యధాహి వహ్నిసంపర్కాన్మలం త్యజతి కాంచనం |
తతైవ గురుసంపర్కాత్ పాపం త్యజతి మానవః ||

స్నేహేనకృపయా వాపి మంత్రీ  మంత్రం ప్రయచ్చతి |
గురుర్గ్యేయశ్చ సంపూజ్యో దానమానాదిభిస్సదా ||

అనన్యశరణాంచ తధా వానన్య సేవినాం
అనన్యసాదనానాంచ వక్తవ్యం మంత్రముత్తమం ||

సంవత్సరం తదర్ధం వా మాసత్రయ మదాపివా |
పరీక్ష్య వివదోపాయః కృపయా నిస్పృహో వదేత్ ||

నదీక్షితాయ వక్తవ్యం నా భక్తాయ న మానినే |
నాస్తికాయ కృతఙ్ఞాయ న శ్రద్దా విముఖాయ చ ||

దేశ కాలాది నియమం అరిమిత్ఱదిసోదనం |
న్యాస ముద్రాదికం తస్య పురశ్చరణకం న తు ||
నస్వరః ప్రణవోంగాని నాప్యన్య విదయస్తథా |
స్త్రీణాంచ శూద్రజాతీనాం మంత్రం ఆత్రొక్త్రిష్యతే ||

ఋష్యాదించ కరన్యాసం అంగన్యాసంచ వర్జయేత్ ||
స్త్రీ శూద్రాశ్చ వినీతాశ్చేన్మంత్రం ప్రణవార్జితం |

న దేశకాలౌ నావస్తాం పాత్రసుద్ధించ నై[నే]చ్చతి |
ద్వయోపదేశఖర్తాతు శిష్యదోషం న పస్యతి ||

దురాచారోపి సర్వాసీ కృతఙ్ఞో నాస్తికః పురా |
సమాశ్రయేదాదిదేవం శ్రద్ధయా శరణం యది |
నిర్దోషం విద్దితం జంతుం ప్రభవాత్ పరమాత్మనః ||

మంత్రరత్నం ద్వయం న్యాసం ప్రపతి శ్శరణాగతిః |

లక్ష్మీనారాయణంచేతి హితం సర్వఫలప్రదం |
నామాని మంత్రరత్నస్య పర్యాయేణ నిబోధత ||
తస్యోచ్చారణమాత్రేణ పరితుష్టోస్మి నిత్యసః ||

బ్రాహ్మణాః క్షత్రియా వైశ్యా స్స్థ్రియ శ్సూద్రాస్తతేతరాః |
తస్యాధికారిణస్సర్వే మమ భక్తో భవేద్యది ||

యస్తు మంత్రద్వయం సంయగద్యాపయతి వైష్ణవాన్ |
ఆచార్యస్స తు విఙ్ఞేయో భవబందవిమోచకః ||

వృదేహమాద్యం ప్రతిలభ్య దుర్లభం ప్లవం సుకల్యం గురుకర్ణదారకం హస్వతేరితం పుమాన్ భవాబ్దిం సతరేత్ న ఆత్మహా ||

ఆచార్యం మం విజానీయాన్నావమన్యేత కర్హిచిత్ |
న మాత్యభుద్ద్యాదృస్యేత సర్వదేవమయో గురుః ||

అధ శిష్యలక్షణం:-

మానుష్యం ప్రాప్య లోకేస్మిన్ న ముఖో పదిరోభి వా |
నాపక్రమాతి సంసారాత్ స కలూ బ్రహ్మహా భవేత్ ||

సదాచార్యోపసత్త్యా చ సాభిలాషస్తదాత్మకః |
తత్త్వ ఙ్ఞాననిధిం సత్త్వనిష్టం సద్గుణసాగరం |
సతాం గతిం కారుణికం తమాచార్యం యధావిది |
ప్రణిపాతనమస్కారప్రియవాగ్భిస్చ తోషయన్ |
తత్ప్రసాదవసేనైవ తదంజ్ఞీకారలాభవాన్ | 
తదుక్త తత్వయాదాత్మ్య ఙ్ఞానామ్రుత సుసంబృతః ||

అర్ధం రహస్యత్రితయగోచరం లబ్ధవాహనం ||

పరీక్ష్య లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణో నిర్వేదమాయాత్ నాస్త్యకృతః
కృతేన తత్ విఙ్ఞానార్ధం  స గురుమేవాభిగచేత్ సమిత్పాణి-
స్త్రోత్రియం బ్రహ్మనిష్టం తస్మై స విద్వానుపసన్నాయ సమ్యక్-
ప్రాసాంతచిత్తాయ సమన్విదాయ యేనాక్షరం పురుషం వేద సత్యం ప్రోవాచ
తాం తత్త్వతో బ్రహ్మవిద్యాం ||

గురుం ప్రకాశయేద్ధీమాన్ మంత్రం  యత్నేన గోపయేత్ |
అప్రకాశప్రకాశాభ్యాం క్షీయతే సంప్రదాయుశీ ||

ఆచార్యస్య ప్రసాదేన మమ సర్వమభీప్సితం |
ప్రాప్నుయామీతి విశ్వాసో యస్యాస్తి స సుఖీభవేత్ ||

ఆత్మనో హ్యతినీచస్య యోగిద్యేయ పదార్హతాం |
కృపయైవోపకర్తారం ఆచార్యం సంస్మరేత్ సదా ||

న చక్రాద్యంగణం నేజ్యా న ఙ్ఞానం న విరాగతా |
న మంత్రః పారమైకాంత్యం తైర్యుక్తో గురువశ్యతః ||

నిత్యం గురుముపాసీత తద్వచః శ్రవణోత్సుకః|
విగ్రహాలోకన పరస్తస్యై వాగ్యాప్రదీక్షకః ||

ప్రక్షాళ్య చరణౌ పాత్రే ప్రణిపత్యోపయుజ్య చ |
నిత్యం విదివదర్గ్యాత్యైరాదృతోభ్యర్చయేద్గురుం ||

శ్రుతిః
ఆచార్యవాన్ పురుషో వేద | దేవమివాచార్యముపాసీత |
ఆచార్యాదీనో భవ| ఆచార్యాదీనస్తిష్టేత్ | ఆచార్య దేవో భవ |
యత భగవత్యేవమ్వక్తరి వ్రుతిః | గురుదర్శనే చోత్తిష్టేత్ |
గచ్హంతమనువ్రజేత్ |

శరీరం వసు విఙ్ఞానం వాసః కర్మ గుణానసూన్ |
గురువర్తం దారయేద్యస్తు స శిష్యో నేతరస్మృతః ||

దీర్గదండనమస్కారం ప్రత్యుత్తానమనంతరం |
శరీరమర్తం ప్రాణంచ సద్గురుభ్యో నివేదయేత్ ||

గుర్వర్తస్యాత్మనః పుంసహ కృతఘ్నస్య మహాత్మనః |
సుప్రసన్నస్సదా విష్ణుర్దిహృతస్య విరాజతే ||

మంత్రే తీర్తే ద్విజే దేవే దైవఙ్ఞే భేషజే గురౌ |
యాద్రుసీ భావనా యత్ర సిద్దిర్భవతి తాదృసీ ||

యస్య దేవే పరాభక్తిర్ యథాదేవే తథా గురౌ |
తస్యై తేకతితా హ్యర్తాః ప్రకాశ్యంతే మహాత్మనః ||

దర్శనస్పర్శవచనై స్సంచారేణ చ సతమాః |
భూతమ్ విధాయ భువనమ్ మామేష్యన్తి గురుప్రియాః||

దేహకృన్మన్త్రకృన్న స్యాన్మంత్రసంస్కారకృత్పరః |
తౌ చేన్నాత్మవిదౌ స్యాతామ్ అన్యస్త్వాత్మవిధాత్మకృత్ ||

అవైష్ణవోపదిష్టమ్ స్యాత్పూర్వమ్ మంత్రవరమ్ ద్వయమ్ |
పునశ్చ విధినా సమ్యక్వైష్ణవాద్గ్రాహయేద్గురోః ||

అత స్త్రీశూద్రసంకీర్ణనిర్మూలపతితాదిషు |
అనన్యేనాన్యదృష్టౌ చ కృతాపి న కృతా భవేత్ ||

అతోన్యత్రానువిధివత్ కర్తవ్యా శరణాగతిః |
దణ్డవత్ ప్రణమేద్భూమావుపేత్య గురుమన్వహం|
దిసే వాపి నమస్కుర్యాత్ యత్రాసౌ వసతి స్వయం ||

ఆచార్యాయాహరేధర్తానాత్మానన్చ నివేదయేత్ |
తధదీనశ్చ వర్తేత సాక్షాన్ నారాయణో హిసః ||

సత్భుధ్దిస్సాదుసేవీ సముచితచరితస్ తత్వభోదాభిలాషూ |
సుష్రూశుస్త్యక్తమానః ప్రణిపతనపరః ప్రశ్నకాలప్రతీక్షః ||

సాన్తో దాన్తోనసూయుస్సరణముపగతస్సాశ్త్రవిశ్వాససాలీ |
శిష్యః ప్రాప్తః పరీక్షాన్  గృతవిదాభిమతం తత్త్వతః శిక్షణీయః |

యస్త్వాచార్యపరాదీనస్సత్  వృత్తౌ సాస్యతే యది |
శాసనే స్తిరవృతిస్స  శిష్యస్సద్భిరుదాహృతః ||

శిష్యో గురుసమీపస్తో యథావాక్కాయమానసః |
సుశ్రూషయా  గురోస్తుష్టిమ్ కుర్యాన్నిర్దూతమత్సరః ||

ఆస్తికో దర్మశీలస్చ శీలవాన్ వైష్ణవ స్సుచిః |
గంభీరశ్చతురో ధీరః శిష్య ఇత్యభీధీయతే ||

ఆసనమ్ శయనమ్ యానమ్ తదీయమ్ యఛ్చ కల్పితమ్ |
గురుణాంచ పదాక్రమ్య నరో యస్త్వదమామ్ గతిమ్ ||

ఘోస్వొష్ట్రయానప్రసాదప్రస్తరేశు కటేషు చ |
నాసీత గురుణా సార్త్దమ్ శిలాబలకనౌషూచ ||

యస్తిష్టతి గురుణాంచ సమక్షమకృతాంజలిః
సమద్రుష్ట్యా తదాఙ్ఞానత్ స సద్యో నిరయమ్ వ్రజేత్ |

ఆసనం శయనం యానం అపహాసంచ సౌనక |
అతిప్రలాపం గర్వంచ వర్జయేద్గురుసన్నిదౌ ||

యద్రుచ్చయా శ్రుతో మంత్రస్చన్నేనాతచ లేన వా |
పత్రేక్షితో వావ్యర్తస్స్యాత్పం జపేద్ యద్యనర్తకృత్ ||

మంత్రే తద్ దేవతాయాంచ తతా మంత్రప్రదే గురౌ|
త్రిశూభక్తిస్సదా కార్యా సాహి ప్రథమసాధనం ||

అధమో దేవతాభక్తో మంత్రభక్తస్తు మద్యమః |
ఉత్తమస్తు స మే భక్తో గురుభక్తోతమోత్తమహః ||

శ్రుతి:

ఆచార్యాన్మా ప్రమదః! ఆచార్యాయ ప్రియమ్ ధనమాహృత్య |

గురోర్గురుతరం నాస్తి గురోరన్యన్న భావయేత్ |
గురోర్వార్తాశ్చ కతయేద్ గురోర్నామ సదాజపేత్ ||

అర్చనీయశ్చ వంద్యశ్చ కీర్తనీయస్చ సర్వదా |
ద్యాయేజ్జపేన్నమేద్ భక్త్యా భజేతబ్యర్చయేన్ముదా ||

ఉపాయోపేయ భావేన తమేవ శరణం వ్రజేత్ |
ఇతి సర్వేషూ వేదేషు సర్వశాస్త్రేషు సమ్మతం ||

యేవం ద్వయోపదేష్టారం భావయేత్ భుద్దిమాందియా |
ఇచ్చాప్రకృత్యనుగుణైర్ ఉపచారైస్తతోచితైః ||

భజన్నవహితశ్చాస్య హితమావేదయేద్రః  |
కుర్వీత పరమాం భక్తిం గురౌ తత్ప్రియవత్సలః ||

తదనిష్టావసాదీ చ తన్నామగుణహర్షితః |
సాంతోనసూయుః శ్రద్దావాన్ గుర్వర్తాద్యాత్మప్రుతికః ||

సుచిః ప్రియహితో దాంతః శిష్యస్సోపరతస్సుదిః |
న వైరాగ్యాత్పరో లాభో న బోదాదపరం సుఖం |
న గురోరపరస్త్రాతా న సంసారాత్ పరో రిపుః ||

అనువాదకుని సూచన : ఈ అనువాదకుని సంస్కృత పరిజ్ఞానము స్వల్పమైన కారణమున, సామాన్యముగా వివరించబడే ప్రమాణములను అనువదించాను. 

