Category Archives: anthimOpAya nishtai

అంతిమోపాయ నిష్ఠ – 18

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవర మునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః

ముగింపు – ఆచార్య నిష్ఠ మహిమలు

మునుపటి వ్యాసములో (https://srivaishnavagranthamstelugu.wordpress.com/2022/09/27/anthimopaya-nishtai-17/), మనము ఎంపెరుమాన్, పిరాట్టి, ఆళ్వార్లు, ఆచార్యుల మాటలలో శ్రీవైష్ణవుల మహిమలను గమనించితిమి. సీతా పిరాట్టి, మాముణులు తమను బాధించిన వారిపై ఎనలేని దయను చూపుటను గమనించితిమి. ఇప్పుడు, మనము ఈ దివ్య గ్రంధము యొక్క ముగింపు భాగమును దర్శించెదము.

ఈ విధముగా, “స్తావరాణ్యాపి ముచ్యంతే” (వైష్ణవ స్పర్శచే మొక్కలు కూడ ముక్తి పొందును), “పశుర్ మనుష్యః పక్షివా (జంతువులు, మనుష్యులు, పక్షులు అన్నియును వైష్ణవ సంబంధముచే ముక్తి నొందును) అని తెలిపిన ప్రకారము, ఈ జగత్తునంతయు ఉద్ధరించు మిక్కిలి దయా స్వరూపులైన తమ ఆచార్యులను మన పూర్వాచార్యులు శరణు చేసిరి. మన పూర్వాచార్యులు సర్వఙ్జులు, పండితులలో వారు అగ్రగణ్యులు, విషయ సారాంశమునకు, అన్య ఇతర విషయముల మధ్య గల అంతరమును గుర్తించ గలవారు, తమ అన్ని బాధ్యతలను పూర్తి చేసిన వారు (సదాచార్యుల ఆశ్రయమును పొందినవారు), సదా మంగళాశాసనముపై దృష్టి కలవారు (భగవత్ భాగవతుల శ్రేయస్సుకై ప్రార్ధించుట). ఆండాళ్ నాచ్చియార్ తిరుమొళిలో “నానుమ్ పిఱన్దమై పొయ్యన్ఱే” అని తెలిపిన విధముగా (నాచ్చియార్ తిరుమొళి 10.4 – ఎంపెరుమాన్ వచ్చి నాకు దర్శనమివ్వనిచో, నేను పెరియాళ్వార్ పుత్రికనగుట వ్యర్థము), “వల్లపరిశు వరువిప్పరేల్ అదు కాణ్డుమే (నాచ్చియార్ తిరుమొళి 10.10 – ఎంపెరుమాన్ వచ్చునట్లు పెరియాళ్వార్ చేసిన, నేను వారిని దర్శించెదను), సదా ఎంపెరుమాన్ ను కీర్తించు శ్రీవైష్ణవులను ఆశ్రయించు సుగమమైన మార్గమును వారు అభ్యసించిరి. తదుపరి, నిస్సంశయమైన సంపూర్ణ జ్ఞానముతో, అట్టి ఆచార్యులే ఆరాధనకు / సేవకు అర్హులని, వారికి బరువు బాధ్యతలు ఉండవని, మండు వేసవిలో కూడ చల్లని గాలిలో విశ్రమించు వంటి వారని, వారిపై దృష్టి నిలిపెదరు. వారు అంతిమ లక్ష్యముపై ఆందోళనను వీడి “శిర్ట్రవేణ్డా” (తిరువాయ్మొళి 9.1.7 – ఆందోళన లేకుండుట), గురుపరంపరను పాటిస్తూ తేవు మత్తఱియేన్ (కణ్ణినుణ్ శిఱుత్తాంబు 2 – నేను నమ్మాళ్వార్ ను తప్ప అన్య దైవము నెఱుంగను). ఇట్టి ఉదాతమైన గుణములను క్రింద గమనించగలము:

  • పెరియాళ్వార్ల దివ్య సుపుత్రి ఆండాళ్ తన తండ్రి / ఆచార్యుని పై

  • నమ్మాళ్వార్ల పాద పద్మముల యందు మధురకవి ఆళ్వార్

  • నాధమునుల పాద పద్మముల యందు కురుగై కావలప్పన్

  • ఆళవందార్ పాద పద్మముల యందు దెయ్వవారియాండన్

  • ఎంపెరుమానార్ పాద పద్మముల యందు వడుగ నంబి

  • నంపిళ్ళై పాదపద్మములపై పిన్భళగియ పెరుమాళ్ జీయర్

శ్రీరంగములో నంపిళ్ళై పాదపద్మముల యందు పిన్భళగియ పెరుమాళ్ జీయర్
  • వడక్కు తిరువీధి పిళ్ళై, పిళ్ళై లోకాచార్యుల పాద పద్మముల యందు కూరకులోత్తమ దాసర్

  • తిరువాయ్మొళి పిళ్ళై, మణల్పాక్కత్తు నంబి పాద పద్మములపై మన జీయర్ (మాముణులు)

శ్రీరామానుజ (ఆళ్వార్ తిరునగరి), తిరువాయ్ మొళి పిళ్ళై (కొంతగై), మాముణులు (ఆళ్వార్ తిరునగరి)

ఇట్టి ఉదాత్త మనస్కులు ఇంకను అనేకులు మన పూర్వాచార్యులను ఆశ్రయించిరని గమనించగలము.

గొప్ప ఆచార్య నిష్ఠ గల ఇట్టి పెక్కు శ్రీవైష్ణవులు మన జీయర్ (మాముణులు) పాద పద్మముల వద్ద నున్నారు. నేటికి (పరవస్తు పట్టర్ పిరాన్ జీయర్ గారి కాలము), పరిపూర్ణ యోగ్యులైన ఆచార్య, శిష్య సంబంధము ఉన్నచోట దీనిని మనము గమనించవచ్చును. భవిష్యత్తులో కూడ, ఎక్కడ రామానుజ సిద్ధాంతము వికసించునో, అచ్చట సదా యోగ్యులను చూడగలము. దీనినే “కలియుమ్ కెడుమ్ కాండు కొణ్మిన్” (కలియుగములోని దుష్పరిణామములు నశించును) లో తెలిపిరి. అట్టి యోగ్యులైన వారు యధాలాపముగా మాటలాడినాను, అవి మిక్కిలి పవిత్రమగును. వారి దివ్య వాక్కులు వేదాంత సారమైన తిరుమంత్రార్ధమును బోధించును.

వేద శాస్త్రారూఢాః జ్ఞానఖడ్గతరాద్విజాః
క్రీడార్ధమపి యద్ బ్రూయుస్స దర్మః పరమో మతః

సాధారణ అనువాదము: వేద గ్రంథములలోని సూత్రముల యందు నమ్మకము కలవారు, ఆ జ్ఞానమునందించు ద్విజులైన వారు, మాటవరసకు పలికినను, అది న్యాయము మరియు మహత్తును పొందును.

అదిగంతవ్యాస్సన్తో యద్యపి కుర్వంతి నైకముపదేశమ్
యస్తేశామ్ స్వైరకతాస్తా ఏవ భవంతి శాస్త్రార్ధాః

సాధారణ అనువాదము : ఉదాత్త పురుషుల బోధనలే కాక, వారి చర్యలను కూడ నిశితముగా పరిశీలించ వలెను. (కారణము) ఆ గ్రంథముల యధార్ధ తాత్పర్యమే వారి వ్యక్తిగత క్రమ శిక్షణకు రూపమగును.

జ్ఞాన సారము 40

అల్లి మలర్ పావైకు అన్బర్ అడిక్కు అన్బర్
సొల్లుమ్ అవిడు సురుదియాం
నల్ల పడియామ్ మను నూఱ్కవర్ సరిదై
పార్వై శెడియార్ వినై తొగైక్కుత్ తీ

సాధారణ అనువాదము : శ్రీయః పతి పాద పద్మములను ఎవరు ఆశ్రయించెదరో, వారి మాటలు వేదముతో సమానము, మను స్మృతికి వారి జీవితము మూలాధారము, వారి దృష్టే సర్వ పాపహరణము.

తదుక్తి మంత్రం మంత్రాగ్ర్యము

సాధారణ అనువాదము : వారి మాటలే ఉత్తమ మంత్రములు

అట్టి భక్తులు పొరపాటున కూడ వ్యర్థమైన మాటలు పలుకరని ప్రతీతి, వారి దివ్య పలుకులు వేదసారమైన తిరుమంత్రార్ధమును ప్రతిబింబించును.

అన్ని ప్రమాణముల ముఖ్య సూత్రములు తిరుమంత్రములో కలవని, దానిని తెలుసుకొనవలెనని, ఈ క్రింది శ్లోకములో తెలిపిరి.

రుచో యజుంషి సామాని తతైవతర్వణాని చ
సర్వమష్టాక్షరాన్తస్తమ్ యచ్చాన్యదపి వాజ్ఞమయం

సాధారణ అనువాదము: ఈ అష్టాక్షరీ మంత్రములో ఋగ్, యజుర్, సామ, అధర్వణ వేదముల, వేదాంతము, ఇతిహాసములు, పురాణములు, స్మృతులు, మొ || వానిలోని అర్ధములు ఇమిడి వున్నవి.

ఇట్టి మహిమాన్వితమైన తిరుమంత్రము 3 ప్రధాన లక్షణములను 3 పదముల ద్వారా వివరించుచున్నది – ఓం (శేషత్వము – శిష్యత్వము), నమః (పరాంతరీయము – పరిపూర్ణ ఆశ్రయము), నారాయణాయ (కైంకర్యము – భగవానుని మాత్రమే పరవశింపజేయు నిరంతర సేవ). ఈ సూత్రములు భగవానునికి పాక్షికముగాను మరియు భాగవతులకు సంపూర్ణముగాను వర్తించును. ఈ కారణముచే, మన పూర్వాచార్యులు, ప్రధాన సూత్రముల సారమును సంగ్రహించి, వానిని సంస్కృత, ద్రావిడ, మణిప్రవాళ భాషలలో సమముగా (ఏకగ్రీవముగా) వివరించిరి. ఒక శిష్యుడు నిరంతర సాధన చేయుచు ఆచార్య అభిమానమే (ఆచార్యుని దయ / ఆదరణ) అంతిమ నిష్ఠగా కలిగి ఉండవలెను. ఆచార్యుని తన గురువుగాను, శరణ్యుడుగాను ఆనంద హేతువుగాను, అన్ని విధముల బాంధవ్యమును కలిగి ఉండునటుల భావించవలెను.
ఆళవందార్ స్తోత్రరత్నము – 5 – మాతా పితా యువతయాః – మనకు నమ్మాళ్వారే తల్లి, తండ్రి, పత్ని, సంతానము మొ || కణ్ణినుణ్ శిఱుత్తాంబు – 4 : అన్నైయామ్, అత్తనాయ్ – నమ్మాళ్వారే నాకు తల్లి, తండ్రి. మాముణుల ఆర్తి ప్రబంధము – 3: తందై నఱ్ఱాయ్ తారం తనయర్ పెరున్జెల్వం ఎన్ఱనక్కు నీయే యతిరాజా – ఓ యతిరాజా నీవే నాకు తండ్రివి, తల్లివి, పత్నివి, సంపదవు మొ || నవి

  • కణ్ణినుణ్ శిరుఱ్ఱాంబు 1: త్తెన్గురు గూర్, నంబి యెన్ఱక్కాల్, అణ్ణిక్కుం అముదూఱుం, ఎన్నావుక్కే – మధురకవి ఆళ్వార్లు నమ్మాళ్వార్ల దివ్య నామములను పలికినంతనే నా నాలుకపై అమృతమైన రుచి కలుగును.
  • కణ్ణినుణ్ శిరుఱ్ఱాంబు  2 – నావినాల్ నవిత్తు, ఇన్బమెయ్ దినేన్ – నమ్మాళ్వార్ల నామమును / కీర్తిని పలికినంతనే, నేను అత్యంత పరవశత్వమును పొందుదును.
  • రామానుజ నూఱ్ఱందాది 102 – ఎన్నా విరున్దెమ్ ఇరామానుశన్ ఎన్ఱజైక్కుమ్ – నీతో నాకు గల నిర్హేతుకమైన దివ్య బాంధవ్యమును, నీ దివ్య నామములను నా నాలుక సదా ఉచ్ఛరించును.
  • రామానుజ నూఱ్ఱందాది 1 – ఇరామానుశన్ చరణారవిందం నామ్ మన్ని వళ నెన్జే శొల్లువోమ్ అవన్ నామఙ్గ్ ళే – ప్రియ మనసా! శ్రీరామానుజుని పాదపద్మముల వద్ద జీవితాంతము కొనసాగుటకై, వారి అనేక దివ్య నామములను పారాయణము చేయుదుము.
  • రామానుజ నూఱ్ఱందాది తనియన్ – ఉన్నామ మెల్లామ్ ఎన్ఱన్ నావినుళ్ళే అల్లుమ్ పకలు మమరుమ్పడి నల్ కు అఱుశమయ వెల్లుమ్ పరమ ఇరామానుశ – ఓ రామానుజ, అప్రమాణమైన ఆరు మతాలను ఖండించి, గెలుపు నొంది మరియు వేదాంత సూత్రములను నెలకొల్పితివి! నీ దివ్య నామములు నా నాలుకపై సదా ఉండున్నట్లు చేయుట కూడ నీదే బాధ్యత.
  • గురోవార్తశ్చ కథయేత్ – గురోర్నామ శబ్ధ జపేత్ – సదా ఆచార్యుని మాటలను / ఆదేశములను గురించి చర్చించుము, ఆచార్యుని నామములను సదా జపించుము.

సరియైన ఆచార్యునితో కల అట్టి బాంధవ్యముచే, శిష్యుడు ఈ క్రింది తీరునవలంబించ వలెను:

  • ఆచార్యునితో ప్రధమముగా చేసిన శరణాగతిపై నిరంతర ధ్యానము మరియు “నమః” అను మంత్రము కలిగి ఉండవలెను (అనువాదకుని గమనిక: జపతవ్యం గురు పరంపరాయుమ్ ధ్వయముమ్ అని పిళ్ళై లోకాచార్యులు తెలిపిరి – ఇక్కడ ద్వయ మంత్రము కన్నా ముందు ప్రధాన మంత్రముగా అస్మద్ గురుభ్యోనమః…. శ్రీధరాయనమః : అని పఠించ వలెను)
  • ఆచార్యుని పరమ దైవముగా భావించాలని ఈ క్రింద తెలిపిరి: 
      • గురేవ పరమ బ్రహ్మ – గురువే పరమ దైవము
      • జ్ఞాన సారం 38 – తేనార్కమలత్ తిరుమామగళ్కొళునన్ తానే గురువాగి – శ్రీయఃపతియే స్వయముగా తానే ఆచార్యుడగును
      • యస్య సాక్షాత్ భగవతి జ్ఞానాధిపప్రధే గురౌ – జ్ఞానజ్యోతి ద్వారా తన శిష్యునికి వికాసము కల్పించు ఆచార్యుని భగవానునిగా భావించాలి.
      • పితాగవాడైప్పిరానార్ బిరమగురువాయ్ వందు – ప్రధమ గురువుగా వచ్చిన భగవానుడు.
  • ఆచార్యుని గృహమే అంతిమ నివాసముగా – పరమపదముగా భావించవలెను. దీనినే ఈ క్రింద పేర్కొనిరి
      • యేనైవ గురుణా యస్య న్యాసవిద్యా ప్రధీయతే; తస్య వైకుంఠదుగ్ధాబ్ది ద్వారకాశ సర్వ ఏవ స: తమ శిష్యునకు శరణాగతి అను జ్ఞానమును ప్రసాదించిన ఆచార్యుడు ఎక్కడ నివసించునో, అదియే అతనికి శ్రీవైకుంఠము, క్షీరాబ్ది మరియు భగవానుని అన్ని నివాసములు.
      • జ్ఞానసారము 36 – విల్లార్మణి కొళిక్కుం వేంగడ పొఱ్కున్ఱు ముదల్ సొల్లార్పొళిల్సూళ్తిరుప్పడి గళ్ ఎల్లాం మరుళాం ఇరుళోడ మతగతు త్తనాళ్ అరుళాలే వైత్త అవర్ – అపారమైన కరుణచే ఆచార్యుడు తన శిష్యుని అజ్ఞానమును తొలగించిన కారణముగా, నిజమైన శిష్యునికి, తన ఆచార్యునిలోనే భగవానుని అన్ని నివాసములు, తిరువేంగడము మొదలుకొని (పరమపదము, క్షీరాబ్ది మొ ||) దర్శించవలెను.
      • కణ్ణినుణ్ శిరుత్తాంబు 11 – నమ్బువార్ పది వైగున్ధమ్ కాణ్మినే – మధురకవి ఆళ్వార్ దివ్య పలుకులను విశ్వసించిన వారికి, వారు ఉన్న నివాసమే వైకుంఠము.
  • ఆచార్యుని పాదపద్మములే మూలాధారము, ఎంపెరుమానార్ ను కీర్తిస్తూ, యోనిత్య మచ్యుత… రామానుజ చరణం శరణం ప్రపద్యే శ్లోకములో తెలిపిరి – రామానుజుని పాదపద్మములే మనకు సదా శరణ్యము.
      • రామానుజ నూఱ్ఱందాది 45 – ‘పేఱొన్ఱు మత్తిల్లై నిన్ శరణన్ఱి, అప్పేఱళిత్తఱ్కు
        ఆఱొన్ఱుమిల్లై మత్ చరణన్ఱి’ – అముదనార్ ఎంపెరుమాన్ ను స్మరిస్తూ – నా జీవిత ధ్యేయము నీ శ్రీచరణాలను సేవించుట మరియు దానిని సాధించుటకు కూడ నీ శ్రీచరణములే మార్గము అనిరి.
      • ఉపాయ ఉపేయ భావేన తమేవ శరణం వ్రజేత్ – ఆచార్యుని పాదపద్మములనే ఉపాయముగా మరియు ఉపేయముగా / లక్ష్యముగా శరణాగతి చేయుట.
  • మనసా వాచా కర్మణా వారి సేవ చేయుట అంతిమ లక్ష్యముగా తెలిపిరి.
      • సుందర బాహు స్తవము 129 – రామానుజార్య వాచక : పరివర్తిష్య – శ్రీరంగములో తమ ఆచార్యుని సేవించుటకై, వారితో తమను తిరిగి కలుపుమని సుందరబాహు పెరుమాళ్ ను అభ్యర్థించిన ఆళ్వాన్
      • యతిరాజ వింశతి 4 – నిత్యం యతీంద్ర తవ దివ్యవపు స్మృతౌ మే, సక్తం మనో భవతు వాక్ గుణ కీర్తనేసౌ, కృత్యం చ దాస్య కరణే తు కరద్వయస్య, వృత్త్యంతరేస్తు విముఖం కరణత్రయం చ – శ్రీరామానుజునితో మామునిగళ్ – ఓ యతీంద్రా! నా మనస్సు నీ దివ్య రూపాన్ని స్మరించుటలో ఆసక్తమై ఉండుగాక! నా వాక్కు నీ కల్యాణ గుణములను పాడటములో లగ్నమై ఉండుగాక: నా కరములు నీ కైంకర్యము చేయు గాక: ఈ మూడును ఇతర ప్రవృత్తులు లేనివగును గాక.
      • శ్రీవచన భూషణము 299 – శక్తిక్కిలక్కు ఆచార్య కైంకర్యము – ఆచార్యునికి చేయు కైంకర్యము పైననే శిష్యుడు తన శక్తి సామర్ధ్యములను నిలిపి / వినియోగించవలెను.
  • శిష్యుని కైంకర్యమును చూసిన ఆచార్యునికి కలిగిన సంతోషమే అతిపెద్ద ఫలితముగా పేర్కొనిరి: 
      • శ్రీవచనభూషణము 321 – శిష్యనెన్బత్తు సాధ్యాంతర నివృత్తియుమ్ ఫల సాధన శుశ్రూషైయుమ్ – ఆచార్యుడే అంతిమ ధ్యేయముగా మరియు ఆచార్యుని సదా ఆనందపరచు సేవయే నిజమైన శిష్యుని లక్షణముగా భావించవలెను. అట్టి అధికారులు (యోగ్యలైన శిష్యులు) ఆచార్య నిష్ఠలో నిమగ్నులై, అన్ని విషయ సుఖములు మరియు భౌతిక వాంఛలు విసర్జించవలెను. వారు ఆచార్యుని పవిత్రమైన దివ్య స్వరూపమును అనుభవింపవలెను. ” సదా పశ్యంతి… ” అను శ్లోకములో చెప్పిన విధముగా – పరమపదములో భగవానుని నిత్య దర్శనముచే జీవాత్మలు ఆనందమును అనుభవించెదరు.

ఇంకను, ” అత్ర పరత్ర చాపి ” (స్తోత్రరత్నము 2) లో తెలిపిన విధముగా, వారు తమ ఆచార్యునికి ఈ జగత్తులోను మరియు పరమపదములోను కైంకర్యము చేయుచు, పరమపదము (అపరిమిత ఆనందమునకు నెలవు) లో ఏకమనస్కులతో కలసి, అమృతతుల్యమైన ఆనంద సాగరములో మునిగి మరియు సదా మంగళాశాసనము చేయుచుందురు.

నాధముని – ఆళవందార్, కాట్టు మన్నార్ కోవెల

ఈ క్రింది దివ్య శ్రీసూక్తులను మనము అంతిమోపాయ నిష్ఠ కు ప్రమాణముగా (ప్రబల ఋజువు) సదా స్మరించగలము.

  • రామానుజ నూత్తందాది 104 – కైయిల్ కనియెన్న కణ్ణనైక్కాట్టిత్తరిలుమ్ ఉన్ తన్ మెయ్యిల్ పిఱఙియ శీరన్ఱి వేణ్డిలన్ యాన్ – నాకు మీరు కణ్ణన్ ఎంపెరుమాన్ ను (అతను సొగసుకు మరియు భక్తులకు అందుబాటులో నుండుటకు ప్రతీక) దర్శింపజేసినను, నేను మీ దివ్య తిరుమేనిని, దాని లక్షణములపై మాత్రమే దృష్టి సారించి తదితరములను విస్మరించెదను.
  • కణ్ణినుణ్ శిరుత్తాంబు 2 – నావినాల్ నవిత్తు ఇన్బ మెయ్ దినేన్ – నమ్మాళ్వార్ల మహిమలను కీర్తించి ధన్యుడనైతిని
  • నాచ్చియార్ తిరుమొళి 10.10 – నల్ల ఎన్ తోళి…. విట్టు శిత్తర్ తఙ్గళ్ తేవరై వల్లపరిశు వరువిప్పరేల్ అదు కాణ్డుమే – ఆండాళ్ పలికిరి – పెరియాళ్వార్ కణ్ణన్ ను ఆహ్వానించి, వారు దర్శనమిచ్చునట్లు చెసినచో, నేను వారిని అప్పుడు దర్శించెదను.
  • ఈ సూత్రమును పరమాచార్యులు ఆళవందార్లు నమ్మాళ్వార్లపై “మాతా పితా యువ తయా” అను శ్లోకములో వివరించిరి. నమ్మాళ్వార్ ను వైష్ణవ కులపతి (వైష్ణవులకు నాయకుడు) గా నిరూపించి, తన సర్వస్వము నమ్మాళ్వారే నని.
  • పశుర్ మానుష్య పక్షివ అను శ్లోకములో – ఒక జంతువు, మనిషి, పక్షి – పుట్టకతో సంబంధము లేకుండా (అట్టి యోగ్యత, జ్ఞాన సముపార్జనకు, శాస్త్రము లేక తత్సమానములను అభ్యసించుటకు అవసరమా), వైష్ణవునితో సంబంధము సులువుగా పరమపదమునకు చేరువ చేయును.
  • బాల మూగ జాత అంధశ్చ శ్లోకములో – బాలుడు, చెవిటి, మూగ, అంధుడు, మూర్ఖుడు, మొ || ఒక నిజమైన ఆచార్యుని శరణు పొందినచో, వారు తమ అంతిమ గమ్యమైన పరమపదమును తప్పక జేరగలరు.
  • ఆచార్యస్య ప్రసాదేనా మమ సర్వమభీష్టదం; ప్రపుణ్యామితి విశ్వాసో యస్యస్తి స సుఖీభవేత్ –
    తమ అపార కోరికలు ఆచార్యుని కరుణచే నెరవేరునని విశ్వాసము / నమ్మకము గల వారు ఆనందముగా నుందురు.
  • మాణిక్కమాలై నందు పెరియ వాచ్చన్ పిళ్ళై యొక్క దివ్య పలుకులు – ఇహ లోక పరలోకంగల్ ఇరణ్డుమ్ ఆచార్యన్ తిరువడిగళే ఎన్ఱుమ్, దృష్టా దృష్టంగళిరణ్డుమ్ అవనే ఎన్ఱుమ్ విశ్వసిత్తిరుక్కిఱతుక్కు మేలిల్లై – పరమపదము మరియు ఈ జగత్తులోనిదేదైనను ఆచార్యుని శ్రీచరణముల కన్నను అధికము కానేరదు మరియు ప్రత్యక్ష మరియు అగోచరమైన ప్రయోజనములు ఆచార్య స్వరూపములే.
  • శ్రీవచనభూషణము 322 లోని పిళ్ళై లోకాచార్యుల దివ్య శ్రీసూక్తి – మంత్రముమ్, దేవతైయుమ్, ఫలముమ్, ఫలానుబన్ధికళుమ్, ఫలసాధనముమ్, ఐహికభోగముమ్, ఎల్లాం ఆచార్యేనెన్ఱు నిన్నైక్కక్ కడవన్ – ఒక శిష్యుడు తన ఆచార్యునే మంత్రముగా తలంచి – అది వల్లించుటచే తన సంసారములోని బాధలు తొలగునని భావించవలెను.
      • పరదేవత – భగవాన్ – ఆ మంత్రము యొక్క లక్ష్యము
      • ఫలము – కైంకర్య రూపముగా ఫలితమును ఇచ్చి దీవించిన భగవానుడు
      • ఫలానుభూతి – సంపూర్ణ ఆత్మజ్ఞానము మరియు పరమపద నివాసము వంటి అనుబంధ ప్రయోజనములు కలుగుట
      • ఫల సాధనము – ప్రయోజనములు నెరవేరుటకు తోడ్పడు సాధనములు
      • ఐహిక భోగము – పరమపదమును జేరుటకు ముందు ఈ జగత్తులో ఇంకను ఇతర ఇంద్రియ సుఖములు అనుభవించ వలెనను కోరిక.

పిళ్ళై లోకాచార్యులు, మాముణులు, పరవస్తు పట్టర్ పిరాన్ జీయర్

శ్రీసౌమ్యజామాతృమునేః ప్రసాదప్బావ సాక్షాత్కృత సర్వతత్వమ్
అజ్ఞానతామిశ్ర సహస్రభానుమ్ శ్రీ భట్టనాధమ్ మునిమాశ్రయామి

సాధారణ అనువాదము: నేను శ్రీభట్టనాధ మునిని శరణాగతి చేసెదను, వారు శ్రీసౌమ్యజామాతృ ముని దయచే యధార్ధములను వీక్షించిరి. వారు అజ్ఞానాంధకారమును రూపుమాపు సహస్ర కిరణముల ఆదిత్యుని వంటి వారు.

ఈ విధముగా పరవస్తు పట్టర్ పిరాన్ జీయర్ రచించిన అంతిమోపాయనిష్ఠ ముగిసెను.

అనువాదకుని గమనిక: ఈ చివరి భాగములో మనము ఆచార్య నిష్ఠ యొక్క అన్ని మహిమలను వీక్షించితిమి. కొన్ని సంస్కృత ప్రమాణములకు అనువాదము చేకూర్చిన శ్రీరంగనాధ స్వామికి కృతఙ్ఞతలు.

అన్ని భాగములను ఈ క్రింద వీక్షించగలరు: https://srivaishnavagranthamstelugu.wordpress.com/anthimopaya-nishtai/

అడియేన్ గోపీకృష్ణమాచార్యులు బొమ్మకంటి, రామానుజ దాసన్ .

మూలము: http://ponnadi.blogspot.com/2013/07/anthimopaya-nishtai18.html

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

అంతిమోపాయ నిష్ఠ – 17

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్ వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః

అంతిమోపాయ నిష్ఠ

మునుపటి వ్యాసములో, (https://srivaishnavagranthamstelugu.wordpress.com/2022/08/25/anthimopaya-nishtai-16/), మనము జన్మతో సంబంధము లేకుండా, శ్రీవైష్ణవుల కీర్తిని గమనించాము. తదుపరి, ఈ భాగములో, మనము భగవానునిచే, ఆళ్వార్లచే, ఆచార్యులచే శ్రీవైష్ణవులు కీర్తింపబడుటను మరియు దీనినే నిరూపించు మన పూర్వాచార్యుల జీవితములలోని కొన్ని సంఘటనలను గమనించెదము.

శ్రీవైష్ణవుల కీర్తిని అనేక సందర్భములలో స్వయముగా భగవానుడే కీర్తించిరి.

లోకే కేచన మద్భక్తాస్ సద్ధర్మామృతవర్షిణః
సమయంత్యగమత్యుగ్రం మేఘా ఇవ తవానలమ్

సాధారణ అనువాదము : వర్షపు మేఘములు ఏ విధముగా అగ్ని వేడిని అణచి వేయునో, అదే విధముగా రాబోయే ప్రమాదములను నా భక్తులు కొందరు దూరము చేయుదురు.

తన బాల్య మిత్రుడైన సుధాముని కృష్ణుడు కలిసెను

జ్ఞాని త్వాత్మైవ మే మతం

సాధారణ అనువాదము : నా పరిపూర్ణ భక్తుడైన జ్ఞాని నా ఆత్మ – ఇది నా అభిప్రాయము

ప్రియోహి జ్ఞానినోత్యర్ధం అహం స చ మమ

సాధారణ అనువాదము : నా భక్తుడైన జ్ఞానికి నా పై మిక్కిలి అనుబంధము – నాకు కూడ అతనిపై అంతే (యధార్ధమునకు ఇంకను అధికము) అనుబంధము కలదు.

మహాభారత యుద్ధములో అర్జునుని రధసారధిగా కృష్ణుడు

మమ ప్రాణా హి పాండవాః

సాధారణ అనువాదము : పాండవులు నా ప్రాణవాయువు వంటి వారు.

నిరపేక్షం మునిం శాంతం నిర్వైరం సమదర్శనం
అనువ్రజామ్యహం నిత్యం పూయేయేత్యన్గ్రిరేణుపిః

సాధారణ అనువాదము : యతులను నేను సదా అనుసరించి, వారి పాదపద్మముల ధూళిని స్వీకరించెదను, వారు స్వార్ధ ప్రయోజనములకు అతీతులుగా, శాంతియుతులుగా, విరోధ రహితులుగా, అందరి ఆత్మలయందు సమదృష్టి కలవారుగా వుందురు.

మాముణులను తమ ఆచార్యునిగా స్వీకరించిన శ్రీరంగనాధుడు – పెరియ జీయర్ పై తమ అత్యంత అనుబంధము / ఆదరణను వెల్లడించిరి

మమ మద్భక్తేషు ప్రీతిరభ్యధికా నృప
తస్మాన్ మత్ భక్తభక్తాశ్చ పూజనీయా విశేషతః

సాధారణ అనువాదము : నా భక్తులపై నా ప్రేమ అత్యంత గొప్పది, నా భక్తులు పూజింపబడి నప్పుడు అది ఇంకను ప్రత్యేకమైనది, నాకు ప్రియమైనది

కృష్ణుడు మరియు నమ్మాళ్వార్ – వీరిరువురి దివ్య ప్రేమానుబంధమును బహిర్గతము చేయుట

అన్నాధ్యమ్ పురతో న్యస్తమ్ దర్శనాత్ గృహ్యతే మయా
రసాన్ దాసస్య జిహ్వాయామస్నామి కమలోద్భవ

సాధారణ అనువాదము : ఓ కమలోధ్భవ (బ్రహ్మ – తామర పుష్పము నుంచి జన్మించిన) ముందుగా నాకొసగిన ప్రసాదమును దృష్టి ద్వారా స్వీకరించి, నా భక్తుల జిహ్వ ద్వారా నేను ఆస్వాదించెదను.

మద్భక్త జన వాత్సల్యమ్ పూజాయాంచ అనుమోదనమ్
స్వయమభ్యర్చనమ్ చైవ మదర్ధే డంబవర్జనమ్
మత్కధా శ్రవణే భక్తిసర్వనేత్రాంగ విక్రియా
మమానుస్మరణమ్ నిత్యమ్ యచ్చ మామ్ నోపజీవతి
భక్తిరష్ట విధా హ్యేషా యస్మిన్ మ్లేచ్చేపి వర్తతే
స విప్రేంద్రో మునిశ్రీమాన్ స యతిశ్శ చ పణ్డితః
తస్మై ధ్యేయమ్ తతో గ్రాహ్యమ్ స చ పూజ్యో యతా హ్యహమ్

సాధారణ అనువాదము : నా భక్తులకు ఈ క్రింది 8 లక్షణములు ముఖ్యముగా నుండును –

  • ఎంపెరుమాన్ భక్తులపై నిర్హేతుకమైన ప్రేమ
  • ఎంపెరుమాన్ ఆరాధనను (ఇతరుల) ఆస్వాదించుట
  • తాను స్వయముగా ఎంపెరుమాన్ ఆరాధన చేయుట
  • అహంకార రహితుడుగా నుండుట
  • ఎంపెరుమాన్ గురించిన విషయములను ఆసక్తిగా శ్రవణము చేయుట
  • ఎంపెరుమాన్ గురించి శ్రవణము / భావన / భాషణము చేయునపుడు శరీరము మార్పులకు లోనగుట ( ఒడలు పులకరించుట, మొ || )
  • సదా ఎంపెరుమాన్ నే తలంచుట
  • ఎంపెరుమాన్ ను ఆరాధించునపుడు భౌతిక ప్రయోజనములను ఆశించకుండుట.
    అట్టి భక్తులు, వారు మ్లేఛ్చులైనను, వారిని నాతో సమానముగా బ్రాహ్మణ పెద్దలు, మధ్యవర్తులు, కైంకర్యపరులు, యతులు, పండితులు ఆరాధించగలరు. వారు అట్టి పండితులకు జ్ఞానమును ఇచ్చుటకు మరియు స్వీకరించుటకు యోగ్యులు.