ఆచార్య వైభవము భాగము యొక్క సారాంశము మరియు కొన్ని ముఖ్య అంశాలు.

  • మనకున్న స్వల్ప జీవితకాలములో, మన జ్ఞానోపార్జన వృద్ధికి అనేక ప్రతిబంధకములు ఏదుర్కొంటున్నాము. ఏ విధముగా హంస పాలలోని నీటిని వేరుచేసి స్వచ్ఛమైన పాలను మాత్రమే స్వీకరించునో, మనము కూడా సుజ్ఞానో పార్జనా ఆసక్తి కలిగి ఉండాలి.
  • ఏ విధముగా అనేక విలువైన రత్నాలు సాగరములో ఉన్నాయో, మన శాస్త్రములలో కూడా అనేక విలువైన విషయాలు వున్నాయి. అయితే శాస్త్రములలో వున్న కొన్ని అనవసరమైన మరియు అంతగా ఉపయోగపడని విషయాలు విస్మరించాలి. శాస్త్రములోని అత్యంత విలువైన రత్నము తిరుమంత్రము మరియు అందులోని గోప్యమైన అర్ధములు. వానిని గ్రహించడానికి నిజమైన  జ్ఞానోపార్జన  చేసేవారు దృష్టి సారించాలి.
  • ఏ జ్ఞానము మోక్షప్రాప్తి కలిగించునో అదియే నిజమైన జ్ఞానము. ఇతర జ్ఞానములన్నియు లౌకిక సుఖములకే కావున అవి నిరుపయోగములు.
  • వివిధములైన ప్రమాణములు చదివి , శాస్త్రసారాన్ని గ్రహించుట సవాలుతో కూడినది మరియు మిక్కిలి కష్టతరము. కాని, జ్ఞానవంతుడైన ఆచార్యుని ద్వారా శాస్త్రసారాన్ని గ్రహించి , మన జీవన శైలిని తదనుగుణముగా నడుపుట చాలా సులభతరము.
  • ఈ సమస్త జగత్తు భగవంతుని అధీనములో కలదు. అట్టి భగవానుడు తను దయతో తిరుమంత్రముకు లోబడి వున్నాడు. కానీ తిరుమంత్రము ఆచార్యుని ద్వారానే సంక్రమించును. కావుననే ఆచార్యులు భగవానునితో సమానము.
  • ప్రతి ఒక్కరు ఒక ఆచార్యుని ఆశ్రయించవలెను. ఏలనన, ఆచార్యులు మాత్రమే హేయమైన పాపాత్ములకు మరియు పవిత్రులైన పుణ్యులకు కూడా విముక్తి ఇవ్వగలరు.
  • ఆచార్యులు భగవాన్ శ్రీహరి స్వరూపమే! భగవానుడు కోవెలలో స్థిరముగా ఉంటాడు. కాని, మన ఆచార్యులు నడిచే దేవుడు. ఆయన యెడల అందరూ సంపూర్ణ విశ్వాసముతో వుండాలి.
  • సమస్త జగత్తులోని ప్రజలను ఉద్దరించడానికి భగవానుడైన శ్రీమన్నారాయణుడు తన దైవికమయిన దయతో ఆచార్యుని రూపాన్ని ధరించారు. ఆచార్యులుగా ఉన్న భగవానుడు హస్తములలో శాస్త్రమును ధరించివుంటారు (భగవానుడైన రాముడు కృష్ణుడు హస్తములలో అస్త్రధారణతో వుంటారు). ఎవరైతే సంసార బంధాల భయాన్ని తొలగించుకోవాలని భావిస్తారో వారు తమ ఆచార్యులపై సంపూర్ణ విశ్వాసాన్ని కలిగి వుండాలి.
  • జీవరాశులైన వారందరూ , అనగా ఒక జంతువు , మనిషి లేక పక్షి ఎవరైతే సదాచార్యుని ఆశ్రయిస్తారో , వారికి శ్రీమహావిష్ణు జగతైన పరమపద ప్రాప్తి తప్పక కలుగును.
  • పిల్లలు, చెవిటి, మూగ, గుడ్డి, అమాయకులు మొదలైన వారికి కూడా, సదాచార్యుని ఆశ్రయము ద్వారా విశేషమైన పరమపద ప్రాప్తి తప్పక సిద్ధించును.
  • వైష్ణవ ఆచార్యుని దయాదృష్టి వీక్షణం పొందితే, చిన్న మొక్కలు, పెద్ద వృక్షములు వంటివి కూడా తప్పక మోక్షప్రాప్తి పొందగలవు. మరి మానవుల గురించి వేరే చెప్పనేల (వారు సంసార బంధాల నుండి తప్పక విముక్తి పొందగలరు).
  • ‘గు’ అజ్ఞానాన్ని సూచిస్తే , ‘రు’ దాని నుంచి విముక్తిని సూచిస్తుంది. అందులకే గురు అనగా అజ్ఞానాన్ని పారద్రోలేవారు.
  • ఆచార్యులు అనగా శాస్త్రాన్ని సంపూర్ణముగా అభ్యసించి, దానిని ఇతరులకు పూర్తిగా బోధించి, తాను సక్రమముగా ఆచరించేవారు.
  • ఇవియేగాక ఇంకను అనేక ప్రమాణములు గలవు .

శిష్య లక్షణము భాగము యొక్క సారాంశము మరియు కొన్ని ముఖ్య అంశాలు.

  • శిష్యుడు ఆచార్యుని కీర్తిస్తూ, వారి విలువైన బోధనలని అభిలాష పరులకు గోప్యంగా తెలియజేస్తారు. కాని ఇందుకు విరుద్ధముగా అనగా ఆచార్యుని గోప్యంగా కీర్తిస్తూ, బోధనలని బాహ్యంగా బోధిస్తూంటే, అట్టి శిష్యుల సంపద హరించుకు పోవును.
  • శిష్యునికి శాస్త్రముఫై అపారమైన విశ్వాసము కలిగి, భగవానుడు సూచించిన సరియైన ధర్మమును అనుసరిస్తూ, భగవత్ కైంకర్యమే తన లక్ష్యముగా దృష్ఠి ఉంచి, శ్రీమన్నారాయణునిపై సంపూర్ణ శరణాగతి కలిగి, స్వచ్ఛమైన, గాఢమైన, వివేకమైన స్థిర చిత్తముతో వుండవలెను. అటువంటి శిష్యులు ఆచార్యుని నిజమైన శిష్యులు.
  • శిష్యుడు తన మాన, ప్రాణ, ధన, జ్ఞాన, గృహ, చర్యలు మొదలుగాగలవి ఆచార్యునికి సమర్పించి, తను ఆచార్యునికి అంకితమై జీవించాలి.
  • ఆచార్యుని వద్ద నిరుపయోగమైన చర్చలు, అహంకారము మొదలైనవి విడనాడాలి.
  • శిష్యుడు ఆచార్యుని ద్వారా స్వీకరించిన మంత్రముపై, మంత్రాధి దేవతైన భగవానుడిపై, బోధించిన ఆచార్యునిపై సంపూర్ణ భక్తి కలిగి వుండాలి. మొదటి వర్గులైన (అల్పులు) శిష్యులు మంత్రాధి దేవతపై ప్రేమతో వుంటారు. తదుపరి వర్గులైన (మధ్యస్తులు) శిష్యులు మంత్రముపై ధ్యాసతో వుంటారు. చివరి వర్గులైన (మిక్కిలి శ్రేష్ఠులు) ఆ మంత్రాన్ని, మంత్రము ద్వారా భగవానుని ఇచ్చిన ఆచార్యునిపై పూర్తి బంధము కలిగి వుంటారు.
  • ఆచార్యునికి దేనిపై ఎక్కువ ప్రేమ గలదో, దానిని శిష్యుడు ఆచార్యునికి సమర్పించాలి గాని తనకిష్టమైనది కాదు.
  • ఇతరములపై గాక, ఆచార్యునిపై మాత్రమే శిష్యులు దృష్టి ఉంచాలి. గురువు బోధనలను మాత్రమే చర్చించాలి / అనుసరించాలి. గురువు నామాన్ని జపించాలి. శిష్యుడు ఆచార్యుని కీర్తిస్తూ, పూజిస్తూ, ధ్యానిస్తూ మరియు గానము చేస్తువుండాలి. ఆచార్యులే తన మార్గదర్శకులుగా, లక్ష్యముగా శిష్యుడు భావించాలి. ఇది పూర్తిగా శాస్త్ర (వేదం) సమ్మతమైనది.
  • ఇవియేగాక మరియు అనేక ప్రమాణములు గలవు.

ఇంకను గలదు.

అడియెన్ శకుంతల రామనుజ దాసి (శ్లోకాలు)

అడియేన్ గోపి కృష్ణమాచార్యులు రామానుజ దాసన్ (వచనము)

మూలము: http://ponnadi.blogspot.com/2013/06/anthimopaya-nishtai-1.html

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

 

తత్త్వత్రయం – అచిత్తు: పదార్థము అనగా నేమి?

శ్రీ:  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమద్వరవరమునయే నమః  శ్రీవానాచల మహామునయే నమః

తత్త్వత్రయం

<< చిత్తు: నేను ఎవరు?

  • గత అధ్యాయములో  (https://srivaishnavagranthamstelugu.wordpress.com/2018/04/24/thathva-thrayam-chith-who-am-i/), చిత్తు (జీవాత్మ) యొక్క తత్వము తాలూకు వివరములను తెలుసుకున్నాము.
  • శ్రీ పిళ్ళై లోకాచార్యుల “తత్వత్రయం” అను ఈ గ్రంథమును శ్రీమణవాళ మహాముణుల దివ్య వ్యాఖ్యాన సహితముగా చిదచిదీశ్వర తత్వముల యొక్క వైభవమును తెలుసు కొనుటకు సాగిస్తున్న మన ప్రయాణములో ఈ అధ్యాయములో అచిత్తు, అనగా స్థూల పదార్థమును గూర్చి వివరాలను తెలుసుకొందాము.

జ్ఞానుల ఉపదేశముల ద్వారా అచిత్ (పదార్థము) యొక్క తత్వమును అర్థం చేసుకొనుట :

పరిచయము:

  • అచిత్తు (జడమైనది, అచేతనమైనది) జ్ఞాన విహీనమై మార్పు, రూపాంతరములకు లోబడి ఉండును.
  • జ్ఞాన విహీనమైన అచిత్తు కేవలం పారతంత్రుల భోగ విశేషముగా మాత్రమే ఉండును.
  • మార్పుకు అతీతమైన చిత్తత్వము వలె కాక అచిత్తు మార్పు ప్రధానమై ఉండగలదు.
  • అచిత్తును మూడు విధములుగా విభజించవచ్చు, అవి:
    • శుద్ధ సత్వము – రజస్తమో గుణ రహితమై నటువంటి శుద్ధాత్మకమైన పదార్థము.
    • మిశ్ర సత్వము: సత్వ – (సత్యపూతము), రజ: (కాముక), తమ: (అజ్ఞానము) గుణ మిళితమైన పదార్థము.
    • సత్వ శూన్యము – సర్వకాల సర్వావస్థల యందు సంపూర్ణ గుణ హీనమైన పదార్థము.

శుద్ధ సత్వము (స్వచ్ఛమైన సత్యము)

పరమపదము: శ్రియఃపతి యగు శ్రీమన్నారాయణుని నివాస స్థానమైన మోక్ష సామ్రాజ్యము: పరమ పవిత్రమైన మండపములు, ఉద్యాన వనములతో కూడిన శ్రీ స్థానము.

  • ఇది రజస్తమో గుణ రహితమై పరమ శుద్ధమైన, సత్యమైన పదార్థము. పరమపదమందలి అన్ని అచిత్పదార్థములనూ శుద్ధ సత్వములుగా వ్యవహరించవచ్చు.
  • దీని సహజ స్వభావములు:
    •  శాశ్వతమైనది
    • ఆనందమునకు, జ్ఞానమునకు నిలయమైనది.
    • కర్మ బద్ధుడైన జీవాత్మ యొక్క ఐహిక కామ్యము వలె గాక పరమాత్మ యొక్క లీలామాత్ర సంకల్పము చేత సృష్టించబడిన విమానములు/ గోపురములు, మండపములు ఇత్యాది రూపములు ధరించి ఉండును.
    • అనంత తేజోమాయమైన రూపము గలది.
    • నిత్యులు (శాశ్వతముగా సంసార ముక్తి పొందినవారు), ముక్తులు (సంసారము నుంచి ముక్తిని పొందినవారు) సైతం వర్ణింపనలవి గానిది. ఇక్కడ మణవాళ మహాముణులకు సైతం సందేహము కలిగినదట! సర్వజ్ఞుడైన భగవానునికి సైతం తెలుసుకొనుటకు సాధ్యము కానంతటి రూపము శుద్ధ సత్వమునకు ఉన్నచో మరి భగవానుడు సర్వజ్ఞుడు ఎట్లు కాగలడు? అని! దానికి పిదప మామునులే సమాధాన పడ్డారట, అనంతమైన శుద్ధసత్వపు నిజ తత్వము ఎఱిగినవాడు భగవానుడు కనుక భగవానుడు సర్వజ్ఞుడు, అని!
    • అపరిమితమైన వైభవము కలది!
  • అచిత్తును గూర్చి కొందరు ప్రకాశవంతమైనదని కొందరు కాదు అని అభిప్రాయం వెల్లడించారు.
  • అయితే అధిక భాగమున అచిత్తును ప్రకాశవంతమైన వస్తువుగా ఒప్పుకొనుట జరిగినది! అచిత్తు ప్రకాశవంతమైన వస్తువు అయినందు వలన నిత్యులకు, ముక్తులకు, మరియు భగవంతునికి గోచరమై యున్నది (అనగా తన అస్తిత్వమును పరమపద మందు నిలుపు కొనుటకు, పరమపద వాసులు గుర్తించుటకు అనువుగా ప్రకాశమును పొంది ఉన్నదని అర్థం)! అయితే సంసారుల చేత చూడనలవి కానిది ఇది!
    • అయితే ఇది ఆత్మ కలిగిన వస్తువు కాదు కనుక తనను గూర్చి తాను తెలుసుకోలేదు.
    • మార్పు చెందే స్వభావము కలిగి ఉండును.
  • అచిత్తు జ్ఞానమునకు కూడా అతీతమై ఉండును,
    • కనుక, ఉపకార ఆవశ్యకత లేకుండా మార్పులు చెందును.
    • తన్మాత్రల (శారీరిక ఇంద్రియములు) ప్రభావము లేనిదై జడమై ఉండును.
మిశ్ర సత్వము (సత్వరజస్తమో గుణ మిళితము):
  • స్వాభావికముగా ఇది,
    • సత్వరజస్తమో గుణ మిళితము.
    • జీవాత్మలను నిజజ్ఞానము తెలుసుకోనివ్వకుండా మనసుకు పొర వలె కమ్మివేయును.
    • జీవాత్మలలో అజ్ఞానమునకు కారణమైనది.
    • శాశ్వతమైనది.
    • జీవాత్మలపై ప్రయోగించుటకు భగవానునికి క్రీడా విశేషమైనది.
    • సమయమును బట్టి (సృష్టి యందు ఒకవిధముగా, అలాగే ప్రళయ మందు మరో విధముగా) తన స్థితిని సారూప్యముగా లేక వ్యతిరిక్తముగా (వ్యక్త, అవ్యక్త రూపములుగా) మార్చుకోగల గుణము కలది.
    • దీనినే ప్రక్రుతి (మార్పుకు నిలయమైనది), అవిద్య (అజ్ఞాన హేతువు), మాయ (పరిణామము విపరీతమై గ్రహించనలవి కానిది) అని వ్యవహరింతురు.
  • నమ్మాళ్వార్లు తిరువాయ్మొళి యందు (10.7.10) పదార్థమును 24 రకములుగా చెప్పియున్నారు, అవి:
    • పంచ తన్మాత్రలు – శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు
    • పంచ జ్ఞానేంద్రియములు – శ్రోత్ర (శబ్ద), త్వక్ (స్పర్శ), చక్షు: (దృష్టి), జిహ్వ (రుచి), ఘ్రాణ (వాసన పీల్చుట)
    • పంచ కర్మేంద్రియములు – వాక్ (నోరు), పాణి (కరములు), పాద (పాదములు), పాయు (విసర్జనంగాములు), ఉపస్థ (జననాంగములు)
    • పంచ భూతములు – ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ
    • మనస్సు – బుద్ధి
    • అహంకారము – జీవుల అస్థిత్వము
    • మహాన్ – అవిర్భుతమైన జీవజాలము
    • మూల ప్రక్రుతి – అనావిర్భుతమైన జీవ జాలము
  • మూల ప్రక్రుతి అనావిర్భావ దశ నుంచి గుణములను / గుణ సమూహమును బట్టి ఆవిర్భవించును.
  • గుణములు మూడు – అవి సత్వ గుణము (జ్ఞానపూర్ణము), రజో గుణము (కాముక స్థితి), తమో గుణము (అజ్ఞానావస్థ)
  • మూల ప్రకృతి యందు ఈ మూడు గుణములు సమ పాళ్ళలో నిండి యుండును.
  • సత్వ రజస్తమో గుణములు మూల ప్రకృతిలో అసమానమై ఉన్నచో జీవ జాలము ఆవిర్భవించును.
  • అవిర్భుతమైన జీవ జాలమందు మహాన్ మొదటి స్థితిగా సంభవించును.
  • మహస్థితి నుంచి అహంకారము ఉద్భవించును.
  • అహంకార స్థితి నుంచి వరుసగా తన్మాత్రలు, జ్ఞాన కర్మేంద్రియాదులు ప్రభవించును.
  • పైన చెప్పిన 24 పదార్థములతో భగవానుడు ఈ సమస్త ప్రకృతిని సృష్టించి యున్నాడు.
  • భగవానుడు కేవలం తన సంకల్ప మాత్రము చేత కార్య కారణ రూపముగా మూల ప్రకృతి నుంచి ఈ సమస్త విశ్వాన్ని సృష్టించియున్నాడు.
  • భగవానుడు బ్రహ్మ, ప్రజాపతులు ఇత్యాది సమస్త జీవ గణాన్నిసృష్టించి వారిలోనే అంతర్యామిగా పరమాత్మగా కొలువై సృష్టి స్థితి లయలను లీలా వినోదియై సలుపుచుండును.

  •  ఈ విశాలమైన విశ్వమునకు సృష్టి కేవలము పరమాత్మ యొక్క సంకల్పము వల్లనే జరిగినది.
  • ఈ అనంతమైన విశ్వములో ఎన్నో బ్రహ్మాణ్డములు ఉన్నవి. ప్రతి బ్రహ్మాణ్డమునకు 14 పొరలు కలవు. సశాస్త్రీయముగా శ్రీమణవాళ మహాముణులు వాటిని గూర్చి చెప్పియున్నారు.

లీలా విభూతి యొక్క నిర్మాణం

లీలా విభూతి యొక్క రూపము (సంసారము –  బాహ్య ప్రపంచము):

  • 7 అథో లోకములు / తలములు/ పొరలు:
    • ఇవి అతల వితల సుతల నితల తలాతల పాతాళ లోకములు. ఇవి భూమికి అథో భాగములో ఉండి పిశాచములకు, సర్పములకు, కొన్ని జాతుల పక్షులకు నెలవై యుండును.
    • ఈ లోకములలో స్వర్గమును మించిన సుందరమైన నగరములు, ఇంద్ర భవనములు ఉండునని చెప్పబడినది.
  • 7 ఊర్థ్వ లోకములు తలములు/ పొరలు:
    • ఇవి భూలోక, భువర్లోక, స్వర్గ లోక, మహో లోక, జనో లోక, తపో లోకములు.
    • భూలోకము – ఇందులో ప్రజాపతులు, మనువులు సంకల్పించి సృష్టించిన మనుష్య జాతి, పశుపక్ష్యాది జంతు జాలము నివాసముండును. ఇది ఏడు ఖండములుగా విభజించ బడియున్నది.
    • భువర్లోకము – ఇది గంధర్వ లోకము: ఇందులో సంగీత దేవతలైన గంధర్వులు నివాసముంటారు.
    • స్వర్గ లోకము: భూర్భువర్లోకముల కార్యకలాపములు చూచే ఇంద్రుడు అతని పరివారము నివసించే లోకము.
    •  మహర్లోకము: ఇచ్చట ఇంద్రత్వము అనుభవించిన పాత ఇంద్రులు, ఇంద్రత్వము కొరకు వేచి ఉండేవారు వంటి మహాత్ములు నివసించే లోకము.
    • జనోలోకము: ఇచ్చట బ్రహ్మ మానస పుత్రులైన సనక సనందనాదులు, ఇతర ఋషులు, బ్రహ్మర్షులు నివసించే లోకము.
    • తపోలోకము: ప్రజాపతులు (సృష్టికి మూల పురుషులు) నివసించే లోకము.
  • సత్య లోకము – ఇచ్చట బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మరియు వారి పరివార గణములు నివసించును.
  • ప్రతి బ్రహ్మాణ్డము యందు ఈ పద్నాలుగు భువనములు ఉండును. వీటి పైన పంచ భూతములు, ఆఖరుగా వాటిపై మూల ప్రకృతి పొరగా ఆవరించు ఉండును.

  •  జ్ఞానేంద్రియములు స్థూల మరియు విశాల పదార్థముల నుంచి కర్మేంద్రియముల చేత జ్ఞానమును పొందును.  కర్మేంద్రియములు బాహ్య కర్మలను ఆచరించును. బుద్ధి ఇంద్రియములను నియంత్రించుచు వాటి ధర్మములు అవి ఆచరించుటకు సహాయపడును.
  • పంచీకరణం అనగా భగవానుడు రకరకాల పదార్థములను తగు పాళ్ళలో కలిపి సృష్టి చేసిన విధానము.
సత్వ శూన్యము (కాలము):
  • మూల ప్రకృతి నుంచి పదార్థము ఆవిర్భవించుటకు హేతువైన ఉత్ప్రేరకమునకు కాలము అని పేరు.
  • కాలము పరిపరి విధములైన కొలమానములలో అన్వయించబడినది.
  • ఆది అంతము లేని శాశ్వతమైన తత్వము కాలము.
  • భగవానుని క్రీడా వస్తువు.
  • భగవానుడే కాల స్వరూపుడు.
  • మామునులు నడువిల్ తిరువీధి పిళ్ళై భట్టర్ అనుగ్రహించిన కాల విశ్లేషణను ఇక్కడ వివరించారు:
    • నిమేషము: కనురెప్ప కాలము. కొలవ దగ్గ అత్యల్ప కాలము.
    • 15 నిమేషములు: ఒక కాష్ఠము.
    • 30 కాష్ఠములు: ఒక కల
    • 30 కలలు: 1 ముహూర్తము
    • 30 ముహుర్తములు: 1 దినము
    • 30 దినములు: 1 మాసము: 2 పక్షములు (శుక్ల, కృష్ణ)
    • 2 మాసములు: 1 ఋతువు
    • 3 ఋతువులు: 1 అయనము (ఉత్తరాయన దక్షిణాయములు)
    • 2 అయనములు: 1 సంవత్సరము
    • 360 మానవ సంవత్సరములు: 1 దేవతా సంవత్సరము
  • శుద్ధ సత్వ, మిశ్ర సత్వ అచిత్తత్వములు భోగ్య విశేషములు. అవి పరమపదస్థులు, జీవాత్మల చేత అనుభవించదగ్గవి.
  • శుద్ధ సత్వము అథో భాగమందు మరియు పార్శ్వములలో అపరిమితముగా విస్తరించబడి ఉండును. కానీ ఊర్థ్వదిశ యందు పరిమితముగా విస్తరించి ఉండును.
  • మిశ్ర సత్వము పార్శ్వములలో మరియు అథోముఖంగా పరిమితమై ఉండును. కానీ ఊర్ధ్వ దిశలో అపరిమితముగా విస్తరించి యుండును.
  • అయితే కాలమునకు ఎటువంటి పరిమితులు లేవు. అది అన్ని లోకముల యందు విస్తరించబడి యుండును.
  • అయితే కాల తత్వము పరమపదంలో స్థిరముగా అనంతముగానూ, సంసార మందు అస్థిరంగా క్షణ భంగురమై కదులును. అయితే పెరియ వాచ్చాన్ పిళ్ళై “తత్వ త్రయ వివరణం” అనే గ్రంథములో కాలము పరమపదములోనూ, సంసారములోనూ సమముగా వ్యవహరించునని చెప్పినారని మామునులు ప్రస్తావించెను. అయితే ఇప్పుడు ఈ గ్రంథము లుప్తమైయున్నది. అయితే తర్వాతి కాలములలో ఎందరో ఆచార్యులు కాల తత్వము పరమపదంలో సంసారములో ఒకే విధముగా అన్వయించదని చెప్పియుండుట చేత సంసారము దృష్ట్యా కాలము మారుతూ ఉండునను సత్యమును గ్రహించి కాలము అస్థిరమైనదిగా పరిగణించబడినది.
  • కొందరు అసలు కాలమే లేదని వాదించెదరు. అయితే తర్కమున ఆ వాదము నిలువబోదు గనుక శాస్త్రము ఆ వాదమును పరిగణించదు.