ఈ విధముగా, భగవానుడు తానే స్వయముగా తన భక్తుల గురించి వారు ఈ సర్వ జగత్తును శుద్ధి చేయు సమర్థులు, వారు నా ఆత్మ వంటివారు, వారు నాకు ప్రాణ వాయువు వంటి వారు, వారిని నేనే స్వయముగా అనుసరించెదను, వారి పాదపద్మముల ధూళిని కాంక్షించెదను, వారిని ఆదరించి / సేవించిన వారు నాకు మిక్కిలి ప్రీతి పాత్రులు, వారితో జరుపు వ్యవహారముల ద్వారా లభించు ఆహారమును నేను ఆస్వాదించెదను, వారు మ్లెచ్చులుగా జన్మించినను, నాతో సమానముగా ఆరాధ్యయోగ్యులు అని ప్రకటించిరి.

భూమి పిరాట్టి (భూదేవి తాయారు) తమ అంతిమ లక్ష్యముగా మహా భాగవతులను దర్శించుట, స్పృశించుట, వారితో ముచ్చటించుట అని ప్రకటించిరి; వారి యొక్క దివ్య మంగళకరమైన లక్షణములను వర్ణించుటకు తాను అశక్తురాలనని, వారి మహిమలను పూర్తిగా వివరింపజాలనని తెలిపెను. దీనినే ఈ క్రింది శ్లోకములలో వివరించిరి :

అక్ష్ణోః ఫలమ్ తాద్రుసదర్శనమ్ హి తన్వాః ఫలమ్ తాద్రుసగాత్రసంగమ్
జిహ్వాఫలమ్ తాద్రుసకీర్తనంచ సుధుర్లబా భాగవతా హి లోకే

సాధారణ అనువాదము : నేత్రముల లక్ష్యము గొప్ప భాగవతుల దర్శనము; మన శరీర లక్షణము గొప్ప భాగవతుల యొక్క స్పర్శనము; మన నాలుక లక్షణము గొప్ప భాగవతులను కీర్తించుట; ఈ జగత్తులో అట్టి భాగవతులు అరుదుగా లభించెదరు.

నాహమ్ సమర్ధో భగవత్ ప్రియాణామ్ వక్తుమ్ గుణాన్ పద్మ భువోప్యగణ్యాన్
భవత్రభావమ్ భగవాన్ హి వేత్తి తధా భవన్తో భగవత్ ప్రభావమ్

సాధారణ అనువాదము : భగవానుని భక్తిలో లీనమైన అట్టి భాగవతుల ఔన్నత్యమును గురించి వచించుటకు నేనర్హుడను. ఆ పరమాత్మకే వారి ఔన్నత్యము తెలియును, వారికి మాత్రమే ‘అతని’ ఔన్నత్యము తెలియును.

ఆళ్వార్లు కూడ భాగవతులను కీర్తించిరి, యమ భటులకు (యమధర్మ రాజుగారి సేవకులు) వారిపై నియంత్రణ లేదని గుర్తించిరి.

యమభటుల హస్తములనుంచి అజామిళుని విష్ణుదూతలు కాపాడిరి

తిరుమళిశై ఆళ్వార్ – నాన్ముగన్ తిరువందాది 68

తిఱమ్బేన్మిన్ కణ్డీర్
తిరువడి తన్నామమ్ మఱన్దుమ్ పుఱన్దోళా మాన్దర్
ఇఱైఞ్జియుమ్ శాదువరాయ్ ప్పోదుమిన్గళెన్ఱాన్
నమనుంతన్ తూదువరై క్కూవిచ్చెవిక్కు

సాధారణ అనువాదము : యముడు తమ దూతలతో “ఈ ఆదేశమును విస్మరించరాదు. భగవానుని నామములను కూడ మరచినను అన్య దేవతారాధనను చేయని శ్రీవైష్ణవులను మీరు ఆరాధించుడు, వారిని మిక్కిలి ఆదరించుడు, శుద్ధి పొందుడు” అని పలికిరి. (అనువాదకుని గమనిక: దీనికి విలక్షణమైన ఉదాహరణగా – భార్యా భర్తల మధ్య మనస్ఫర్ధలు ఏర్పడినప్పుడు, భర్తతో మాటలాడక భార్య వున్నచో అది అర్ధము చేసికొనవచ్చును గాని, ఆమె వేరొక పురుషునికై చూచుట, పూర్తిగా అనంగీకారయోగ్యమగును).

పోయిగై ఆళ్వార్ – ముదల్ తిరువందాది 55

అవన్ తమర్ ఎవ్వినైయర్ ఆకిలుమ్
ఎమ్ కోన్ అవన్ తమరే యెన్ఱు ఒళివతల్లాల్
నమన్ తమరాల్ ఆరాయప్పట్టు అఱియార్ కణ్డీర్
అరవణై మేల్ పేరాయఱ్కు ఆళ్ పట్టార్ పేర్

సాధారణ అనువాదము : శ్రీమన్నారాయణునికే అంకితులైన శ్రీవైష్ణవులు నాకు గురువులు, వారి చర్యలు ఏమైనను. ఆదిశేషునిపై పవళించి, గోపాల బాలునిగా దర్శనమిచ్చిన భగవానునికి సంపూర్ణ శరణాగతులైన శ్రీవైష్ణవుల దోషములను విశ్లేషించుటకు యమభటులు కూడ అనర్హులు.

నమ్మాళ్వార్ – తిరువాయ్మొళి 5.2.1

ఎంపెరుమానార్లకు ఘనమైన ఊరేగింపు – వారి ప్రత్యక్షము సమస్త జగత్తుకు శుభసూచకము

పొలిక పొలిక పొలిక పోయిఱ్ఱు వల్ ఉయిర్ చ్చాపమ్
నలియుమ్ నరకముమ్ నైన్ద నమనుక్కు ఇఙ్గుయాతొన్ఱుమ్ ఇల్లై
కలియుమ్ కెడుమ్ కణ్డు కొణ్మిన్
కడల్వణ్ణన్ పూదఙ్గళ్ మణ్మేల్ మలియప్పుకున్దు ఇశైపాడి ఆడి ఉళి తరక్కణ్డోమ్

సాధారణ అనువాదము : సాగరము (ముత్యములతో మొ || వానితో నిండి వున్నది) వలె శక్తివంతుడు, నీలి వర్ణము గలిగి మిక్కిలి సుందరుడైన భగవానునికి సంపూర్ణ శరణాగతి చేసిన అనేక భాగవతుల ఆట పాటలను నేను వీక్షించితిని. ఇట్టి భాగవతుల వలన, ప్రజల మనస్సులలో నున్న అజ్ఞానము నశించును. అజ్ఞానము తొలగినందుచే, వీరిని నరక లోకములో పడవేయు యమునికి, యమ కింకరులకు పని లేకుండా పోయెను. కలియుగ దోషములు అనే అంతర్లీన కారణము కూడ తొలగెను. ఇట్టి శుభ సూచకము కలకాలము ఉండగలదు.

తిరుమంగై ఆళ్వార్ – పెరియ తిరుమొళి 8.10.7

వెళ్ళై నీర్ వెళ్ళత్తు అణైన్ద అరవణై మేల్
తుళ్ళు నీర్ మెళ్ళత్తుయిన్ఱ పెరుమానే!
వళ్ళలే! ఉన్ తమర్కెన్ఱుమ్ నమన్ తమర్
కళ్ళర్ పోల్ కణ్ణపురత్తుఱై అమ్మానే!

సాధారణ అనువాదము : క్షీరాబ్ధిలో (పాల సముద్రము) ఆదిశేషునిపై శయనించియున్న ఓ పరమాత్మ! తిరుక్కణ్ణపురములో ఓ స్వామి (నా ముందరనే వున్నారు)! చోరులు ఇతరుల నుంచి ఏ విధముగా దాగెదరో, నీ భక్తులను చూచిన యమభటులు కూడ అదేవిధముగా దాగు కొనెదరు.

ఆళ్వార్లు (తొండరప్పొడి ఆళ్వార్) “నావలిట్టు ఉళి తరుగిన్ఱోమ్ నమన్తమర్ తలైగళ్ మీతే” (మేము జయధ్వానము చేయుచు, యమభటుల శిరములపై నుండి నడచెదము).

శ్రీవైష్ణవులను నియంత్రించుటపై యమభటులు దృష్టి సారించుటను, అట్టి చర్యలు గైకొనినచో వారు మిక్కిలి బాధ పడుదురని ఆళ్వార్లు పేర్కొనిరి. శ్రీవైష్ణవుల మహిమలు అంత గొప్పవి.

“న కలు భాగవతా యమ విషయం గచ్ఛంతి” (భాగవతులు, యమునకు పరస్పర చర్యలకు ఏమియును లేదు) భాగవతుల మహిమలను కూడ వివరించిరి. ఈ విషయములో, భాగవతులతో యముని చర్యలు, ఇత్యాదులను ఈ క్రింది శ్లోకములో వివరించిరి.

స్వ పురుషమ్ అపి వీక్ష్య పాచహస్తమ్ వతతి యమః కిల తస్య కర్ణమూలే
పరిహర మధుసూధన ప్రపన్నాన్ ప్రభురహమ్ అన్యనృణామ్ న వైష్ణవానామ్

కమలనయన వాసుదేవ విష్ణో ధరణిధరాచ్యుత శంఖ చక్రపాణే
భవ శరణమితీరయన్తి యే వై త్యజ భటదూరతరేణ ధనపాపాన్

సాధారణ అనువాదము: యముడు తన కింకరులను దగ్గరకు రమ్మని, వారితో మధుసూధనుని శరణాగతి చేసిన శ్రీవైష్ణవులకు తాను స్వామిని కానని, కాని తదితరులు తన నియంత్రణలో నుందురని వివరించిరి. శ్రీవైష్ణవులతో తటస్థముగా నుండగలరని, కమలనేత్రుడు, వాసుదేవుడు, విష్ణువు, ధరణీ ధరుడు (భూమిని చేత ధరించిన వాడు), శంఖ చక్రములు తన హస్తములలో ధరించిన వాడైన భగవానునికి వారు శరణాగతి చేసినందులకు, వారికి దూరముగా నుండమని తెలిపిరి.

ఈ విధముగా, యమ ధర్మరాజు తన కింకరులతో, మీరు శ్రీవైష్ణవులని అదుపు చేయజాలరని ఆదేశించిరి, భగవానుని క్రోధము నుంచి కాపాడ బడుటకై శ్రీవైష్ణవులకు దూరముగా ఉండుమని అనిరి. భాగవతుల ఇట్టి మహిమలను శ్రీవిష్ణుపురాణము, ఇత్యాదులలో వివరించిరి.

అభాగవతులతో కలిసి ఉండుట అనగా భాగవతులతో మరియు భగవానునితో ఎడబాటుకు దారి చూపును. భాగవతులతో కలియుట, భగవానునితో కలయికకు మార్గము, అభాగవతులను వీడివుండుట మోక్షమునకు దారి చూపును. నిజమైన ఆచార్యుని పర్యవేక్షణలో నున్నవారు సంసారము వలన కలత చెందరు. అట్టి పర్యవేక్షణను శిష్యుడు వదలి వేసినచో, అతడు ఈ సంసారములో సదా బాధలను అనుభవించును. దీనినే ఆచ్చాన్ పిళ్ళై మాణ్ణిక్కమాలైలో వివరించిరి.

కావున, శిష్యుని ప్రతి అంశము ఆచార్యుని అధీనములో నుండ వలెను. కాని, తన కలవరపాటుచే, ఆచార్యునితో సంబంధమును మరచినను, తన స్వబుద్ధిచే అకృత్యకరణము (శాస్త్రము నిషేధించన కార్యములు) లలో జోక్యము చేసుకొనినను, భగవదపచారము (భగవానుని నిందించుట), భాగవతాపచారము (భాగవతులను నిందించుట), అసహ్యపచారము (భగవంతుని – భాగవతులను అకారణముగా నిందించుట) ఇత్యాదులను గావించిన ఫలితముగా రౌరవాది నరక కూపములలో బాధలను అనుభవించుటకు యోగ్యుడగును. నిజమైన ఆచార్యుడు, తమ శిష్యులు, ఇట్లు దిగజారినచో, వారనుభవించు బాధలను ముందుగనే పసిగట్టి, తమ నిర్హేతుక దయచే, వారిని శుద్ధి చేయగలరని, ” పయనన్ఱాగిలుమ్ పాఙ్గల్ల రాగిలుమ్ శెయల్ నన్ఱాగ త్తిరుత్తిప్పణి కొళ్వాన్” కణ్ణినుణ్ శిఱుత్తాంబు – 10 లో గుర్తించిరి (నేను అప్రయోజకుడను, మిక్కిలి అయోగ్యుడ నైనను, నమ్మాళ్వార్ నన్ను సంస్కరించి, తన దాసుని చేసుకొనిరని, మధురకవి ఆళ్వార్ తెలిపిరి) ఇదియే నిజమైన ఆచార్యుల లక్షణము.

ఆచార్యుల నిర్హేతుక దయ అను ఈ లక్షణమును మన పూర్వాచార్యుల జీవితములలోని కొన్ని సంఘటనల ద్వారా వివరించిరి.

ఎంపెరుమానార్ ఆదేశములననుసరించి, ఆళ్వాన్ వరదరాజస్తవమును గానము చేయుచు, నాలూరన్ కు కూడ పరమపదమును ప్రసాదించగలరని దేవ పెరుమాళ్ళను చివరలో అభ్యర్థించిరి.

కూరత్తాళ్వాన్ శిష్యుడైన నాలూరన్ క్రిమికంఠునితో కలిసి ఆళ్వాన్ పై (నాలూరన్ యొక్క ఆచార్యులు) అత్యంత క్రూరమైన దోషమును గావించగా, పెరుమాళ్ వారిపై మిక్కిలి కలత చెంది “న క్షమామి” (నేను ఎన్నటికి నిన్ను క్షమించను) అని పలికిరి. కాని, ఆళ్వాన్ తమ నిర్హేతుక దయ చూపుచు, పెరుమాళ్ తో అంగీకరించక, “నాలూరన్ కూడ తమ వలనే పరమపదము పొందవలెను” అని పెరుమాళ్ ను అభ్యర్థించిరి.

అనుచిత సహవాసముతో కలిగిన కలవరపాటుచే, భట్టరు శిష్యులలో ఒకరు, ప్రాపంచిక విషయ సంబంధముచే, వారితో ” భట్టర్! ఇక మన మధ్య ఎట్టి సంబంధము లేదు ” అని పలికి, వారి పాదపద్మములను వీడు ప్రయత్నము చేసిరి. భట్టరు, అతనితో ” ప్రియ కుమారా! నీవలా తలంచవచ్చు. నీవు నాతో సంబంధమును వీడినను, నేను వీడను” అనిరి మరియు అతనిని మరల సంస్కరించిరి.

నంజీయర్ అయిన వేదాంతికి గల ఒక ప్రియ శిష్యుడు, మిక్కిలి వైరాగ్యము కలిగి, పుణ్య ప్రవృత్తితో నిండి వుండిరి. కాని అసాత్విక ఆహారమును స్వీకరించిన కారణముచే అతనిలో అహంకారము, ఇత్యాదులు పెరిగి, నంజీయర్ ను శరణు చేయుటకు ముందు వినియోగించిన గొడ్డలిని మరల చేత ధరించి, తమ రాజుగారి సేవకై తిరిగి ప్రయాణమైరి. నంజీయర్ అతనిని ఏదో విధముగా పట్టుకొని, ఒక ఏకాంత గదిలో నుంచి, అతనికి సరియగు ఆదేశముల నిచ్చుటకై తలుపులు మూసి వేసిరి. నంజీయర్ పాద పద్మములను ఆశ్రయించిన శ్రీవైష్ణవులు కలత చెంది, వారితో “ఓహ్! ఇది మంచిది కాదు. అతని చేతనున్న గొడ్డలితో మీపై అఘాయిత్యము చేయగలడు, కావున మీరు వెంటనే గదిని వదిలి బయటకు రాగలరు” అనిరి. నంజీయర్ సమాధానముగా “అతను శుద్ధి పొందు వరకు నేను బయటకు రాను. తన ఆత్మ స్వరూపమును గ్రహించి ఉజ్జీవుడైనను కావలెను లేదా అతని చేతిలో గొడ్డలిచే నేను హతుడనగుదును” అనిరి.

పిళ్ళై లోకాచార్యులు – అన్ని మంగళకర లక్షణములకు నిధి

శ్రీ వచన భూషణ దివ్య శాస్త్రములో పిళ్ళై లోకాచార్యులు ఈ విధముగా తెలిపిరి. తమపై తామే అపరాధమును చేసికొనిన వారిపై, పోఱై (జాలి), కృప (దయ), చిరిప్పు (చిరునవ్వు), ఉగప్పు (ఆనందము), ఉపకార స్మృతి (కృతజ్ఞత) ఉండాలి. ఇంతేకాక, అతను వ్యక్తిగతంగా మరింత గౌరవముగా ప్రవర్తించగలుగుట, శ్రీవైష్ణవుని నడవడికకు అంతిమ ఉదాహరణ అగును.

స్వీకరోతి సదాచార్యాస్ సర్వానప్య విశేషతః
యత్పునస్తేశు వైషమ్యమ్ తేషామ్ చిన్ జ్ఞానవృత్తయోః

సాధారణ అనువాదము : సదాచార్యుడు అందరిని శిష్యులుగా అంగీకరించగలరు వారికి మంచితనము లేకపోయినను. తదుపరి అట్టి లోపభూయిష్ఠమైన వారికి ఆత్మ జ్ఞానమును,  తదనుగుణమైన అనుష్ఠానమును (శిష్యుని తో నిబద్ధత గల ఆచరణ) బోధించి, వారి దోషములను తొలగించెదరు.

తేషామేవ హి దోషోయమ్ న చాశ్యేతి వినిశ్చితమ్
అపక్వ పద్మకోశానామ్ అవికాసో రవేర్యతా

సాధారణ అనువాదము : సూర్య కిరణములు సోకినను, అపక్వమైన పద్మముల రేకలు వికసించనట్లు, శిష్యుల లోపములు వారి అపరిణిత వికాసము వలన మాత్రమే గలవని, తమ వలన కాదని భావించెదరు (శిష్యుడు జ్ఞానములోను, క్రమ శిక్షణ లోను పరిణతి పొందువరకు ఆచార్యులు సంస్కరించెదరు కాని అతనిని నిరాకరించరు).

పై శ్లోకములు గుర్తించినట్లు, ఒక శిష్యుడు ఆచార్యుని శరణు చేసినను, అతని అజ్ఞానము / దోషము వలన మరల దుశ్చర్యలు గావించి తన వ్యక్తిత్వము కోల్పోయినను, ఆచార్యుడు అతనిని సంస్కరించి మరియు రక్షించెదరు, “స్కాలిత్యే శాస్త్రము” లోని ఆదేశముల ద్వారా (తప్పు దారిలో నడచు శిష్యునికి సక్రమ ఆదేశముల నొసంగి సరి చేయుదురు), తమ అపార కరుణచే “దేషికో మే దయాళు” లో చెప్పిన విధముగా (నా పై ఆచార్యులు అపార కరుణ చూపిరి).

వాసుదేవమ్ ప్రపన్నానామ్ యాన్యేవ చరితాని వై
తాన్యేవ దర్మశాస్త్రాని త్యేవమ్ వేద విధో విధుః

సాధారణ అనువాదము : వేదములలో నిష్ణాతులైన వారు వాసుదేవునికి ప్రపన్నులైన (సంపూర్ణ శరణాగతి చేసిన భక్తులు) వారి జీవితమును ధర్మ శాస్త్రముగా పరిగణించెదరు.

మన పూర్వాచార్యుల యొక్క ఇట్టి విశిష్ఠ లక్షణములను మన ఆచార్యులు (మాముణులు) విశదీకరించిరి. వారు ఆళ్వార్ తిరునగరి లోని ఓలమిచ్చాన్ మఠములో (ఒక పూరి గుడిశె) విశ్రాంతి తీసుకొను సమయములో, క్రూర స్వభావులైన కొందరు (ఎంపెరుమాన్ కు ఇచ్చు ఆహారమును విషపూరితము చేసిన ఛండాలురు), మాముణులపై అసూయతో అర్ధరాత్రి సమయములో ఆ మఠమును అగ్నికి ఆహుతి గావించిరి. (అనువాదకుని గమనిక: ఆ మఠము లోని మంటల నుంచి మాముణులు ఆదిశేషుని రూపములో బయటకు దూరి వచ్చి, అగ్నికి ఆహుతి అగుచున్న ఆ మఠమును తిలకించుచు నిలబడిరి). ఆ స్థానీయ నిర్వాహకులు అట్టి ఘోర నేరము చేసిన పాపులను శిక్షించుటకు వారికై అన్వేషించసాగిరి. కాని, ఈ క్రింది ప్రమాణముల ద్వారా మాముణులు, వారి చర్యలను వ్యతిరేకించి, ఆ దుర్మార్గులను క్షమించమని మరియు వారిని వదిలి వేయమని కోరిరి. (అనువాదకుని గమనిక : మాముణులను ఇచట సీతా పిరాట్టితో పోల్చిరి – ఆమె కూడ తనపై హాని చేసిన వారిపై మిక్కిలి దయతో కనికరించెను. అదే విధముగా మాముణులు కూడ తమను అంతము చేయదలచిన వారిపై మిక్కిలి దయను కృపజేసి, వారిని చివరకు సంస్కరించిరి.

మిక్కిలి దయా స్వభావము గల సీతా పిరాట్టి మరియు మాముణులు (ఆళ్వార్ తిరునగరి)

పాపానాం వా శుభానాం వా వదార్హాణాం ప్లవంగమ
కార్యమ్ కరుణ మార్యేణ న కశ్చి న్నా పరాద్యతి

సాధారణ అనువాదము : హనుమాన్ తో సీతా పిరాట్టి – ఓ హనుమా! ఉదార స్వభావము కలవారు పాపాత్ములపై, పుణ్యాత్ములపై, మరణార్హులు అయిన వారిపై కూడ దయను చూపవలెను, ఏలనన, దోషములు చేయని వారు ఎవరూ వుండరు.

భావేయం శరణం హి వాః

సాధారణ అనువాదము : రాక్షస స్త్రీలతో సీతా పిరాట్టి – ఎట్టి పరిస్థితులలో నైనా మీకు నా అభయము

కః కుప్యేధ్ వానరోత్తమః

సాధారణ అనువాదము : హనుమానునితో సీతా పిరాట్టి – తమ యజమానుల ఆదేశములను పాటించు సేవకురాండ్రతో ఎవరు ఆగ్రహించెదరు?

ఈ విధముగా అత్యంత దయా స్వరూపులైన ఆచార్యులు మాముణులు, మిక్కిలి పాపులైన వారిని కూడ నిర్వాహకులు శిక్షింపకుండా చేసిరి. ఈ సంఘటన అన్ని ప్రాంతములలో ప్రాచుర్యము పొందెను. ఇంకను, మన ఆచార్యుని అత్యంత దయా స్వభావము, వారి అవతార విశేషమును (ఆదిశేషుని అవతారము, శ్రీ రామానుజులుగా మరల ఆగమనము) మనము ముంగిస మరియు చిలుక, వృక్షము (మాముణులు తింత్రిణీ వృక్షమునకు మోక్షమును ఇచ్చుట), విశిష్ఠ వ్యక్తుల స్వప్నములు (కోయిల్ అణ్ణాణ్, తిరుపతి లోని సాధు శ్రీవైష్ణవులు, మొ ||, మాముణుల గొప్పదనమును ముందుగానే దర్శించిరి) వంటి సంఘటనల ద్వారా గమనించగలము.

అనువాదకుని గమనిక : ఈ విధముగా, మనము శ్రీవైష్ణవుల దివ్య కీర్తిని, ఎంపెరుమాన్, పిరాట్టి, ఆళ్వార్లు, ఆచార్యులు గుర్తించినారని, అవి ప్రతిబింబించిన కొన్ని సంఘటనలను
గమనించితిమి. సీతా పిరాట్టి, మాముణులు తమను బాధించిన వారిపై చూపిన షరతులులేని దయను గమనించితిమి. ఇప్పుడు మనము ఈ దివ్య గ్రంధము యొక్క అంతిమ భాగమును దర్శించెదము.

కొన్ని సంస్కృత ప్రమాణములకు తగిన అనువాదమును ఒసంగిన శ్రీరంగనాథ స్వామికి ధన్యవాదములు.

తదుపరి భాగములో, ఈ అద్భుత గ్రంధము యొక్క కడపటి విశేషములను మనము దర్శించెదము.

సశేషము…

అడియేన్ గోపీకృష్ణమాచార్యులు బొమ్మకంటి, రామానుజ దాసన్ .

మూలము: http://ponnadi.blogspot.com/2013/07/anthimopaya-nishtai-17.html

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

అంతిమోపాయ నిష్ఠ – 16

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్ వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః

అంతిమోపాయ నిష్ఠ

మునుపటి వ్యాసములో (https://srivaishnavagranthamstelugu.wordpress.com/2022/08/07/anthimopaya-nishtai-15/ ), మనము ఆచార్యులు, భాగవతుల ప్రసాదము, శ్రీపాద తీర్థ మహిమలను తెలుసుకొంటిమి. ఈ తదుపరి భాగములో మనము వారి జన్మతో సంబంధము లేని శ్రీవైష్ణవుల మరిన్ని మహిమలను చర్చించెదము.

పిళ్ళై లోకాచార్యులు, అళగియ మణవాళ పెరుమాళ్ నయనార్, మణవాళ మాముణులు

పిళ్ళై లోకాచార్యుల పిన్న దైవాంశ సోదరులైన అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్, ఆచార్య హృదయములో లోతైన రమణీయ అర్థాలను అనుగ్రహించి దీవించిరి.

చూర్ణిక 85 లో, శ్రీవైష్ణవుని జన్మ ఉత్తమమైనదా లేక అల్పమైనదా అను విషయము ఈ క్రింది సంఘటనల ద్వారా విశదీకరించిరి. (అనువాదకుని గమనిక: ఈ భాగములో, ఎవరినైనను వారి గొప్పదనము జన్మతః కాదని, వారికి భగవానునిపై మరియు భాగవతులపై గల భక్తిని బట్టి నిర్ణయించవలెనని నిరూపించిరి. ప్రతి విషయము భౌతిత దృష్టికోణంతో మాత్రమే ఎంచబడే నేటి యుగములో, మన పూర్వాచార్యుల సాహిత్యము, వారి నడవడిని మన ఆదర్శంగా చేసుకొని, ఈ భౌతిత భావన కంటే పైకి ఎదిగి జీవనము సాగించవచ్చును. చక్కదనమేమనగా – మన పూర్వాచార్యులు అన్ని వర్ణముల భాగవతులను గౌరవించే పరమ ఆస్తికులు (వర్ణాశ్రమ ధర్మాన్ని అనుసరించేవారు).

  • మ్లేచ్చనుమ్ భక్తనానాల్ చతుర్వేదికళనువర్తక్క అఱివుకొడుత్తుక్కులదైవ త్తొడొక్క పూజై కొణ్డు పావన తీర్థప్రసాదనామెన్గిఱ తిరుముఖ ప్పడియుమ్

తన నిజమైన భక్తులకు 8 లక్షణములు ఉండవలెనని ఎంపెరుమాన్ స్వయముగా తెలిపిరి. వారు మ్లేచ్చులైనను (వర్ణాశ్రమ ధర్మములలో భాగము కాని వారు), ఈ లక్షణములు కలిగి, 4 వేదములలో నిష్ణాతులైనచో, వారిని అంగీకరించి ఎంపెరుమాన్ తో సమానముగా పరిగణించ వచ్చును (యధార్ధముగా వారిని గౌరవించి / ఎంపెరుమాన్ కంటే ఉన్నతముగా పరిగణించ వచ్చును) – అనగా వారితో భగవద్విషయమును పంచుకొని, వారిని ఆరాధించి, వారి శ్రీపాద తీర్థమును, శేష ప్రసాదమును స్వీకరించినచో, అవి మనను శుద్ధి పరచును.
ఆ 8 లక్షణములు ఇవి:

    1. భగవత్ భక్తులతో నిబంధనలేని ప్రేమతో నుండుట,
    2. ఇతరుల భగదారాధనను ఆనందించుట,
    3. స్వయముగా తాను భగవానుని ఆరాధించుట,
    4. అహంకారరహితుడుగా నుండుట,
    5. భగవత్ విషయాలను శ్రద్ధగా ఆలకించుట,
    6. భగవత్ శ్రవణము / చింతన / భాషణము చేయునపుడు శరీరములో మార్పులు కలుగుట (అనగా ఒడలు పులకరించుట, మొ || ),
    7. సదా ఎంపెరుమాన్ గురించే తలంచుట,
    8. కామ్య ఫలాలను ఆశించకుండా భగవత్ ఆరాధన చేయుట.
  • విశ్వామిత్ర – విష్ణుచిత్త – తుళసీ భృత్యరోడే ఉళ్ కలందు తొళుకులమానవన్ నిలైయార్ పాడలాలే బ్రాహ్మణ వేళ్విక్కుఱై ముడిత్తమైయుమ్

నంపాడువన్ (వీరు తిరుక్కురుంగుడిలో మలైనంబికి కైశికరాగ గానము చేసిరి. అందువలన వారిని విశ్వామిత్ర ఋషితోనూ, పెరియాళ్వార్ తోనూ, పెరుమాళ్ళ కోసం తిరుప్పళ్ళియెళుచ్చి (మేలుకొలుపు) ని గానము చేసిన తొండరప్పొడి ఆళ్వార్ తోనూ పోల్చిరి), అగ్ర కులములో జన్మించక పోయినను బ్రహ్మ రాక్షసుడుగా (ఒక యజ్ఞములో మంత్రోచ్చారణ లోపం వల్ల  బ్రాహ్మణుడు రాక్షసుడయ్యెను) పొందిన శాపమును, వారి గానముచే, తొలగించుకొనిరి.

  • కీళ్మగన్ తలైమకనుక్కు సమసఖావాయ్ , తంబిక్కు మున్ పిఱన్దు వేలుమ్ విల్లుమ్ కొణ్డు పిన్ పిఱన్దారై శోదిత్తు తమైయోన్ ఇళైయోన్ సద్భావమ్ శొల్లుమ్బడి ఏకకులమానమైయుమ్

బోయకులములో జన్మించిన గుహుడు పెరుమాళ్ళకు (శ్రీ రాముడికి) అత్యంత సన్నిహితుడు మరియు సోదరుడైనాడు, రాత్రి సమయములో పెరుమాళ్ నిద్రించునప్పుడు, ఇళయ పెరుమాళ్ (లక్ష్మణ స్వామి) ను శంకించెను. కావున, గుహుడు రాత్రి అంతయు మేల్కొని ఉండి లక్ష్మణుని గమనించెను. భరతుడు (శ్రీరామ లక్ష్మణుల గుణములను బాగుగా తెలిసినవాడు) గుహుని కలసినప్పుడు , లక్ష్మణుని గుణములు అతనికి తెలియవేమోనని, వానిని గుహుడు భరతునికి తెలిపినప్పుడు, భరతుడు అమితానందము పొందెను. ఈ విధముగా వారు ఐదుగురు (శ్రీరాముడు, గుహుడు, లక్ష్మణుడు, భరత శత్రుఘ్నులు) ఒకే కుటుంబము వారైరి.

  • తూతుమొళింతు వన్దవర్ కళుడైయ సమ్యక్సగుణ సహ భోజనముమ్

శబరి (బోయ వంశములో జన్మించినది) ని స్వీకరించి ఆమె ఒసంగిన ఫలములను ఆరగించిన శ్రీరాముడు; భీష్ముడు, ద్రోణుడు, మొ || వారి గృహముల నేగక, శ్రీవిదురుని గృహములో ఆరగించిన కణ్ణన్ ఎంపెరుమాన్; సీతా పిరాట్టిని కలిసిన ఉదంతమును ఆలకించిన శ్రీరాముడు హనుమంతుని (వానరము) ఆలింగనము చేసికొనుట

  • ఒరుపిఱవియిలే యిరుపిఱవియానా రిరువర్ క్కు దర్మసూను స్వామిగళ్ అగ్రపూజై
    కొడుత్తమైయుమ్

శ్రీ కృష్ణుడికి (బ్రాహ్మణ వంశములో జన్మించలేదు) ప్రధమ మర్యాదనిచ్చిన యుధిష్టిరుడు,
ఒక వడ్రంగిచే పెంచబడిన తిరుమళిశై ఆళ్వారుకి ప్రధమ మర్యాదనిచ్చిన పెరుంబులియూర్ అడిగళ్ – కృష్ణుడు, తిరుమళిశై ఆళ్వార్ వీరిరువురు ఒకే జీవితములో రెండు జన్మలు పొందిరి – కృష్ణుడు క్షత్రియ దంపతులకు జన్మించినను యాదవ కుటుంబమునకు, బ్రాహ్మణ దంపతులకు జన్మించిన ఆళ్వార్ వడ్రంగి కుటుంబమునకు తరలి వెళ్ళిరి.