ముగింపు

ఈ విధముగా ఈ అధ్యాయములో శుద్ధ సత్వ (పరమపద సంబంధితమైనది), మిశ్ర సత్వ (సంసార సంబంధమైనది), మరియు సత్వ శూన్యమైన (ఉభయ సత్వములకు సంబంధించిన) అచిత్స్వరూపమును లవలేశముగా తెలుసుకున్నాము. అనంత జ్ఞాన ప్రదాయమైన ఆచార్య సన్నిధిలో ఇటువంటి నిగూఢ రహస్యములైన శాస్త్ర విషయములు కాలక్షేపముగా విన్నచో మరింత విశదంగా ఈ విషయములు అవగతమవుతాయి.

శ్రీమతే రమ్యజామాతృ మునింద్రాయ మహాత్మనే |
శ్రీరంగ వాసినే భూయాత్ నిత్యశ్రీర్నిత్య మంగళం ||

మంగళాశాసన పరైర్మదాచార్య పురోగమై: |
సర్వైశ్చ పూర్వైరాచార్యై: సత్కృతాయాస్తు మంగళమ్ ||

తరువాతి అధ్యాయములో ఈశ్వర తత్వమును గూర్చి తెలుసుకొందాము.

అడియేన్ శ్రీనివాస రామానుజ దాసన్

మూలము: http://ponnadi.blogspot.in/2013/03/thathva-thrayam-achith-what-is-matter.html

పొందుపరిచిన స్థానము: https://srivaishnavagranthamstelugu.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

తత్త్వత్రయం – చిత్: నేను ఎవరు?

శ్రీ:  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమద్వరవరమునయే నమః  శ్రీవానాచల మహామునయే నమః

తత్త్వత్రయం

<< శ్రీ పిళ్ళైలోకాచార్యుల తత్వ త్రయ గ్రంథ పరిచయము

జ్ఞానుల ఉపదేశముల ద్వారా చిత్ (ఆత్మ) తత్వమును అర్థం చేసుకొనుట :

పరిచయము:

  • సామాన్య జనుల నుంచి శాస్త్రజ్ఞులు, జ్ఞానుల వరకు సమాధానము తెలియగోరే గొప్ప ప్రశ్న “నేను ఎవరిని?” అని. అలాగే ప్రకృతి అంటే ఏమిటి? దాని సృష్టి కర్త ఎవరు? అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతాయి!
  • తరతరాలుగా అనేక నాగరికతలలో జ్ఞానులు ఈ మూడు వస్తువుల గురించి కొత్త విషయములు తెలుసుకొనుటకు అన్వేషణ సాగిస్తూనే ఉన్నారు.
  • సనాతన ధర్మం వేదము, వేదాంగము, స్మృతి ఇతిహాస పురాణములపై ఆధారపడి యుండుట చేత పై మూడు (చిదచిదీశ్వరులు) విషయముల గూర్చి చక్కగా వివరిస్తుంది.
  • గీతాచార్యుడు (శ్రీమన్నారాయణుడు), నమ్మాళ్వార్లు, శ్రీ పిళ్ళై లోకాచార్యులు మరియు స్వామి మణవాళ మహాముణులు తమ తమ గ్రంథములలో చిదచిదీశ్వర తత్వములను అద్భుతముగా చెప్పియున్నారు.
  • ముఖ్యముగా శ్రీ పిళ్ళై లోకాచార్యులు రచించిన ఈ “తత్వ త్రయం” గ్రంథము మరియు స్వామి మణవాళ మహాముణులు రచించిన వ్యాఖ్యానము సామాన్యులు కూడా సులువుగా అర్థము చేసుకొను రీతిలో మలచబడియున్నవి.
  • ముముక్షువులు చిదచిదీశ్వర తత్వము గూర్చి తెలుసుకోకుండా సాధన చేయుట కష్ట సాధ్యమే అవుతుంది. కనుక ఆస్తికులు, ప్రపన్నులు తత్వ త్రయము గూర్చి తప్పక తెలుసుకొనవలెను.
ఆత్మ యొక్క నిజమైన తత్వము
  • ఆత్మ, పాంచ భౌతికమైన స్థూల శరీరము ఒకటి కాదు.
  • ఆత్మ యొక్క గుణములు:
    1. ప్రకాశవంతమైనది: తన అస్తిత్వమును పూర్తిగా తెలుసుకొన్నది మరియు స్వయం ప్రకాశమైనది.
    2. అమితానందమైనది: ఎప్పుడూ బ్రహ్మానంద స్థితిలో ఉండునది.
    3. అక్షయమైనది: సృష్టి నాశనములు లేనిది.
    4. అగోచరమైనది: బాహ్య దృష్టికి కానరానిది.
    5. అణ్వాత్మకమైనది: స్థూల దృష్టితో దర్శించలేనంత అల్పమైనది.
    6. దురవగతమైనది: ఇంద్రియముల చేత గ్రహించనలవికానిది.
    7. అభేద్యమైనది: భాగించుటకు, విభజించుటకు సఖ్యము కానిది.
    8. మార్పులేనిది: మార్పు చెందే గుణము లేనిది.
    9. జ్ఞానపూర్ణమైనది.
    10. భగవానుని చేత నియంత్రించబడునది.
    11. భగవంతునికి దాస్యము  చేయుటయే ఆత్మకు  స్వాభావికము.

ఆత్మకు శరీరమునకు, ఇంద్రియములకు, బుద్ధికి, శ్వాసకు గల భేదములు :

  • శరీరేంద్రియములను “నా శరీరము”, “నా బుద్ధి”, “నా ఇంద్రియములు” అని వ్యవహరిస్తుంటాము. “నేను” అనునది ఆత్మ కాగా పైన చెప్పిన ఉదాహారణలలోని శరీరాదులు ఆత్మకు చెందిన వస్తువులుగా ఆపాదించవచ్చు.
  • ఆత్మ గూర్చి ఎరుక ఎల్లప్పుడూ ఏదోక రూపములో ఉండును కానీ శరీరాదుల ఎరుక ఎల్లప్పుడూ ఉండదు.
  • ఉదాహరణకు నిద్రావస్థయందు శరీరస్మృతి ఉండదు కానీ ఆత్మ యొక్క ఉనికి (జాగృతముగా) ఉండును. కనుకనే నిద్ర మేల్కొనగానే మనము ఎవరో తిరిగి తెలుసుకొనగలుగుతున్నాము. అలాగే చేతికి మత్తు మందు ఇస్తే చేయి స్పర్శ కోల్పోతుంది కానీ మిగిలిన శరీరము చైతన్యముతో ఉంటుంది. అదే ఆత్మయొక్క గుణము.
  •   అందుచేత ఆత్మ వేరు, శరీరాదులు వేరు.

పై గమనికల ద్వారా శరీరేంద్రియములు, ఆత్మ వేరు అన్న విషయము మనకు అర్థమవుతుంది.

  • పై గమనికలలో బేధములను ఇతరులు ఆక్షేపించవచ్చు. తర్కము ఎల్లప్పుడూ సాధ్యమే. అయితే మనకు శృతి స్మృతి పురాణాదులు ప్రమాణము కనుక పూర్వాచార్యుల సూక్తులు వాటిపై ఆధారపడినవి కనుక మనము పై గమనికలను ఒప్పు కొనవలెను. శాస్త్ర  ప్రమాణము దుర్బేధ్యమైనది, తర్కమునకు అందనిది కనుక దానినే ఒప్పుకొనవలెను.

అందుచేత శరీరము వేరు ఆత్మ వేరు. ఆ రెండు వస్తువులు వేరైనను ఒకదానికి మరొకటి సంబంధము కలిగి యుండి పరస్పరము ఆధారమైనవి. ఈ విషయము బాగా అర్థము చేసుకోగలిగితే మనకు శారీరిక సంబంధిత విషయములపై ఆసక్తి తగ్గనారంభిస్తుంది.

శరీరములోని మార్పు ఆత్మ యొక్క శరీర ప్రయాణము:
  • భగవానుడు భగద్గీతలోని రెండవ అధ్యాయములో ఆత్మ శరీరము గూర్చి చక్కగా వర్ణించాడు.
  • 13వ శ్లోకములో, “ఆత్మ శరీరములో ప్రవేశించిన పిదప శరీరమునకు జననము, బాల్యము, కౌమార్యము, యవ్వనము, వార్ధక్యం,మరణము అనెడి స్థితులు కలిగి ఆత్మ ఒక శరీరమును వదిలి మరొక శరీరమునకు ప్రయాణించును. ఈ విషయము తెలిసినచో శరీరము పట్ల మమకారము పట్టదు.”
  • 22వ శ్లోకములో, “పాడైపోయిన దుస్తులను విడిచి మనము కొత్త దుస్తులు ఎలా తొడుక్కుంటామో అలాగే ఆత్మ క్షిణించిన ఒక శరీరమును విడిచి మరొక శరీరమునకు ప్రయాణము చేయును”.

కనుక శరీరము క్షయమగును కానీ ఆత్మ క్షయమవదు.

కర్త కర్మ క్రియ ఆత్మయే:
  • ఆత్మ జ్ఞాన పూర్ణమైనది కనుక కర్త ఆత్మయే.
  • శాస్త్రము ఆత్మ జ్ఞాన పూర్ణమైనదిగా చెబుతున్నది.
  • జ్ఞానము కర్మకు హేతువు. కర్మ అనుభవమునకు హేతువు. కనుక కర్మ, అనుభవము అనునవి జ్ఞానము యొక్క రెండు దశలుగా చెప్పవచ్చు.
  • ఆత్మ శరీరాంతర్గతమై యుండి భూమిపై సత్వ రజస్తమో (ప్రశాంతత, ఆవేశము, నిర్లక్ష్యము) గుణ విరాజితమై యుండును కనుక దానికి అనుగుణముగా ప్రవర్తించును.
  • భగవానుడు ఆత్మకు స్వాతంత్య్రము నిచ్చి ఇష్టారీతిలో వర్తించుటకు అనుమతిచ్చిననూ భగవానుని నిరంకుశ గుణము చేత జీవుని నియంత్రించే అధికారము భగవానునికి కలదు.
  • జీవుడు ఆచరించే ప్రతీ కార్యములోనూ జీవునికి స్వాతంత్య్రము కలదు. భగవానుడు సాక్షిభూతుడై అది గమనించుచూ జీవుడు తన ఇష్టానుసారం చేయు చర్యలకు ఫలితమును అనుగ్రహించును.
  • జీవుడు చేయు కర్మలు శాస్త్రానుసారమా లేక శాస్త్రవిరుద్ధమా నిర్ణయించి భగవానుడు జీవునికి తగిన కర్మ ఫలమును ఇచ్చును. దీని వలన భగవానుడు పరోక్షముగా జీవుని నియంత్రించు చుండును. అయితే కర్మ ఇష్టానుసారముగా ఆచరించే స్వాతంత్య్రత జీవునికి భగవంతుడు ఇచ్చుట చేత తాను చేయు కర్మలకు తానే బాధ్యుడవుతాడు జీవుడు.
  • కొన్ని ప్రత్యేక పరిస్థితులలో భగవానుడే జీవుని కర్మలను పూర్తిగా నియంత్రించి లోకోపకార రీతిలో జీవుని చేత కర్మలు ఆచరింపచేయును. అవి కారణ జన్ముల జీవితాలలో జరుగు సంఘటనలు, వారి కర్మలు మొదలగునవి.
భగవానుని చేత నియంత్రింప బడుట, ఉద్ధరింప బడుట – భగవానునికి దాస్యము చేయుట :

భగవానుని చేత పూర్తిగా నియంత్రించ బడిన జీవుని జీవితములోని కర్మలన్నీ భగవానుడే చేయించు చుండును. అటువంటి వారి జీవితములో వారు ఆచరించిన కర్మలకు బాధ్యులు వారు కాదు. భగవానుడే!

  • శరీరములోని అన్ని చర్యలను జీవుడు నియంత్రించినట్లు, జీవుని పూర్తిగా నియంత్రించు సర్వాంతరాత్మ ఆ భగవంతుడు.
  • భగవంతుడు సర్వజీవులను నియంత్రించువాడు అయిననూ వారి ఇష్టానుసారము జీవించుటకు, శాస్త్రమును అనుష్ఠించుట కొరకు జీవునికి స్వతంత్రత ఇచ్చెను.
  • అనుష్టానము లేనిచో శాస్త్రము అర్థరహితమగును.
  • అందుచేత జీవుడైన ఆత్మ భగవానునిచే నియంత్రించ బడి, ఉద్ధరించ బడుతుంది. జీవుని కర్తవ్యము భగవద్దాస్యము చేయుటయే.
  • కర్మలను ఎలా చేయవలెనో, ఏది విసర్జనీయమో తెలిపేది శాస్త్రము. కర్మ స్వాతంత్య్రము కలిగిన జీవుడు శాస్త్రాన్ని అధ్యయనము చేసి, అనుష్టించి శాస్త్రానుసారముగా జీవించవలెను.
  • జీవుడు కర్మలు ఆచరించునపుడు భగవంతుడు మూడు రూపములలో ఉండును, అవి
    • సాక్షి : జీవుడు ఆచరించు కర్మలను గమనిస్తూ పరోక్షముగానుండును.
    • అంగీకర్త : జీవుడు కర్మలను తాను అనుకున్న విధమున ఆచరించుటకు అంగీకరించును.
    • ప్రేరేపించువాడు : జీవుడు ఆచరించు కర్మలనుంచి పుట్టే మరిన్ని కర్మలను జీవుని చేత ఆచరింపజేయువాడు.
  • భగవంతుడే జీవుని ఉద్ధరించువాడు. జీవుడు భగవానుని గూర్చి అవగాహన కోల్పోయి నప్పుడు తాను అజ్ఞానావస్థలో ఉంటాడు. జీవునికి భగవానుని విషయములో తెలియవలసిన విషయములు:
    • జీవునికి భగవంతునికి సంబంధము ఎట్టిది?
    • భగవత్తత్వము ఎటువంటిది?
    • భగవంతుని కళ్యాణ గుణములు ఏవి?
  • విశ్వాంతరాత్ముడైన భగవంతునికి జీవుడు దాసుడు.
  • అనగా, జీవుడు తన స్వార్థమును విడిచి ఎల్ల వేళలా భగవంతుని సంతృప్తి పరుచుట కొరకు, భగవంతుని ఆనందింప చేయుట కొరకు నిస్వార్థముగా కర్మలు ఆచరించవలెను. జీవము లేని అచిత్తులైన చందనము, పుష్పములు ఎలా అయితే సుగంథములతో మనలను ఆనందింపజేయునో అటులనే జీవుడు భగవానుని సంతోషపరుచుటకు సత్కర్మలు ఆచరించవలెను.
  • చివరగా భగవానుడు వేరు , జీవుడు వేరు అయిననూ భగవంతునికంటే ఇతరమైన ఉనికి జీవునికి లేదు.

ఆత్మలు మూడు రకములు :

  • జీవులు అనంత కోటి కలవు. వాటిని స్థూలముగా మూడు విధములుగా విభజించ వచ్చును. అవి బద్ధాత్మ, ముక్తాత్మ, నిత్యాత్మ
  • బద్ధాత్మ
    • ఇవి సంసార సాగర మందు బంధింపబడి అనాది కాలము నుంచి జనన మరణ చక్రములో తిరుగుచున్నవి.
    • తమ యొక్క నిజతత్వమును ఎరుగక సంసారము శాశ్వతమనుకునే జీవాత్మలు ఈ కోవకు చెందినవి.
    • పూర్తిగా అజ్ఞాన భూయిష్టులై శరీరము, తానూ ఒకటే అనే భ్రమలో జీవించే ఆత్మలను బద్ధాత్మలుగా పరిగణించవచ్చు.
    • సంసారము అశాశ్వతము అని తెలిసినా తాము స్వతంత్రులమని భ్రమించి ఎటువంటి నియంత్రణ లేక సంసారములో చరించే జీవాత్మలు కూడా ఒకరకమైన బద్ధాత్మలే.

  • ముక్తాత్మ
    • ముక్తాత్మలు ఒకకాలములో బద్ధాత్మలై సంసారమందుండి ముముక్షువులై మోక్షము కొరకు సాధన చేసి మోక్షము పొందినవి.
    • భక్తి, జ్ఞాన వైరాగ్యముల చేత సంసార శృంఖలాల నుంచి విముక్తి పొంది, భగవానుని యొక్క నిర్హేతుక కృప చేత మోక్షార్హత పొంది కైవల్య సామ్రాజ్యమును పొందినవి ముక్తాత్మలు.
    • ఇవి మోక్ష సాధన పరిపక్వమైనపుడు అర్చిరాది మార్గాన పయనించి విరజా నదిలో తీర్థమాడి దివ్య శరీరమును పొంది సారూప్య ముక్తిని పొందుతాయి.
    • శ్రీ వైకుంఠము నందు నిత్యసూరులు మరియు ముక్తాత్మల చేత ఆహ్వానించబడి శ్రీ పరమపదనాథుని సన్నిధానములో శాశ్వతానంద స్థితిలో పరమపదంలో పెరుమాళ్ళకు పల్లాండు పాడుతూ అనంత కాలము శ్రీ కైంకర్యములో అన్వయింపబడతాయి.

  • నిత్యాత్మ
    • నిత్యాత్మలు సంసార గంథము ఎన్నడూ అంటనివారు.
    • వారు అహర్నిశలు క్షణక్షణము భగవానుని యందే నిమగ్నులై ఉండును. అది పరమపదమైనా సరే, సంసారమైనా సరే.
    • పరమపదములో నిత్య సూరులు భగవానుని ఆజ్ఞ చేత జీవోద్ధరణకు సంసారలోక మందు అవతరించెడి వారు నిత్యాత్మలు. సంసార మందు ఉండిననూ సంసార వాసనలు వారికి అంటవు.
    • అటులనే పరమపదములో స్వామికి నిత్య కైంకర్యము అన్వయించెడి నిత్య సూరులు ఈ నిత్యాత్మల కోవకు వస్తారు. వారు అనంత, గరుడ విశ్వక్సేనాదులు.
    • పరమపద నాథుడు ఎల్లప్పుడూ నిత్యాత్మలైన నిత్యసూరుల చేత కైంకర్యములను స్వీకరించుచుండును.

  •   అనంత కోటి జీవాత్మలు – వాటి గుణములు
    • చల్లటి నీరు పాత్రలో వేసి నిప్పుపై పెడితే వేడిపడి నట్లు భగవద్దాసులైన జీవాత్మలు సంసారవాసన తగలగానే అజ్ఞానమును, కర్మలు వాటి ఫలితాలకు బద్ధులవుతారు. ఇది బద్ధాత్మల లక్షణము.
    • విషయ ప్రావణ్యము తరుగుతున్న కొద్దీ అజ్ఞానము పోవనారంభిస్తుంది.
    • అనంత కోటి జీవాత్మలు మూడు రకములు – అవి బద్ధాత్మ, ముక్తాత్మ, నిత్యాత్మ – ఇవి ఒక్కొక్కటి అనంత కోటి.
    • శాస్త్రమును సరిగా అర్థం చేసుకోనివారు అందరిలోనూ ఉన్న ఆత్మ ఒకటే అని భ్రమిస్తారు (అద్వైతము కూడా దీన్ని ఒప్పు కోదు). కానీ అది శాస్త్ర విరుద్ధము, తర్క దూరము.
    • అందరిలో ఉన్న ఆత్మ ఒకటే అయితే ఒకరు సంతోషముగా నుంటే మరొకరు బాధగా ఉండ కూడదు. అంతే తర్కము. కనుక ఒక శరీరాన్ని ధరించిన జీవాత్మ ఆ శరీరానికే బద్ధమైయుండును.
    • శాస్త్రానుసారము, కొన్ని నిత్యాత్మలు, కొన్ని ముక్తాత్మలు మరి కొన్ని జీవాత్మలు అనే వేర్పాటు ఉండుట చేత ఒక్కొక్క ఆత్మ ఒక్కొక్క జ్ఞాన దశలో ఉండుట చేత కొన్ని ఆచార్యత్వము వహిస్తే కొన్ని శిష్యత్వము వహిస్తాయి.
    • మోక్షము పొందిన ముక్తాత్మలు కూడా అనంత కోటి ఉంటాయి.
    • మోక్ష మందు కూడా అన్ని ముక్తాత్మలు ఒకే జ్ఞాన స్థితిలో ఉంటాయా అంటే అవును అని చెప్పడం కుదరదు. ఒకే పరిమాణములో, ఒక కుమ్మరి చేత చేయబడి ఒకే ఆకారములో ఉన్న కుండలు కూడా ఒకదానితో మరొకటి వేరుగా ఉంటాయి. ఆ సామ్యాన్ని ఇక్కడ ఉపయోగించుకొని కొన్ని ముక్తాత్మలు భగవంతుని దర్బారులో  భగవద్గుణానుభవము చేస్తుంటే కొన్ని ముక్తాత్మలు పెరుమాళ్ళ ఆజ్ఞ చేత మరల సంసారములో జన్మిస్తూ జనోద్ధరణ చేస్తుంటాయి. ఒకే స్థితిలో కూడా వేరు పాటు గమనించవచ్చు.
    • కనుక సంసారలోక మందు, పరమపద మందు కూడా అనంత కోటి జీవాత్మలు కలవని మనం గమనించవచ్చు.
ధర్మి జ్ఞానం – ధర్మ భూత జ్ఞానం

ఇక జ్ఞానము యొక్క విధములను తెలుసుకుందాము ! జ్ఞానము రెండు రకములు ధర్మి జ్ఞానము – ధర్మము పట్ల ఎరుక

ధర్మ భూత జ్ఞానము – ధర్మమును గూర్చి తెలుసుకొనుట వలన లభించిన జ్ఞానము.

ఆత్మ తత్వము (బద్ధ, ముక్త, నిత్య అను వైవిధ్యముతో సంబంధము లేక) యొక్క నిజ రూపములో రెండు గుణములు కలిగియుండును! అవి,

శేషత్వము : భగవంతునికి శేషునిగా అనగా సేవకుని వలె ఉండుట.