  • ఐవరిల్ నాల్వరిల్ మూవరిల్ ముఱ్పట్టవర్గళ్ సందేహియామల్ సహజరోడే పురోటాసమాక
    చ్చైయ్త పుత్ర కృత్యముమ్

ఐదుగురు సోదరులలో జ్యేష్టుడైన యుధిష్టిరుడు శ్రీవిదురునికి (సేవకురాలికి జన్మించినవాడు) చరమ కైంకర్యము చేసెను. నలుగురు సోదరులలో జ్యేష్ఠుడైన శ్రీరాముడు జటాయువు (పక్షి) కి చరమ కైంకర్యము చేసెను. ముగ్గురు నంబిలలో (పెరియ నంబి, తిరుక్కోష్ఠియూర్ నంబి, తిరుమలై నంబి) పెద్దవాడైన పెరియ నంబి మాఱనేరి నంబికి చరమ కైంకర్యము చేసిరి.

  • పుష్ప త్యాగ భోగ మండపంగళిల్ పణిప్పూవుమ్ ఆలవట్టముమ్ వీణైయుమ్ కైయుమాన అంతరంగరై ముడిమన్నవనుమ్ వైదికోత్తమరుమ్ మహామునియుమ్ అనువర్తిత్త క్రమముమ్
      • పుష్ప మండపములో (తిరుమల) కురుమ్బురుత్త నంబిచే మట్టి పూలను స్వీకరించిన తిరువేంగడముడియాన్ ను ఆరాధించిన తొండమాన్ చక్రవర్తి

      • త్యాగ మండపములో (కాంచీపురము) తిరుక్కచ్చి నంబిచే వింజామన సేవనందుకున్న పేరారుళాళన్ ను ఆరాధించిన ఎంపెరుమానార్

      • భోగ మండపములో (శ్రీరంగము) తిరుప్పాణాళ్వార్ల వీణ కైంకర్యమును ఆలకించిన పెరుమాళ్ళను ఆరాధించిన లోకసారంగముని

  • యాగానుయాగ ఉత్తర వీధికళిల్ కాయాన్న స్థల శుద్ది పణ్ణిన వృద్దాచారముమ్

తిరువారాధన సమయములో, పిళ్ళై వురంగా విల్లి దాసర్ను స్పృశించి, ఎంపెరుమానార్ శుద్ధి నొందిరి: ప్రసాదమును స్వీకరించుటకు ముందే దానిని స్పృశించమని పిళ్ళై ఏఱు తిరువుడైయార్ దాసర్ తో నంపిళ్ళై అనిరి; తమ నూతన గృహమును శుద్ధి చేయుటకై పిళ్ళై వానమామలై దాసర్ ను ప్రదక్షిణ చేయుమని నడువిల్ తిరువీధి పిళ్ళై భట్టర్ అనిరి;

‘అఱివార్ క్కిరే జన్మోత్కర్షాపకర్షఙ్గళ్ తెరివతు’ – పై సంఘటనలు అర్ధమైనచో, నిజమైన అధమ ఉన్నత జన్మల గురించి తెలియును. తమ అద్భుతమైన వ్యాఖ్యానములో, ఈ సూత్రమునే భాగవతుల (జన్మముతో సంబంధము లేకుండా) మహిమలను సులువుగా, మిక్కిలి ఉపయుక్తముగా మందమతులు కూడ అర్ధము చేసుకొనగలరని నయనార్ వివరించిరని, మాముణులు ముగించిరి.

86 వ చూర్ణికలో, దీనినే ఇంకను వివరించిరి :

అజ్ఞర్ భ్రమిక్కిఱ వర్ణాశ్రమ విద్యా వృత్తన్గళై గర్దభ జన్మమ్, శ్వపచాధమమ్, శిల్పనైపుణ్యమ్, భస్మాహుతి, శవవిధవాలన్కారమెన్ఱు కళిప్పర్కళ్

సాధారణ అనువాదము

  • కేవలము బ్రాహ్మణ వర్ణములో (భగవత్ భాగవతుల యెడల భక్తి భావము లేకుండా) జన్మించుట అనగా కుంకుమ పువ్వును మోయు గాడిదగా (దాని విలువ తెలియక) తెలిపిరి.
  • కేవలము సన్యాసాశ్రమమును (భగవత్ భాగవతుల యెడల భక్తి భావము లేకుండా) స్వీకరించుటను అత్యంత హేయమైన ఛండాలుడుగా (శునక మాంస భక్షకుడు) వివరించిరి,
  • కేవలము వేద జ్ఞానము ఉండుట (భగవత్ భాగవతుల యెడల భక్తి భావము లేకుండా) అనగా పాద రక్షలు చేయు నైపుణ్యముతో మాత్రమే సమానముగా (ఉదరపోషణకు తప్ప మరి దేనికి నిరుపయోగము) భావించవచ్చును.
  • కేవలము కర్మానుష్ఠానములు (భగవత్ భాగవతుల యెడల భక్తి భావము లేకుండా) కాలిన బూడిద వలె నిరుపయోగమనిరి.
  • భగవానుని స్తుతించని మాటలు, చర్యలు ఒక మృతదేహమునకు చేయు అలంకరణముల వంటివి.
  • ఎంపెరుమాన్ పై భక్తిలేని పైనవన్నియు, ఒక విధవరాలికి గల అందమైన ఆభరణముల వలె నిరుపయోగమగును. ఏలనన, ఆమెకు మంగళ సూత్రము ఉండదు (అది లేనందువల్ల ఆమెకు ఆ ఆభరణములు నిరూపయోగములు) కనుక. అదే విధముగా, కేవలము వర్ణము, ఆశ్రమము, జ్ఞానము మరియు మాటలు (భగవానునిపై భక్తిలో తడిసి ముద్ద కానివి) పామరులకు పరవశము కలుగజేయును గాని, జ్ఞానులైన పండితులు వానిని విస్మరించి, వానికి ఎట్టి విలువను ఆపాదించరు.

తదుపరి భాగములో, పిళ్ళై లోకాచార్యుల శ్రీవచన భూషణమను దివ్య శాస్త్రము నుంచి అనేక సూత్రములను ఉటంకించి, జన్మ సంబంధము లేకుండా శ్రీవైష్ణవుల మహిమలను తెలిపిరి. ఆ సూత్రములలో, సూత్రము 212 వరకు వైష్ణవుని కీర్తిని ముఖ్యముగా ప్రస్తావించిరి.

సూత్రము – 212ఉత్కృష్టమాక భ్రమిత్త జన్మమ్ భ్రంశ సమ్భావనైయాలే  “శరీరేచ” ఎన్గిఱపడియే భయ జనకమ్

    • తమది ఉత్కృష్టమైన జన్మగా భ్రమించుటచే, వారు దిగ్భ్రాంతితో భీతిల్లి ఉపాయాంతరములకై (అనగా వారు మొదటి 3 వర్ణములలో జన్మించిన ఫలితముగా కర్మ, జ్ఞాన, భక్తి యోగములు నిర్వహించు అవకాశము / యోగ్యత వున్నది) చూచెదరు.
    • జితంతే స్తోత్రము 1.9 “శరీరే చ” లో భయము కలుగు అనేక విషయములను ప్రస్తావించుతూ, వర్ణాశ్రమ ధర్మమును పాటించుటకు అర్హత కలిగిన మన శరీరమునే, భీతికి ప్రధాన కారణముగా తెలిపిరి.

సూత్రము 213అతుక్కు స్వరూప ప్రాప్తమాన నైచ్యమ్ భావిక్క వేణుమ్

అట్టి ఉత్కృష్ట జన్మనొందినవారు, జీవాత్మకు స్వాభావికమైన అణకువను, దానిని సక్రమముగా పాటించు ఇతరుల నుంచి చూచి సాధన చేయవలెను.

సూత్రము – 214అపకృష్టమాక భ్రమిత్త ఉత్కృష్ట జన్మత్తుక్కు ఇరణ్డు దోషముమిల్లై

నిజముగా ఉత్కృష్ట జన్మనొందిన వారికి (అది అల్ప జన్మమనే భ్రమచే) ఈ రెండు దోషములు వుండవు. అవి ఏమనగా,

    • తాము జన్మించిన వర్ణము వలన ఏర్పడిన బాధ్యతలకు దిగ్బ్రాంతి నొంది తద్వారా తమ శరీరము చేయవలసిన చర్యలకు భీతిల్లి,
    • తాము స్వాభావికముగ గాక, ఇతరులను చూచి అణకువను సాధన చేసి నేర్చుకొనవలెను.

సూత్రము – 215నైచ్యమ్ జన్మ సిద్దమ్

ఉత్కృష్ట జన్మ (అల్ప జన్మమనే భ్రమలో నుండుట) పొందిన వారికి వినయము సహజము.

సూత్రము – 216 – ఆకైయాలే ఉత్కృష్ట జన్మమే శ్రేష్ఠమ్

కావున ఉత్కృష్ట జన్మమే శ్రేష్ఠమైనది

సూత్రము 217 – శ్వపచోపి మహీపాల

స్వయముగా భగవానుడే పై శ్లోకములో తెలిపిన విధముగా, ఛండాలుడైనను తన భక్తుడైనచో, ద్విజుని కంటే గొప్పవాడు. అదే ప్రకారము, సన్యాసుడైనను, నా భక్తుడు కానిచో, ఛండాలుని కంటే అల్పుడు.

సూత్రము 218నికృష్ట జన్మత్తాల్ వంద దోశమ్ శమిప్పతు విలక్షణ సంబంధత్తాలే

నికృష్ట జన్మను నొందినవారు ఇతర ఉపాయాంతరములు, మొ || వానిలో నుండుటచే, వారి దోషములు తొలగుటకై, లోపరహితులైన శ్రీవైష్ణవులతో సంబంధము నేర్పరచుకొనవలెను.

సూత్రము 219సంబంధత్తుక్కు యోగ్యతైయుండా మ్బోతు జన్మక్కొత్తై పోకవేణుమ్

లోపరహితుడైన శ్రీవైష్ణవునితో అట్టి సంబంధమునకు యోగ్యత కలుగుటకు, తనది ఉత్కృష్ట జన్మమనే ఆభిజాత్యమును వీడవలెను.

సూత్రము 220జన్మత్తుక్కు కొత్తైయుమ్ అతుక్కుప్పరిహారముమ్ “పళుతిలా ఒళుకల్” ఎన్గిఱ పాట్టిలే అరుళిచ్చెయ్ తార్

తమ జన్మ సంబంధిత అపార్ధములను, వాటిని తొలగించు పరిష్కారమును దయతో మనకు తొండరప్పొడి ఆళ్వార్ “పళుతిలా ఒళుగల్ ” (తిరుమాలై 42) పాశురములో వివరించిరి. ఈ పాశురములో ఆళ్వార్ “జన్మ జన్మల నుండి బ్రాహ్మణ వంశములో జన్మించి, 4 వేదములలో నిష్ణాతులై, తమ అహంకారము మొ || వానిని పోగొట్టుటకై, అహంకార రహితులైన శ్రీమన్నారాయణుని భక్తులను ఆరాధించవలెను. తాము శుద్ధి పొందుటకు జ్ఞానమును వారి నుంచి స్వీకరింపవలెను / పొందవలెను” అని వివరించిరి.

సూత్రము 221వేదగప్పొన్బోలే ఇవర్ కళోట్టై సంబంధమ్

అట్టి మహిమగల భక్తులతో సంబంధము స్పర్శవేదితో (ఇనుమును బంగారముగా మార్చును) సంబంధము వంటిది.

సూత్రము 222 – ఇవర్గళ్ పక్కల్ సామ్య బుద్దియు మాధిక్య బుద్ధియుమ్ నడక్క వేణుమ్

అట్టి శ్రీవైష్ణవులను సమానులుగా పైగా అధికులుగా భావించవలెను.

సూత్రము 223అతావతు ఆచార్య తుల్యరెన్ఱుమ్ సంసారి కళిలుమ్ తన్నిలుమ్ ఈశ్వరనిలుమ్ అధికరెన్ఱుమ్ నినైక్కై

యధార్ధమునకు, వారిని తమ స్వయమాచార్యులతో సమమైన వారిగా పరిగణించి, సంసారులకంటే (విషయవాంఛలపై దృష్టి కలవారు), తమకంటే, స్వయం ఈశ్వరుని కంటే ఉన్నతులుగా పరిగణించవలెను.

సూత్రము 224ఆచార్య సామ్యత్తుక్కడి ఆచార్య వచనమ్

ఆచార్యుని పాదపద్మములను శరణాగతి చేయునపుడు, స్వయముగా ఆచార్యులే ఇచ్చిన ఆదేశము ప్రకారము, అట్టి శ్రీవైష్ణవులను తమ ఆచార్యునితో సములుగా పరిగణించ వచ్చును.

సూత్రము 225ఇప్పడి నినైయాతొళిగైయుం అపచారమ్

శ్రీ వైష్ణవుని జన్మ విశ్లేషణ చేయుట ఎంత పెద్ద నేరమో, వారికి సరియైన గౌరవమును (ఇంతకు మునుపు తెలిపిన సూత్రముల ప్రకారము) ఇవ్వక పోవుట కూడ అంతే పెద్ద నేరము / తప్పిదము అగును.

సూత్రము 226 – ఇవ్వర్ధమ్ ఇతిహాస పురాణఙ్గళిలుమ్, పయిలుమ్ శుడరొళి నెడుమాఱ్కడిమైయిలుమ్ కణ్ శోర వెఙ్గురుతియిలుమ్ వణ్ణాత వాళవుణరిలుమ్ తేట్టరుమ్ తిఱల్ త్తేనిలుమ్, మెమ్బురుళుక్కు మేలిఱ్పాట్టుక్కళిలుమ్ విచదమాక క్కాణలామ్

ఈ సూత్రమునే (జన్మతో సంబంధము లేని భాగవతుల యొక్క మహిమలు) మరింత వివరముగా క్రింది వానిలో తెలిపిరి :

  • ఇతిహాసములు (శ్రీరామాయణము, మహాభారతము), పురాణములు
  • పయిలుమ్ శుడరొళి పదిగము – తిరువాయ్మొళి  3.7
  • నెడుమాఱ్కడిమై పదిగము – తిరువాయ్మొళి  8.10
  • నణ్ణాద వాళ్ అవుణర్ పదిగము – పెరియ తిరుమొళి 2.6
  • కణ్ శోర వెఙ్గురుది పదిగము – పెరియ తిరుమొళి 7.4
  • తెట్టు అరుమ్ తిఱల్ తేన్ పదిగము – పెరుమాళ్ తిరుమొళి 2
  • తిరుమాలై – 39 – 43 పాశురములు

సూత్రము 227క్షత్రియనాన విశ్వామిత్రన్ బ్రహ్మర్షి యానాన్

క్షత్రియ కుటుంబములో జన్మించిన విశ్వామిత్రుడు బ్రహ్మర్షి (సాధారణముగా బ్రాహ్మణులకు వర్తించును) అయిరి.

సూత్రము 228 – శ్రీవిభీషణనై రావణన్ కులపాంసనమ్ ఎన్ఱాన్; పెరుమాళ్ ఇక్ష్వాకు వంశ్యనాగ  నినైత్తు వార్తై యరుళిచ్చెయ్ తార్

శ్రీ విభీషణుని రావణాసురుడు ద్రోహిగా ప్రకటించెను; శ్రీరాముడు (పెరుమాళ్) శ్రీ విభీషణుని (రాక్షస వంశములో జన్మించినవాడు) తమ స్వంత ఇక్ష్వాకు వంశములో నుండి వచ్చిన సోదరునిగా భావించిరి, వారితో ప్రేమతో సంభాషించిరి.

సూత్రము 229పెరియ ఉడైయారుక్కు పెరుమాళ్ బ్రహ్మమేధ సంస్కారమ్ పణ్ణియరుళినార్

సాధారణముగా పుత్రులు / శిష్యులు తమ పితరులకు / ఆచార్యునికి జరుపు చరమ కైంకర్యములు (అంతిమ సంస్కారములు) శ్రీరాముడు అభిమానముతో జటాయు మహారాజుకు (పక్షి జన్మ నొందిన వానికి) నిర్వహించిరి.

సూత్రము 230ధర్మపుత్రర్ అశరీరి వాక్యత్తైయుమ్, జ్ఞానాధిక్యత్తైయుమ్ కొణ్డు శ్రీవిదురరై బ్రహ్మమేదత్తాలే సంస్కారిత్తార్

అశరీరవాణి ఆదేశముల ప్రకారము, శ్రీ విదురుని జ్ఞానాధిక్య స్వభావము వలనను, అతని అంతిమ సంస్కారములను (దాసి పుత్రునిగా జన్మించినను) యుధిష్ఠిరుడు (వర్ణాశ్రమ ధర్మములలో నున్నవాడు) నిర్వహించెను.

సూత్రము 231ఋషికళ్ ధర్మవ్యాదన్ వాశలిలే తువణ్డు ధర్మ సందేహంగళై శమిప్పిత్తుక్కొణ్డార్ కళ్

ఋషులు ధర్మవ్యాధుని (ఒక కటిక వాడు) వాకిట కాచియుండి, వారు తమ తల్లిదండ్రుల సేవ ముగించు వరకు వేచియుండి, తమ ధర్మ సందేహములను నివృత్తి చేసికొనిరి.

సూత్రము 232కృష్ణన్ భీష్మ ద్రోణాదిగళై విట్టు శ్రీవిదురర్ తిరుమాళికైయిలే అముతు శెయ్ తాన్

ఎంపెరుమాన్ కృష్ణుడు, భీష్మ, ద్రోణ, దుర్యోధనాదులను విస్మరించి, శ్రీవిదురుని గృహమున ఆహారమును ఆనందముగా స్వీకరించిరి.

సూత్రము 233పెరుమాళ్ శ్రీశబరి కైయాలే అముతు శెయ్తరుళినార్

బోయ కుటుంబములో జన్మించినను, తమ ఆచార్యునిపై అత్యంత భక్తిగల శ్రీశబరి ఇచ్చిన ఫలములను శ్రీరాముడు భుజించెను.

సూత్రము 234మాఱనేరి నంబి విషయమాక పెరియనంబి ఉడైయవర్ క్కరుళిచ్చెయ్ద వార్తైయై స్మరిప్పతు

మాఱనేరి నంబి అంతిమ సంస్కారములను చేసిన పిదప పెరియ నంబి (ఒక శ్రీవైష్ణవుని అవసరమును తీర్చుట మరియొక శ్రీవైష్ణవుని భాధ్యత అని అనేక ఉదాహరణములను వివరించుచు తెలిపిరి) శ్రీరామానుజునికి ఇచ్చిన వివరణమును గుర్తుంచుకొనవలెను.

ఈ సూత్రమునే యతిరాజ వింశతి 16 వ శ్లోకములో మన జీయర్ (మాముణులు) వివరించిరి

శబ్దాదిభోగ విషయా రుచిరస్మదీయా
నష్టా భవత్విహ భవద్దయయా యతీంద్ర!
త్వద్దాసదాసగణనాచరమావదౌ యః
తద్దాసతైకరసతావిరతా మమాస్తు

తిరువహీంద్రపురములో శ్రీవిల్లిపుత్తూరు పగవర్ అను ఒక సన్యాసి నివసించుచుండిరి. వారు ఒక వైపున తమ స్నాన అనుష్ఠానములను చేసెడివారు. ఇతరులు మరియొక వైపున తమ అనుష్ఠానములను చేసెడివారు. ఒకసారి వీరు తమ అనుష్ఠానములు ముంగించుకొని తిరుగు ప్రయాణములో నుండగా, ఒక బ్రాహ్మణుడు “మా అందరితో కలవక, మీరు అనుష్ఠానములు మరియొక స్థలములో చేయుటకు కారణమేమి?” అని అడిగిరి. దానికి వారు సమాధానముగా “మీరు బ్రాహ్మణులు, వర్ణాశ్రమముపై మాత్రమే దృష్టి కలవారు. కాని మేము దాసులము, కైంకర్యపరులము (భగవానునితో పాటు భాగవతులపై దాస్య భావమున్నవారము) – కావున మీతో కలిసిఉండ నవసరము లేదు” అని పలుకుచు, ఆ స్థలమును వీడి వెళ్ళిరి. ఈ సంఘటనను తిరునారాయణ పురత్తు అను వారు తమ ఆచార్య హృదయము వ్యాఖ్యానములో స్పష్టముగా వివరించిరి. శ్రీవిల్లిపుత్తూరు పగవర్ దీనినే సమర్థించుచు, ఈ క్రింది పురాణ శ్లోకమును ఉటంకించిరి.

విష్ణుదాసా వయమ్ యూయమ్ బ్రాహ్మణా వర్ణధర్మినః
అస్మాకమ్ దాస వృత్తీనామ్ యుష్మాకమ్ నాస్తి సంగతిః

సాధారణ అనువాదము : మేము విష్ణు సేవకులము, మీరు వర్ణాశ్రమ ధర్మమును మాత్రమే పాటించు బ్రాహ్మణులు. మేము దాస్య భావముతో నుందుము, కావున కలియుటకు కారణము లేదు.

తమ జ్ఞాన సారములోని క్రింది పాశురముల ద్వారా అరుళాళ పెరుమాళ్ ఎంపెరుమానార్ ఈ సూత్రమునే నిరూపించిరి. కేవలము వర్ణాశ్రమ ధర్మమును పాటించుట మాత్రమే నిరుపయోగము, ప్రతి వారికి శ్రీమన్నారాయణుని పాద పద్మములే అంతిమ లక్ష్యము.

పాశురము 14

బూదంగళ్ ఐందుం పోరుందుడలినాఱ్పిఱంద
సాదంగళ్ నాన్గినోడుం సంగతమాం – బేధం కొండు
ఎన్న పయన్ పెఱువీర్ ఎవ్వుయిరుక్కుం ఇందిరై కోన్
తన్నడియే కాణుం శరణ్

సాధారణ అనువాదము : పంచ భూతములతో తయారైన ఈ శరీరమును వ్యక్తి యొక్క వర్ణముతో గుర్తించిన ఏమి ప్రయోజనము? ప్రతి వారికి శ్రీమన్నారాయణుని పాదపద్మములే శరణ్యము.

పాశురము 15
కుడియుమ్ కులముమ్ ఎల్లామ్
కోకనకై కేళ్వన్ అడియార్కు అవనడియే యాగుం
పడియిన్ మేల్ నీర్ కేళువుం ఆఱుగళిన్ పేరుం నిఱముమ్ ఎల్లామ్
ఆర్ కలియై శేన్ందిడ మాయన్ తఱ్ఱు

సాధారణ అనువాదము : సాగరములో కలియునప్పుడు నదుల రంగు, నామ రూపాలు మొ || నవి ఎట్లు అదృశ్యమగునో, అదే విధముగా శ్రీమన్నారాయణుని భక్తుల ఊరు, వంశ పారంపర్యము మొ || నవి అదృశ్యమై అతను కేవలం భగవానుని తిరువడి సంబంధముతోనే అతనిని గుర్తించవస్తారు.

దేహాత్మ జ్ఞాన కార్యేణ వర్ణభేదేన కిమ్ పలమ్
గతి సర్వాత్మనామ్ శ్రీమన్నారాయణ పదద్వయమ్

సాధారణ అనువాదము : శరీర ఆత్మల వ్యత్యాసము గుర్తించిన పిదప ఆ వ్యక్తిని వర్ణము ఆధారముగా గుర్తించినచో ఫలమేమి? ప్రతి ఒక్కరికి శ్రీమన్నారాయణుని పాదపద్మములే శరణ్యము.

ఏకాంతి వ్యపతేస్థవయః నైవ గ్రామకులాధిపిః
విష్ణునా వ్యపతేస్థవ్యస్ తస్య సర్వమ్ స ఎవ హి

సాధారణ అనువాదము : విష్ణుని నిజమైన భక్తుని అతని స్వగ్రామము, వంశపారంపర్యము మొ || వానిచే గుర్తించరాదు. అట్టి భక్తునకు, భగవానుడే సర్వస్వము.

శ్రీశుక బ్రహ్మర్షి ఎంత గొప్పవాడనగా, వారి తండ్రి వేద వ్యాసుని (4 వేదములను, 18 పురాణములను వర్గీకరించగల సామర్ధ్యుడు) శుకతాతర్ (శుకుని తండ్రి) గా గుర్తించెదరు. శాస్త్రము (భగవద్విషయము) పై వారికున్న పట్టు వలన, వారు భగవానునిపై తమకున్న జ్ఞానము / అనుబంధమును ప్రకటించుకొని, సంసారులకు భోగవిషయ ప్రీతిపై గల జ్ఞానము / అనుబంధము కారణముగా వారితో సంబంధమును తెగతెంపులు చేసుకొనిరి.

అద్య ప్రబృతి హే లోకా! యూయమ్ యూయమ్ వయమ్ వయమ్
అర్ధ కామ పర యూయమ్ నారాయణపరా వయమ్
నాస్తి సంగతిః అస్మాకమ్ యుష్మాకమ్ చ పరస్పరమ్
వయమ్ తు కింకరా విష్ణోః యూయుమ్ ఇంద్రియ కింకరః

సాధారణ అనువాదము : ఈ జగత్తులో నివసించుచున్న వారా! మీరు భౌతిక సంపదపై, భోగములపై ఆసక్తులై వున్నారు. మేము శ్రీమన్నారాయణుని సేవకై తపించుచున్నాము. మీరు మీ ఇంద్రియాలకు దాసులు. మేము శ్రీమన్నారాయణుడికి దాసులము. కావున మీతో పొత్తు కుదిరే అవకాశం లేదు.

తమ వర్ణాశ్రమముపై గాక, మన నిజమైన గుర్తింపు ఆత్మ ద్వారానే అని వారు తెలిపిరి.

నాహం విప్రో న చ నరపతిర్ నాపి వైశ్యో న శూద్రో నో వా వర్ణీ చ గృహపతిర్నో వనస్థో యతిర్వ
కింతు శ్రీమద్భువన భవనస్తిత్యపాయైక హేతోర్ లక్శ్మీభర్తుర్ నరహరితనోర్ దాసదాసస్య దాస

సాధారణ అనువాదము : నేను బ్రాహ్మణుడను, క్షత్రియుడను, వైశ్యుడను, శూద్రుడను కాను. నేను బ్రహ్మచారిని, గృహస్థుడను, వాన ప్రస్థుడను, సన్యాసిని కాను. నేను శ్రీమహాలక్ష్మి పతియైన శ్రీనరసింహుని దాసానుదాసుడను.

శుక బ్రహ్మర్షి “వర్ణాశ్రమ ధర్మమును బట్టి నా గుర్తింపు కాదు. జ్ఞానము, పరమానందము ఆధారముగా గుర్తింపు పొందిన జీవాత్మ వలన కూడ కాదు. శ్రీలక్ష్మీ నరసింహుని భక్తులకు నేను చేయు దాస్యము వలన నాకు గుర్తింపు. ఇట్టి అవగాహన కలిగిన పిదప, మనము 2 రకముల వ్యక్తులను గమనింప వచ్చును – భాగవతులు (భక్తులు), అభాగవతులు (భక్తి లేనివారు) – మరి ఏ ఇతర వర్గము లేదు” అని పలికిరి. ఆ విధముగా వారు విషయలోలులైన వారందరి నుంచి సంబంధమును తెగతెంపులు చేసుకొనిరి, శ్రీలక్ష్మీ నరసింహ ఎంపెరుమాన్ భక్తులతో చేరిరి. ఈ చరిత్రము ప్రముఖము మరియు ప్రసిద్ధమైనది.

ఇంకను, అట్టి భాగవతుల స్వరూపమును వివరించిరి:

పంచాస్త్రాంగాః పంచ సంస్కారయుక్తాః పంచార్త్యాగ్యాః పంచమోపాయనిష్ఠాః
తేవర్ణానామ్ పంచమాశ్చాశ్చ్రామాణాం విష్ణోర్భక్తాః పంచ కాల ప్రపన్నాః

సాధారణ అనువాదము : పంచాయుధములు కలవారు (శంఖము, చక్రము, మొ || నవి భగవానుని నుంచి వారసత్వముగా పొందినవి), పంచ సంస్కారములు పొందినవారు, ఆచార్య నిష్ఠలో పూర్తిగా నిమగ్నులైనవారు, పంచకాల పారాయణము (దినమును 5 భాగములుగా విభజించి అభిగామనము / మేల్కొనుట, ఉపాదానము / తిరువారాధనకై సామాగ్రి సమీకరించుట, ఇజ్జా / తిరువారాధనము, స్వాధ్యానము / శాస్త్ర అభ్యాసము, యోగము / భగవద్ ధ్యానము – ఎంపెరుమాన్ సేవ కొరకై ) – వీటికి వర్ణాశ్రమముతో సంబంధము లేకుండా విష్ణు భక్తులుగా సంబోధించుదురు.

దేవర్షి భూతాప్త నృణామ్ పితృణామ్ న కింకరో నాయమ్ ఋణీ చ రాజన్
సర్వాత్మనా యశ్శరణమ్ శరణ్యమ్ నారాయణమ్ లోకగురుమ్ ప్రపన్నః

సాధారణ అనువాదము : విశ్వ గురువైన శ్రీమన్నారాయణునికి సంపూర్ణ శరణాగతి చేసిన వారు, ఋషులకు, దేవతలకు, ప్రజలకు, పితరులకు మరి ఏ ఇతరులకు ఋణగ్రస్తులు కారు.

కాబట్టి, పండితులైన జ్ఞానులు కేవలం వర్ణము, ఆశ్రమము, జ్ఞాన అనుష్ఠానములను (ఎంపెరుమాన్ పట్ల భక్తి లేకుండా అజ్ఞానులచే స్తుతింపబడేవారు) వరుసగా కుంకుమ పువ్వును మోసే గాడిదగా, చండాలుని కంటే తక్కువగా , కాలిన బూడిద వంటి పనికిరానిదిగా, మృతదేహము/వితంతువులకు చేయు అందమైన అలంకరణముల వంటివిగా భావిస్తారు. అటువంటి పండితులకు, వారు చేయు శరణాగతి వారి స్వంత నిష్ఠ / అర్హతపై ఆధారపడి ఉంటుంది. అనగా..

  • బంధము / మోక్షము రెండింటికీ సామాన్యమైన ఈశ్వరుడు లేదా మోక్షమును మాత్రమే చూస్తున్న ఆచార్యుడు,
  • ఈశ్వరునకు పూర్తిగా శరణాగతి చేసిన వారు గాని లేదా వారి స్వంత ఆచార్యుల పట్ల ఉన్న విపరీతమైన అనుబంధము కారణముగా అత్యంత అనుకూలమైన వారు గాని

అందుకే, ఆళ్వాన్ “న చేత్ రామానుజేత్ యేషా చతుర చతురాక్షరి; కామావస్థం ప్రపధ్యంతే జంతవో హంత మాదృశః” అనిరి. ఇక్కడ వారు “నారాయణ” మరియు “రామానుజ” అనే పదములను స్పష్టముగా గుర్తించిరి – ఇక్కడ నారాయణ అను పదము, బంధ మోక్షములు రెండింటికీ సాధారణము అయితే, రామానుజ అను పదము కేవలము మోక్షముపై మాత్రమే దృష్టి కలిగినది. అందుకే రామానుజులకు “చతుర చతురాక్షరి” అనే ప్రత్యేక విశేషణము కలదు, దీని అర్థం “ఇది అత్యంత వివేకవంతమైన నాలుగు అక్షరముల పదము” అని అర్థం.

అనువాదకుని గమనిక: ఈ విధంగా, శ్రీవైష్ణవుల పుట్టుకతో సంబంధము లేకుండా వారి దివ్య మహిమలను మనము గమనించాము.

సశేషం….

అడియేన్ బొమ్మకంటి గోపిక్రిష్ణమాచార్యులు రామానుజ దాసన్.

మూలము: http://ponnadi.blogspot.com/2013/07/anthimopaya-nishtai-16.html

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

అంతిమోపాయ నిష్ఠ – 15

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్ వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః

అంతిమోపాయ నిష్ఠ

మునుపటి వ్యాసములో, (https://srivaishnavagranthamstelugu.wordpress.com/2022/07/29/anthimopaya-nishtai-14/ ), మనము భాగవతాపచారము వల్ల కలిగే దుష్పరిణామములను గమనించితిమి. ఈ వ్యాసములో, మనము ఆచార్యునితో మెలగుట, సేవించుట గురించి, ముఖ్యముగా ఆచార్యుని/భాగవతుని ప్రసాదము (ఉఛ్చిష్టము), శ్రీపాద తీర్థము (వారి పాదపద్మములను శుద్ధిపరచిన పుణ్య జలము) యొక్క విశిష్టతను గురించి తెలుసుకొందాము.

యోసౌ మంత్రవరమ్ ప్రాధాత్ సంసారోచ్చేద సాధనమ్
యది చేత్గురువర్యస్య తస్య ఉఛ్చిష్టమ్ సుపావనమ్

సాధారణ అనువాదము: సంసారము నుండి ఉద్ధరింపబడుటకు ఆచార్యుడు దయతో తిరుమంత్రమును ఎవరికైతే అనుగ్రహించి, వారికి తమ శేష ప్రసాదమును అనుగ్రహించిరో, దానిని శ్రేష్ఠమైనదిగా తప్పక స్వీకరించవలెను.