జ్ఞాతృత్వము: భగవద్గుణానుభవ ప్రభావిత జ్ఞానము కలిగియుండుట

  • రెండు గుణములు ఆత్మకు అత్యావశ్యక లక్షణములు
  • ఆత్మ జ్ఞానియై ఉండుట చేత అచిత్తు నుంచి వేరగు చుండును
  • భగవంతునికి శేషుడై ఉండుట చేత భగవానుని నుంచి వేరగు చుండును
  • ధర్మి జ్ఞాన ప్రభావము చేత ఆత్మ స్వాభావిక జ్ఞాన స్వరూపమై ఉండిననూ ధర్మ భూత జ్ఞానమును ఆవశ్యక విశేషముగా పొందవలెను
  • అంటే, ధర్మి జ్ఞానము ఆత్మ యొక్క అనంతమైన, నాశనము లేనట్టి, ఎటువంటి మార్పు లేనట్టి అస్తిత్వ గుణమును సూచిస్తుంది
  • ధర్మ భూత జ్ఞానము ప్రకృతిని, బాహ్య ప్రపంచమును గమనించుట చేత ఆత్మకు అలవడును. అది ఆత్మ యొక్క బుద్ధి పరిపక్వ స్థితిని బట్టి మారుతూ ఉండును
  • నిత్యాత్మలకు ధర్మ భూత జ్ఞానము అనంతమై పూర్తి జ్ఞాన భూత స్థితి కలిగియుండును
  • ముక్తాత్మలకు  ఒకప్పడు పరిమిత స్థితిలో యుండి, ముక్తి పొందిన పిమ్మట పూర్తి వ్యాకోచమై నిత్యులవలె అనంతమై ఉండును
  • ప్రకృతిపై ఆధారపడి జీవించే బద్ధాత్మలకు చాలా పరిమితముగా ధర్మ భూత జ్ఞానము ఉండును
  • నిజమైన జ్ఞానము సత్యమై శాశ్వతమై అనంతమై ఉన్ననూ, సత్త్వరజస్తమో గుణముల వలన జ్ఞానము గ్రహించు ఇంద్రియముల యొక్క పరిమితుల చేత జ్ఞానము పరిమితముగా ఆత్మకు అందును.
  • ఎందుకనగా ఇంద్రియములు సత్త్వరజస్తమో గుణముల వలన అన్ని వేళలా జ్ఞాన గ్రహణకు సిద్ధముగా ఉండవు. కనుక, ధర్మ భూత జ్ఞానము కొన్ని సార్లు పెరగవచ్చు, కొన్నిసార్లు తరగవచ్చు.

ముగింపు :

  • పరిపూర్ణ జ్ఞాన స్థితి పొందు ఆత్మ యొక్క గుణములను గూర్చి చెప్పుట జరిగినది
  • భౌతిక శరీరమును హింసించెడి వస్తువుల (విషం, శస్త్రములు) వలన దుఃఖము ఏర్పడుచున్నది .
    • ఎందుకనగా, ఆత్మ, శరీరము ఒకటే అన్న భ్రాంతి కలుగుట చేత.
    • దానికి కారణము మనము చేయు కర్మలు ఆత్మను శరీరమునకు కట్టి వేసి శరీరాత్మ  భ్రాంతి కలుగజేయుచున్నవి.
    • మనకు పాంచ భౌతికమైన ప్రకృతి గూర్చి పూర్తి అవగాహన లేకపోవుట చేత శస్త్రములు, రోగములు అంటే భయము కలుగుతున్నది. నిజానికి విశ్వవ్యాపకుడగు పరమాత్మ అన్ని పదార్థముల యందు కలడన్న జ్ఞానము పొందిన రోజు శరీరము ఆత్మ వేరనే ఎరుక కలిగి అన్ని భయములు పటాపంచలు అయిపోతాయి. ప్రహ్లాదునికి తనను చంపటానికి సిద్ధం చేసిన విషమో, కౄర మృగములో, మారణాస్త్రములో తనను ఏమీ చేయలేకపోవుటకు కారణము ఇదియే. “ఇందుగలడందు లేడను…. ” చందమున ప్రహ్లాదుడు అన్నిటి యందు ఆ హరిని దర్శించ గలిగెను.
  • భయము కేవలం మన అజ్ఞానము (పరమాత్మ విశ్వ వ్యాపకుడను సత్యమును నమ్మక పోవుట చేత) వలన కలుగు చున్నది
  • కేవలం పరమాత్మ తప్ప మరే వస్తువు ఆత్మకు పడదు. ఒకరికి ఈనాడు ఇష్టమైన వస్తువు రేపు ఇష్టము లేకపోవచ్చును. నేడు హితమైనది రేపు వర్జనీయమగును. కానీ పరమాత్మ మాత్రమే ఆత్మకు శాశ్వతముగా ఉపాయమగు వస్తువు. అందులో సందేహము అవసరము లేదు.
  • ప్రకృతిలోని ప్రతి మార్పుని (శారీరిక మార్పులు సైతం) పరమాత్మకు అనుసంధానము చేసి చూస్తే మనస్సులో మార్పు జరగదు. ఒక నిశ్చలమైన భావన ఏర్పడుతుంది. తద్వారా అశాశ్వతమైన వాటిపై మమకారము తగ్గి శాశ్వతమైన మోక్షము కొరకు మనసు తపిస్తుంది.

చిత్ ప్రకరణము ఇంతటితో ముగిసినది. ఈ అద్వితీయమగు మోక్ష శాస్త్రము ఒక ఆచార్యుని సముఖమున నేర్చినచో మరింత గొప్పగా అవగతపడుతుంది.

శ్రీమతే రమ్యజామాతృ మునీన్ద్రాయ మహాత్మనే |
శ్రీరంగ వాసినే భూయాత్ నిత్యశ్రీర్నిత్య మంగళమ్ ||
మంగళాశాసన పరైర్మదాచార్య పురోగమై: |

సర్వైశ్చ పూర్వైరాచార్యై: సత్కృతాయాస్తు మంగళమ్ ||

ఇక తర్వాతి అధ్యాయములో అచిత్తు యొక్క తత్వమును తెలుసుకుందాము

మూలము: http://ponnadi.blogspot.in/2013/03/thathva-thrayam-chith-who-am-i5631.html

పొందుపరిచిన స్థానము: https://srivaishnavagranthamstelugu.wordpress.com/

అడియేన్ శ్రీనివాస రామానుజ దాసన్ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

తత్త్వత్రయం – శ్రీ పిళ్ళైలోకాచార్యుల తత్వ త్రయ గ్రంథ పరిచయము

శ్రీ:  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమద్వరవరమునయే నమః  శ్రీవానాచల మహామునయే నమః

మనము ఇంతవరకు అయిప్పసి (తులా మాసము) మాసములో అవతరించిన ఆళ్వారాచార్యుల దివ్యానుభవములను తెలుసుకుంటున్నాము. మరిన్ని వివరముల కొరకు https://srivaishnavagranthamstelugu.wordpress.com/thathva-thrayam/ లింక్ చూడవచ్చును. ఇప్పుడు మనము పరమ కారుణికులు, దివ్య వైభవము కలిగిన శ్రీ పిళ్ళై లోకాచార్యుల గురించి మరియు వారు రచించిన చిన్న శ్రీభాష్యమైన “తత్వత్రయము” గ్రంథము, దానికి స్వామి మణవాళ మహామునులు అనుగ్రహించిన వ్యాఖ్యానావతారికను తెలుసుకుందాము.

ఎమ్బెరుమానార్, శ్రీ పిళ్ళై లోకాచార్యులు, స్వామి మణవాళ మహామునులు – తిరుప్పవళ వణ్ణం దివ్య దేశం

“తత్వ త్రయము” అను ఈ గ్రంథము “చిన్న శ్రీ భాష్యము” గా మన సంప్రదాయములో ప్రసిద్ధి గాంచినది. శ్రీ భాష్యకార బిరుదాంకితులైన భగవద్రామానుజులు బ్రహ్మ సూత్రములకు అద్భుతమైన, సరళమైన వ్యాఖ్యానమును అనుగ్రహించారు. ఆ వ్యాఖ్యానమే “శ్రీ భాష్యము” గా సుప్రసిద్ధమైనది. విశిష్టాద్వైత సిద్ధాంతమునకు అవసరమైన అన్ని ప్రధాన ప్రమాణములు ఇందులో ఇమిడియున్నవి. అయితే శ్రీ భాష్యము సంస్కృతములో ఉండుట చేత సంస్కృత భాషాప్రవేశము లేనివారికి శ్రీ భాష్యము నందలి విషయములు తెలుసుకొనుటకు కష్టసాధ్యముగానుండెను. శ్రీ పిళ్ళై లోకాచార్యులవారు శ్రీభాష్యము యొక్క సారమును “తత్వ త్రయము” అను గ్రంథములో పొందు పరిచి ద్రావిడ భాషలో సామాన్యులకు సైతం సులభముగా అర్థమగు రీతిలో రచించారు. ఈ గ్రంథములో వేదాంతము నందలి ప్రాథమిక విషయములైన చిత్తు, అచిత్తు మరియు ఈశ్వరుడు అను మూడు విషయముల గూర్చి విశదీకరించుట జరిగినది. తత్వ త్రయం గ్రంథము యొక్క సారాంశము ఈ లింకులో చదువుకొనవచ్చును.

https://srivaishnavagranthamstelugu.wordpress.com/2017/02/13/simple-guide-to-srivaishnavam-thathva-thrayam-in-short/

ఇక స్వామి మణవాళ మహాముణులు ఈ గ్రంథమునకు అనుగ్రహించిన ఉపోద్ఘాతమును చూద్దాము.

“అనాది మాయయా సుప్తః” అనునట్లు, అనంతకోటి సంవత్సరాలుగా ఎడతెగని ఈ కాల చక్రములో జీవుడు పంచ భూతాత్మకమైన ఈ ప్రకృతి సంబంధము చేత కర్మలు ఆచరించుచూ వాటి వల్ల సంక్రమించే పుణ్య పాపముల ఫలితముగా జనన మరణ చక్రములో పడి అలమటిస్తున్నాడు. అజ్ఞానమనెడి అంధకారంలో చిక్కుకున్న జీవుడు తాను వేరు ప్రకృతి వేరు అన్న సత్యమును (తెలిసినచో కేవలము భగవత్కళ్యాణ గుణములనే స్మరిస్తూ భగవంతుని అనుభవిస్తూ ఈ ప్రకృతిని విస్మరించెడివాడు) మరచి తానూ ప్రకృతిలో ఒకనిగా భావించి ఈ ప్రకృతినే అనుభవిస్తూ కాలము గడుపుతున్నాడు. అటువంటి అజ్ఞానముతో జీవుడు.

  • “దేహోऽహమ్, మనుష్యోహమ్”, నేను దేహిని, మనుష్యుడును – అనే మాయలో దేహము తానూ ఒకరే అని భ్రమపడుతున్నాడు.
  • “ఈశ్వరోऽహమ్ అహం భోగి”, నేనే ఈశ్వరుడను, స్వతంత్రుడను – తానూ శరీరమూ వేరన్న భావము జీవునికి కలిగిననూ, తానే భగవంతుడనని భావించి, తాను స్వతంత్రుడనని భ్రమిస్తున్నాడు.
  • తాను పరతంత్రుడనని భావించిననూ, భగవంతుని సేవకుడైన జీవుడు, తగు భగవత్కైంకర్యములను చేయక ప్రాపంచిక భోగములలో మునిగి తేలుచున్నాడు.

“యోऽన్యథా సంతమానం అన్యథా ప్రతిపద్యతే, కిమ్ తేన న కృతం పాపమ్ చోరేణాత్మాపహారినా”, జీవుడు తన యొక్క స్వరూపజ్ఞానమును (తాను భగవంతుని దాసుడనన్న సత్యమును) విస్మరించి ప్రాపంచిక కార్య కలాపము లందు నిమగ్నుడగుట ఆత్మచౌర్యమే అవుతుంది. తనది కాని వస్తువైన ఆత్మను తనదిగా భావించి తనది కాని శరీరమునకు ఆత్మను ఆపాదించి అశాశ్వతమైన, కర్మ ప్రదమైన ప్రాపంచిక సుఖములను భవించుట పాపములలోకెల్లా మహా పాపమైనదని దీని భావము.