‘గురోర్యస్య యతోచ్చిష్టమ్ భోజ్యమ్ తత్పుత్ర శిష్యయోః’

సాధారణ అనువాదము: గురువు యొక్క శేషములను స్వీకరించుట శిష్యులకు పుత్రులకు శ్రేష్ఠము.

‘గురోరుఛ్చిష్టమ్ భుంజీత’

సాధారణ అనువాదము: గురువు యొక్క శేషములను తప్పక స్వీకరించవలెను.

పైన పేర్కొన్న ప్రమాణములు, అంతకు ముందు ఉదాహరించిన ప్రమాణములు, శిష్యులకు (ఆచార్య నిష్ఠయే అంతిమ లక్ష్యముగా నున్న వారికి) తమ ఆచార్యులే స్వయముగా సర్వేశ్వరుని అవతారమని సంపూర్ణ విశ్వాసము కలిగి, ఆచార్యుని శేష ప్రసాదము, వారి శ్రీపాద తీర్థము
(ప్రక్షాల్య చరణౌ పాత్రే ప్రణిపత్యోపయుజ్య చ; నిత్యమ్ విధివదర్ జ్ఞాత్యైర్ ఆవృత్తోభ్యర్చ్యాయేత్ గురుమ్ – ఆచార్యుని పాదపద్మములను ప్రక్షాళన గావించి వానిపై ప్రణమిల్లవలెను. వారి పాదపద్మములకు ప్రతి రోజు అర్ఘ్యప్రధానము చేసి అర్చించవలెను) మిక్కిలి శుద్ధి చేయునని, తల్లి పాలను సేవించే పసిపాపకు కలుగు తృప్తి వలే, వారికి తృప్తి నిచ్చును. ఇదియే శిష్యునికి జీవితాంతము మిక్కిలి ఆహ్లాదమును కలిగించే అంశమగును.

ఆచార్యుని పట్ల శిష్యుని ప్రవర్తనను విశదపరిచే మరికొన్ని ప్రమాణములు.

శ్రీరామానుజుని శ్రీపాద తీర్థమును స్వీకరించి వడుగనంబి పూర్ణ శుద్ధి నొందిరి.

గంగాసేతుసరస్వత్యాః ప్రయాగాన్ నైమిశాదపి
పావనమ్ విష్ణుభక్తానామ్ పాదప్రక్షాలనోదకమ్

సాధారణ అనువాదము : విష్ణు, గంగ, సేతు సముద్రము, సరస్వతి, ప్రయాగ, నైమిశారణ్యముల భక్తుని శ్రీపాద తీర్థము మిక్కిలి శుద్ధి గలది (ఇతరులను శుద్ధి చేయు శక్తి కలది)

శ్రీరామానుజుని శ్రీపాద తీర్థము స్వీకరించి దుష్ట ఆలోచనలున్న వ్యాపారులు కూడా శుద్ధి నొందిరి

యత్ తత్సమస్తపాపానామ్ ప్రాయశ్చిత్తమ్ మనీషిభిః
నిర్ణీతమ్ భగవద్భక్తపాదోదక నిషేవణమ్

సాధారణ అనువాదము : భగవత్ భక్తుల శ్రీపాద తీర్థమును స్వీకరించిన వివిధ పాపముల నుండి ముక్తి కలుగునని జ్ఞానులు తేల్చిరి.

ముదలియాండన్ శ్రీపాద తీర్థముచే గ్రామస్థులు శుద్ధి నొందిరి

తిస్రః కోట్యర్థకోటీ చ తీర్థాని భువనత్రయే
వైష్ణవాంఘ్రి జలాత్ పుణ్యాత్ కోటి భాగేన నో సమః

సాధారణ అనువాదము : ముల్లోకాలలోని (ఊర్ధ్వ, భూ, అధో లోకాలు) పుణ్య నదులను పరిశీలించినను, ఒక వైష్ణవుని శ్రీపాద తీర్థముతో కొంచెము కూడ పోల్చబడదు.

ప్రాయశ్చిత్తమ్ ఇదమ్ గుహ్యమ్ మహాపాతకినామపి
వైష్ణవాంగ్రి జలమ్ శుభ్రమ్ భక్త్యా సంప్రాప్యతే యది

సాధారణ అనువాదము : అత్యంత ఘోర పాపాత్ములకు కూడ విశ్వసనీయమైన ప్రాయశ్చిత్తము విష్ణు భక్తుని దోష రహితమైన శ్రీపాద తీర్థము స్వీకరించుటే.

నారదస్యాతితేః పాదౌ సర్వాసామ్ మందిరే స్వయమ్
కృష్ణ ప్రక్షాల్య పాణిభ్యామ్ పాపౌ పాదోదగమ్ మునేః

సాధారణ అనువాదము : శ్రీ కృష్ణుడు స్వయముగా మహర్షులైన నారదుడు, అధీతి వంటి వారి పాదములను కడిగి ఆ జలమును స్వీకరించిరి.

పెరుమాళ్ తిరుమొళి 2.3

‘తొణ్డర్ శేవడి చ్చెళుం శేఱు ఎన్ శెన్నిక్కణివనే’

సాధారణ అనువాదము : భక్తుల పాదపద్మములచే పవిత్రమైన (తొక్కబడిన) ఈ మృత్తిక నా శిరమునలంకిరించగలదు.

పెరుమాళ్ తిరుమొళి 2.2

‘తొణ్డరడిప్పొడి ఆడ నామ్ పెఱిల్ గంగై నీర్ కుడైన్ దాడుమ్ వేట్కై ఎన్నావదే’

సాధారణ అనువాదము : శ్రీమన్నారాయణుని సదా తలంచు పావనులైన శ్రీవైష్ణవుల పాదపద్మములపై బాంధవ్యమేర్పడిన వారికి, గంగలో మునిగి స్నానము చేయుట కూడ ఆకర్షణీయము కాదు.

తత్ పాదాంబుధూలం తీర్థమ్ తదుఛ్చిష్టమ్ సుపావనమ్
తదుక్తిమాత్రమ్ మంత్రాగ్ర్యమ్ తత్ స్ప్రుష్టమ్ అఖిలమ్ శుచి

సాధారణ అనువాదము : వారి పాద పద్మములను కడిగిన జలము పావనము; వారి ఉఛ్చిష్టము స్వచ్చము; వారి పలుకులు మహా మంత్రములు; వారిచే స్పృశించబడినవి శుద్ధమైనవి (దోషరహితములు)….

కోటిజన్మార్జితమ్ పాపమ్ జ్ఞానతోజ్ఞానతః కృతః
సత్యః ప్రదహ్యతే నృణామ్ వైష్ణవ ఉఛ్చిష్ట భోజనాత్

సాధారణ అనువాదము : శ్రీవైష్ణవుని ఉచిష్టమును భుజించినచో, అనేక జన్మల నుంచి తెలిసో/తెలియకో చేసిన పాపములన్నియు దగ్ధమవును.

తిరుమాలై 41

‘పోణగమ్ చెయ్త చేతమ్ తరువరేల్ పునిదమన్ఱే’

భగవానుని యొక్క మిక్కిలి సాధుపుంగవులైన భక్తులు తమ ఉచ్చిష్టమును ప్రసాదించి ఆశీర్వదించినచో మాత్రమే (అనగా, దానిని పొందుట అతి దుర్లభము)

ఈ విధముగా, పైన పేర్కొన్న ప్రమాణముల ద్వారా, మనము మన ఆచార్యులతో సమానులు, సత్వగుణ సంపన్నులు, మిక్కిలి జ్ఞానులు, అంకిత స్వభావులు, భౌతిక విషయ వాంఛారహితులైన గొప్ప భక్తుల ప్రసాదము, శ్రీపాద తీర్థమునకై ఎదురు చూచి, వానిని స్వీకరించవలెను. వారి ప్రసాదమును,  శ్రీపాద తీర్థమును ప్రేమతో మాత్రమే గాని మొక్కుబడిగా శాస్త్రము తెలిపినదని స్వీకరించరాదు. కారణము, అది శ్రీవైష్ణవులపై జీవాత్మ యొక్క దాస్యత్వమునకు నిదర్శనము మరియు జీవాత్మను నిలబెట్టును.

దీనినే ఇంకను వివరించిరి. ఆపస్థంభ ఋషి “శరీరమేవ మాతాపితరౌ జనయతః” అని ఆదేశించిరి.

(మాతా పితరులు ఈ శరీరమును ప్రసాదించిరి)

‘పితుః జ్యేష్టస్య బ్రాతురుచ్చిష్టమ్ భోక్తవ్యమ్’

(తమ పితరుల మరియు జ్యేష్ఠ సోదరుల ప్రసాదమును స్వీకరించవలెను) శిష్యులు / పుత్రులు పితరుల ప్రసాదమును స్వీకరించవలెను. ఆ ఋషియే ఈ విధముగా ఆదేశించిరి
“స హి విద్యాతస్తమ్ జనయతి; తచ్చ్రేష్టమ్ జన్మః”

(అతను తప్పక ఒక జ్ఞానునికి జన్మనిచ్చును. ఇది శ్రేష్ఠమైన జన్మ) ఆచార్యుడు యధార్థమైన జ్ఞానమును అనుగ్రహించును కనుక, వారిని విశిష్ఠ (ఆధ్యాత్మిక) పితరులుగా భావించవలెను. మన శారీరిక సంబంధము వల్ల పితరులైన వారి ప్రసాదమును ఎట్లు స్వీకరించెదమో, అదే విధముగా ఆధ్యాత్మిక పితరులైన (తమ ఆచార్యునికి సమానులైన గొప్ప భాగవతులు) వారి ప్రసాదమును, శ్రీపాద తీర్థమును కూడ స్వీకరించవలెను. సదాచార్యతుల్యులు అనగా (ఆచార్యునికి సమానులైన భాగవతులు) “ఆచార్యవత్ దైవన్ మాతృవత్ పితృవత్ ” (శ్రీవైష్ణవులు ఆచార్యులుగా, భగవానునిగా, మాతా పితరులుగా), తమ ఆచార్యునితో సమముగా శ్రీవైష్ణవులను భావించి ఆదరించవలెను.

ఇంకా, శ్రీ వచన భూషణంలో పిళ్ళై లోకాచార్యుల దివ్య వక్కుల ప్రకారం స్వచ్ఛమైన భాగవతుల గురించి ఈ విధంగా వివరించబడింది..

సూత్రము 259

‘అనుకూలరాగిరార్ జ్ఞానభక్తివైరాగ్యన్గళ్ ఇట్టు మాఱినాప్పోలే వడివిలే తొడై కొళ్ళలామ్పడియిరుక్కుమ్ పరమార్ త్తర్’

సాధారణ అనువాదము : అత్యంత జ్ఞానము (నిజమైన ప్రజ్ఞ), భక్తి (శ్రద్ధ), వైరాగ్యము (భౌతిక వాంఛలనుంచి దూరము), పరమపదము పొందవలెనని కోరిక వున్నవారు అనుకూల వ్యక్తులు. వారిని చూడగానే, అందరు వారితో సంబంధమునకై స్ఫూర్తి కలిగి – వారికి ఎల్ల వేళలా గల ప్రేమాతిశయము ద్వారా భగవానునితో వారికి గల అమిత అనుబంధమును గమనించవచ్చును.

సూత్రము 223

‘అతావతు, ఆచార్యతుల్యర్ ఎన్ఱుమ్ సంసారిగళిలుమ్, తన్నిలుమ్, ఈశ్వరనిలుమ్ అధికర్ ఎన్ఱుమ్ నినైక్కై’

అనగా, శ్రీవైష్ణవులు ఆచార్యునితో సమానులు. వారు సంసారులు (విషయ వాంఛాపరులు), స్వీయులు, స్వయముగా భగవానుని కన్నా ఆదరణీయులు.

సూత్రము 451

‘…అనుకూలర్ ఆచార్య పరతంత్రర్…’

తమ ఆచార్యునిపై సంపూర్ణ విశ్వాసము గల శిష్యునికి, మిక్కిలి ఇష్టులైన వారు ఎవరనగా వారి ఆచార్యునిపై పూర్తిగా ఆధారులైన వారు.

రామానుజ నూఱ్ఱందాది పాశురములలో ఈ సూత్రమునే తిరువరంగత్తు అముదనార్ గుర్తించిరి.

పాశురము 85

‘ఇరామానుజనైత్ తొళుం పెరియోర్ పాదమల్లాల్ ఎన్ఱన్ ఆరుయిర్కు యాదొన్ఱుమ్ పఱ్ఱిల్లైయే’

శ్రీరామానుజుని ఆరాధించే గొప్ప భాగవతుల పాదపద్మములు మాత్రమే నా మనస్సుకు శరణాగతి – ఇతరములేవియును కాదు.

పాశురము 105

‘ఇరామానుజనైత్ తొళుం పెరియోర్ ఎళుంతిరైత్తాడుమ్ ఇడం అడియేనుక్కిరుప్పిడమే’

శ్రీ రామానుజుని ఆరాధించి, వారి మహిమలను గానముగా, నృత్యముగా గొప్ప భాగవతులు ఎచట చేయుదురో, అదియే నా నివాసము.

కావున, భాగవతులనగా భౌతిక విషయ వాంఛారహితులు, ఆచార్యునికి శరణాగతి చేసినవారికి విధేయులు. అట్టి ఆచార్య నిష్ఠాపరుల సేవలో సదా నిమగ్నమైన వారు.

సర్వజ్ఞులైన మన ఆచార్యులు ఈ సూత్రమునే మిక్కిలి స్పష్టముగా తగిన ప్రమాణముల ద్వారా వివరించిరి. ఇతరులు కూడ దీనినే వివరించిరి. దీనినే పిళ్ళై లోకాచార్యులు రామానుజ నూఱ్ఱందాదిలో వివరించుట గమనించవచ్చును.

పరమ సాత్వికుల మధ్య శ్రీరామానుజులు

పాశురము 80

నల్లార్ పరవుమ్ ఇరామానుజన్ తిరు నామమ్
నంబ వల్లార్ తిఱత్తై మఱవాతవర్గళ్ ఎవర్
అవర్కే ఎల్లా విటత్తిలుమ్ ఎన్ఱుమ్ ఎప్పోతిలుమ్ ఎత్తొళుంబుం
చొల్లాల్ మనత్తాల్ కరుమత్తినాల్ చెయ్వన్ చోర్విన్ఱియే

సాధారణ అనువాదము: పరమ సాత్వికులైన శ్రీరామానుజులకు శరణాగతి చేసిన, వారి దివ్య నామమును సదా స్మరించు, భాగవతులను నేను సేవించెదను. వారి కొరకు నేను అన్ని స్థలములలో, అన్ని వేళలలో, అన్ని విధములుగా మనసా వాచా కర్మణా సేవ చేయుదును.

పాశురము 107

ఇన్బుఱ్ఱ శీలత్తిరామానుజ, ఎన్ఱుమ్ ఎవ్విటత్తుమ్
ఎన్బుఱ్ఱ నోయుడల్ తోఱుమ్ పిఱన్తిఱన్తు
ఎణ్ణరియ తున్బుఱ్ఱు వీయినుమ్ సొల్లువతొన్ఱుణ్డు
ఉన్ తొణ్డర్కట్కే అన్బుఱ్ఱిరుక్కుమ్ పడి, ఎన్నై ఆక్కి అన్గాట్పడుత్తే

సాధారణ అనువాదము : ప్రియ రామానుజ! నేను అత్యంత అల్పుడనైనను, మీరు మిక్కిలి కరుణచే నా మనస్సున విచ్చేయుట మీ ఆశీర్వాదముగా భావించెదను. నాకొక చిన్న కోరిక కలదు. నేను అనేక అల్ప జన్మలు పొందినను, రోగగ్రస్థుడనైనను, ఎచట ఏ స్థితిలో జన్మించినను మీ ప్రియ సేవకులకు నేను సంపూర్ణ శరణాగతి చేయునట్లు అనుగ్రహించుడు.

కూరత్తాళ్వాన్ ప్రియ తనయులైన పరాశర భట్టర్ భగవద్విషయముపై (తిరువాయ్మొళి కాలక్షేపము) ఒక పెద్ద గోష్ఠిలో ప్రసంగించుచుండగా, ఆళ్వాన్ సతీమణి ఆండాళ్ (భట్టర్ కు తల్లి) అచ్చటకు విచ్చేసి, తమ తనయుని ముందు మోకరిల్లి, శ్రీపాద తీర్థమును గైకొనిరి. దీనిని చూచిన గోష్ఠిలోని ఒక శ్రీవైష్ణవుడు “ఒక తల్లి తన పుత్రుని ముందు మోకరిల్లి వారిచే శ్రీపాద తీర్థమును స్వీకరించుటయా?” అనిరి. అతనికి, గోష్ఠికి సమాధానముగా ఆండాళ్ “ప్రియ పుత్రులారా! ఎవరైనను ‘ఇతరుల కొరకు ఇతరులచే ప్రతిష్టింపబడిన భగవానుని తీర్థ ప్రసాదములను స్వీకరింపవచ్చునని, కాని నాచే ప్రతిష్టింపబడిన ఎంపెరుమాన్ నుంచి దానిని నేనెట్లు స్వీకరించవచ్చును?’ అనినచో, అట్టి వారు కఠినాత్ములు మరియు సరియైన జ్ఞానము పొందని వారు – అవునా?” అనిరి. ఈ సంఘటనను అళగియ పెరుమాళ్ నయనార్ తమ తిరుప్పావై వ్యాఖ్యానములో వివరించిరి. ఆండాళ్ తమ పుత్రుని నుంచి తీర్థమును ఎందుకు అంగీకరించిరి? ఎందుకనగా :

‘న పరీక్ష్యవయో వంధ్యాః నారాయణపరాయణాః’

శ్రీమన్నారాయణుని భక్తుని వయస్సును, సామర్ధ్యతను బట్టి నిర్ణయించరాదు. పెరుమాళ్ తిరుమొళి – 7.6 – ‘వణ్ణచ్చెమ్ శిఱుకైవిరలనైత్తుమ్ వారి వాయ్ క్కొణ్డ అడిశిలిన్ మిచ్చల్ ఉణ్ణప్పెఱ్ఱిలేనో కొడువినైయేన్…’

దేవకి భావములో కులశేఖరాళ్వార్ – కృష్ణుడు తన అందమైన ఎర్రని వ్రేళ్లతో గుప్పెడు అన్నమును అందుకొని ఆరగించినప్పుడు, నోటి నుండి జారి పడిన ముద్దలను నేను తినలేక పోవుట మిక్కిలి దురదృష్టకరము అని గానము చేసిరి.

అనువాదకుని గమనిక : ఈ విధముగా, మనము ఆచార్యులతో,  శ్రీవైష్ణవులతో వ్యవహరించు సరియైన ఆచారములను, ఆచార్య/భాగవత ప్రసాదము, శ్రీపాద తీర్థ మహిమలను గమనించితిమి. తదుపరి భాగములో, తమ జన్మతో సంబంధము లేకుండా శ్రీవైష్ణవుల విశిష్టతను వివరముగా తెలుసుకొనెదము.

కొన్ని సంస్కృత ప్రమాణములను అనువదించుటకు సహకారమునిచ్చిన శ్రీరంగనాథన్ స్వామికి కృతజ్ఞతలు.

సశేషం….

అడియేన్ బొమ్మకంటి గోపిక్రిష్ణమాచార్యులు రామానుజ దాసన్.

మూలము: http://ponnadi.blogspot.com/2013/07/anthimopaya-nishtai-15.html

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

అంతిమోపాయ నిష్ఠ – 14

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్ వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః

అంతిమోపాయ నిష్ఠ

మునుపటి వ్యాసములో, https://srivaishnavagranthamstelugu.wordpress.com/2022/07/18/anthimopaya-nishtai-13/, మనము ఆచార్య అపచారము, వాని యొక్క దుష్పరిణామముల గురించి వివరముగా గమనించాము. ఈ భాగములో మనము భాగవత అపచారము గురించి అవగాహన చేసుకొందాము.

ఇప్పుడు మనము భాగవత అపచారమును తిలకించెదము .

శ్రీ వచన భూషణము 307 వ సూత్రం – ‘ఇవై యొన్ఱుక్కొన్ఱు క్రూరన్గళుమాయ్, ఉపాయ విరోధిగళుమాయ్, ఉపేయ విరోధిగళుమాయ్ యిరుక్కుమ్’

సాధారణ అనువాదము: ఇవి (అకృత్య కరణము – శాస్త్రవిరుద్ధమైనవి చేయుట,
భగవత్ అపచారము – భగవానుని పట్ల తప్పు చేయుట, భాగవత అపచారము – భాగవతుల పట్ల తప్పు చేయుట, అసహ్యాపచారము – అకారణముగా భగవత్ / భాగవతుల పట్ల అపచారము చేయుట) అన్నియు మునుపు దాని కంటే అతి క్రూరమైనవి. అనగా, భగవత్ అపచారము అకృత్య కరణము కన్నా క్రూరమైనది, భాగవత అపచారము భగవత్ అపచారము కంటే క్రూరమైనది, అసహ్యాపచారము భాగవత అపచారము కంటే క్రూరమైనది. ఇవన్నీ మన సాధనములకు, మన అంతిమ లక్ష్యము పొందుటకు అవరోధములు.

కూరత్తాళ్వాన్ శిష్యులైన వీర సుందర బ్రహ్మ రాయన్ (ఆ ప్రాంతపు రాజు) ఒకసారి ఆళ్వాన్ కుమారులైన పరాశరభట్టర్ పై శత్రుత్వమును పెంచుకొనిరి. వారు భట్టర్ ను వేధించగా, ఆ బాధను భరించేక శ్రీరంగమును వీడి, తిరుక్కోష్ఠియూర్ చేరిరి. భట్టరే స్వయముగా ఈ విషయమును తమ శ్రీరంగరాజ స్తోత్రము 5 వ శ్లోకములో వెల్లడించిరి.

పూగీ కణ్ఠద్వయస సరస స్నిగ్ధ నీరోపకణ్ఠాం
ఆవిర్మోద స్తిమిత శకునానూదిత బ్రహ్మఘోషామ్
మార్గే మార్గే పధికనివహై రుంజ్య మానాపవర్గాం
పశ్యేయం తాం పునరపి పురీం శ్రీమతీం రఙ్గధామ్నః

సాధారణ అనువాదము: పచ్చని చేట్లు నీటి వనరులతో, దివ్య సంపద సౌందర్యాలతో అలరారుతూ, మనస్సునకు ఆహ్లాదమును చేకూర్చే శ్రీరంగ దివ్య దేశమును మరలా ఎప్పుడు చూస్తానో?  అక్కడి పక్షులు నిరంతరము చేయు వీనులవిందైన శబ్దాలు, వేద ఘోషను పోలి ఉండును. ఆ దివ్య దేశం దారి మోక్ష సాధకుల సమూహముతో నిండి వుంటుంది.

తిరుక్కోష్ఠియూర్లో సౌమ్య శ్రీనారాయణ ఎంపెరుమాన్ పాదపద్మముల చెంత నంజీయర్ తో పాటు భట్టర్ – కాని వారి మనస్సు శ్రీరంగం లోనే

పై శ్లోకము ద్వారా, భట్టర్ తాను శ్రీరంగము, శ్రీరంగనాధుని నుండి దూరమగుట వలన కలిగిన వేదనను వెల్లడించిరి. ఆ సమయములో ఒక శ్రీవైష్ణవుడు భట్టరు వద్దకు వచ్చి, వారిని సేవించి, తనకు తిరువిరుత్తము బోధించమని అభ్యర్థించిరి. భట్టరు తన శిష్యుడైన నంజీయర్ వంకకు తిరిగి “జీయ! శ్రీరంగానికి,  రంగనాధునికి దూరమైన నేను, ఏ విషయము గురించి మాట్లాడలేను. తిరువిరుత్తం అర్థాలను నీవు ఈ శ్రీవైష్ణవునికి వివరించుము” అని పలికి, ఆ శ్రీవైష్ణవునికి నంజీయర్ పాదపద్మములను చూపిరి. తదుపరి కొంత కాలము గడచిన పిదప, భట్టర్ ను కష్టముల పాలు చేసిన వీర సుందర బ్రహ్మ రాయన్ గతించిరి. భట్టర్ తల్లి ఆండాళ్ ను కొందరు శ్రీవైష్ణవులు కాపాడుచు, వారి ఉపదేశములను పాటించుచుండిరి, ఈ వార్తను ఆలకించి, తమ ఉత్తరీయమును గాలిలోనికి ఎగురవేసి సంబరములు జరుపుకొనిరి. దీనిని గమనించి ఆండాళ్ తమ తీరుమాళిగకు వెనువెంటనే చేరి, ద్వారములు మూసి, బిగ్గరగా రోదించసాగిరి. గొప్పగా సంబరములలో నున్న ఆ శ్రీవైష్ణవులు, ఆండాళ్ వైపునకు తిరిగి “భట్టర్ వారి శత్రువు గతించినందులకు మీరు సంతోషముగా లేరా, భట్టర్ ఇచ్చటకు తిరిగి వచ్చెదరు కదా! మనమంతా కలిసి గొప్ప సత్సంగము చేయమా? ” అని అడిగిరి.

ఆండాళ్ సమాధానముగా “మీకు తెలియదు. వీర సుందర బ్రహ్మ రాయన్ ఆళ్వాన్ శిష్యులు. కాని వారు భట్టర్ను మిక్కిలి కష్టపెట్టి మహాపరాధమును ఒడిగట్టుకొనిరి. దీనికి తోడు అతను భట్టర్ వారిని మరల కలువలేదు, నేను అపరాధము చేసితినని, దయతో నన్ను క్షమించమని వారి పాదపద్మములపై శిరస్సు వంచి క్షమాభిక్షను కూడా కోరలేదు. ఇప్పుడు వారు గతించిరి కూడా. వారు తమ తనువును వీడిన వెంటనే యమధర్మరాజు భటులు వారిని తీసుకొని వెళ్ళిరి. వారి చేతులలో, వారు అనుభవించు బాధలను నేను తట్టుకోలేను. మీరు, నా ఈ భావనను గ్రహించలేరు” అనిరి. ఈ విధముగా నా ఆచార్యులు (మాముణులు), భాగవత అపచార ఫలము క్రూరముగా నుండునని తెలిపిరి.

భట్టర్ శిష్యులైన కడక్కత్తు ప్పిళ్ళై చోళ మండలము (ఒక ప్రాంతము) లో నివసించుచుండగా, ఉడయవర్లచే సంపూర్ణ శిక్షణ పొందిన సోమాసియాండన్ గురించి వినిరి. సోమాసియాండన్ తిరునారాయణపురంలో నివసించుచు అనేకులకి శ్రీభాష్యముపై శిక్షణనిచ్చెడి వారు. పిళ్ళై, తిరునారాయణపురము జేరిరి. వారిని దర్శించిన సోమాసియాండన్ అమితానందమును పొంది తమ తీరుమాళిగలో బస చేయమని వారిని ఆహ్వానించిరి. తదుపరి పిళ్ళై ఒక సంవత్సర కాలము శ్రీభాష్యము, భగవద్విషయము ఇత్యాదులపై ఆండాన్ ఉపదేశమును శ్రవణము చేసిరి. శాత్తుముఱై (చివరి సమావేశము) పిదప, పిళ్ళై తమ తిరుగు ప్రయాణము ప్రారంభించిరి. పిళ్ళైకు తోడుగా ఆండాన్ తిరునారాయణపురం సరిహద్దుల వరకు వెళ్ళిరి (అనువాదకుని గమనిక: సందర్శకులుగా వచ్చిన శ్రీవైష్ణవులను గ్రామ సరిహద్దు వరకు లేక నీటి వసతి వరకు కలిసి వెళ్లి, ఘనముగా సాగనంపుట శ్రీవైష్ణవుల యొక్క ఆచారము), “మీరు ఇచ్చట ఒక సంవత్సర కాలము నివసించుట నాకు గర్వకారణము; ఇప్పుడు మీ ఎడబాటు నాకు మిక్కిలి విచారకరముగా ఉంది: నేను దేనిని ఆశ్రయించాలి  అను విలువైన ఆదేశమును ఇచ్చి దీవించుడు” అని పలికిరి. పిళ్ళై “సోమాసియాండన్! మీరు గొప్ప జ్ఞానులు, శ్రీభాష్యము మరియు భగవద్విషయము రెంటిపై నిష్ణాతులు. అయినను, మీరు భాగవత అపచారము చేయరాదని సదా జ్ఞప్తికి వచ్చుటకై, మీ ఉత్తరీయమునకు ఒక ముడిని బిగించిరి” అని సమాధానమిచ్చిరి. ఈ సంఘటనను నా ఆచార్యులు (మాముణులు) వెల్లడించిరి. (అనువాదకుని గమనిక : పై ఉత్తరీయమునకు ముడి బిగించుట ఒక ఆచారము, దానిని చూచినంతనే మరచిన విషయము స్ఫురణకు రాగలదు).

ప్రాతుర్భావై స్సురనరసమో దేవదేవస్తదీయాః జాత్యా వృత్తేర్ అపి చ గుణతః తాదృశో నాత్ర గర్హా
కింతు శ్రీమద్బువనభవన త్రాణతోన్యేషు విద్యావృత్తప్రాయో భవతి విధవాకల్పకల్పః ప్రకర్శః

సాధారణ అనువాదము : పరమాత్మ భక్తులు, వారి జన్మ , కులము, చర్యలు లేక గుణముల వలన మానవులను కాని దేవతలను కాని పోలి ఉండుటచే, వారు యధార్ధముగా స్వయముగా పరమాత్మకు సమానులు. వారిని నిందించరాదు. వారు పెరుమాళ్ళ ఆలయములను, వాటి భూములను కాపాడుచుందురు. వారు జ్ఞాన అనుష్ఠానములలో ప్రవీణులు. వారు పండితులలో ఆభరణముల వలె అద్భుత కాంతి కలిగి ఉందురు.

అర్చావతారోపాదానమ్ వైష్ణవోత్పత్తి చింతనమ్
మాతృయోని పరీక్ష్యాస్తుల్యమాహూర్ మనీషిణః

సాధారణ అనువాదము : పండితవర్యులు గుర్తించినట్లు, ఎంపెరుమానుని దివ్య అర్చా రూపమును, దాని ముడి పదార్ధము ఆధారముగా యోగ్యత నిర్ణయించుట, ఒక వైష్ణవుని అతని జన్మ ఆధారముగా అర్హత నిర్ణయించుట అనేది తమ స్వంత తల్లి శీలమును అనుమానించుటతో సమానము.

అర్చాయామేవ మామ్ పస్యన్ మద్భక్తేషుచ మామ్ దృహన్
విషదగ్దైర్ అగ్నిదగ్దైర్ ఆయుదైర్హన్తిమామసౌ

సాధారణ అనువాదము : నన్ను నా భక్తులలో కాక, ఒక అర్చావతారములో మాత్రమే దర్శించుట, నన్ను తీవ్రమైన విషము, అగ్ని మరియు ఆయుధములతో గాయపరచుటతో వంటిది.

యా ప్రీతిర్మయి సంవృత్తా మద్భక్తేషు సదాస్తు తే
అవమానక్రియా తేశామ్ సంహరతి అఖిలమ్ జగత్

సాధారణ అనువాదము : భక్తులపై నాకు గల ప్రేమ సదా పెరుగుచూ నుండును. ఎంతనగా అనగా వారికి అవమానము జరిగినచో ఈ జగత్తునంతను అంతము చేయు వరకు కూడ వెళ్లును.

మద్భక్తమ్ స్వపచమవాపి నిందామ్ కుర్వంతి యే నరాః
పద్మకోటి శతేనాపి న క్షమామి కథాచన

సాధారణ అనువాదము : నా భక్తునిపై నిందారోపణలు చేయు వారిని, వారు ఛండాలుడైనను, కొన్ని లక్షల సంవత్సరములు గడచినను, నేను వారిని క్షమించను.

చండాలమపి మద్భక్తమ్ నావమన్యేత బుద్దిమాన్
అవమానాత్ పదత్యేవ రౌరవే నరకే నరః

సాధారణ అనువాదము : నా భక్తుని, అతను ఛండాలుడైనా సరే, ఒక తెలివైన వ్యక్తి అవమానము చేయరాదు, కారణము అతను నా భక్తుని అవమానపరిస్తే నిశ్చయముగా రౌరవాది నరకములో పడును.

అశ్వమేధ సహస్రాణి వాజపేయ సతానిచ
నిష్కృతిర్ నాస్తి నాస్త్యేవ వైష్ణవ ద్వేషినామ్ నృణామ్

సాధారణ అనువాదము : వైష్ణవులపై ద్వేషము కల వారు, ఒక సహస్ర అశ్వమేధ యాగములు లేక నూరు వాజపేయ యాగములు జరిపినను నిష్కృతి లేదు.

శూద్రమ్ వా భగవత్ భక్తమ్ నిషాదమ్ స్వపచమ్ తథా
ఈశతే జాతి సామాన్యాన్ స యాతి నరకమ్ దృవమ్

సాధారణ అనువాదము : భగవత్ భక్తుడిని జన్మతః శూద్రుడు, నిషాదుడు లేక స్వపచ అనే దృష్టితో వివక్షగా ఎవరైతే చూచెదరో, వారు ఘోరమైన నరకమును జేరెదరు.

అనాచారాన్ దురాచారాన్ అజ్ఞ్యాతౄన్ హీనజన్మనః
మద్భక్తాన్ శ్రోత్రియో నిందన్ సత్యాస్ చండాలతాం వ్రజేత్

సాధారణ అనువాదము : వేదములలో పండితుడైన వ్యక్తి, నా భక్తులకు నిబద్ధత, న్యాయము, జ్ఞానము లేదని నిందను మోపితే, అతను నిశ్చయముగా ఛండాల గుణమును పొందును.

అపిచేత్ సుదురాచారో భజతే మామనన్యభాక్
సాధురేవ స మంతవ్యః సమ్యక్ వ్యవసితో హి సః

సాధారణ అనువాదము : అత్యంత ఘోరమైన కార్యములు చేసినను, నా భక్తుడైనచో, అతనిని పవిత్రునిగా భావించాలి.

సర్వైశ్ఛ లక్షణైర్యుక్తో నియతశ్చ స్వకర్మసు
యస్తు భాగవతాన్ ద్వేష్టి సుదూరమ్ ప్రచ్యుతో హి సః

సాధారణ అనువాదము : ఎవరైతే అన్ని సుగుణములు కలిగి ధర్మ బద్ధమైన కార్యములలో నిబద్ధతో నున్నను, అతను భగవానుని భక్తులపై ద్వేషముగా వున్నచో సుదూర ప్రాంతములకు బహిష్కృతుడగును.

తిరుమాలై 43

అమర ఓర్ అంగమాఱుం వేదమోర్ నాన్గుమోది
తమర్గళిల్ తలైవరాయ శాది అంతణర్గళేలుమ్
నుమర్గళై ప్పళిప్పరాగిల్ నొడిప్పదోర్ అళవిల్
ఆంగే అవర్గళ్ తామ్ పులైయర్ పోలుమ్ అరంగమానగరుళానే

సాధారణ అనువాదము : ప్రియ శ్రీరంగనాధ! నాలుగు వేదాలు, ఆరు వేదాంగాలలో నిష్ణాతులై, వైష్ణవులలో అగ్రగణ్యులైన బ్రాహ్మణులైనను, నీ భక్తులకు మనస్తాపము కలిగించినచో వెంటనే, అక్కడే, వారు అత్యల్పులగుదురు.

శ్రీవచన భూషణము 192వ సూత్రం –  “ఈశ్వరనవతరిత్తు ప్పణ్ణిన ఆనైతొళిల్ కళెల్లామ్ భాగవతాపచారమ్ పొఱామై” ఎన్ఱు జీయర్ అరుళిచ్చెయ్వర్

సాధారణ అనువాదము : తన భక్తులకు మనస్తాపము కలిగినచో భరించలేడు కనుక భగవానుడు ప్రత్యక్షమై అనేక క్లిష్ట కార్యములను జరిపినట్లు నంజీయర్ ప్రముఖముగా తెలిపిరి.

శ్రీవచన భూషణము 194 – 197 వ సూత్రం – ‘భాగవతాపచారం తాన్ అనేక విధమ్; అతిలే యొన్ఱు అవర్గళ్ పక్కల్ జన్మ నిరూపణమ్;  ఇతుతాన్ అర్చావతారత్తిల్ ఉపాదానస్మృతియులుమ్ కాట్టిల్ క్రూరమ్; ఆత్తై మాతృ యోని పరీక్షై యోడోక్కుమ్ ఎన్ఱు శాస్త్రమ్ శొల్లుమ్.’

సాధారణ అనువాదము : భాగవతాపచారము పలు విధములు. జన్మ ఆధారముగా అర్హతను నిర్ణయించుట వానిలో ఒక విధము. దివ్య అర్చామూర్తిగా వున్న ఎంపెరుమానుని ముడి పదార్ధము ఆధారముగా అర్హత నిర్ణయించుట కంటే ఇది క్రూరమైనది. శాస్త్రము ప్రకారము, దివ్య అర్చామూర్తిగా నున్న ఎంపెరుమాన్ అర్హతను నిరూపించుట అనగా తన స్వంత తల్లి శీలమును అనుమానించుటతో పోల్చవచ్చును.

శ్రీవచన భూషణము 198 వ సూత్రం –  ‘త్రిశంకువైప్పోలే కర్మ చండాలనాయ్ మార్విలిట్ట యజ్ఞోపవీతమ్ తానే వారాయ్విడుమ్’

సాధారణ అనువాదము : భాగవతాపచారము చేసిన వారు, త్రిశంకు వలె కర్మ ఛండాలుడు (తన చర్యల ద్వారా ఈ జన్మలోనే ఛండాలుడగుట ) అగుట, తన యజ్ఞోపవీతమే ఉరితాడు అయి, కంఠమును బిగించి నులిమి వేయును.

శ్రీవచన భూషణము 199 – 200 వ సూత్రం – జాతి చండాలనుక్కు క్కాలాన్తరత్తిలే భాగవతనాకైక్కు యోగ్యతై యుణ్డు. అతువుమిల్లై యివనుక్కు; ఆరూఢ పతితనాకైయాలే.

సాధారణ అనువాదము : జన్మతః చండాలునికి, ఏదో ఒక సమయములో, భాగవతుడగు అవకాశము కలదు. కాని కర్మ ఛండాలునికి అట్టి ఆశ మృగ్యము ఏలనన అతను అత్యున్నత స్థానము నుంచి దిగజారుటచే.

మన సమాజమునకు నాయకులైన ఆళ్వార్లు, శ్రీవైష్ణవులని గొప్పగా కీర్తించెదరు, ఒక శ్రీవైష్ణవుడు మరియొక శ్రీవైష్ణవుడు తమతో సమానుడనే భావన కూడ భాగవతాపచారమే అగును.

ఆళ్వార్లు శ్రీవైష్ణవులని వివిధ మార్గములలో కీర్తించెదరు :

  • తిరువుడైమన్నార్ – అమితమైన కైంకర్యశ్రీ కలిగినవారు (రాజులు)
  • శెజుమామణిగళ్ – సుందరమైన పెద్ద ముత్యములు
  • నిలత్తేవర్ – ఈ జగత్తులోని దేవతలు
  • పెరుమక్కళ్ – ఉన్నతమైన వారు
  • తెళ్ళియార్ – గొప్ప మేధావులు
  • పెరుంత్తవత్తార్ – మిక్కిలి నిరాడంబరులు
  • ఉరువుడైయార్ – సుందరులు
  • ఇళైయార్ – యవ్వనులు (మరియు సుందరులు)
  • వళ్లార్ – జ్ఞానులు
  • ఒత్తువళ్లార్ – వేద నిష్ణాతులు
  • తక్కార్ – మిక్కిలి తగిన వారు (కీర్తించుటకు)
  • మిక్కార్ – మన కన్నా మేలైనవారు
  • వేదవిమలర్ – స్వచ్ఛమైన వైదికులు
  • శిఱుమామనిసర్ – రూపములో చిన్నవారు కాని గుణాలలో గొప్పవారు
  • ఎంపిరాన్తన చిన్నన్గళ్ – నా పరమాత్మ యొక్క ప్రతినిధులు

భాగవతాపచార దుష్పరిణామములపై మరికొన్ని ముఖ్య ప్రమాణములు

తస్య బ్రహ్మవిధాగసః 

సాధారణ అనువాదము : బ్రహ్మ జ్ఞానము చేరువలో నున్న వారిని కీర్తించుట (స్పష్టమైన భావము లేదు)

నాహమ్ విసంగే సురరాజవజ్రాంత త్ర్యక్ష శూలాన్ న యమస్య దండాత్
నాజ్ఞోర్కసోమానిల విత్తహస్తాత్ శంగే బృశం భాగవతాపచారాత్

సాధారణ అనువాదము: నేను ఇంద్రుని వజ్రాయుధము యొక్క ఆగ్రహమునకు గాని, యముని భటులకు గాని లేక అగ్ని, చంద్రుడు, ఇతర దేవతల కోపమునకు గాని భీతిల్లను. కాని భాగవతాపచారమునకు మిక్కిలిగా భయపడెదను.

బ్రహ్మవిధోపమానాత్

సాధారణ అనువాదము : బ్రహ్మ జ్ఞానము కల వానితో పోల్చుట (భావము అస్పష్ఠముగా నున్నది).

ఆయుశ్రియమ్ యశో ధర్మమ్ లోకానాశిష ఏవ చ
హన్తి శ్రేయాంసి సర్వాణి పుంసో మహదతిక్రమః

సాధారణ అనువాదము : దీర్ఘాయువు, సంపద, నైపుణము, గౌరవము, శ్రేష్ఠత మరియు అతనికి అనుకూలమైన ప్రతీది కూడ అతని అతిక్రమణచే నాశనము చెందును (భాగవతాపచారము చే)

నిందంతియే భాగవత్చరణారవింద చింతావధూత సకలాఖిలకల్మషౌకాన్
తేశామ్ యశోదనసుకాయుర పత్యబందు మిత్రాణి చ స్తిరతరాణ్యపి యాంతి నాశమ్

సాధారణ అనువాదము : భగవానుని పాదపద్మములే అన్ని కల్మషములు హరించుటకు ఆధారామని భావించు భక్తులను నిందించు వారు తమ కీర్తిని, సంపదను, దీర్ఘాయుశ్శును, సంతానమును, బంధువులను, మిత్రులను, తమ స్వాధీనములోనివన్నీ కోల్పోవును.

అప్యర్చయిత్వా గోవిందమ్ తదీయాన్ నార్చయింత్యే
న తే విష్ణోః ప్రసాదస్య భాజనమ్ డాంబికాజనాః 

సాధారణ అనువాదము : పరమాత్మను మాత్రమే అర్చించి, వాని భక్తులను పూజించని కపటులు భగవానుని కృపకు పాత్రులు కారు.

శ్రీవచన భూషణము 204 వ సూత్రం –  ‘..ఇళవుక్కు అవర్గళ్ పక్కల్ అపచారమే పోరుమ్’

ఎట్లు స్వచ్చమైన భాగవతునితో గల అనుబంధము (మనకు జ్ఞాన అనుష్టానము లేకున్నను) ఒక ఆహ్లాదకరమైన ఫలితము నిచ్చునో, అటులనే మనకు సంపూర్ణ జ్ఞానము మరియు అనుష్టానము వున్నను, అట్టి భాగవతులకు ఒనర్చు అపచారమే, మనను దానికి దూరము చేయును.

వైష్ణవానామ్ పరీవాదమ్ యో మహాన్ శృణుతే నరః
శంకు పిస్తస్య నారాచైః కుర్యాత్ కర్ణస్య పూరణమ్

సాధారణ అనువాదము : వైష్ణవుని పై దూషణలను ఆలకించిన వారి చెవులు బల్లెములతో, బాణములతో నిండి పోవును.

శ్రీవచన భూషణము 203 వ సూత్రం –ఇవ్విడత్తిలే వైనతేయ వృత్తాన్తత్తైయుమ్, పిళ్ళైప్పిళ్ళైయాళ్వానుక్కు ఆళ్వాను పణిత్త వార్ త్తైయైయుమ్ స్మరిప్పతు

అపచారమొనర్చిన గరుడాళ్వార్ల రెక్కలను దహించివేస్తున్న అగ్ని

సాధారణ అనువాదము : ఇది అర్ధము కావలెననిన (భాగవతాపచారము యొక్క క్రూరత్వము) వైనతేయుని సంఘటనను (శాండిలిని దివ్యదేశమునకు బదులుగా దూరముగా ఏల నివసించుచున్నదని తలంచిన మాత్రమే గరుడుని రెక్కలు ఆహుతి అయినవి), పిళ్ళై పిళ్ళై కు భాగవతపచారము వీడుటపై ఆళ్వాన్ ఆదేశములపై ధ్యానమొనర్చుట.

ఈ విధముగా ఆచార్యాపచారము, భాగవతాపచారము అతి క్రూర ప్రవృత్తి కలవని వేదశాస్త్రము, పురాణములు, శాస్త్రసారము తెలిసిన జ్ఞానులు, ఆళ్వార్లు, మన ఆచార్యులు అనేక మార్లు వివరించిరి. ఇది అర్ధము అయిన ఆస్తికుడు (శాస్త్రమును నమ్మినవారు), సంసార బంధము నుండి ఉపశమనముపై దృష్టి కలవాడు, సరియైన గురువులు మరియు మనను సదా కాపాడువారైన భాగవతులపై ఎట్టి పరిస్థితులలోనూ అపచారమొనర్చరాదు. (స్వప్నములో నైనను). మా జీయర్ (మాముముణులు) ఈ విషయములను విస్మరించి చిన్న అపచారము చేసినను దానినుండి కోలుకోలేము, భూమి బ్రద్ధలైనచో దానిని కలపలేము, సాగరము భూమి పైకి వచ్చిన ఆ ప్రవాహాన్ని ఎవరూ ఆపలేరు, ఒక పర్వతము శిరస్సున పడినచో దానిని భరించలేము – భాగవతాపచారము సరిదిద్దుకోలేని భాద్యతారాహిత్యమైన నేరమగును. ఇట్లు, తమ సదాచార్యునితో సమానులైన భాగవతుల పట్ల జాగరూకతతో ఉండి, పై సూత్రములను మరువకుండగ, ఎట్టి అపచారములను చేయరాదు. ఇదియేగాక, తమ ఆచార్యులు మరియు అట్టి భాగవతులపై సత్శిష్యుల ప్రవర్తనను గురించి తదుపరి వివరించిరి.

అనువాదకుని గమనిక : ఇట్లు, భాగవతాపచారము చెసినచో కలుగు దుష్పరిణామములను చూచితిమి. తదుపరి భాగములో, నిజమైన శిష్యుడు ఆచార్యునికి మరియు గొప్ప భాగవతులకు ఏమి చేయవలెనో గమనించెదము.

కొన్ని సంస్కృత ప్రమాణములను అనువదించుటకు సహకారమునిచ్చిన శ్రీరంగనాథన్ స్వామికి కృతజ్ఞతలు.

సశేషం….

అడియేన్ బొమ్మకంటి గోపిక్రిష్ణమాచార్యులు రామానుజ దాసన్.

మూలము: http://ponnadi.blogspot.com/2013/07/anthimopaya-nishtai-14.html

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

అంతిమోపాయ నిష్ఠ – 13

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్ వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః

అంతిమోపాయ నిష్ఠ

మునుపటి వ్యాసములో, (https://srivaishnavagranthamstelugu.wordpress.com/2022/07/12/anthimopaya-nishtai-12/), మనము ఆచార్యుడు సాక్షాత్ భగవానుని అవతారమని మరియు వారిని ఆ ప్రకారముగానే భావించవలెనని గమనించితిమి. ఈ భాగములో, మనము ఆచార్యుని ఒక సామాన్య జీవిగా తలంచిన కలుగు దుష్పరిణామముల గురించి తెలుసుకొందాము.

ఎంపెరుమానార్ – ఆళ్వాన్, కూరమ్ (ఆళ్వాన్ అవతార స్థలము) – ఆదర్శవంతమైన ఆచార్య శిష్యులు

పరాశర మహర్షి ఈ క్రింది పలుకులతో మనకు అనుగ్రహించిరి:

అర్ధ పంచక తత్త్వజ్ఞాః పంచసంస్కార సంస్కృతాః
ఆకారత్రయ సంపన్నాః మహాభాగవతాః స్మృతాః
మహాభాగవతా యత్రావసంతి విమలాస్శుభాః 
తద్దేశం మంగళం ప్రోక్తం తత్తీర్థం తత్తు పావనం
యథా విష్ణుపాదం శుభం

సాధారణ అనువాదము: ఆచార్యుని యందు పంచ సంస్కారమును పొంది, అర్ధ పంచకమును అభ్యసించవలెను. మనము ఆచార్యుని 3 విశేష గుణములను (అనన్యార్హత్వము, అనన్య శేషత్వము, అనన్య భోగ్యత్వము) గుర్తించి, నిర్మలుడైన భాగవతుని సేవించవలెను. సంపూర్ణ శుద్ధి పొందుటకై, మహా భాగవతునికి దగ్గరలో నివసించవలెను. ఆ చోటు మిక్కిలి పవిత్రమైనదని, ఆ సమీపములోని జలము అతి స్వచ్ఛమైనది (మనను శుద్ధి చేయుటకు), అది శ్రీమన్నారాయణుని మంగళప్రదమైన స్థానమని చెప్పబడింది.

ఈ సూత్రమును అత్యంత స్పష్టముగా పిళ్ళై లోకాచార్యులు తమ శ్రీ వచన భూషణము సూత్రము 450 లో వివరించిరి:

పాట్టుక్కేట్కుమిడముమ్, కూప్పీడు కేట్కుమిడముమ్, గుతిత్త విడముమ్, వళైత్తవిడముమ్,
ఊట్టుమిడముమ్ ఎల్లామ్ వకుత్తవిడమే యెన్ఱిరుక్కక్కడవన్

సాధారణ అనువాదము: ఎంపెరుమానుని 5 విభిన్న స్వరూపాలను ఆచార్యునిగా (సరియైన రక్షకునిగా) శిష్యుడు భావించవలెను. ఆ ఐదు స్వరూప స్వభావమును వరుస క్రమములో వివరించుచు,

  • ఆతడు దివ్య సంగీతమును (సామగానము) పరవశముతో శ్రవణము చేయు చోటు – పరమపదము
  • దేవతల ఫిర్యాదులను విను చోటు – వ్యూహము
  • లోక రక్షణ కోసమై ఈ సంసారములోకి దూకుట – విభవము
  • తమ ఉనికితో అందరిని ఆకర్షించు చోటు – అర్చావతారము
  • ప్రతి ఒక్కరి అంతరాత్మగా ఉండి పాలించు వాడు – అంతర్యామి

ఈ విధముగా, ఆచార్యుని పరమపదమునకు మరియు సంసారమునకు పరమాత్మగా శిష్యుడు గుర్తించి, ఆచార్యుడే ఈ రెండు జగత్తులలో పొందగల గొప్ప సంపదగా భావింపవలెను.

ఆచార్య నిష్ఠాపరులు (అముదనార్ వంటి వారు) ఆచార్యుని సదా ఈ క్రింది విధముగా భావించెదరు :

  • రామానుజ నూఱ్ఱందాది 20 – ఇరామానుశన్ ఎందన్ మానిదియే – శ్రీ రామానుజులే నా తరగని సంపద.
  • రామానుజ నూఱ్ఱందాది 22 – ఇరామానుశ నెందన్ శేమవైప్పే – శ్రీ రామానుజులు అను నా సంపద, నన్ను విపత్తుల నుండి కాపాడును.
  • రామానుజ నూఱ్ఱందాది 5 – ఎనక్కుఱ్ఱ శెల్వం ఇరామానుశన్ – నా నిజ స్వభావమునకు శ్రీ రామానుజలే తగిన చక్కని సంపద.

సాక్షాత్ నారాయణో దేవః కృత్వా మర్త్య మాయిమ్ తనుమ్” – తమను ఉద్ధరించుటకై భగవానుడే స్వయముగా మానవ రూపమును ధరించుటను అర్ధము చేసుకోలేక, వారు కూడ మనవలే భుజించుచు, నిదురించుచు ఉండుటను గమనించుట, ఆచార్యులు కూడ మన వంటి మానవ మాత్రులే అని భావిస్తూ, “మానిడవనెన్నుమ్ గురువై” (జ్ఞాన సారం – 32) లో తెలిపిన విధముగా “జ్ఞానదీపప్రదే గురౌ మర్త్య బుద్ధి శృతమ్ తస్య“, “యో గురౌ మానుషమ్ భవామ్“, “గురుషు నరమతిః” మొ || నవి తీవ్రముగా ఖండించిరి.

తదుపరి భాగములలో, ఆచార్యుని మానవమాత్రునిగా భావించిన కలుగు దుష్పరిణామములను చూచెదము.

విష్ణోరర్చావతారేషు లోహభావం కరోతియః
యో గురౌ మానుషం భావమ్ ఉభౌ నరకపాతినౌ

సాధారణ అనువాదము: దివ్య అర్చా రూపముగా ఒక లోహము (ముడి పదార్ధము) తో తయారు చేసిన విష్ణువును విగ్రహముగా, తమ ఆచార్యుని ఒక మానవమాత్రునిగా మాత్రమే భావించుట, ఈ రెండును కూడ మనను నరక లోకమునకు నడిపించగలవు.

నారాయణోపి వికృతిమ్ యాతి గురోః ప్రచ్యుతస్య దుర్భుదేః
జలాత భేదమ్ కమలం సోషయతి రవిర్ణ పోషయతి

సాధారణ అనువాదము : ఏ విధముగానైతే, సూర్య కిరణాలు కమల పుష్పమును వికసింపజేయునో, నీటి నుంచి బయటకు తీసిన ఆ కమల పుష్పము అదే సూర్య కిరణాల వేడికి  కమిలిపోవును. అదే విధముగా, ఎవరైతే తమ గురువు నుంచి విడిపోయెదరో, వారిని శ్రీమన్నారాయణుడే (సర్వరక్షకుడు) కష్టములపాలు చేయును.

ఏకాక్షర ప్రధారమ్ ఆచార్యమ్ యోవమన్యతే
స్వానయో నిశతమ్ ప్రాప్య చణ్డాలేష్వపి జాయతే

సాధారణ అనువాదము: జ్ఞానమును ప్రసాదించు మన ఆచార్యుని విస్మరించిన వారు, 100 మార్లు చండాలునిగా (కుక్క మాంస భక్షకుడు) జన్మించెదరు.

గురుత్యాగీ భవేన్ మృత్యుః మంత్రత్యాగీ దరిద్రదా
గురుమంత్ర పరిత్యాగీ రౌరవం నరకం వ్రజేత్

సాధారణ అనువాదము : గురువును త్యజించిన వారు శవముతో సమానము; మంత్రమును (గురువు నుంచి పొందిన) త్యజించిన వాడు అష్టదరిద్రుడు. గురువును, మంత్రమును రెంటిని త్యజించిన వాడు, రౌరవాది నరకమును తప్పక పొందును.

జ్ఞాన సారము 30

మాడుం మనైయుం మఱై మునివర్
తేడుం ఉయర్వీడుం సెన్నెఱియుం – పీడుడైయ
ఎట్టెళుత్తుం తంద వనే ఎన్ఱు ఇరాదార్ ఉఱవై
విట్టిడుగై కండీర్ విధి

(దీనికి సరియగు సంస్కృత ప్రమాణమును మాముణులు నిరూపించిరి)

ఐహికం ఆముష్మికం సర్వం గురు అష్టాక్షర ప్రదః
ఇత్యేవం యేన మన్యన్తే త్యక్తవ్యస్తే మనీషిపిః 

సాధారణ అనువాదము : ఎవరైతే తమ సంపదను, భూములను, మోక్షమును మరియు ధర్మమును, మొ || వానిని, తమకు అష్టాక్షర మహామంత్రమును ఉపదేశించిన ఆచార్యునిగా భావించరో, వారితో గల సంబంధమును / బాంధవ్యమును త్యజించవలెను.

జ్ఞాన సారం – 32

మానిడవన్ ఎన్ఱుం గురువై మలర్మగళ్కోన్
తానుగందకోలం ఉలోగం ఎన్ఱుం – ఈనమదా
ఎణ్ణుగిన్ఱ నీసర్ ఇరువరుమే ఎక్కాలుం
నణ్ణిడు వర్కీళాంనరగు

సాధారణ అనువాదము : ఎవరైతే ఆచార్యుని సాధారణ మానవమాత్రునిగానే భావించెదరో, ఆ శ్రీయఃపతి అర్చామూర్తిని సాధారణ లోహపు (ముడి సరుకు) విగ్రహముగానే భావించెదరో – ఆ ఇరువురు తప్పక అత్యల్ప నరకము లోకమును పొందగలరు.

ఏక గ్రామనివాసస్సన్ యశ్శిష్యో నానర్చయేత్ గురుం
తత్ ప్రసాదం వినా కుర్యాత్ సవై విద్సూకరో భవేత్

సాధారణ అనువాదము : తన గ్రామములో నివసించు శిష్యుడు ఆచార్యుని ఆరాధన చేయకుండా, ఇతర కార్యములలో నిమగ్నుడై ఆచార్యుని ప్రసాదమును గ్రహించకున్నచో అతను జంతువుతో సమానుడు.

జ్ఞాన సారము 33

ఎట్ట ఇరుంద గురువై ఇవై అన్ఱు ఎన్ఱు
విట్టోర్ పరనై నై విరుప్పుఱుదల్ – పొట్టనెత్తన్
కణ్సెంబళి తిరుందు కైత్తురుత్తి నీర్తూవి
అంబుదత్తై పార్తిరుప్పాన్ అఱ్ఱు

సాధారణ అనువాదము : సులభముగా లభ్యమగు ఆచార్యుని విస్మరించి, ఎవరైతే భగవానుని సమీపించెదరో, అది దాహార్తితో నున్న వారు చేతిలో నున్న జలమును జారవిడచి, వర్షముకై ఆకాశము వంక చూచుటకు సమానము.

జ్ఞాన సారము 34

పఱ్ఱుగురువై పరన్ అన్ఱు ఎన్ఱు ఇగళందు
మాఱ్ఱోర్పరనై వళిప్పడుదల్ – ఎఱ్ఱేతన్
కైప్పొరుళ్ విట్టారేనుం ఆసినియిల్తాంపుదైత్త
అప్పొరుళ్ తేడితిరివానఱ్ఱు

సాధారణ అనువాదము : భగవదవతారముగా ఆచార్యుని (మనకు సులభముగా అందుబాటులో నున్న వారు) అంగీకరించుటకు బదులుగా భగవానుని నేరుగా ఆరాధించుట, మన అధీనములో నున్న సంపదను వీడి, ఇతరులు గుప్తముగా భూమిలో దాచిన సంపద కొరకై అన్వేషణ గావించిన విధముగా నుండును.

జ్ఞాన సారము 35

ఎన్ఱుమ్ అనైత్తు యిఱ్కుమ్ ఈరం సెయ్ నారణనుం
అన్ఱుమ్ తన్ ఆరి యన్పాల్ అంబు ఒళి యిల్నిన్ఱ
పునల్పిరింద పంగయతై పొంగుసుడర్ వెయ్యోన్
అనల్ ఉమిళ్ందు తాన్ ఉలర్తియఱ్ఱు

సాధారణ అనువాదము : భగవంతుడు అపార కరుణామయుడు, అందరీ మిక్కిలి అనుకూలుడు, కాని జీవాత్మ ఆచార్యునిపై ప్రేమను / బాంధవ్యమును విస్మరించినచో, ఆ జీవాత్మను పరమాత్మ కూడ విస్మరించును. ఈ చర్య, ఒక తామర పుష్పము వికసించుటకు దోహదపడిన సూర్యుడే, అదే తామర పుష్పము నీటి నుంచి విడి పోయినచో అదే సూర్యుడి వలన ఎండి పోవుటకు సమానము వంటిది.

ప్రమేయ సారము 9

తత్తం ఇఱైయిన్ వడివు ఎన్ఱు తాళిణైయై
వైత్త అవరై వణంగియిరాప్ పిత్తరాయ్
నిందిప్పార్కు ఉణ్దు ఏఱానీణిరరయం నీదియాల్
వందిప్పార్కు ఉణ్డిళియావాన్

సాధారణ అనువాదము : ఆచార్యులే మనకు భగవంతుని పాదపద్మములతో ఆశీర్వదింతురు. అట్టి ఆచార్యుని స్వయముగా భగవానుడని ఆరాధించిన వారు నిశ్చయముగా పరమపదములోని దివ్య జీవులగుదురు. ఆచార్యుని అంగీకరించక, ఆరాధించని ఇతరులు ఈ లోకములోనే శాశ్వతముగా కష్టముల పాలగుదురు.

ఉపదేశ రత్తిన మాలై 60

తన్ గురువిన్ తాళిణైగళ్ తన్నిల్ అన్బొన్ఱిల్లాదార్
అన్బుతన్పాల్ శెయ్ దాలుమ్ అంబుయైకోన్
ఇన్బ మిగు విణ్ణాడు తానళిక్క వేణ్డియిరాన్
ఆదలాల్ నణ్ణాఱ్ అవర్ గళ్ తిరునాడు

సాధారణ అనువాదము : తమ ఆచార్యుని పాదపద్మములను సేవించని వారు, తాము ఎంపెరుమాన్ పై ఎంత గొప్ప ప్రేమ చూపినను, శ్రీమన్నారాయణుడు వారికి పరమపదములోని ఆనందమయమైన జీవితమునొసంగరు, కావున వారు పరమపదమును జేరలేరు.

ప్రతిహంతా గురోరపస్మారి వాక్యేన వాక్యస్య
ప్రతిఘాతం ఆచార్యస్య వర్జయేత్

సాధారణ అనువాదము : ఆచార్యునికి దూరముగా నున్నచో, వారు త్యజించబడుటకు అర్హులు.

బ్రహ్మాండ పురాణము

అర్చావిష్ణౌl శిలాధీర్ గురుషూ నరమతిర్ వైష్ణవే జాతి బుద్దిర్
విష్ణోవా వైష్ణవానామ్ కలిమలమతనే పాద తీర్ధే అంబు బుద్దిః
సిద్దే తన్నామ మందిరే సకల కలుషహే సప్త సామాన్య బుద్దిః
శ్రీసే సర్వేశ్వరే చేత్ తతితర (సురజన) సమతీర్ యస్యవా నరకి సః

సాధారణ అనువాదము : అర్చామూర్తి రూపములో నున్న విష్ణువును ఒక విగ్రహముగా భావించుట, గురువును మానవమాత్రునిగా భావించుట, వైష్ణవ జన్మమును విశ్లేషించుట, కలిలో నున్న అన్ని దోషములను తొలగించు విష్ణువు, వైష్ణవుల శ్రీపాద తీర్థమును సాధారణ జలముగా భావించుట, వారి నామములను, కోవెలలను (విష్ణు మరియు వైష్ణవుల) కీర్తించు పదములను, సాధారణ వానిగా భావించుట, శ్రీమన్నారాయణుని అన్య దేవతలతో సమానముగా భావించువారు నిశ్చయముగా నరక లోకమును జేరెదరు.

గురువును అవమానించుట యందు ఈ క్రింది అంశములు ఉండును :

  • గురువు ఆదేశములను అనుసరించక పోవుట
  • అనర్హులకు గురువు ఆదేశములను బోధించుట
  • ఆచార్యునితో సంబంధమును వదులు కొనుట – శ్రీ వచన భూషణ దివ్య శాస్త్రము 439 వ సూత్రంలో తెలిపిన విధముగా “తామరైయై అలర్ త్తక్కడవ ఆదిత్యన్ తానే నీరైప్ పిరిన్తాల్ అత్తై ఉలర్ త్తుమాపోలే, స్వరూప వికాసత్తై ప్పణ్ణుమ్ ఈశ్వరన్ తానే ఆచార్య సంబంధం కులైంతాల్ అత్తై వాడ ప్పణ్ణుమ్” – ఒక తామర పుష్పము వికసించుటకు దోహదపడిన సూర్యుడు, ఆ తామర పుష్పము నీటి నుంచి బయట పడినచో ఎటుల దానిని అదే సూర్యుడు కాల్చి వేయునో, అదే విధముగా, జీవాత్మకు జ్ఞానము నిచ్చి పోషించు భగవానుడు, ఆచార్య సాంగత్యమును వీడిన జీవాత్మ జ్ఞానమును క్షీణింప జేయును.
  • ‘గురోరపహ్నుతాత్ త్యాగాత్ అస్మరణాదాపి; లోభా మోహాదిపిశ్చాన్యైర్ అపచారైర్ వినశ్యతి’ – గురువును త్యజించిన వాడు, అతనికి దూరముగా నున్న వాడు, అతని గురించి ఆలోచించని వాడు, తన దురాశ మరియు మోసము వల్ల ఆర్జించిన పాపముతో నాశనము అగును.
  • గురోరన్ఱుతాబిశంసనం పాదకసమానమ్ కలు గుర్వర్ త్తే సప్తపురుషాన్ ఇతశ్చ పరతశ్చ హంతి; మనసాపి గురోర్నాన్ఱుతమ్ వదేత్; అల్పేష్వప్యర్ త్తేషు – అసత్య వచనములతో ఆచార్యుని చేరుట, వారిని గాయపరచుటతో సమానము. ఆచార్యుని సంపదను తస్కరించినచో, ముందు ఏడు తరాలు, తరువాతి ఏడు తరాలు నాశనమగును. కావున, ఆచార్యుని మదిలో కూడ మోసము చేయు తలంపుతో నుండరాదు. వారి సంపదలో ఒక అణువు కూడ తస్కరించరాదు.
  • వారితో అబద్దపు మాటలాడుట, వాదించుట, వారు బోధించని వాని గురించి మాటలాడుట, వారు దయతో ఆదేశములను కృప చేయునప్పుడు వారిపై పిర్యాదు చేయుట, వారిని కీర్తించునప్పుడు దూరముగా ఉండుట, వారిపై కఠిన పదజాలమును ఉపయోగించుట, వారిపై బిగ్గరగా అరచుట, వారి ఆదేశములను విస్మరించుట, వారి ఎదురుగా మేను వాల్చుట, వారి కన్నా వేదికపై ఎత్తులో ఉండుట, వారి ఎదురుగా పాదములను జాచుట / చూపుట, వారి చర్యలకు అడ్డు తగులుట, అంజలి ఘటించి వారిని ఆరాధించుటకు సిగ్గు పడుట, వారు నడుచునప్పుడు మార్గములోనున్న అడ్డంకులను తొలగించక పోవుట, వారి మనో భావములను అర్ధము చేసుకొనక మాటలాడుట, ‘కాయిలే వాయక్కిడుతాల్ ‘ – అన్యుల ద్వారా వారితో పరోక్షముగా వ్యవహరించుట, వారి ముందు కంపించుట, వారి నీడపై పాదమునిడుట, ఇతరుల నీడ ఆచార్యునిపై పడుటను అనుమతించుట – ఈ చర్యలను ఆచార్యుని ముందు వదులు కొనవలెను.