“విచిత్ర దేహ సంపత్తిర్ ఈశ్వరాయ నివేదితుం, పూర్వమేవ కృతా బ్రహ్మన్ హస్తపాదాది సంయుతా”, అని చెప్పినట్లు పూర్వము ప్రళయ సముద్రము నందు విశ్వము గాఢాంధకారమై యుండి, సృష్టి చేయునపుడు, సర్వేశ్వరుడు తన యొక్క నిర్హేతుక కృప చేత అప్పటివరకు అస్థిత్వము లేని జీవునికి శరీరమును, ఇంద్రియములను ఇచ్చి వాటి ద్వారా తనకు దాస్యము చేసి తరించి చివరికి తన శ్రీచరణాలను చేరమని  ఆశీర్వదించెను.

శ్రీనమ్మాళ్వారులుశ్రీరంగనాథుని యందు జీవులను అనుక్షణం ప్రేమతో అనుగ్రహించెడి  “వ్యూహ సౌహార్ద్రత” అను కళ్యాణగుణమును బాగుగా అనుభవించియున్నారు.

తిరువాయ్మొళి  3.2.1 లో, “అన్నాళ్ నీ తంద అక్కైయిన్ వాళి ఉళల్వేన్” అని  చెప్పినట్టుగా, జీవుడు భగవదనుగ్రహము చేత పొందిన శరీరేంద్రియములను దుర్వినియోగ పరుచుచూ భౌతిక సుఖలోలుడై కాలము గడుపుచున్నాడు. నది దాటుటకు పడవను పొంది నది దాటకపోగా, ఆ పడవలో సముద్రములోనికి పోయి అలలాడినట్లు, ఈ జీవుడు పాంచ భౌతిక శరీరమును తానేయని భ్రమించి స్వార్థ పూరిత కర్మలు ఆచరించుచూ సంసార సాగరములో కొట్టుమిట్టాడు చున్నాడు. చేసిన కర్మల ఫలితముగా మరల మరల జన్మించుచూ తాపత్రయ గ్రస్థుడై గర్భస్థ, జన్మ, కౌమార, యవ్వన, మరణ అనెడి దశలను గడిపి చేసిన పాప కర్మల ఫలితముగా నరకముననుభవించి, పుణ్య కర్మల ఫలితముగా ఉత్తమ జన్మలెత్తుతూ అలా పడుతూ లేస్తూ ఈ జననమరణ చక్రములో తిరుగుచున్నాడు. “ఏవం సంస్మృతి చక్రస్థే భ్రామ్యమాణే స్వకర్మభిః జీవే దుఃఖాకులే కృపా కాపి ఉపజాయతే “, అనునట్లు భగవానుడైన శ్రీ మహా విష్ణువు జీవుల పట్ల తనకు గల నిర్హేతుక కృప చేత జీవులను సంసార సాగరము నుంచి ఉద్ధరించుటకు అనేక అవతారాల ఎత్తి ధర్మ రక్షణ, శిష్ట రక్షణ చేస్తూనే ఉన్నాడు. “జాయమానమ్ యమ్ పశ్యేన్ మధుసూదనః సాత్విక స్సతు విజ్ఞేయః సవై మోక్షార్థ చిన్తకః”, జీవుడు తల్లి గర్భములో జనించునపుడు తాను ఎటుల తరించవలెనో తెలుసుకుని సత్యమైన జ్ఞానమును పొంది సాత్వికుడై విష్ణువును ఆశ్రయించి మెలిగినపుడే ముముక్షుత్వము సాధించినవాడు అవుతాడు.   

సత్యమైన నిజ జ్ఞానము పొందేందుకు రెండు దారులు కలవు : 1) శాస్త్రము 2) ఉపదేశము (ఆచార్యోపదేశముగా పొందేది )

శాస్త్రాధ్యయనము వలన కొన్ని ఇబ్బందులు కలవు.
  • “శాస్త్ర జ్ఞానం బహు క్లేశం”, అనునట్లు శాస్త్రాధ్యయనము బహు క్లిష్టతరమైనది. అందు విషయము అంత సులభగా అవగతపడదు. పదములకు గల నానార్థముల వలన శాస్త్ర వాక్యాలకు వివిధములైన అర్థములు స్ఫురించి ఏ అర్థమును అన్వయించు కొనవలెనో తెలియక చివరికి అజ్ఞానావస్థలోనే మిగిలిపోయే ప్రమాదం కలదు.
  • ఒకవేళ అంత శ్రమను ఓర్చి శాస్త్ర జ్ఞానము సొంతముగా పొందగోరిననేమి, “అనంత భారమ్ బహు వేదితవ్యం అల్పచ్చ కాలో బహవశ్చ విఘ్నాః”, అనునట్లు జీవుడు తనకు గల పరిమిత జీవిత కాలములో మరియు, పరిమితమైన బుద్ధి చేత అనంత సాగరమైన శాస్త్రమును తెలియగోరుట అసాధ్యమే అవుతుంది.
  • చివరగా జీవులలో ఆడవారు, శూద్రులు శాస్త్రాధ్యయనమునకు నిషిద్ధులు. అయితే ముముక్షుత్వమునకు వారు అర్హులు.

అయితే శాస్త్రాధ్యయనము చేసిన పెద్దలైన ఆచార్యులను ఆశ్రయించి వారి వద్ద శాస్త్ర జ్ఞానమును ఉపదేశముగా పొందవచ్చును. దానికి ఎటువంటి ఆంక్షలు లేవు. శాస్త్రజ్ఞులైన గురువులు అపారమైన శాస్త్ర జ్ఞానమును అవపోశన పెట్టినవారు గనుక శిష్యుని యొక్క బుద్ధి పరిమితులను బట్టి శిష్యుడు సుకరముగా తరించుటకు ఎంత జ్ఞానము అవసరమో అంతే ఉపదేశిస్తారు. ఏ భాషలో (అంటే అత్యంత క్లిష్టమైన భాషలో శాస్త్రమున్ననూ దానిని సంస్కరించి శిష్యునికి అర్థమగు నట్లు లలితముగా చిన్న చిన్న పదాలతో ఆళ్వార్లు రచించిన పాశురముల వలె గురువు శాస్త్రార్థములను శిష్యునికి ఉపదేశిస్తాడు.) చెబితే శిష్యునికి అర్థమవుతుందో ఆ భాషలో గురువు ఉపదేశిస్తాడు.

అందువలన పరమ కారుణికులైన శ్రీ పిళ్ళై లోకాచార్యులు వేదాంత శాస్త్రమును ఆసాంతం అధ్యయనం చేసిన శాస్త్రజ్ఞులైననూ జీవుల పట్ల గల నిర్హేతుక కృప చేత అందరికీ అర్థమగునట్లు లలితమైన భాషలో వేదాంతమునకు మూల వస్తువులైన చిత్తు, అచిత్తు మరియు ఈశ్వరుడు అను మూడు విషయముల గూర్చి ఈ తత్వ త్రయమను గ్రంథమును రచించియున్నారు.

పూర్వాచార్యులైన నడువిల్ తిరువీధి పిళ్ళై భట్టర్, మరియు పెరియ వాచ్చాన్ పిళ్ళై వంటివారు కూడా క్లిష్టతరమైన వేదాంత శాస్త్రమును సులభ రీతిలో జనులకు అర్థమగునట్లు తమ గ్రంథములు ద్రావిడ భాషలో రచించుటకు కారణం జీవులపట్ల తమకు గల నిర్హేతుక కృప మాత్రమే. ఎందుకంటే మన పూర్వాచార్యులు

  • అహంకార రహితులు
  • జీవుల పట్ల ఎల్లప్పుడూ అక్కర కలిగినవారు
  • ఎప్పుడూ తమ స్వార్ధము, గొప్పతనము చూసుకోనివారు

మరి ఇందరు ఆచార్యులు ఒకే విషయముపై ఇన్ని గ్రంథములు రచించుట ఎందులకు? ఒకరు రచించిన గ్రంథమునే మిగిలిన వారందరునూ ఒప్పుకొని అన్వయించ వచ్చును కదా? దీనికి స్వామి మణవాళ మహాముణులు అనుగ్రహించిన వివరణ చూద్దాము:

  • ఆళ్వార్లు ఏకకంఠులు (అంటే శరీరములు వేరు వేరైననూ పాడిన పాశురములు ఒక్కటే), ఒకే విషయమగు భగవద్గుణానుభవము గురించి పన్నెండుగురు ఆళ్వార్లు ప్రతిపాదించుట చేత శరణాగతి సిద్ధాంతము మరింత స్థిరీకరించబడినది. ఆళ్వార్లు రచించిన దివ్య ప్రబంధమందలి మూల వస్తువు శరణాగతి తత్వమే కదా.  అదే విధముగా పూర్వాచార్యులు కూడా ఏకకంఠులు అగుట చేత దుష్కరమైన వేదాంత తత్వమును వివిధ గ్రంథముల ద్వారా ఒకే విషయమును ఒకే విధముగా ఒక గ్రంథమునకు ఇంకొక గ్రంథము భావ వ్యత్యాసము లేకుండా అంగీకృతముగా నుండు విధమున అనుగ్రహించారు. అందుచేత సిద్ధాంత ప్రమాణములుగా ఈ గ్రంథములు విలసిల్లుచున్నవి.
  •  ఒక గ్రంథమున క్లుప్తముగా వివరించిన విషయము మరొక గ్రంథములో విస్తారముగా చెప్పియుండును. ఇందువలన ఒకదానికి మరొకటి సామరస్యముగానుండును.

ఇదే సూత్రము ఒకే ఆచార్యుడు రచించిన అనేక గ్రంథములకూ వర్తించును. ఒక గ్రంథమందు ప్రతిపాదించిన విషయములను మరొక గ్రంథము ఆదరించుచూ సమన్వయము గలవైయుండును.

శ్రీ పిళ్ళై లోకాచార్యులు, స్వామి మణవాళ మహాముణులు – శ్రీపెరుంబుదూరు

ఈ విధముగా పరమాద్భుతమైన తత్వత్రయ గ్రంథము యొక్క పరిచయము చెప్పబడినది. విశిష్టాద్వైత సిద్ధాంతమందలి క్లిష్టమైన వేదాంత సూత్రములు ఈ గ్రంథములో అత్యంత సులభతరంగా వివరించబడినవి. స్వామి మాణవాళ మహాముణుల యొక్క వ్యాఖ్యానము ఈ గ్రంథమునకు మరింత వన్నె తెచ్చినది. ఈ గ్రంథము నిజానికి ఒక ఆచార్యుని ఆశ్రయించి వారి ముఖేన వినదగిన శాస్త్రము. ఆ అవకాశము లేని వారికి ఈ అనువాదం ఒక సుగమవారధిగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము. పరమ కృపా పూర్ణులైన మన పూర్వాచార్యుల దివ్య శ్రీచరణాలను మనసా స్మరించి ఈ గ్రంథములోని మరిన్ని విషయాలను వచ్చే అధ్యాయాలలో తెలుసుకుందాము!

అడియేన్ శ్రీనివాస రామానుజ దాసన్

మూలము : http://ponnadi.blogspot.in/2013/10/aippasi-anubhavam-pillai-lokacharyar-tattva-trayam.html

పొందుపరిచిన స్థానము: https://srivaishnavagranthamstelugu.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

శ్రీమద్రామానుజుల 72 అపూర్వ వార్తలు

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్ వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః

swamy-in-unjal

శ్రీమద్రామానుజుల 72 అపూర్వ వార్తలు

లీలా విభూతి నుండి నిత్య విభూతికి తరలి పోయే సమయములో ఆచార్యుల విషయములోను, తోటివారి విషయములోను, లోకములోను నడచుకొన వలసిని విధానము గురించి తమ శిష్యులకు చెప్పిన 72 అపూర్వ వార్తలు.