యస్య సాక్షాత్ భగవతి జ్ఞానాదీపప్రదే గురౌ
మర్త్య బుద్ది శృతం తస్య సర్వమ్ కున్జరసౌచవత్

సాధారణ అనువాదము: ఆచార్యులు జ్ఞాన జ్యోతితో శిష్యునికి జ్ఞానోదయము చేయుటచే, వారిని భగవానునితో సమానునిగా భావించవలెను. ఎవరైతే గురువును సాధారణ మానవ మాత్రునిగా భావించెదరో, వారు పొందిన శాస్త్ర జ్ఞానము గజము స్నానము (మట్టిని శిరస్సుపై చల్లుకునే విధముగా) చేసిన దానితో సమానము.

సులభమ్ స్వగురుమ్ త్యక్త్వా దుర్లభమ్ య ఉపాసతే
లబ్ధమ్ త్యక్త్వా ధనమ్ మూడో గుప్తమన్వేషతి క్శితౌ

సాధారణ అనువాదము : సులభముగా పొందగలిగిన ఆచార్యుని వీడి, క్లిష్టతరమైన ఉపాసనలను అవలంబించుట అనునది మన వద్దనున్న సొమ్మును పారవైచి, నిధికై భూమిని తవ్వుటతో సమానము.

చక్షుర్ గమ్యమ్ గురుమ్ త్యక్త్వా శాస్త్ర గమ్యమ్ తు యస్స్మరేత్
హస్తస్తమ్ ఉదగమ్ త్యక్త్వా గనస్తమభి వాన్చతి

సాధారణ అనువాదము : సమీపమున నున్న గురువును వదలివేసి, భగవానునికై ప్రయత్నించుట అనునది దాహర్తితో నున్న వ్యక్తి చేతిలోని నీటిని జార విడచి, ఆకాశములోని వర్షమునకై ఎదురుచూచినట్లు ఉండును.

గురుమ్ త్వంగ్కృత్య హూంగ్కృత్య విప్రమ్ నిర్జిత్య వాదతః
అరణ్యే నిర్జలే దేశే భవంతి బ్రహ్మరాక్షసాః

సాధారణ అనువాదము : తమ ఆచార్యునితో అనుచితముగా భాషించి అణచుటకు పర్యత్నించువారు, నీరు దొరకని అరణ్యములో బ్రహ్మరాక్షసులగుదురు.

ఈ విధముగా, పైన పేర్కొన్న ప్రమాణముల ద్వారా, ఆచార్య అపచారములు వివరించిరి.

అనువాదకుని సూచన : ఈ విధముగా, ఆచార్య అపచారము చేసిన, జరుగు దుష్పలితములను గమనించితిమి. తరువాతి భాగములో మనము భాగవత అపచారము గురించిన ప్రమాణములను తెలుసుకొందాము.

సంస్కృత ప్రమాణములను అనువదించుటకు సహకారము నిచ్చిన శ్రీ రంగనాథన్ స్వామి గారికి ధన్యవాదములు.

సశేషం….

అడియేన్ బొమ్మకంటి గోపిక్రిష్ణమాచార్యులు రామానుజ దాసన్.

మూలము: http://ponnadi.blogspot.com/2013/07/anthimopaya-nishtai-13.html

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

అంతిమోపాయ నిష్ఠ – 12

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్ వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః

అంతిమోపాయ నిష్ఠ

మునుపటి వ్యాసములో (https://srivaishnavagranthamstelugu.wordpress.com/2022/07/06/anthimopaya-nishtai-11/ ), మనము ఎంబార్ల దివ్య ప్రవృత్తిని, ఇతర సంఘటనలను గమనించాము. ఈ వ్యాసములో, ఆచార్యుడు భగవానుని అవతారమని, ఆచార్యుడిని భగవానునితో సమానంగా భావించాలని స్థాపించారు.

ఆచార్యులు భగవానుని అవతారము

పురుషార్ధము (జీవాత్మ సాధించవలసిన లక్ష్యాలు) నాలుగు రకాలు:

  1. సాక్షాత్కారము – భగవానుని దివ్య దర్శనము (అంతరంగములో) – ఇది భగవానుని అర్ధము చేసుకొనే ప్రత్యేక జ్ఞానము.
  2. విభూతి సాక్షాత్కారము – సాకార రూపములో సాక్షాత్కరించే భగవానుని దివ్య దర్శనము – ఈ స్థితిలో ఒక ప్రత్యేక జ్ఞానము ద్వారా మనము నిజమైన అడ్డంకులను (ఈ భౌతిక శరీరము మరియు భౌతిక ప్రపంచము) గ్రహించగలము.
  3. ఉభయవిభూతి సాక్షాత్కారము – ఆధ్యాత్మిక మరియు ఆదిభౌతిక రూపములలో భగవానుని దివ్య దర్శనము – ఈ స్థితిలో ఒక ప్రత్యేక జ్ఞానము ద్వారా కైంకర్యము యొక్క యధార్ధ లక్ష్యమును మనము గ్రహించవచ్చును.
  4. ప్రత్యక్ష సాక్షాత్కారము – భగవానుని దివ్య దర్శనము మన కనులారా వీక్షించుట – ఈ స్థితిలో
    • మన లక్ష్యము మరియు సాధనం రెండూ ఒకటే అని గుర్తించగలము, అనగా, రెండూ భగవానుడే
    • భగవానునికి చేయు కైంకర్యము (ప్రేమతో చేయు సేవ) మన అంతిమ లక్ష్యము
    • దానికి ఉపాయము (విధానము) కూడ కైంకర్యమే

మొదటి మూడు విధములు పురుషార్ధములో (అంతిమ లక్ష్యము) భాగము అని భావించినను, ప్రత్యక్ష సాక్షాత్కారము పొందనిచో, ఆ మూడు నిరుపయోగమే. అంతిమ లక్ష్యమును మాత్రమే మనము ప్రత్యక్షముగా దర్శించినచో, ఆ ఇతర మూడు కూడ సాధించలేము.

ఈ క్రింది ఆరు రూపములలో భగవానుని ప్రత్యక్ష దర్శనమును సాధించగలము :

  • పరత్వము – పరమపదములో నున్న భగవానుని దివ్య స్వరూపము – ఇది నిత్యులకు మరియు ముక్తులకు
  • వ్యూహము – క్షీరాబ్దిలో దర్శనమిచ్చు భగవానుని దివ్య స్వరూపము – ఇది సనకసనందనాదులకు (బ్రహ్మ మానస పుత్రులు), దేవతలకు, మొ ||
  • విభవము – భగవానుని అవతారములైన శ్రీరామ, శ్రీకృష్ణ, ఇత్యాదులు – ఇవి శ్రీరామ, శ్రీకృష్ణ మొ || వారి కాలములో జీవించివున్న వారికి, దశరధుడు, వాసుదేవుడు, నందగోపాలుడు, ఇత్యాదులు
  • అంతర్యామిత్వము – ప్రతి జీవుని అంతరంగములో నివసించు భగవానుని స్వరూపము – ఇది యోగులకు మరియు ఉపాసకులకు
  • అర్చావతారము – కోవెలలో, మఠములలో, గృహములలో వున్న స్వరూపము – ఈ రూపము ప్రతి ఒక్కరికి
  • ఆచార్యావతారము – జ్ఞానమును ప్రసాదించు ఆచార్యునిగా దర్శనమిచ్చు భగవానుని స్వరూపము – ఇది వారిని ఆశ్రయించిన (శరణాగతి) వారికి.

పై వానిలో, వానికి ఉన్న పరిమితుల దృష్ట్యా మొదటి నాలుగు చేరలేము – అనగా

  • దేశము – ప్రాంతము – పరమపదము, క్షీరాబ్ది సర్వులకు అందుబాటులో లేవు
  • కాలము – సమయము – విభవ అవతారములు వేరు వేరు యుగములలో జరిగినవి – ఆ కాలములో లేనివారు వానిని కోల్పోయిరి.
  • కరణము – స్పందన – మనస్సును పూర్తిగా నియంత్రించగల యోగులు మాత్రమే తమ జ్ఞానము ద్వారా అంతర్యామి ఎంపెరుమాన్ ను దర్శించగలరు.

పై వానిలో చివరి రెండు, అర్చావతారములోని ఎంపెరుమాన్లు, ప్రతి ఒక్కరితో స్వయముగా సంబంధము కలిగి వుండరు. కావున, అర్చావతారమును కూడ ఎంపెరుమానుని ఇతర అవతారములతో పోల్చవచ్చును. అన్ని శాస్త్రములను పరిశీలించిన పిదప, ఒక జీవాత్మ ముక్తుడగుటకు, తమ ఆచార్యుని దివ్య జ్ఞానము పొందవలెనని స్పష్టముగా నిర్ణయమైనది. కావున, దేనివలన జ్ఞానము లభించునో అది అంతిమ లక్ష్యము కూడ అగును. దేనివలన అంతిమ లక్ష్యము లభించునో, అది ఉపాయం (సాధనము) అగును. కావున, ఆచార్యునికి చేయు కైంకర్యమే అత్యున్నత లక్ష్యము. స్వయముగా భగవానుడే నమ్మాళ్వార్లను మచ్చలేని జ్ఞానముతో అనుగ్రహించుటచే, తనకు మచ్చలేని జ్ఞానము నొసంగిన భగవానుడే, తన ఆరాధ్యుడు అని వారు ప్రకటించిరి. దివ్య జ్ఞానమును ఇచ్చి దీవించే ఆచార్యులే  శిష్యునికి ఏకైక సాధనము. ఇతర ఉపాయములన్ని కూడ ఉపాయాంతరముల వంటివి (వదలి వేయ తగిన ఇతర సాధనములు). ఈ విషయమును నంపిళ్ళై కు తిరుముడిక్కుఱై రహస్యములో, నంజీయర్ వివరించిరి. ఇట్టి ప్రత్యక్ష సాక్షాత్కారము లేనిచో (ఆచార్యుని ప్రత్యక్ష దివ్య దర్శనము), మోక్షమును పొందు అవకాశము లేదు, కావున, ఆచార్యావతారము అంతిమ ఉపాయమగును.

ఆచార్య అభిమానము యొక్క గొప్పతనమును పిళ్ళై లోకాచార్యులు తమ అర్థ పంచకము (రహస్య గ్రంధము) లో ఈ క్రింది విధముగా స్పష్టముగా వివరించిరి.

ఆచార్య అభిమానమావతు ఇవైయొన్ఱుక్కుమ్ సక్తనన్ఱిక్కే ఇరుప్పానొరు ఉవనైక్ కుఱిత్తు ఇవనుడైయ ఇళావైయుమ్, ఇవనైప్పెఱ్ఱాల్ ఈశ్వరనుక్కు ఉణ్డాన ప్రీతియైయుమ్ అనుసందిత్తు, స్తనందయప్రజైక్కు వ్యాతి ఉణ్డానాల్ తన్ కుఱైయాగ నినైత్తుత్ తాన్ ఔషధ సేవై పణ్ణి రక్శిక్కుమ్ మాతావైప్పోలే ఇవనుక్కుత్తాన్ ఉపాయానుష్టానమ్ పణ్ణి రక్శిక్క వల్ల పరమదయాళువాన మహాభాగవత అభిమానత్తిలే ఒదుంగి, “వల్లపరిసు వరువిప్పరేల్ అతు కాణ్డుమే” ఎన్గిఱపడియే సకల నివృత్తి ప్రవృత్తిగళుమ్ అవనిట్ట వళక్కాయ్.

ఆండాళ్ తిరుక్కళ్యాణము

సాధారణ అనువాదము : ఆచార్య అభిమానము అనగా – మరి ఇతర ఉపాయములు (కర్మ, జ్ఞాన, భక్తి, ప్రపత్తి) నిర్వహించు సామర్ధ్యము లేని, జీవాత్మకు, అతని అసహాయతను గుర్తించిన ఆచార్యులు (ఎంపెరుమానుతో గల సంబంధమును జీవాత్మ గుర్తించనందు వల్ల) మరియు జీవాత్మను పొందిన ఈశ్వరుని (తన నిజమైన సేవకునిగా) సంతోషమును గమనించినట్లు, తన పసిపాప అనారోగ్యమును గమనించిన తల్లి తాను అనారోగ్యమును పొందినట్లు భావించి తాను ఔషధమును స్వీకరించి, తన స్తన్యము ద్వారా దానిని పసిపాపకు నయమగుటకు ఇచ్చినట్లు, ఒక ఆచార్యుడు తన శిష్యుని కొరకు తానే స్వయముగా ఎంపెరుమాన్ ను శరణాగతి చేయుదురు. అట్టి కరుణా స్వరూపులైన సిసలైన భాగవతునికి, శిష్యుడు సదా అందుబాటులో వుంటూ, వారి ఆశీర్వాదమునకై వేచి ఉండి, “భగవానుడు ఆచార్యునికి కట్టుబడి వున్న విధముగా వారు వచ్చి నన్ను దీవించగలరు” (నాచ్చియార్ తిరుమొళిలో ఆండాళ్ నాచ్చియార్ గుర్తించిన ప్రకారముగా) అని భావింతురు.

మణఱ్పాక్కత్తు నంబి ప్రత్యక్షముగా దర్శించినట్లు మన పిళ్ళై లోకాచార్యులు సాక్షాత్తు పేరరుళాళన్ (కంచి దేవ పెరుమాళ్) అవతారమని స్పష్టమగుచున్నది. ఈ సంఘటనను (దేవ పెరుమాళ్ళ అవతారము పిళ్ళై లోకాచార్యులని) మన జీయర్ (మాముణులు) శ్రీ వచన భూషణము వ్యాఖ్యానములో (అవతారిక) చక్కగా వివరించిరి. ఇవియేగాక, ఇంకను సదాచార్య – సత్శిష్య లక్షణము గురించి అనేక సొగసైన వ్యాఖ్యానములను మన జీయర్ (మాముణులు) వివరించిరి. వానిని ఇది పెద్ద గ్రంధమగుననే భయముచే నేను వివరించుటలేదు.

ఈ విధముగా, “శ్రీమన్నారాయణుడే (శ్రీమహాలక్ష్మి పతి) మిక్కిలి దయతో ఆచార్యునిగా దర్శనమిచ్చును” అని ఘోషించుచున్నాయి. అవి

  • వేదములు
  • వేదములను వివరించు – స్మృతి, ఇతిహాసములు, పురాణములు
  • పరాశర, పారాశర్య (వ్యాసుడు), బోధాయనుడు, శుకుడు, మొ || ఋషులు వాని సారాంశమును దర్శించిరి.
  • ఆళ్వారులైన ప్రపన్న జన కూటస్థర్ పరాంకుశ (నమ్మాళ్వార్) పరకాల (తిరుమంగై ఆళ్వార్), భట్టనాధుడు (పెరియాళ్వార్), మొ ||ఆళ్వార్లు భగవానుని ఆధ్యాత్మిక ఆది భౌతిక జగత్తులను సంపూర్ణముగా వీక్షించగలుగుటచే, వారు ద్రావిడ బ్రహ్మ విద్య ద్వారా సమస్త వేదముల వేదాంతముల సారాంశమును వెల్లడించి, పుట్టుక వయస్సులతో నిమిత్తము లేకుండా ప్రతి ఒక్కరికి అందుబాటులోనుంచిరి.
  • సర్వము తెలిసిన ఆచార్యులైన నాథమునులు, యామూనాచార్యులు, యతిరాజులు, మొ || వారు ఆళ్వార్ల అడుగుజాడలను కొనసాగించిరి.

ముముక్షుపడి ప్రారంభములో పిళ్ళైలోకాచార్యులు వివరించిన విధముగా – జీవాత్మలు ఈ సంసారములో  అనాదిగా వుంటూ తమ యధార్ధ స్వరూపము, భగవానుని యధార్ధ స్వరూపము, జీవాత్మ పరమాత్మల మధ్య సంబంధము తెలుసుకొనక, భగవత్ కైంకర్యములో నిమగ్నమగు అద్భుత అవకాశమును జారవిడుచు కొనుచున్నారని కూడ గుర్తించలేక పోవుచున్నారు. బదులుగా, అనాది కాలము నుండి సంసార సాగరములో మునిగి సంసారులు బాధలను అనుభవించుచున్నారు. అయిదు భిన్న రూపములు కల భగవానుడు (పరత్వాది పంచకము – http://ponnadi.blogspot.in/2012/10/archavathara-anubhavam-parathvadhi.html) మిక్కిలి దయతో తిరుమంత్రము ద్వారా ఈ సంసారులను శుద్ధి చేయవలెనని భావించిరి. వారిని అర్చిరాది గతి (మోక్షమునకు పయనమగు మార్గము) ద్వారా మార్గనిర్దేశనము చేయుట, సూర్య మండలమును చేధించుకొనుచు, విరజా నదిని దాటుటకు సహాయమొనరించుచు, అమానవన్ (ఎంపెరుమాన్ యొక్క మరొక స్వరూపము) హస్త స్పర్శచే ఆధ్యాత్మిక శరీరమును ఆశీర్వదించుచు, ఆ జీవాత్మను సదా కైంకర్య సేవకు వినియోగపడుట చేయును. దీనిని సాధించుటకు, బదరికాశ్రమములో నర నారాయణులుగా సాక్షాత్కరించిన పరమాత్మ, జీవాత్మలను సంసార బంధము నుండి విముక్తి చేయుటకు ఇప్పుడు ఈ సంసారములో కూడ సాక్షాత్కారమును ఇచ్చిరి. ఆ విధముగా, భగవానుడే స్వయముగా (ప్రధమ పర్వము – మొదటి వేదిక) ఆచార్యునిగా దర్శనమిచ్చున్నారని (చరమ పర్వము – అంతిమ వేదిక) మనము అంగీకరించ వలెను. దీనినే ఈ క్రింది శ్లోకములో వివరించిరి :

సాక్షాన్ నారాయణో దేవ:
కృత్వామర్త్యమయీమ్ తనుమ్
మగ్నానుద్దరతే లోకాన్
కారుణ్యాచ్చాస్త్ర పాణినా

సాధారణ అనువాదము: మహోన్నత భగవానుడైన శ్రీమన్నారాయణుడే, తమ అపార కరుణచే మనుష్య రూపు ధరించి, తమ హస్తములోనున్న శాస్త్ర సహాయముతో, ఈ జగత్తు లోని జీవాత్మలను ఉద్దరించుచున్నారు (ఆచార్యునిగా).

ఇప్పటి వరకు మనము, నిజమైన శిష్యుడు భగవానుని విశిష్ఠ అవతారము దాల్చిన నిజమైన ఆచార్యుని ఆరాదించవలెనని అనేక ప్రమాణముల (సాక్షములు) ద్వారా దర్శించితిమి. ఇప్పుడు, మనము ఆచార్యుని సాధారణ పురుషునిగా భావించరాదని మరికొన్ని ప్రమాణముల ద్వారా దర్శించెదము. పైన పేర్కొనిన రెండింటి ద్వారా, ఆచార్యుని సాధారణ పురుషునిగా భావించిన వారు నరక లోకములో పడుదురని, ఆచార్యుని భగవంతునిగా ఆరాధన చేయువారు పరమపద ప్రాప్తి నొందుదురని విదితమైనది. అరుళాళ పెరుమాళ్ ఎంపెరుమానార్ జ్ఞాన సారము 32 పాశురములో “ఎక్కాలుమ్ నణ్ణిడువర్ కీళాం నరగు” (ఆచార్యుని సామాన్య మానవునిగా భావించినవారు, శాశ్వతముగా నరక లోకములో పడుదురు). ఈ విధమైన ఆలోచనలను పూర్తిగా వదలివేయవలెను, మనము “పీతకవాడై ప్పిరానార్ బిరమగురువాగివందు” (భగవానుడే స్వయముగా ఆచార్యునిగా సాక్షాత్కరించుట) అని పెరియాళ్వార్ తెలిపిన విధముగా భావింపవలెను. ఈ సూత్రము శాస్త్రమును పూర్తిగా విశ్వసించిన, సదా ప్రమాణములను పాటించిన వారి హృదయ లోతులలో ఉండును.

అందువలన, “యత్సార భూతం తదుపాసితవ్యం” (సారాంశము/మూలమును ఆరాధించిచాలి/అనుసరించాలి), “భజేత్ సార తమం శాస్త్రం” (శాస్త్రంలో మూలసారాన్ని అనుసరించాలి, మొ॥., “ఉపాయ ఉపేయ భావెన త్వమేవ శరణం వ్రజేత్” అని చెప్పినట్లుగా జీవాత్మ మోక్షంపైనే ఏకైక దృష్టి ఉన్న ఆచార్యుని (ఆచార్య అభిమానం) పై ఆధారపడే బదులు, ఆచార్యుని చరణ కమల యందు శరణాగతి చేసి అదియే ఉపాయం/ఉపేయం భావించుట), “పేరొన్ఱు మాఱ్ఱిళ్ళై నిన్ శరణన్ఱి” (నీ తిరువడి తప్పా నాకు ఇంకొక ధ్యేయం లేదు – ఇరామానుశ నూఱ్ఱందాది 45 పాశురములో అముదనారులు), మొ॥. ఈ ఆచార్యత్వం

  • అన్ని శాస్త్రాముల సారము
  • శ్రీ మధురకవి, నాథమునులు మొదలైన ప్రారంభించి మన పూర్వాచార్యులు మన గురుపరంపరలో బోధించారు.
  • మనం అరాధించ తగిన ప్రత్యక్ష స్వరూపం
  • అణు మాత్రం స్వాతంత్ర్యం లేని పరమ దయామయుడు
  • అతి చేరువలో ఉన్న అత్యంత సులభుడు

కాని మనను ఉద్దరించు ఆచార్యుని సంపూర్ణ శరణాగతి చేయుటకు బదులు, పూర్ణ స్వతంత్రుడు, అత్యుత్తముడైన భగవానుని ఉపాయ ఉపేయములుగా పట్టుకొనుట, మన కన్నుల ముందరే దర్శనమిచ్చు ఆచార్యుని విస్మరించి భగవానునికై ప్రయత్నించుట, చాలా మూర్ఖత్వమగును (మన దోసలిలో ఉన్న నీటిని జారవిడచి, నిజముగా దాహార్తితో నున్నవాడు వర్షపు నీటికై ఆకాశము వంక చూచినట్లు). భగవానుని ఇట్లు వివరించారు.

  • తైత్తరీయ ఉపనిషత్తు – “యతో వాచో నివర్తంతే అప్రాప్య మానసా సహ – భగవానుని ఒక్క గుణమే కూడ మనస్సుకు అర్ధము కాదు మరియు అత్యంత వివేకవంతుడు కూడా దానిని మాటలలో చెప్పలేడు.
  • “సులభమ్ స్వగురుమ్ త్యక్త్వా దుర్లభమ్ యా ఉపాసతే” – సులభముగా లభ్యమగు గురువును వదలి భగవానునికై క్లిష్టమగు ఆరాధన చేయుట మూర్ఖత్వమగును.
  • స్తోత్ర రత్నము – విధి శివ సనకాద్యైర్ ధ్యాతుం అత్యంత దూరం – మహా యోగులైన బ్రహ్మ, శివ, సనక కుమారులకు కూడా నీ సేవ చేయుట వారి గ్రహణ శక్తికి అతీతమైనది.
  • తిరుమాలై 44 – ‘పెణ్ణులామ్ శడైయినానుమ్ పిరమునుమ్ ఉన్నైక్కాణ్బాన్ ఎణ్ ఇలా ఊళిఊళి త్తవం శెయ్దార్ వెళ్గి నిఱ్ప’ – జటా జూటములో గంగను దాల్చిన శివుడు అనేక వర్షములు తపమొనరించినను బ్రహ్మాదులకు కూడా నీ సాక్షాత్కారము లభింపక సిగ్గుతో తలదించుకొనిరి.
  • సిద్ధిర్ భవతి వా నేతి సంసయోచ్యుత సేవినామ్ – అచ్యుతుని సేవించిన వారికి కూడ అతడు లభ్యమగుట అనుమానస్పదమే.
  • తిరుచ్చంద విరుత్తమ్ 85 – ‘వైత్త శిందై వాంగు విత్తు నీంగు విక్క – నీవు సర్వ స్వతంత్రుడవు, నా మనస్సును నీ నుండి తొలగించి, భౌతిక విషయముల వైపు మళ్ళించగలవు.
  • క్షిపామి న క్షమామి – నేను వారిని శిక్షించెదను, నేను వారిని క్షమించను

ఆచార్యుని అంత దయాశాలి ఎంపెరుమాన్ కాదని, ఆచార్యులు సదా క్షమిస్తూ మరియు మోక్షమార్గమునకు మనను మరల్చగలరని తెలిపిరి.

పరమాత్మ గురించి వివరించుచు, అతనిని జేరుట చాలా కష్టమని, సంసారములో జీవాత్మను బంధించుటకైనను, సంసారము నుండి జీవాత్మను విముక్తి చేయుట కైనను, తనను శరణాగతి చేసిన భరతుని కూడ నిర్దయగా నిరాకరించుట, పెరుమాళ్ళనే అంటిపెట్టుకొని వున్న సీత పిరాట్టిని ఎడబాసి జీవించుటకు అరణ్యమునకు పంపుట, అర్జునునికి ప్రపత్తిని బోధించుట, ఇత్యాది వన్నియు అతని లీలలను ప్రదర్శించు చున్నవి.

నమ్మాళ్వార్ ను పూర్తిగా శరణాగతి చేసిన మధురకవి ఆళ్వార్

కావున, శిష్యుడు ఆచార్యుని ఉపాయము (సాధనము) మరియు ఉపేయము (లక్ష్యము) గా అంగీకరించుట “ఉత్తారయతి సంసారాత్ తదుపాయ ప్లవేనతు; గురుమూర్తి స్థిత స్సాక్షాత్ భగవాన్ పురుషోత్తమః” (భగవానుడు ఆచార్య రూపమును ధరించి తగిన సాధనముల ద్వారా జీవాత్మలను సంసారము నుండి ఉద్దరించుటకు అవతరించును) అని వివరించిరి.
స్తోత్ర రత్నములో ఆళవందార్లు “సర్వం యదేవ నియమేన” (ఆళ్వారుని పాదపద్మములే నాకు సదా సర్వస్వము) అని తెలిపిరి. శిష్యుడు తన ఆచార్యుని గురువుగాను, రక్షకుడుగాను, మిక్కిలి ఆనందముగా అనుభవించు వానిగాను స్వీకరించవలెను. దీనికి బదులుగా, కొందరు ఆచార్యుని సామాన్య ఉపకారకునిగా (ఎంపెరుమాన్ దగ్గరకు చేర్చు సహాయకునిగా) మాత్రమే భావించుటను, ఉపదేశ రత్న మాల 71 పాశురములో “మున్నోర్ మొళింద ముఱై తప్పామల్ కేట్టు! పిన్నోర్ందు  తామతనై ప్పేశాదే! తన్నేఞ్జిల్ తొఱ్ఱినతే శొల్లి ఇదు శుద్ధ ఉపదేశ వరవాఱ్ఱతెన్బర్ మూర్కరావార్!” అని తెలిపిరి. పూర్వాచార్యుల నుంచి విని నది, వారి దివ్య సిద్ధాంతములు, అంతర్యామి తెలియజేసినది అనుసరించకయే, వారు భావించిన సిద్ధాంతమునే బోధించుచు” ఈ సూత్రము మన పూర్వాచార్యుల నుండి వచ్చినది” అని తెలుపుచు, కొందరు తమను తామే స్వతంత్రులుగా తలంచుచు, ఆ దౌర్భాగ్యులు తమ ఆచార్యునిపై అంకితము లేకుండా కఠిన హృదయులైనారు.
మన సంప్రదాయములోని లోతైన సూత్రములపై అవగాహన లేకపోవుటచే వారి ఉపదేశములు ఉనికిని కోల్పోయి, నకిలీ అలంకారముల వలె అదృశ్యమగును. నా ఆచార్యులు (మాముణులు) వివరించుచు, ప్రమాణములకు అనుగుణంగా ప్రతి ఒక్కరు తమ ఆచార్యునిపై సంపూర్ణ విశ్వాసముగలిగి ఉండవలెనని తెలిపిరి. అవి..

  • ‘ఆచార్యాయాహరే ధర్తాన్ ఆత్మానంచ నివేధయేత్ : తదధీనశ్చ వర్తేత సాక్షాన్ నారాయణో హి సః’ – తనను తాను, తన సంపదను, ఆచార్యుని అధీనములో ఉండి  తమ ఆచార్యునికి ఎవరు సమర్పించుదురో, వారు తప్పక శ్రీమన్నారాయణుని దివ్య ధామానికి చేరగలరు.
  • ‘యస్య సాక్షాత్ భగవతి జ్ఞాన దీపప్రదే గురౌ’ – ఆచార్యులు జ్ఞానజ్యోతి వెలిగించి, శిష్యునికి జ్ఞానమోసగుటచే, వారిని సాక్షాత్ భగవానునిగా భావించవచ్చు.
  • ‘ఆచార్యస్స హరి సాక్షాత్ చరరూపి న సంశయః’ –  ఆచార్యులు స్వయముగా శ్రీహరియే – నిస్సంశయముగా, కాని వారు భగవానునిలా (కోవెలలో ఒకే చోట నిశ్చలముగా వుంటారు) కాక, మన చుట్టూ దర్శనమిచ్చెదరు
  • ‘గురురేవ పరంబ్రహ్మ’ – గురువే పరంబ్రహ్మ
  • ‘గురుమూర్తి స్థితస్ సాక్షాత్ భగవాన్ పురుషోత్తమః’ – భగవానే స్వయముగా గురువు రూపమును ధరిస్తారు, మొ ||

పిళ్ళై లోకాచార్యులు, శ్రీవచన భూషణము 443 సూత్రములో ఈ విషయమునే వివరించిరి:
‘స్వాభిమానత్తాలే ఈశ్వరాభిమానత్తై కులైత్తుకొణ్డ ఇవనుక్కు, ఆచార్యాభిమానమొళియ గతియిల్లై ఎన్ఱు పిళ్ళై పలకాలుం అరుళిచ్చెయ్య క్కేట్టిరుక్కైయాయిరుక్కుమ్’.

సాధారణ అనువాదము: జీవాత్మ తన స్వతంత్రత కారణముగా ఈశ్వరుని కృపను కోల్పోయిరని, వారికి ఆచార్యుని కృపయే శరణ్యము అని వడక్కు తిరువీధి పిళ్ళై పదే పదే తెలిపిరని నేను వింటిని.

ఈ సూత్రము (ఆచార్యుని కృపను ఉపాయముగా స్వీకరించుట) సత్సంప్రదాయము యొక్క ఫలితము. అందరూ

  • తమ ఆచార్యుని శ్రీమన్నారాయణుని (శ్రీమహాలక్ష్మి పతి) రూపముగా భావించాలి
  • వారి పాదపద్మములను ఉపాయ ఉపేయములుగా తలంచాలి
  • ఆ పాదపద్మముల సేవయే అంతిమ లక్ష్యముగా చేసుకొనాలి
  • వారి తిరుమాలిగ (లేదా వారి మఠం) అత్యున్న నివాసముగా యోచించాలి
  • వారి దివ్య స్వరూపమునే రక్షకునిగా, పోషకునిగా, ఆనందము నొసంగునదిగా భావించి సేవించవలెనని నమ్మాళ్వార్లు ఉణ్ణుం చోఱు అను పాశురములో వివరించిరి
  • ‘ఉత్తారయతి సంసారాత్’ శ్లోకములో వివరించిన ప్రకారము వారిని ఉధ్ధారకునిగా భావింపవలెను
  • ఆర్తి ప్రబంధములో మాముణులు ఆరాధించిన విధముగా వారిని ఆరాధించవలెను “యతిరాజ ఎన్నై ఇని క్కడుక ఇప్పవత్తినిన్ఱుమ్ ఎడుత్తఱుళే ” – యతిరాజా నన్ను దయతో ఈ క్రూర సంసారము నుండి వెంటనే విముక్తుడిని చేయుము.
  • ” ఆచార్య అభిమానమే ఉత్తారకము ” – శ్రీవచన భూషణము 447 – ఆచార్యుని కృపయే ఉద్ధరింపబడుటకు శరణ్యము.
  • రామానుజ నూఱ్ఱందాది 93వ పాశురము “ఎన్ పెరువినైయై క్కిట్టిక్కిళంగొడు తన్నరుళ్ ఎన్నుం ఒళ్ వాళురువి వెట్టి కలైన్ద, ఇరామానుశన్”, కణ్ణినుణ్ శిఱుత్తాంబు 7వ పాశురము “కండు కొండెన్నై, కారి మాఱ ప్పిరాన్ పణ్డై వల్వినై, పాఱ్ఱి యరుళినాన్” – మనము మునుపు చేసిన పాపములను తొలగించువాడు ఆచార్యులే అని భావించుము.

ఈ విధముగా చరమ పర్వము (అంత్య స్థితి) లో నున్న శిష్యులు, ఆచార్యులు తాము ఆశించిన ఫలితము నిచ్చువారిని, తమ లక్ష్య సాధనలో నున్న అడ్డంకులను తొలగించు వారని, తమను ఉద్ధరించు ఆచార్యునకు విధేయులని, స్వగత స్వీకారము (ఆచార్యుని అనుసరించు శిష్యుడు), పరగత స్వీకారము (ఆచార్యులు తమ దివ్య కృపచే శిష్యుని అనుగ్రహించుట), ఈ రెండును అంతిమ ఫలితమును ప్రసాదించును. కాని, శిష్యునికి ఆచార్యుని సమీపించుట / అనుసరించుట తామే స్వయముగా / అహంకార పూరితముగా చేయుచున్నామను భావనలో నుండుట, కాలుడు (యముడు) దీవించి ఇచ్చిన ఉంగరమును ధరించినటు వంటిది అగును, కావున జీవాత్మ స్వభావమునకు స్వగత స్వీకారము సరిపోదు. కావున శిష్యుడు దానిని వదలి, ఆచార్యుని అపార కరుణ (పరగత స్వీకారము) పైననే సంపూర్ణముగా ఆధారపడి ఆనందముగా జీవించవలెను.

  • “సంసారావర్త వేగ ప్రశమన శుభదృక్ దేశిక ప్రేక్షి – తోహం” – సంసారము వల్ల ఏర్పడు శక్తివంతమైన ఫలితములను అణచి వేయుటకై నా ఆచార్యుని సహాయమునకై ఆధారపడుట వల్ల నేను సుఖముగా నున్నాను.
  • ‘నిర్భయో నిర్భరోస్మి’ – భయము మరియు సంసారములో కష్టములు లేకుండుట.
  • ‘ఆచార్యస్య ప్రసాదేన మమ సర్వమభీష్టితం’; ప్రప్నుయామీతి విశ్వాసో యస్యాస్తి స సుఖీభవేత్’ – ఆచార్యుని కృపచే తమ సమస్త వాంఛలు నెరవేరునని నమ్మకము / విశ్వాసము కలిగిన వారు సుఖముగా నుండగలరు.
  • తిరువాయ్మొళి తనియన్ – ‘తనత్తాలుమ్ ఏదుమ్ కుఱై విలేన్ ఎందై శడకోపన్ పాదంగల్ యాముడైయ పత్తు’ – నేను నమ్మాళ్వార్లను శరణు చేయుటచే, నా సంపద (భౌతిక, ఆధ్యాత్మిక) పై సంతుష్టి కలిగి వున్నాను.

ఇంకను, పుణ్య పాపములు రెంటిని త్యజించుటచే, నిత్య విభూతి (పరమపదము) మరియు లీలా విభూతి (సంసారము) ల మధ్య అడ్డంకులు తొలగిపోవుటచే, ఈ సంసారములో ఆనందముగా వశించ వచ్చునని ఈ క్రింద పేర్కొనిన వానిలో వివరించిరి :

  • ప్రమేయ సారము 1 – ‘ఇవ్వాఱు కేట్టిరుపాఱ్కు ఆళెన్ఱు కణ్డిరుప్పార్ మీట్చియిల్లా నాట్టిరుప్పార్ ఎన్ఱు ఇరుప్పన్ నాన్’ – ఎవరైతే ఆచార్యుని ద్వారా తిరుమంత్ర అర్ధములను వినిరో, ఆచార్య శేషత్వమును గ్రహించిరో, వారి సేవ గావించిరో, వారు నిశ్చయముగా తిరిగి రాని ఉత్తమ లోకము పరమపదమును చేరెదరు.
  • ప్రమేయ సారము 9 – ‘తత్తం ఇఱైయిన్ వడివు ఎన్ఱు తాళిణైయై వైత్త అవరై’ – ఎవరైతే తమ ఆచార్యుని భగవదవతారముగా భావించి, ఆరాధించెదరో వారు తప్పక పరమపదమును చేరగలరు.
  • ఉపదేశ రత్త మాల 72 – ‘ఇరుళ్ తరుమా జ్ఞాలత్తే ఇన్బ ముఱ్ఱు వాళుం, తెరుళ్ దరుమా దేశిగనై చ్చేర్ న్దు’ – పూర్వాచార్యుల దివ్య ఆదేశములను, వారి జీవితములను శ్రవణము గావించి, ఆచరించి, వాటి దివ్య జ్ఞానమును ఆచార్యుని ద్వారా పొందిన శిష్యుడు, అంధకారమయమైన ఈ సంసారములో కూడ ఆనందముగా జీవించగలడు.

ఈ కారణముగానే పెరియ వాచ్చన్ పిళ్ళై, ఆచార్యుని పాదపద్మములే భౌతిక / ఆధ్యాత్మిక జగత్తులని భావించుట, గోచరమైన / అగోచరమైన లక్ష్యమని అంగీకరించుట కన్నా ఇతర గొప్ప విషయమేది లేదని తేల్చిరి. అయితే, అట్టి శిష్యులకు (తమ ఆచార్యునిపై సంపూర్ణ విశ్వాసము కలవారికి) ఈ సంసారమే పరమపదమగునా? ఒకసారి, నంబి తిరువళుది వళనాడు దాసర్, కణ్ణినుణ్ శిఱుత్తాంబు పఠించుచూ “మధురకవి శొన్నశొల్ నంబువార్ పది వైకుందం కాణ్మనే” (మధురకవి ఆళ్వార్ల దివ్య పలుకులను విశ్వసించినవారు, వారు ఎక్కడ వున్నను అదియే వైకుంఠమగును) అని ముగించిరి. ఆ సమయములో అక్కడ నున్న శ్రీవైష్ణవులు “ఈ సంసారములో (లీలా విభూతి) నున్న శ్రీవైష్ణవులు దానిని విశ్వాసముతో చదివిన, ఆ స్థలము వైకుంఠముగా (నిత్య విభూతి) ఎట్లగును?” అనగా, వారు జవాబుగా ఎట్లగునో నేను వివరించెదను, వినుము. దైవాంశతో జన్మించిన కూరత్తాళ్వాన్ పుత్రుడు (భట్టర్) అవతరించిన పిదప, ఆ రెండు జగత్తుల మధ్య ఉన్న హద్దులు తొలగిపోయి, రెండును ఏకమైనవి” అనిరి. ఈ సంఘటనను కణ్ణినుణ్ శిఱుత్తాంబు వ్యాఖ్యానములో వివరించిరి.

అనువాదకుని గమనిక: ఈ విధముగా, మనము భగవానుని స్వయం అవతారముగా అపార కరుణా స్వరూపునిగా ఆచార్యుని దర్శించితిమి, శిష్యునికి వారి సేవయే అత్యంత ఆవశ్యకము.

దీనిలోని అనేక సంస్కృత ప్రమాణములను అనువదించుటకు సహాయ మొనర్చిన శ్రీ రంగనాథన్ స్వామికి కృతఙ్ఞతలు.

సశేషం….

అడియేన్ బొమ్మకంటి గోపిక్రిష్ణమాచార్యులు రామానుజ దాసన్.

మూలము: http://ponnadi.blogspot.com/2013/06/anthimopaya-nishtai-12.html

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

అంతిమోపాయ నిష్ఠ – 11

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్ వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః

అంతిమోపాయ నిష్ఠ

మునుపటి వ్యాసములో, (https://srivaishnavagranthamstelugu.wordpress.com/2022/06/19/anthimopaya-nishtai-10/), మనము శ్రీరామానుజుల శిష్యుల దివ్య మహిమలను గమనించితిమి. ఇప్పుడు మరికొన్ని సంఘటనలను (ప్రధానముగా ఎంబార్ యొక్క నిష్ఠ గురించి) తెలుసుకొందాము.

ఎంపెరుమానార్ – ఎంబార్

ఎంబార్ (గోవిందర్) వట్టమణి కులంలో (ఒక ప్రత్యేక కుటుంబ పరంపర) జన్మించిరి. వారు మంచి జ్ఞానులు, గొప్ప వైరాగ్యపరులు, యుక్త వయస్సు నుండే అనుష్టానములు సక్రమముగా చేసినవారు. ఆ కాలములో వారు శివ భక్తులుగా వుంటూ, శైవ ఆగమములో ప్రవేశించి, రుద్రాక్ష మాల ధరించి కాళహస్తిని చేరిరి. అక్కడ వారు ప్రధాన అర్చకులుగా వుంటూ, శివుని ఆలయమును నిర్వహించుచుండిరి. వారి హస్తములో దండములు/పత్రములు (శివునికి ప్రియమైనవి) ధరించి, తమిళ భాషలో వారికున్న పటుత్వము వలన సదా శివ కీర్తనలను ఆలపించెడివారు. ఆ సమయములో తిరుమల నుంచి పెరియ తిరుమల నంబి (శ్రీశైలపూర్ణులు) ఒక ప్రత్యేక కార్యము (గోవిందర్ ను సంస్కరించుటకై) పై కాళహస్తిని చేరిరి. వారు వారి శిష్యులతో కలసి వృక్షముల చెంత (అడవి) కూర్చుని చర్చ ప్రారంభించిరి. అదే సమయంలో రుద్రునికి పుష్పములు కోయుటకై అచటికి ఎంబార్ వచ్చి, తిరుమలనంబి గారు కూర్చున్న ప్రక్కనే ఉన్న ఒక వృక్షమును ఎక్కనారంభించిరి. ఎంబార్ స్థితిని గమనించిన తిరుమల నంబి వారిపై బాధతో, “ఈ జీవాత్మ (ఎంబార్) ఒక మంచి విద్వాంసుడు, వైరాగ్యపరుడు. అల్పమైన వానిపై జీవాత్మకు ఉండకూడని భక్తిని వదిలించుకొని, జీవాత్మకు సముచిత గురువైన శ్రీమన్నారాయణునిపై భక్తి పట్ల మరలించిన, ఈ జగత్తునకు ఎంతో ప్రయోజనము చేకూరును” అని తలంచిరి. అప్పుడు వారు ఎంబార్ పుష్పములు కోయుచున్న వృక్షము వద్దకు వెళ్లి, శ్రీమన్నారాయణుడే సర్వేశ్వరుడు అని నిరూపించు వేదములలోని కొన్ని పద్యములను శిష్యులకు వివరించిరి. తిరుమల నంబిగారి దివ్య వివరణను ఆలకించిన ఎంబార్, తాను ఆలయములో చేయు సేవలను, పుష్పములను కోయుటను కూడ మరచి, అమిత పారవశ్యముతో అచ్చటనే చాలా సమయము గడిపిరి.

ఎంబార్ అనుకూల ప్రవర్తనను, ఆసక్తిని గమనించి, నంబి “నమ్మాళ్వార్ల దివ్య శ్రీ సూక్తుల నుండి ఒక పాశురమును వివరించుట ద్వారా వారి మనస్సును శుద్ధి చేయగలము” అని తలంచి, తిరువాయ్మొళి (2.2.4) పాశురమును విశ్లేషణాత్మకముగా వివరించుట ప్రారంభించిరి.

తేవుమ్ ఎప్పొరుళుమ్ ప్పడైక్క
పూవిల్ నాన్ముకనై ప్పడైత్త
తేవన్ ఎమ్బెరుమానుక్కల్లాల్
పూవుమ్ పుశనైయుమ్ తకుమే?

సాధారణ అనువాదము: వ్యష్ఠి సృష్టి అనగా అన్ని జీవులను మరియు ఇతర అంశాలను సృష్టించుటకై ఎంపెరుమాన్ బ్రహ్మను సృష్టించెను. (మొదటగా భగవానుడు తానే స్వయముగా సమిష్టి సృష్టి గావించెను – పంచభూతములను సృష్టించుట, పరోక్షముగా బ్రహ్మ ద్వారా వ్యష్ఠి సృష్టి గావించెను). కావున, ఎంపెరుమాన్ కాకుండా పుష్పములచే, పూజలచే ఆరాధనలను అందుకోగలిగిన యోగ్యులు వేరొకరెవరైనా ఉన్నారా? (ఇతరులెవరూ యోగ్యులు కాదు అని భావము).

అది విన్న ఎంబార్, తమిళములో మంచి ప్రతిభ కలిగి ఉండుటచే, ఒక్కసారిగా పుష్పముల బుట్టను జారవిడిచి, వృక్షముపై నుండి క్రిందకు దిగి, “లేదు! లేదు! ఇంతవరకు నేను, తమోగుణ పూరితుడైన ఈ దేవుని స్నానమునకై జలమును తెచ్చుట మొ || సేవలు ఒనరిస్తూ, నా జీవితమును వ్యర్ధము చేసుకొంటిని” అని పలుకుచూ తిరుమల నంబి పాద పద్మములపై బడిరి. నంబి, తమ లక్ష్యము నెరవేరినదని సంతసించి, ఎంబార్ కు స్నానమాచరించి, శుద్ధి పొందమని ఆదేశించిరి. ఎంబార్ తన రుద్రాక్షమాలను పారవేసి తమ పాషండ వేషమును తొలగించి, స్నానమొనరించి, తడి వస్త్రములతో నంబి వద్దకు, వారిని తమ ఆచార్యులుగా పొందు గొప్ప కోరికతో, చేరిరి. వారిని గాంచి మిక్కిలి సంతసించిన నంబి, వెను వెంటనే వారికి పంచ సంస్కారములు గావించి, త్యజించుట (ఏమి వదలి వేయవలెనో) మరియు ఉపాధ్యేయము (ఏమి అంగీకరించవలెనో) స్పష్టముగా వివరించి, “భగవానునితో సంబంధము తప్ప మిగిలిన ఇతర అన్ని విషయములను త్యజించమని, శ్రీమన్నారాయణుని వదలక ఆశ్రయింపుమని, మన కలయికపై విశ్వాసము వుంచమని” ఆదేశించిరి. ఎంబార్ కృతజ్ఞతతో అంగీకరించి, నంబితో కలిసి తిరుమలకు పయనమైరి.

అదే సమయమున, కాళహస్తిలోని అనేక పాషండులు అచటకు వచ్చి ఎంబారుతో “మీరు మా ప్రధానులు, కావున మీరు మమ్ములను వీడరాదు” అని ప్రార్థించిరి. కొంచెము దూరము నుంచే సమాధానమిచ్చుచు ఎంబార్ “మీ దండములు మరియు పత్రములు మీరే ఉంచుకొనుడు; ఇంక నేను ఈ స్మశానములో ఉండలేను” అనిరి. లంకపై ఎట్టి అనుబంధము లేకుండా వదిలి వేసిన సీతా పిరాట్టి వలె, పరమపదము చేరుటకై ముక్తాత్మలు అర్చిరాది మార్గము వైపు మనలోని అంతర్యామి సూచన వలన పయనమగునట్లు, తిరుమల నంబి మార్గ దర్శకత్వములో, భూలోక వైకుంఠముగా భావింపబడు తిరుమలకు, ఎంబార్ చేరి, తిరుమల నంబికి మిక్కిలి విశ్వాసపాత్రుడై, సదా సేవ చేయుచు అక్కడ నివసించసాగిరి.

ఉడయవర్ తిరుమలకు చేరి, తిరుమల నంబి వద్ద శ్రీ రామాయణములోని ప్రధాన సూత్రములను అభ్యసించి, శ్రీరంగమునకు తిరుగు ప్రయాణమునకు సన్నద్దులైరి. శ్రీ రామానుజులను ఒక ప్రత్యేక అవతారముగా భావించి, వారిని ఆళవందార్ రూపముగా దర్శించిన తిరుమల నంబి, తమ కుమారులకు ఉడయవర్లను ఆశ్రయించమని తెలిపి, వారితో “నేను మీకు ఇంకా విలువైనది ఇవ్వదలచితిని” అనిరి. ఎంబార్ కు తమ ఆచార్యునిపై గల నిష్ఠను గమనించిన ఉడయవర్లు, ఎంబార్ ను తమతో శ్రీరంగమునకు పంపి, ఆశీర్వదించమని నంబిని కోరిరి. వారి అభ్యర్ధనను నంబి సంతోషముగా అంగీకరించి ఉదక తర్పణము (శుద్ధ జలమును దానమునకు వినియోగించి వ్యవహారమును పూర్తి చేయుట) గావించి, ఎంబార్ ను వారికి ధారపోసిరి. ఉడయవర్లతో కలిసి ఎంబార్ పయనమైరి. 4 / 5 రోజుల ప్రయాణము తరువాత, వారు తమ ఆచార్యులైన నంబిని వీడినందువలన, విచారవదనముతో నుండిరి. ఉడయవర్ వారితో “మీరు ఏల విచారముతో నున్నారని” అడిగిరి, “మీ ఆచార్యుని ఎడబాటు వల్లనైతే, మీరు తిరిగి తిరువేంగడమునకు వెళ్లవచ్చును” అనిరి. తిరుమలకు ఎంబార్ సంతోషముగా తిరుగు ప్రయాణమై, 4 / 5 రోజుల పిదప, తిరుమల నంబి తిరుమాళిగను (గృహము) చేరి వారి పాద పద్మములపై బడిరి. నంబి ఎంబార్ తో “నేను ఉదక తర్పణము గావించి, మిమ్ములను ఉడయవర్లకు ధారపోసితిని కదా! మీరు మరల ఏల ఇచటకు వచ్చిరి?” అని అడిగిరి. ఎంబార్ సమాధానముగా నేను మీ ఎడబాటును భరించలేక తిరిగి వచ్చితిని అనిరి. నంబి వారితో “ఇతరులకు అమ్మివేసిన గోవునకు మేము దాణ ఇవ్వలేము. మీరు ఉడయవర్లకు పూర్తిగా కట్టుబడి ఉండి వారి సేవయే చేయవలెను” అనిరి. ఎంబార్ కు ప్రసాదమును కూడా ఇవ్వక వారిని బయటకు త్రోసి వేసిరి. ఈ చర్యతో తమ ఆచార్యుల ఉద్దేశ్యమును అర్ధము చేసుకొనిన ఎంబార్ తమకు ఉడయవర్ల పాదపద్మములే శరణ్యమని గ్రహించి, శ్రీరంగమునకు తిరుగు ప్రయాణమైరి. అప్పటి నుండి వారు అచటనే ఉండి, ఉడయవర్లకు సంతోషముగా సేవ చేయుచు ఉండిరి.

ఒకసారి, ఉడయవర్లు తమ శిష్యులతో ఉన్న ఒక గోష్ఠిలో, ఎంబార్ల జ్ఞానము, భక్తి, వైరాగ్యము, మొ|| వాటి గురించి ఉడయవర్ల శిష్యులు కీర్తింప సాగిరి. ఎంబార్ తమ శిరస్సును అంగీకారముగా ఊపి “ఔను ! అది యదార్ధము” అనిరి, తనను తానే ఇతరుల కన్నా ఉత్తమునిగా కీర్తించుకొనిరి. ఇది గమనించిన ఉడయవర్ “ఇతరులు నిన్ను కీర్తించిన, నీవు చాల అణుకువతో మెలిగి, నేను ఆ పొగడ్తలకు అనర్హుడనని పలుకవలెను. కాని నిన్ను నీవే కీర్తించుకొనుట, మర్యాదకరమేనా?” అని ప్రశ్నించిరి. ఎంబార్ సమాధానమిచ్చుచు “స్వామి! ఈ శ్రీవైష్ణవులు నన్ను కీర్తించినది – నేను కాళహస్తిలో నున్నప్పుడు అల్పమైన దండములు మరియు మట్టిపాత్ర, మెడలో రుద్రాక్షమాల మొ|| వానిని ధరించినందువలన. వానిని చూచి కీర్తించినచో, దానికి నేను అర్హుడనే. కాని మీరు, మీ గొప్పదనముచే, ‘పీతగవాడైప్పిరానార్ బిరమగురువాయ్ వంతు’ (భగవాన్ తానే ప్రధమ గురువుగా దర్శనమిచ్చినటుల) అని చెప్పిన విధముగా, నన్ను శుద్ధి చేసిరి. నేను అతి అల్పుడను – నిత్య సంసారి కన్నా అల్పుడను – కాని నన్ను మీరు సంస్కారించుటచే ఈ శ్రీవైష్ణవులు నన్ను కీర్తించుచున్నారు. కావున, ప్రతిసారి నన్ను నేను గాని, లేక ఇతరులు గాని కీర్తించినచో, అది యధార్ధముగా మీ గొప్పతనమును కీర్తించుటయే అగును” అనిరి. ఉడయవర్ “ప్రియ గోవింద పెరుమాళ్! అద్భుతము! అద్భుతము!” అని పలికి ఎంబార్ యొక్క స్వామి నిష్ఠను గాంచి మిక్కిలి సంతసించిరి.

ఒక ఆచార్యుడు తమ శిష్యునికి, ఏమి గ్రహించవలెనో మరియు ఏమి త్యజించవలెనో స్పష్టముగా వివరించుచుండిరి. ఆ సూత్రములను శిష్యుడు అర్ధము చేసుకొనలేదు. ఆచార్యులు వాని లోపములను అక్కడే సరిచేయుచున్నారు (కాలిత్యే శాసితారంలో సూచించిన విధముగా). ఒక విద్వాంసుణ్ణి శిష్యుడు కలవగా, ఆచార్యుని శిక్షణ పొందుటకు ఆ శిష్యుడు ఇంకను సిద్ధముగా లేడని భావించి, దిగులుగా, ఆచార్యుని ఆదేశములను పాటించగల శిష్యులకు మాత్రమే ఆచార్యుడు శిక్షణనిచ్చును, కాని “నీ ఆచార్యులు నీకేల శిక్షణనిచ్చిరి?” అని అడిగిరి. ఈ విషయమును నా ఆచార్యులు (మాముణులు) వివరించిరి. ఆ విధముగా, పూర్ణ శరణాగతి అయిన శిష్యునికి ఆదేశములు/ మార్గదర్శనము ఆచార్యులు చేయవలెను, నిజమైన ఆచార్యుని అట్టి ఆదేశములు/ మార్గదర్శనము శిష్యుని అంతిమ ధ్యేయములో ఒక భాగమని నిరూపింపబడినది. మరియొక ప్రాంతములో నివసిస్తున్న నంజీయర్ శిష్యులు ఒకరు వారి వద్దకు వచ్చి, కొంత కాలము వారిని సేవించుకొని, తదుపరి వారు తిరుగు ప్రయాణమునకు సిద్ధమైరి. వారు తిరిగి వెళ్ళుటకు గమనించిన నంజీయర్ల మరియొక శిష్యుడు వారితో, “ఓహ్! జీయర్ పాదపద్మములను విడనాడి, మీ నివాసమునకు తిరిగి పయనమగుట దురదృష్టకరము” అని బాధ పడిరి. దానికి శ్రీవైష్ణవుడు జవాబుగా “నేను ఎక్కడ వున్నను, నాకు నా ఆచార్యుని కృప ఉండును” అని తమను తాము ఓదార్చుకొనిరి. ఈ సంభాషణను వినిన మరియొక శ్రీవైష్ణవుడు (నంజీయర్లకు సన్నిహితుడు), తమ గృహమునకు తిరుగు ప్రయాణమైన ఆ శ్రీవైష్ణవుడు తమ ఆచార్యుని నుండి ఎడబాటునకు సహితము బాధను కనపరచ లేదని “ఏనత్తు ఉరువాయ్ ఉలగిడంద ఊళియాన్ పాదమ్ మరువాదార్కు ఉండామో వాన్?” (మొదల్ తిరువందాది 91 – ఈ భూమిని కాపాడిన వరాహ పెరుమాళ్ పాదపద్మములను పూజించని వాడు, పరమపదమును ఎలా పొందగలరు? – విషయమేమనగా – ఎంపెరుమాన్ పాదపద్మములను గురించియే ఈ విధముగా భావించిన, ఇంక ఆచార్యుని పాదపద్మములను ప్రతిరోజు అర్చించనిచో, దానిని గురించి ఏమని అనగలము). ఈ సంఘటనను నా ఆచార్యులు (మాముణులు) తెలిపిరి. దీని వలన, శిష్యుడు తమ సదాచార్యుని ఎడబాసినచో, అతను ఏమి గ్రహించవలెనో, ఏమి త్యజించవలెనో తెలుసుకొనజాలడు అని విదితమగుచున్నది. తదుపరి, ఆ అజ్ఞానము వానిని నష్టపరుచుటయే కాక, పరమపదము పొందవలెనను అంతిమ లక్ష్యము కూడ నెరవేరనీయదు.

కొంగునాడు (కోయంబత్తూర్ ప్రాంతము) కరువుతో ప్రభావితమైన సమయములో, ఒక బ్రాహ్మణుడు, అతని పత్ని, శ్రీరంగములో నివసించుటకై పయనమైరి. ఆ రోజుల్లో ఎంపెరుమానార్ మధుకరము (ఆహారమునకై బిక్షాటన) చేయుటకై 7 గృహములకు వెళ్లెడివారు. అగళంగనాట్టాళ్వాన్ ప్రాకారమ్ (కోవెల చుట్టూ ఉన్న 7 ప్రాకారములలో ఒకటి) వీధిలో వున్నప్పుడు శ్రీవైష్ణవులు, ఎంపెరుమానార్ల పాదపద్మములకు ప్రణమిల్లెడివారు. ఆ దగ్గరలోనే ఉన్న ఒక మేడపై నున్న ఇంట్లో నివసిస్తున్న ఆ బ్రాహ్మణుడు, అతని పత్ని ఇది గమనించిరి. ఒకరోజు, ఎంపెరుమానార్ వారి నివాసము దగ్గరకు వచ్చినప్పుడు, ఆమె మేడపై నుంచి క్రిందకు వచ్చి ఎంపెరుమానార్లతో “రాజులందరు మీ పాదపద్మములకు ప్రణమిల్లుచుండగా, మీరు మాత్రము ఆహారమునకై బిక్షాటన చేయు చున్నారు. కారణమేమి?” అని అడిగిరి. ఎంపెరుమానార్ సమాధానముగా “నేను వారికి చేయు మంచి ఆదేశముల వలన వారు నన్ను ఆరాధించుచున్నారు” అనిరి. ఆమె కూడ వారి పాదపద్మములకు ప్రణమిల్లి “నాకు కూడ దయతో మంచి ఆదేశములను ప్రసాదించగలరు” అని ప్రాధేయపడెను. వారు తమ దివ్య అనుగ్రహముచే ఆమెకు ద్వయ మంత్రమును ఉపదేశించిరి. తదుపరి కొంత కాలము పిదప, వారి ప్రాంతములో సాధారణ స్థితి నెలకొనెను. వారు శ్రీరంగమును వీడుటకు సిద్ధమైరి. తాము తిరిగి వెళ్ళు సమయమునకు ఎంపెరుమానార్లతో కలయిక జరుగదేమోనని ఆమె చింతించెను. ఆ సమయమునకే మధుకరమునకై ఎంపెరుమానార్ అచ్చటకు వెళ్ళిరి. వారిని గాంచి ఆమె “మేము మా స్వగ్రామమునకు తిరుగు ప్రయాణమగుచుంటిమి; మీరు దయతో మరియొక సారి దివ్య మంత్రమును ఉపదేశింపుమని, తద్వారా అది నా అంతరంగములో నిక్షిప్తమగునని” అని ప్రాధేయపడెను. ఎంపెరుమానార్ తమ అపార కరుణచే, మరల ఆమెకు దివ్య ఆదేశములను అనుగ్రహించిరి. ఆమె ఇంకను “నన్ను సదా కాపాడుటకై మరియొక ఆదేశమును ఇచ్చి అనుగ్రహించమని” వేడుకొనెను. వెంటనే ఉడయవర్ తమ పాదుకలను ఆమెకు ప్రసాదించి, ఆమెను పెరియ పిరాట్టి అని సంబోధించిరి. అప్పటి నుండి ఆమె ఆ పాదుకలను తన తిరువారాధనలో నుంచి, ప్రేమగా అర్చించసాగెను. ఈ సంఘటన వార్తామలై ద్వారా ప్రసిద్ధిచెందెను. దీని ద్వారా, ఈ సంసారములో ఎంపెరుమానుని కూడ విస్మరించి – ఆచార్యునిపై సంపూర్ణ భక్తిని పెంపొందించుకొని, ఆచార్య సంబంధమైన దానిని గ్రహించి (ఇచట పాదుకల వలె) పరిపూర్ణ శరణాగతి చేయవలెనని అవగతమగుచున్నది. ఆచార్యునిపై పూర్తి విశ్వాసము కలవారు, కొంగు దేశములోని పెరియ పిరాట్టి వంటివారు. ఆచార్య నిష్టాపరులైన పొన్ నాచ్చియార్ (పిళ్ళై వురంగ విల్లి దాసర్ పత్ని), తుంబి యార్కు కొండి, ఏకలవ్యుడు, విక్రమాదిత్యుడు మొ || వారి జీవితములను మనము గుర్తు పెట్టుకొనవలెను.

అనువాదకుని గమనిక: ఈ విధముగా మనము ఎంబార్ నిష్ఠను, ఉడయవర్ల ఇతర శిష్యుల నిష్ఠను గమనించాము. వారు శ్రీ రామానుజునిపై ఎటుల సంపూర్ణముగా ఆధారపడిరో వ్యక్తమైనది.

సశేషం….

అడియేన్ బొమ్మకంటి గోపిక్రిష్ణమాచార్యులు రామానుజ దాసన్.

మూలము: http://ponnadi.blogspot.com/2013/06/anthimopaya-nishtai-11.html

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

అంతిమోపాయ నిష్ఠ – 10

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్ వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః

అంతిమోపాయ నిష్ఠ

మునుపటి వ్యాసములో, (https://srivaishnavagranthamstelugu.wordpress.com/2022/06/09/anthimopaya-nishtai-9/) నంపిళ్ళైల దివ్య మహిమల గురించి మనము తెలుసుకొన్నాము. ఈ వ్యాసములో మనము మరిన్ని సంఘటనలను ఎంపెరుమానార్ల వివిధ శిష్యుల ద్వారా తెలుసుకొందాము.

ఉడయవర్ల కాలములో ఒకసారి, అరుళాల పెరుమాళ్ ఎంపెరుమానార్ అస్వస్థులైరి. కూరత్తాళ్వాన్ వారిని పరామర్శించుటకై వెంటనే వెళ్ళ లేదు. కాని 4 రోజుల తరువాత వెళ్లి పరామర్శిస్తూ “మీరు ఇన్ని రోజులు అనారోగ్యముతో ఎలా వున్నారు?” అని అడిగిరి. అరుళాల పెరుమాళ్ ఎంపెరుమానార్ “మన ఇరువురి మధ్య గల మిత్రత్వ స్థాయి తలంచి, నా అనారోగ్యము గురించి తెలిసిన వెంటనే మీరు వచ్చి నన్ను కలసి ఆశీర్వదించ గలరని భావించాను. కాని మీరు నన్ను పూర్తిగా విస్మరించుట, నన్ను అమిత బాధకు గురిచేసెను. నేను ఆళవందార్ల పాద పద్మములను ఆరాధించిస్తేగానీ నాకు స్వస్థత చేకూరదు” అని తెలిపిరి. ఈ సంఘటనను ‘పొన్ ఉలగు ఆళిరో’ (తిరువాయ్మొళి 6.8.1) అను పాశురము వ్యాఖ్యానములో స్పష్టముగా వివరించిరి. (అనువాదకుని గమనిక: ఇచట సందర్భము, ‘పొన్ ఉలగు ఆళిరో’ పాశురములో, నమ్మాళ్వార్ ఒక పక్షిపై పరిపూర్ణ విశ్వాసముతో ఎంపెరుమాన్ వద్దకు దూతగా పంపుటకు కారణము, ఆ పక్షికి ఎంపెరుమాన్ తో ఉన్న సాన్నిత్యము మరియు సమర్థత. కాని ఆ పక్షి వెంటనే ఆళ్వార్ కు సహకరించలేదు. అదే విధముగా, ఆళ్వాన్ కు ఎంపెరుమానునితో ఉన్న సాన్నిత్యము ద్వారా, తమను వెంటనే పరమపదమునకు పంపగలిగే సమర్థత ఉన్ననూ వారు తనను కలియుటకు జాప్యము చేసిరని, అరుళాల పెరుమాళ్ ఎంపెరుమానార్ భావించిరి. ఇట్టి తమ భావన నయము కావలెననిన, తాము ఇప్పటికే పరమపదములో నున్న ఆళవందార్ల ముందు మోకరిల్లిన గాని తొలగదని అనిరి).

ఉడయవర్లు పరమపదము పొందిన తరువాత, వడుగనంబి కొంతకాలము సజీవులుగానే వున్నారు. కాని తరువాత వారు కూడా పరమపద ప్రాప్తి పొందారు. ఒక శ్రీవైష్ణవుడు భట్టరు వద్దకు వెళ్లి “వడుగనంబి పరమపదము నొందిరి” అని తెలిపిరి. భట్టరు “నీవు వడుగనంబి గురించి ఆ విధముగా అనరాదు” అనిరి. ఆ శ్రీవైష్ణవుడు “ఎందులకనరాదు? వారు పరమపదమును చేరినారు అనిన దోషమేమి?” అని అడిగిరి. భట్టరు వారు అద్భుతముగా సమాధానమిస్తూ, పరమపదము ప్రపన్నులకి మరియు ఉపాసకులకి (భక్తి యోగమును అవలంబించిన వారికి, వారి కృషిచే పరమపదము పొంద గలరు) సాధారణమైనది – కాని వడుగనంబి లక్ష్యం అది కాదు అనిరి. ఆ శ్రీవైష్ణవుడు “అయితే వడుగనంబి మనస్సులో వేరే ఇతర స్థానము ఉన్నదా?” అని అడిగిరి. జవాబుగా భట్టరు వారు “అవును, నీవు, వడుగనంబి ఎంపెరుమానార్ పాదపద్మములను చేరిరి, అని పలుకవలెను” అనిరి. మా ఆచార్యులైన (మాముణులు) దీనిని వివరించిరి. స్తోత్ర రత్నము ప్రారంభములో ఆళవందార్లు ఈ విధముగా ప్రకటించిరి ” త్ర పరత్ర చాపి నిత్యం యదీయా చరణం శరణం మదీయం” – (సంసారము మరియు పరమపదము రెంటిలో కూడా నేను నాధమునుల పాదపద్మములనే సేవించవలెను). రామానుజ నూఱ్ఱందాది 95 వ పాశురములో, తిరువరంగత్తు అముదనార్ ఈ విధముగా సాయించారు “విణ్ణిణ్ తలై నిన్ఱు విడలిప్పన్ ఎమ్మిరామానుజన్ మణ్ణిణ్ తలత్తుధిత్తు మరైనాళుమ్ వలరత్తననే” (పరమపదము నుంచి జీవాత్మలను మన రామానుజులు పరమపద కైంకర్యమే అంతిమ లక్ష్యము అని దీవించెదరు, ఈ సంసారములో జన్మించినపుడు, సంసారములోని దోషములు అంటకుండా, సరైన వేద శాస్త్రమును నిరూపించెదరు).