  1. మీ ఆచార్యుల పట్ల , శ్రీవైష్ణవుల పట్ల చూపే భక్తిలో భేదము పాటించ రాదు.
  2. ఆచార్యుల బోధనలను పరి పూర్ణముగా విశ్వసించాలి.
  3. ఇంద్రియములకు దాసులు కావద్దు.
  4. ఙ్ఞాన సముపార్జనతో ఆగిపోవద్దు.
  5. భగవంతుడి లీలను తెలిపే రచనలను చదవటములో ఆనందమును అనుభచండి.
  6. ఒక సారి మీ ఆచార్యులు ఙ్ఞానేత్రమును తెరిచిన తరువాత తిరిగి ఇంద్రియ భోగములకు దాసులు కాకండి.
  7. సుఖదుఃఖములను సమానముగా స్వీకరించండి.
  8. గంధము, పుషములు, సెంటు వంటి సువాసన ద్రవ్యములకు దాసులు కావద్దు.
  9. భాగవతుల కథలను, ఔన్నత్యములను, నిరంతరము స్మరించటము వలన భగవంతుడు మిమ్మల్ని తనవారిగా స్వీకరిస్తాడు.
  10. భాగవత కైంకర్యము చేసే వారి కంటే ఎవరూ ముందుగా భగవంతుడిని చేరుకోలేరనే విషయాన్ని మీ మనసులలో దృఢముగా చిత్రించుకోవాలి.
  11. అత్యంత ఙ్ఞాన వంతుడైనా, భగవంతుడికి, భాగవతులకు కైంకర్యము చేయక పోతే నాశము తప్పదు.
  12. శ్రీవైష్ణవుల జీవనము లౌకిక సంపదలు ఆర్జించటము కోసమని అనుకోవద్దు.
  13. పరమపదము చేరటమే లక్ష్యముగా జీవనము సాగించాలి.
  14. భాగవతులను పొరపాటున కూడా అమర్యాదగా పిలవరాదు.
  15. శ్రీవైష్ణవులను చూసిన మాత్రముననే నమస్కరించటము మరచిపోకండి.
  16. భగవంతుడి ముందు, భాగవతుల ముందు, పెద్దల ముందు విలాసముగా కూర్చో కూడదు.
  17. నిద్రించే సమయములో భగవంతుడివైపు, భాగవతులవైపు, గృహ దేవతవైపు కాళ్ళు చాచరాదు.
  18. నిద్ర లేవగానే గురుపరంపరను అనుసంధానము చేయాలి.
  19. భాగవత గోష్ఠి కనపడితే భగవంతుడి కన్నా ముందు భాగవతులకు నమస్కారము చేయాలి.
  20. భాగవత గోష్ఠిలో నామ సంకీర్తనమో, ప్రబంధ సేవో జరుగుతున్నప్పుడు భక్తితో నమస్కరించాలి. మధ్యన లేచి వెళ్ళరాదు. అది దోషాలన్నిటిలోను పద్ద దోషము.
  21. శ్రీవైష్ణవులు మిమ్మల్ని చూడటానికి వస్తుంటే మీరే ముందుగా ఎదురేగి ఆహ్వానించడము మరవకండి. వారు బయలుదేరి నపుడు కొంత దూరము కూడా వెళ్ళి సాగనంపండి. ఇలా చేయక పోవటము పాపము.
  22. శ్రీవైష్ణవుల ఎడ భక్తితో ప్రవర్తించండి. వారి కృప మీమీద ప్రసరించేదాకా వేచి ఉండండి. అందుకని తరచుగా వారి ఇళ్ళకు వెళ్ళటము, వారి పేరును మీపేరు ముందు చేర్చుకోవటము, జీవనము కోసము వారి మీద ఆధారపడటము లాంటి పనులు చేస్తే, అవి మీ స్తాయిని దిగజారుస్తాయి.
  23. కోవెలను, గోపురమును చూడగానే భక్తితో చేతులు జోడించండి.
  24. ఎంత అందముగా మలచబడ్డా వింత దేవుళ్ళవైపు చూడకండి.
  25. వింత దేవుళ్ళ చేష్టలను విని ఆశ్చర్య పోకండి.
  26. శ్రీవైష్ణవులు భగవత్, భాగవత, ఆచార్య గ్రంధములను సేవించే సమయములో వారితో వాదనకు దిగరాదు.
  27. శ్రీవైష్ణవుల నీడను దాటరాదు.
  28. మీ నీడను శ్రీవైష్ణవుల మీద పడనీయకండి.
  29. అపవిత్రమైన వాటిని తాకితే స్నానము చేయనిదే శ్రీవైష్ణవులను తాకరాదు.
  30. పేదవారైన శ్రీవైష్ణవులు మిమ్మల్ని ముందుగా నమస్కరించితే, వారిని తక్కువగా చూడవద్దు. అది పాపము.
  31. శ్రీవైష్ణవులు మిమ్మల్ని ముందుగా నమస్కరించి “దాసుడిని” అనగానే, మిమ్మల్ని మీరు గొప్పగా తలచ కూడదు.
  32. ఎవరైనా శ్రీవైష్ణవుల లోపాలు (అతి నిద్ర, సోమరి తనము, తక్కువ కులములో పుట్టి వుండటము….)తెలిసి వుంటే ఎవరిదగ్గర చెప్పరాదు. వారిలోని మంచిని మాత్రమే అందరితో పంచుకోవాలి.
  33. అనుకోకుండానైనా భగవంతుడికిగాని, భాగవతులకుగాని శ్రీపాదములను కడిగిన తీర్థమును వారి ముందే పంచుకోవద్దు.
  34. తత్వ త్రయము, మంత్ర త్రయము తెలియని వారి శ్రీపాద తీర్థమును ఎట్టి పరిస్తితులలోను తీసుకోరాదు.
  35. ఆచార్య శ్రీపాద తీర్థమును తీసుకోవటము ఎట్టి పరిస్తితులలోను మరువరాదు.
  36. మీ అంచనాలకు మించి భాగవతుల స్థాయికి ఎదగ వద్దు.
  37. నాస్తికుడిని పొరపాటున తాకినా వేంటనే భాగవతుల శ్రీపాద తీర్థముతో పవిత్ర స్నానము చేయాలి.
  38. ఙ్ఞాన, వైరాగ్య, భక్తి సంపన్నులు ఈ దేహమును ఒక వస్త్రముగా భావిస్తారు. అలాంటి వారికి కైంకర్యము చేయండి.
  39. వారి జన్మనిరూపణ చేయకుండా మీరు కైంకర్యము చేసి తరించటము కోసము వచ్చిన పవిత్రులుగా భావించండి.
  40. నాస్తికుల గృహములలో భగవంతుడి శ్రీపాద తీర్థము అయినా తీసుకోరాదు.
  41. నాస్తికుల గృహములలో భగవంతుడి విగ్రహాలకు పూజ చేయ రాదు.
  42. పవిత్ర స్థలములలో నాస్తికులున్నా భగవత్ప్రసాదము తీసుకోవచ్చు.
  43. శ్రీవైష్ణవులు భగవత్ప్రసాదము ఇచ్చినప్పుడు, ఉపవాస దినము అని నిరాకరించరాదు.
  44. భగవంతుడికి సమర్పించే ప్రసాదముల పవిత్రత కంటే దానిని స్వీకరించిన భగవంతుడు పరమ పవిత్రుడని తెలుసుకోవాలి.
  45. శ్రీవైష్ణవుల ముందు ఆత్మస్తుతి చేసుకోరాదు.
  46. ఇతరులను చిన్నబుచ్చ రాదు.
  47. ప్రతి క్షణము భగవత్, భాగవత కైంకర్యములో గడపాలి.
  48. రోజులో కొంతభాగము , కనీసము ఒక గంట అయినా ఆచార్య సూక్తులను చేప్పుకోవాలి.
  49. రోజూ ఆళ్వార్ల, ఆచార్యుల రచనలను చదవాలి.
  50. స్వార్థపరుల గొష్ఠిలో చేర రాదు.
  51. కపట శ్రీవైష్ణవ వేషధారుల గొష్ఠిలో చేర రాదు.
  52. పుకారులను, అపవాదులను మాట్లాడటము, ప్రచారము చేయటము చేయరాదు.
  53. ఇతర మతవాదులతో చేరి ,వాదించి పాపము పెంచుకోకుండా శ్రీవైష్ణవుల గొష్ఠిలో చేరండి.
  54. భగవత్, భాగవత దూషణ చేసేవారు లౌకికముగా ఎంత పెద్దవారైనా వారి వైపు చూపు తిప్పకండి.
  55. సత్యమును విశ్వసించే విషయములో ద్వైదీభావము గల మేధావులతో చేరకండి.
  56. మోక్షమునకు ప్రపత్తి కాక ఇతర మార్గాలను అవలంభించే వారితో చేరకండి.
  57. తత్వ త్రయము, మంత్ర త్రయములను విశ్వసించని వారితో చేరకండి.
  58. ఐశ్వర్యము, లౌకిక సుఖముల వెంట పరుగులు తీసేవారికి దూరముగా వుండండి. కలిగినంతలో భగవంతుడికి సమర్పించి సంతోషముగా జీవనము సాగించండి.
  59. శ్రీవైష్ణవులెవరైనా మీకు అపకారము చేసినా, అనాదరణ చేసినా, వారికి అపకారము చేయ తలపెట్టరాదు. ఆత్మ నిగ్రహము కలిగి వుండాలి.
  60. పరమపదములో చోటు కోరుకుంటే, శ్రీవైష్ణవుల నుండి లబ్ది పొందకండి.
  61. భగవతుడిని ప్రపత్తి చేసిన వారు, విధి, విధానములకు భంగము రాకుండా భాగవతులతో నడచుకుంటారు.
  62. భగవతుడికి సమర్పించే గంధము, పుష్పములు, తమలపాకులు, వస్త్రము, నీరు రుచి, వాసన చూడరాదు.
  63. భగవంతుడికి సమర్పించే ప్రసాదముల పవిత్రత కంటే దానిని స్వీకరించేవాడు పరమ పవిత్రుడని తెలుసుకోవాలి.
  64. ప్రసాదములు ఉత్తమ జన్మ, పవిత్ర జీవనము ఉన్న వారు తయారు చేస్తేనే తీసుకోవాలి.
  65. కంటికింపైన వన్నీ భగవతుడికి సమర్పించ రాదు.
  66. భగవతుడికి సమర్పించ తగిన పదార్థములుగా మన గ్రంధములలో పేర్కొనిన వాటిని మాత్రమే సమర్పించాలి.
  67. భగవతుడికి సమర్పించి ఆయన కటాక్షించిన, పదార్థములను స్వీకరించండి . కాని వాటీని భోగ వస్తువులుగా చూడ రాదు.
  68. శాస్త్రములలో తెలిపిన విధముగా కైంకర్యము చేయాలి.
  69. మంత్ర త్రయమును ధ్యానము చేయు విషయములో శ్రధ్ధ గౌరవము లేని వారికి, లౌకిక విషయములో శ్రధ్ధ గౌరవము అమితముగా కల వారికి ఆత్మహాని నిశ్చయము.
  70. భాగవత కైంకర్యము జీవిత లక్ష్యము కావాలి. వారికి అసంతృప్తి కలిగితే అది ఆత్మహాని హేతువవుతుంది.
  71. ఎవరైతే భగవతుడిని కేవలము రాతి విగ్రహముగాను, అచార్యులను సామాన్యునిగాను, సకల పాపాలను పోగొట్టే పవిత్ర జలములను సాధారణ నీరుగాను, పవిత్ర మంత్రములు కేవల శబ్దములనుగాను, భగవంతుడు ఎవరి కంటే గొప్పవాడు కాడని భావించే వాడు నరకములో ఉండే వాడని గుర్తించాలి.
  72. భగవంతుడే తానుగా కోరి ఒకరిచే పూజ చేయించుకుంటే వారు ఎంతో గొప్పవారు, సమర్దులు. వారి పట్ల అమర్యాదగా నడచుకోవడము గొప్ప పాపము. పర్యవసానము చాలా తీవ్రముగా వుంటుంది. అది భగవంతుడిని అవమాన పరచడమే అవుతుంది. వారి శ్రీపాద తీర్థము, భగవంతుడి శ్రీపాద తీర్థము కన్నా పవిత్రమైనది. ఆ విషయము మనసు నందు నిలుపుకొని సదా భాగవత సేవలో నిమగ్నమై వుండాలి.

ఆధారము: వైణవన్ కురల్

తెలుగు సేత చక్రవర్తుల చూడామణి

English translation Courtesy: vaiNavan kural magazine.

archived in https://srivaishnavagranthamstelugu.wordpress.com

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://srivaishnavagranthams.wordpress.com
pramAthA (preceptors) – http://guruparamparai.wordpress.com
srIvaishNava education/kids portal – http://pillai.koyil.org