సర్వజ్ఞులైన అరుళాల పెరుమాళ్ ఎంపెరుమానార్, కూరత్తాళ్వాన్ కుమారులైన భట్టరు, పరమాచార్యులైన ఆళవందార్లు, ఉడయవర్ల దివ్యమహిమలను సంపూర్ణముగా తెలిపిన తిరువరంగత్తు అముదనార్, కూరత్తాళ్వాన్ మొ ||, వీరందరూ ఆచార్య నిష్ఠ యొక్క మహిమలను స్పష్టముగా వివరించినవారు. ఈ సంసారము మరియు పరమపదము రెంటిలో కూడా సాటిలేని ఆచార్యుల పాదపద్మములను ఆశ్రయించుటయే శిష్యునికి అత్యావశ్యకము అని నిరూపింపబడినది, భగవానుని పాదపద్మములను ఆశ్రయించుట కంటే ఉత్తమమైనది. జితంతె స్తోత్రములో కూడా ఈ రెండు సమానమని ఈ విధముగా తెలిపిరి “దేవానాం ధనవాంఛ సామాన్యం అధిదైవతం” (అన్ని జీవులకు భగవానుడు ఒక్కడే). అందులకే మాముణులు, ఎంపెరుమానార్లతో “నీ పాదపద్మములను నేను ఎప్పుడు పొందగలను?”, “యతిరాజా! దయతో నాకు సదా మీ సేవ చేసే భాగ్యము పొందజేయుడు” అనిరి.

మన జీయర్ ఈ క్రింది సంఘటనను వివరించిరి. ఒకసారి ఒక శ్రీవైష్ణవుడు ప్రసాదమును స్వీకరిస్తుండగా కిడాంబి ఆచ్చన్ జలాన్ని వడ్డించుతున్నారు. కాని వారు ఎదురుగా ఉండి అందించకుండా, ప్రక్కన నిలబడి ఇచ్చుట వలన, ఆ శ్రీవైష్ణవుడు తన కంఠమును ప్రక్కకు తిప్పి అందుకొన్నారు. ఇది గమనించిన ఉడయవర్లు, కిడాంబి ఆచ్చన్ ను వెనుక నుంచి తట్టి “మనము శ్రీవైష్ణవులకి అత్యంత శ్రద్దతో సేవ చేయవలెను” అనిరి. ఆ మాటలు వినిన కిడాంబి ఆచ్చన్ హర్షాతిరేకముతో “మీరు నాలోని లోపాలను తొలగించుచున్నారు, ఇంకను అధిక సేవ చేయుటకై ప్రోత్సహించుచున్నారు. నేను మీకు సదా కృతజ్ఞుడను” అని తమ కృతజ్ఞతను తెలియ జేసిరి.

మాణిక్క మాలైలో, పెరియ వాచ్చాన్ పిళ్ళై ఈ క్రింది సంఘటనను తెలిపిరి. ఒకసారి ఆళ్వాన్ పై ఆగ్రహం చెందిరి. అక్కడ వున్న కొందరు ఆళ్వాన్ తో “ఉడయవర్లు మిమ్ములను విస్మరించి పక్కన పెట్టినారు కదా. మరి మీరు ఇప్పుడు ఏమి తలంచుచున్నారు?” అని అడిగిరి. సమాధానముగా ఆళ్వాన్ “నేను శ్రీభాష్యకారులకు పరిపూర్ణ విధేయుడను, వారి ఆజ్ఞ మేరకు ఉండగలను – చింతింపనవసరము లేదు” అని బదులుచ్చెను.

ఈ క్రింది సంఘటన వార్తామలైలో వివరించబడినది. ఒకసారి పిళ్ళై ఉరంగవిల్లి దాసర్, ముదలిఆణ్డాన్ వద్దకు వెళ్లి వారి పాదపద్మములకు ప్రణమిల్లి “ఆచార్యుని వద్ద శిష్యుని ప్రవర్తన ఏ విధముగా ఉండవలెను?” అని అడిగిరి. ఆణ్డాన్ “ఆచార్యుని కొరకై శిష్యుడు పత్నివలె, శరీరము వలె, ఒక విశిష్ట గుణము వలె నుండవలెను – అనగా పతి ఆజ్ఞ పాలించు పత్నిలాగా, శరీరము ఆత్మకు అవసరమైనవి సమకూర్చునట్లు, లక్ష్య సాధనే ధ్యేయంగా గల గుణము” అని అనిరి. తదుపరి, పిళ్ళై ఉరంగవిల్లి దాసర్ ఆళ్వాన్ వద్దకు వెళ్లి” ఒక ఆచార్యులు తమ శిష్యులతో ఏ విధముగా ఉండవలెను?” అని అడిగిరి. జవాబుగా ఆళ్వాన్, శిష్యుని కొరకై ఆచార్యులు ఒక పతి వలె, ఆత్మ వలె మరియు లక్ష్యము వలె – అనగా పత్నికి స్పష్టమైన ఆదేశములు ఇచ్చు పతివలె, శరీరమును నియంత్రించగల ఆత్మ వలె, లక్ష్యమును సాధించు గుణము వలె” నుండవలెను అనిరి.

ఒకసారి కూరత్తాళ్వాన్ మరియు ముదలియాణ్డాన్ మధ్య దైవ సంబంధ విషయములపై సాగుచున్న చర్చలో “సానువృత్తి ప్రసన్నాచార్యులు (శిష్యులను అనేక క్లిష్ట పరీక్షలకు గురిచేసి, తదుపరి వారికి దివ్య జ్ఞానమును ప్రసాదించువారు) లేక కృపామాత్ర ప్రసన్నాచార్యులు (శిష్యుల నిష్కామమైన కోరిక ఆధారముగా, దివ్య జ్ఞానమును ప్రసాదించు ఆచార్యులు), వీరిలో అంతిమ ధ్యేయమైన మోక్షము ఎవరి వలన లభించును” అని చర్చించిరి. ఆణ్డాన్ “సానువృత్తి ప్రసన్నాచార్యుల వలననే మోక్షము లభించును” అనిరి. కాని ఆళ్వాన్ “మనకు మోక్షము కృపామాత్ర ప్రసన్నాచార్యుల ద్వారానే లభించును” అనిరి. ఆణ్డాన్ వివరిస్తూ, పెరియాళ్వార్ “కుఱ్ఱమిన్ఱి గుణం పెరుక్క గురుక్కలుక్కు అనుకూలరే (మనలోని లోపములను తొలగించుకొని, ఆచార్యునికి అనుకూలముగా ప్రవర్తించ వలెను) అని తెలిపారు, మనము కూడా ఆ విధముగానే చేయవలెను, అనిరి. ఆళ్వాన్ “అది సరి కాదు”, కారణము మధురకవి ఆళ్వార్ ఈ విధముగా తెలియజేసిరి, “పయనన్ఱాగిలుం, పాఙ్గల్ల రాగిలుమ్, శెయల్ నన్ఱాగ, త్తిరుత్తిప్పణి కొళ్వాన్, కుయిల్ నిన్ఱార్ పొళిల్ శూళ్, కురుగూర్ నమ్బి” (చుట్టూ ఉద్యానవనములతో కూడి ఉన్న ఆళ్వార్ తిరునగరిలో నివసించుచున్న నమ్మాళ్వార్, మనకు యోగ్యత లేకపోయినను, సరియైన జ్ఞానము లేకపోయినను కూడా, మనను శుద్ధిచేసి, వారి సేవలో వినియోగించగలరు). ఈ ప్రయత్నమును మనము స్వయముగా చేయరాదు, అంతిమ లక్ష్యమైన మోక్షమును పొందుటకై ఆచార్యుని కృపపైననే ఆధారపడవలెను. ఇది వినిన ఆండాన్ మిక్కిలి సంతసించిరి. ఈ సంఘటనను మా ఆచార్యులు (మాముణులు) వివరించిరి.

కిరుమికండన్ (ఒక శైవ రాజు) కారణమును ఉదహరిస్తూ, తమ దివ్య కృపచే ఉడయవర్లు తిరునారాయణపురమునకు పయనమైరి. ఆ కారణముగా, అక్కడ (శ్రీరంగము) కోవెల కైంకర్యపరులు ఆవేదన చెందుతూ, “మాకు వచ్చిన ఇక్కట్లకు ఉడయవర్లే కారణమని భావించి, ఉడయవర్లతో సంబంధమున్న వారెవరికీ, ఈ కోవెలకు ప్రవేశము లేదు” అను ఆదేశమును ప్రకటన చేసిరి. కూరత్తాళ్వాన్ మన సిద్ధాంతమును నిలబెట్టుటకై కిరుమికండన్ సభకు వెళ్లి, అచ్చట తమ నేత్రములను కోల్పోయిరి. తిరిగి శ్రీరంగమును చేరిరి. కోవెలలో జరిగిన పై సంఘటన వారికి తెలియనందువల్ల, పెరియ పెరుమాళ్ ఆరాధనకై, వారు కోవెలకు వెళ్లిరి. ఆళ్వాన్ను అక్కడ ఒక ద్వారపాలకుడు అనుమతించలేదు. కాని మరియొక ద్వారపాలకుడు ఆళ్వాన్ను మీరు కోవెలకు వెళ్లవచ్చుననిరి. వీరిరువురి భిన్న అభిప్రాయములను ఆలకించిన ఆళ్వాన్ ఆశ్చర్యముగా “ఇక్కడ ఏమి జరుగు చున్నది?” అని అడిగిరి. దానికి వారు “ఎంపెరుమానార్లతో సంబంధము ఉన్న వారెవరిని కోవెలలోనికి ప్రవేశింప జేయరాదని మాకు ఆదేశము ఇచ్చిరి” అనిరి. ఆళ్వాన్ “అయినచో నన్ను కోవెలలోనికి ఏల అనుమతించుచున్నారు” అని అడిగిరి. వారు “మీరు ఇతరుల వలె కాదు, మంచి సహృదయులు మరియు ఆత్మ గుణవంతులు. కావున అనుమతించుచున్నాము” అనిరి. ఇది విన్న ఆళ్వాన్ ఉలిక్కిపడి నీటిలో కనిపించు చంద్రుని వలె (సదా కదులుతూ ఉండును కదా) వణికిరి. వారు కొంత వెనుకంజ వేసి “శాస్త్రము ప్రకారము ఆత్మ గుణములు ఆచార్యుని సంబంధమును వృద్ధి చేయును; కాని ఇక్కడ నా విషయములో ఆత్మ గుణములు ఎంపెరుమానార్లతో నాకు గల సంబంధమును వదలి వేయునట్లుగా చేయుచున్నది” అని మిక్కిలి బాధతో పలికిరి. ఇంకను వారు “నా వరకు, ఎంపెరుమానార్ల పాదపద్మములే నా అంతిమ లక్ష్యము చేరుటకు సరిపోవును; ఎంపెరుమానార్లతో సంబంధమును వదులుకొని నేను పెరుమాళ్ళను ఆరాధించలేను” అని పలుకుచూ ఎంపెరుమాన్ ఆరాధన చేయకుండా తమ తిరుమాళిగైకు (నివాసము) వెడలిరి. ఈ సంఘటనను మన జీయర్ వివరించిరి.

తిరువిరుత్తమ్ వ్యాఖ్యానములో ఆళవందార్లు, ఎంపెరుమాన్ తమ అపార కరుణచే వారే స్వయముగా నమ్మాళ్వార్లుగా దర్శనమిచ్చిరి అని పేర్కొనిరి. అళగియ మణవాళ నయనార్ తమ ఆచార్య హృదయములో నమ్మాళ్వార్లే కలియుగము చతుర్ధ వర్ణములో అవతారము దాల్చిరా, వీరే పూర్వము అత్రి, జమదగ్ని, దశరధుడు, వాసుదేవుడు / నందగోపాలుడు మొ || వారి కుమారులుగా, బ్రాహ్మణ / క్షత్రియ / వైశ్య వర్ణములలో పూర్వపు యుగములలో (సత్య, త్రేతా, ద్వాపర యుగములు) జన్మించినారా అని ఆశ్చర్యచకితులైరి. (అనువాదకుని గమనిక: ఆళ్వార్ల మహిమలు మనకు వారు ఎంపెరుమానుని అవతారమా అను భావన కలుగజేయును, కాని పూర్వాచార్యులు వివరించినట్లు వారు అలా కాదు. కాని ఇక్కడ విషయము ఎంపెరుమాన్ తానే స్వయముగా ఆచార్యుని రూపముగా, అదియే అన్నిటికన్నా అత్యున్నత స్థితి అని ఋజువు చేయుచున్నారు.

అనువాదకుని గమనిక: ఈ విధముగా మనము శ్రీరామానుజుల వివిధ శిష్యుల నిష్టను గమనించితిమి. వారు ఏ విధముగా శ్రీరామానుజులపై సంపూర్ణముగా ఆధారపడినారో వ్యక్తమైనది.

సశేషం….

అడియేన్ బొమ్మకంటి గోపిక్రిష్ణమాచార్యులు రామానుజ దాసన్.

మూలము: http://ponnadi.blogspot.com/2013/06/anthimopaya-nishtai-10.html

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

అంతిమోపాయ నిష్ఠ – 9

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్ వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః

అంతిమోపాయ నిష్ఠ

నంపిళ్ళై వైభవము – 2

మునుపటి వ్యాసములో, (https://srivaishnavagranthamstelugu.wordpress.com/2022/06/05/anthimopaya-nishtai-8/), మన పూర్వాచార్యుల జీవితములలోని మిక్కిలి అద్భుతమైన సంఘటనలను గమనించాము, అవి, శ్రీరంగనాధుడు మాముణులను తమ ఆచార్యునిగా అంగీకరించుట, శ్రీశైలేశ దయాపాత్రము తనియన్ ను అనుగ్రహించుట, ఆ తనియన్ ను అన్ని దివ్య దేశములలో ప్రచారము చేయుట. ఈ వ్యాసములో మనము నంపిళ్ళై యొక్క మరిన్ని దివ్య మహిమలను గమనించెదము.

నంపిళ్ళై పాదపద్మముల వద్ద పిన్భళగియ పెరుమాళ్ జీయర్ – శ్రీరంగము

ఒకరోజు నంపిళ్ళై తమ భాగవత విషయ కాలక్షేపము ముగించిన పిదప అందరూ వెళ్ళుచుండగా, పిన్భళగియ పెరుమాళ్ జీయర్ నంపిళ్ళై ముందు ప్రణమిల్లి, “నా నిజ స్వభావము (జీవాత్మ) ఏమిటి? దానికి ఉపాయము, అంతిమ లక్ష్యము వివరించగలరు” అని అడిగిరి. సమాధానముగా నంపిళ్ళై “జీవాత్మలను ఉద్దరించుట అనే ధ్యేయముగల ఎంపెరుమాన్ / ఎంపెరుమానార్ల కోరిక వలననే జీవాత్మ పోషింపబడుచున్నాడు, వారి కృపయే ఉపాయము, వానికి ఒనరించు పరమానందకరమైన సేవ అంతిమ లక్ష్యము” అని అనిరి. జీయర్ ప్రతిస్పందిస్తూ “నేను ఆ విధముగా భావించుట లేదు”  అనిరి. నంపిళ్ళై “వేరే మార్గము ఏమైనా కలదా? మీ మనస్సులో ఏమున్నదో తెలియజేయుడు” అనిరి. జీయర్ “మీ పాద పద్మములను ఆశ్రయించిన శ్రీవైష్ణవులను నేను ఆశ్రయించుట నా స్వభావము, వారి దయ నాకు ఆధారము (ఉపాయము), వారి దివ్య ముఖారవిందములోని ఆనందము నాకు అంతిమ లక్ష్యము” అనిరి. జీయర్ పలుకులకు నంపిళ్ళై మిక్కిలి సంతసించిరి.

నంపిళ్ళై కాలములో, ఎంతో కీర్తి గాంచిన  ముదలియాండాన్ మనుమడైన కందాడై తోళప్పర్ నంపిళ్ళైపై  అసూయ చెందిరి. ఒకసారి తోళప్పర్ పెరియ పెరుమాళ్ కోవెలలో ఆరాధనలో నుండగా, అదే సమయమునకు నంపిళ్ళై తమ పలు శిష్యులతో అచ్చటకు వేంచేసిరి. అకారణముగా అసూయతో, తోళప్పర్ నంపిళ్ళైపై బిగ్గరగా అరచి వారిని అవమానించిరి. అది వినిన నంపిళ్ళై దీని పరిణామము ఎట్లుండునో నని కలత చెంది, పెరియ పెరుమాళ్ ఆరాధనను త్వరగా ముగించి, తమ తిరుమాళిగకు (నివాసము) వెడలిరి. ఈ సంఘటనను తెలుసుకొనిన, వివేకవంతురాలైన తోళప్పర్ సతీమణి, నంపిళ్ళై పట్ల తన పతి చేసిన ఈ ఘోర తప్పిదమునకు మిక్కిలి చింతించి, తను గృహమున చేయు అన్ని కైంకర్యములను ఆపి, తన పతి రాకకై ఎదురుచూచుచున్నది. తోళప్పర్ ఇంటికి రాగానే, తన సతీమణి ఆహ్వానము పలుకలేదని, తాము వచ్చినప్పుడు చేసే సేవలు ఏమీ చేయలేదని గ్రహించిరి. వారు ఆమెతో “మన వివాహము మొదలు నీవు నన్ను నీ ఆచార్యునిగా భావించి, నాకు చక్కని సేవలు చేసెడి దానవు. కాని ఈ రోజు నన్ను పూర్తిగా విస్మరించితివి. కారణమేమిటి?” అని అడిగిరి. దానికి ఆమె, “ప్రియ స్వామి! మీరు తిరుమంగై ఆళ్వార్ల అపరావాతారులైన మరియు పెరియ పెరుమాళ్ళకు అత్యంత ప్రియులైన, నంపిళ్ళైను, పెరియ పెరుమాళ్ ముందే అవమానించిరి. మీ చర్యకు మీరు పశ్ఛాతాపమూ పడినట్టుగా లేదు. నేటి నుండి నాకు మీతో ఎట్టి సంబంధము లేదు. నన్ను ద్వేషించి, శిక్షించదలచినచో, నా తల్లిదండ్రులు మీకు ఒసగిన నా శరీరమును శిక్షించవచ్చును. నా ఆచార్యుని ఆశ్రయము పొందిన నేను, అప్పుడే ఉద్దరింపబడినాను. కావున, నాకు మీతో ఏ సంబంధము లేదు. అనేక కోట్ల జన్మలెత్తినను, భాగవతాపచారము చేసిన వానిని నేను క్షమించను అని పరమాత్మ తెలిపెను కదా! ఇది తెలిసి కూడా మీరు నంపిళ్ళైను అవమానించారు. కావున, నా జీవితమును నేనే కొనసాగించెదను.” అని పలికెను.
ఆమె మాటలకు తోళప్పర్ ఒక్క క్షణము విస్మయము చెందిరి. తోళప్పర్ ఒక్క క్షణం మననం చేసి, ముదలియాండాన్ వంటి గొప్ప వంశములో జన్మించి, విద్వాంసుడై నందున తన తప్పిదమును గ్రహించిరి. వారు ఆమెతో “నీవు చెప్పినదంతయు యధార్ధము. నేను చాలా పెద్ద తప్పు చేసితిని. ఇప్పుడు నేను ఏమి చేయవలెను?” అని పలికిరి. ఆమె వారితో “మీరు నదిలో పోగొట్టుకున్న దానిని, చిన్న కొలనులో వెతకరాదు” అనెను. దానికి “మీ భావమేమిటి” అని వారు అడిగిరి. దానికి ఆమె “నంపిళ్ళైకు మీరు నేరము చెసినారు, కావున మిక్కిలి దయాళువులైన వారి పాదపద్మములపై మోకరిల్లి,  క్షమాపణ కోరుడు. వారు మిమ్ములను తప్పక కరుణించగలరు. మీ పాపము నుండి విముక్తి కలుగును” అనెను. దానికి వారు “పెరియ పెరుమాళ్ ఎదురుగా నేను వారిని అవమానించి పెద్ద నేరమే చేసినాను. వారి ముందకు వెళ్ళుటకు కూడా నాకు మొఖము చెల్లుట లేదు. వారిని క్షమా బిక్ష అభ్యర్థించుటకు, నీవు కూడా దయతో నాతో రావలసినది” అనిరి. దానికి ఆమె అంగీకరించి, వారిరువురు తమ నివాసము వదిలి వెళ్ళుటకు ఉద్యుక్తులైరి.

ఆ సమయానికే, పెరుమాళ్ కోయిల్ నుండి బయలుదేరి నంపిళ్ళై తమ తిరుమాళిగైకు చేరి, తమ శిష్యులందరిని పంపించివేసి, సూర్యాస్తమయము వరకు ఉపవాసము చేసిరి. ఆ పిదప తమ శిరస్సును ఒక వస్త్రముచే కప్పివేసికొని, తోళప్పర్ నివాసమునకు ఒక్కరే నడచి వెళ్లి, వసారాలో వేచి వున్నారు. ఆ సమయమునకే, దీపము చేతబట్టుకొని ద్వారమును తెరచి తోళప్పర్ తమ సతీమణితో కలిసి నంపిళ్ళై తిరుమాలిగకు వెళ్ళుటకు సిద్ధమైరి. అక్కడ వసారాలో ఎవరో వున్నారని గమనించి, ఎవరది అని అడిగిరి. నంపిళ్ళై తనను తాను తిరుక్కలికన్ఱి దాసర్ను అని సంబోధించికొనిరి. నంపిళ్ళైని  అచట చూసి, తోళప్పర్ ఆశ్చర్యపోయి, వారితో (మరల అహంకారముతో) “పెరియ పెరుమాళ్ ముందు నాపై మీరు తిరిగి బిగ్గరగా అరవలేదు, కారణము, అక్కడ నాకు మంచి పేరు ఉన్నదని, అందుచే నన్ను ఏకాంతముగా ఇక్కడ అవమానించుటకు వచ్చితివి” అని పలికిరి. నంపిళ్ళై “నేను అందులకు ఇచటకు రాలేదు” అనిరి. తోళప్పర్ ఆశ్చర్యముతో “మరి ఇచటకు ఏల వచ్చితిరి?” అని అడిగిరి. నంపిళ్ళై “నా ప్రవర్తన వలన పెరియ పెరుమాళ్ ఎదురుగా ముదలియాండాన్ మనుమడు అవమానింపబడు పాపమును నేను చేసితిని. నేను ఇచటకు క్షమాబిక్షకై వచ్చితిని. మీరు నన్ను క్షమించగలరు” అనిరి. ఇది ఆలకించిన తోళప్పర్ పూర్తిగా శుద్ధులై, నంపిళ్ళైను ఆలింగనము చేసుకొనిరి. తరువాత వారు “నేటి వరకు మీరు కొంత మంది శిష్యులకే ఆచార్యులు అనే భావనలో నేను వున్నాను. కాని మీరు ఈ లోకమంతటికి ఆచార్యులు కాగల లక్షణములు కలవారని నాకు ఇప్పుడు అవగతమైనది. కావున నేటి నుండి మీరు ‘లోకాచార్యర్’ అని పిలువబడెదరు” అని పలికిరి. తదుపరి వారు నంపిళ్ళైను తమ తిరుమాలిగలోనికి ఆహ్వానించి, తమ సతీమణితో కలిసి వారికి గొప్ప సేవ చేసిరి. నంపిళ్ళై కూడ సంతుష్టులైరి. వారు నంపిళ్ళై పాదపద్మములను ఆశ్రయించి, అన్ని దైవ సంబంధములైన విషయములను అభ్యసించిరి. ఈ సంఘటనను మన జీయర్ ఉపదేశరత్త మాల 51 వ పాశురములో ఈ విధముగా వివరించిరి.

తున్ను పుగళ్ కన్దాడైత్ తోళప్పర్ తమ్ ఉగప్పాల్
ఎన్న ఉలగారియనో ఎన్ఱురైక్క
పిన్నై ఉలగారియన్ ఎన్నుమ్ పేర్ నమ్పిళ్ళైక్కు ఓంగి
విలగామల్ నిన్ఱదెన్ఱుమ్ మేల్

సాధారణ అనువాదము : శ్రీరంగములో మంచి పేరు గాంచిన కందాడై తోళప్పర్, నంపిళ్ళైను మిక్కిలి ఆప్యాయతతో ‘లోకాచార్యులు’ అని సంభోదించిరి. ఆ తదనంతరము, నంపిళ్ళై లోకాచార్యులన్న పేరు ప్రఖ్యాతులు శాశ్వతంగా నిలిచిపోయాయి.

నంపిళ్ళై మహిమ అపారమైనదని ఈ క్రింది పాశురము, శ్లోకముల ద్వారా అవగాహన పొందవచ్చును.

పిళ్ళై అళగియ మణవాళ దాసర్ అనుగ్రహించిన ఇయల్ సాఱ్ఱుఱైలోని ఒక శ్లోకము

నెన్జత్తిరున్తు నిరంతరమాగ నిరయత్తుయ్ క్కుం
వన్జక్కుఱుమ్బిన్ వగైయఱుత్తేన్
మాయవాదియర్ తామ్ అన్జప్పిరన్తవన్ చీమాదవనడిక్కన్బుచెయ్యుమ్
తన్జత్తొరువన్ చరణాంబుయం ఎన్ తలైక్కణిన్తే

సాధారణ అనువాదము : నంజీయర్ (మాయావాదులకు భయంకరుడైన) కు ప్రియ శిష్యులైన నంపిళ్ళై పాదపద్మములను ఆశ్రయించుటచే, నన్ను నరకమున పడద్రోయునటువంటి చెడు ఆలోచనలను నేను తొలగించుకొంటిని.

నమామి తౌ మాదవ శిష్య పాదౌ యత్ సన్నిధిమ్ సూక్తిమయీమ్ ప్రవిష్టాః
తత్రైవ నిత్యం స్తితిమాద్రియంతే వైకుంఠ సంసార విరక్త చిత్తాః

సాధారణ అనువాదము : నంజీయర్ శిష్యులైన నంపిళ్ళై పాదపద్మములను నేను ఆరాధించెదను. వారి మహిమాన్వితమైన మాటలను శ్రవణము చేసిన మనము, అత్యంత గొప్ప భగవత్ అనుభవమును పొంది, సంసారము మరియు శ్రీవైకుంఠము రెంటిపై కూడ నిర్లిప్తత పొందెదము.

శృత్వాపి వార్తాఞ్చ యదీయగోష్ట్యామ్ గోష్ట్యంతరాణామ్ ప్రధమా భవంతి
శ్రీమత్కలిద్వంసన దాస నామ్నే తస్మై నమస్ సూక్తిమహార్ణవాయ

సాధారణ అనువాదము:  నేను సూక్తి మహార్ణవ (దివ్య సూక్తుల మహా సాగరము వంటి నంపిళ్ళై)ను, శ్రీమద్ కలిధ్వంసన దాసర్ అని పేరు గాంచిన వారిని ఆరాధించెదను. వారి ప్రవచనములను ఆలకించిన తరువాత, ఆ గోష్టి మరి ఇతర అన్ని గోష్టిల కంటే అత్యుత్తమమైనదని అని మనం గ్రహించగలము.

వడక్కు తిరువీధి పిళ్ళై మరియు వారి ధర్మ పత్ని (ఇరువురు నంపిళ్ళై శిష్యులు, అతి విశ్వసనీయులు) ప్రాపంచిక విషయముల నుండి విరక్తిగా వుంటూ, నంపిళ్ళైను అన్ని విధముల సదా సేవించుచుండిరి. ఒకరోజు, వడక్కు తిరువీధి పిళ్ళై తిరుమాళిగకు నంపిళ్ళై వేంచేసిరి. వారి పాదపద్మములకు అందరు ప్రణమిల్లిరి. ఆ సమయమున వడక్కు తిరువీధి పిళ్ళై ధర్మ పత్ని తడి చీరను ధరించి ప్రణమిల్లినది. నంపిళ్ళై అక్కడ ఉన్న ఇతర స్త్రీలతో, ఆమె తడి వస్త్రములో ఉండుటకు కారణము ఏమి అని అడిగిరి. వారు, ఆమె ఋతుక్రమము తదుపరి, శుచిగా, మీ ఆశీర్వచనము పొందుటకై, ఆ విధముగా వచ్చెనని పలికిరి. మిక్కిలి సంతోషముతో, నంపిళ్ళై ఆమెను తమ దగ్గరకు ఆహ్వానించి, తమ దివ్యమైన హస్తముతో ఆమె ఉదరమును స్పృశించి “నా వలె కీర్తిగల పుత్రునికి జన్మనివ్వగలవు” అని ఆశీర్వదించిరి. ఇది తిలకించిన వడక్కు తిరువీధి పిళ్ళై, తమకు పుత్ర సంతానము కలుగుట తమ ఆచార్యునికి ఆనంద హేతువగునని గ్రహించి, తమ పత్నితో ఆ విధముగా మెలగసాగిరి. తదుపరి ఆమె గర్భముదాల్చి, ఒక సంవత్సరములోనే, దైవాంశ సంభూతుడైన పుత్రునికి జన్మనిచ్చెను. వడక్కు తిరువీధి పిళ్ళై అతనకి నంపిళ్ళై యొక్క దివ్య నామము ‘లోకాచార్యర్ ‘ (తరువాత పిళ్ళై లోకాచార్యులుగా పేరుగాంచిరి) అని నామకరణము చేసి, తమ ఆచార్యునిపై తమకున్న కృతజ్ఞతను ప్రకటించిరి.

నంపిళ్ళై, వడక్కు తిరువీధి పిళ్ళై, పిళ్ళై లోకాచార్యులు, అళగియ మణవాళ పెరుమాళ్ నయనార్

ఆ విధముగా నంపిళ్ళై దివ్య ఆశీర్వచనముచే, వడక్కు తిరువీధి పిళ్ళై పుత్రుడు పిళ్ళై లోకాచార్యులు జన్మించిరి. పిళ్ళై లోకాచార్యులు తమ దివ్య అనుగ్రహము, అపారమైన కరుణచే, జీవాత్మలు ఉద్దరింప బడవలెనని, అనేక దివ్య గ్రంధములను మనకు అనుగ్రహించిరి. అవి తత్వ త్రయము, రహస్య త్రయము (ముముక్షుపడి మొ ||), శ్రీ వచన భూషణము మొ || నవి. అత్యంత గొప్యమైన సందేశములను అతి సరళ శైలిలో రచించి మనకు బోధించిరి. పిళ్ళై లోకాచార్యులు జన్మించిన ఒక సంవత్సరము తరువాత, వడక్కు తిరువీధి పిళ్ళై దంపతులకు మరియొక అందమైన పుత్రుడు (స్వయముగా శ్రీరంగనాధుని దివ్య కృపచే) జన్మించెను. అతనికి అళగియ మణవాళ పెరుమాళ్ నయనార్ అని నామకరణము చేసిరి. వీరు ఆచార్య హృదయము (నమ్మాళ్వార్ల దివ్య హృదయమును తెలుపును) అను దివ్య గ్రంధమును అనుగ్రహించిరి.

ఆ విధముగా, తిరుమంగై ఆళ్వార్ల విశేష అవతారమైన లోకాచార్యర్ (నంపిళ్ళై)  గొప్ప జీవితమును జీవించారు. నా ఆచార్యులైన (మాముణులు), వారి పితరులైన తిగళక్కిడంతాన్ తిరునావీఱుడైయపిరాన్ తాతరణ్ణర్, వారి 5 సంవత్సరాల వయస్సులో పెద్దల మార్గదర్శకములో నంపిళ్ళై యొక్క శిష్యులైరని తెలిపిరి.

అనువాదకుని సూచన: ఈ విధముగా మనము నంపిళ్ళై దివ్య మహిమలను దర్శించి, పూర్తిగా ఆనందించితిమి. ఈ సంఘటనల ద్వారా సంసారమును సాగిస్తూ పరమపదమునకు సరి అయిన మార్గము లభింపవలెననిన, ఆచార్యుని కృపయే మనకు తప్పనిసరి అని తెలియుచున్నది. పైగా ఈ ఈ సంసారములో ఉంటూ శిష్యుడు తనకు తగిన కైంకర్యములో నిమగ్నుడై ఉండి జీవనం సాగించవలెను.

సశేషం….

అడియేన్ బొమ్మకంటి గోపిక్రిష్ణమాచార్యులు రామానుజ దాసన్.

మూలము: http://ponnadi.blogspot.com/2013/06/anthimopaya-nishtai-9.html

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org