Category Archives: Dramidopanishat Prabhava Sarvasvam

ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం 28

శ్రీ:  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః   శ్రీమద్వరవరమునయే నమః

ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం

 << ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం – 27

  వేదాంతగురు

(ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం యొక్క ముగింపు శీర్షిక)

              సంస్కృత వేదాలను అభ్యసించాడనికి ముందు ద్రావిడవేదం తప్పక నేర్చకోవాలని వేదాంతదేశికులు స్పష్టంగా తెలియజేశారు. వేదాలను అభ్యసించే వారికి ఆళ్వార్ల దివ్యప్రబంధం నేర్చకోవడం మరొక అవకాశం కాదు, వేదాలను సుస్పష్టంగా నేర్వడానికి ఇది అత్యంత అవసరం. దివ్యప్రబంధం నేర్చకోని వారికి సంస్కృత వేదం నేర్చకోవడం సులభసాధ్యం కాదు అని వారు అభిప్రాయపడ్డారు.

వేదాంతదేశికులు సంస్కృతంలో మహా పండితులన్నవిషయంజగద్విదితం, దానికి వారనుగ్రహించిన గ్రంధాలే ఉదాహరణగా నిలుస్తాయి . అయినా తనకు  సంస్కృతంలోఉన్న పాండిత్యమో అపారమైన వేదాంత జ్ఞానమో,  ద్రావిడవేదాన్ని వ్యాఖ్యానించటానికి సరిపొతుందని వారు భావించలేదు.

అధికార సంగ్రహంలో వారు, “శేయ్య తమిళ్ మరైగళై నామ్ తెళియఓది తెళియాద మరైనిలంగళ్ తెళిహిన్రోమే!” అని స్పష్టంగా చెప్పారు. వేదాంత దేశికులు సంస్కృత వేదాన్ని “తెళియాద మరైనిలంగళ్” (గుహ్యమైన వేదాలు) అంటున్నారు. “తమిళ్ మాలైగళై తెళియ ఓది” అని తమిళ వేదాన్ని ఉపదేశించాల్సిన ఆవశ్యకతను తెలియ జేస్తున్నారు. ఇది వారు ఇతరుల కోరకు చెప్పింది మాత్రమే కాదు, తాను కూడా అనుష్టించారన్నదానికి సంకేతంగా “నామ్ తెళియఓది” (మనం ఉపదేశించి) అంటున్నారు.

ఈ విషయాన్నీ వారు ద్రమిడోపనిషత్ తాత్పర్యసారావళిలోని నాలుగవ శ్లోకంలో, “యత్ తత్ కృత్యం శృతీనాం మునిగణ విహితై సేతిహాసైః పురాణైః తత్ రసా సత్వ సీమ్నాః శఠమతా నామునే సంహితా సార్వభౌమి” అని స్పష్ఠీకరించారు.

మునులను గ్రహించిన ఇతిహాస పురాణాల వలన వేదాలను అవగాహనా చేసుకోవటానికి మార్గం సుగమమవుతుంది. అయినా కొన్ని సందర్భాలలో రజోగుణం, తమోగుణం కలగలిసి కనపడుతుంది. ఆళ్వార్ల శ్రీసూక్తులు అలా కాక శుద్ద సత్వంగా రూపుదాల్చి ఉన్నది. దీనినే “సత్వ సిమ్నాః” అని చెప్పారు. కావున శఠకోప సంహిత ఉన్నతమైనదని నిరూపించబడింది.

ఆళవందార్ల స్తోత్రరత్నంలోని నాలుగవ శ్లోకానికి అర్థం చెప్పినప్పుడు ‘మతాపితా’ అన్న ప్రయోగానికి చెప్పిన అర్థాన్ని ఒక్కసారి చూద్దాం.

“అథ పరాశర ప్రబంధాదిభి వేదాంత రహస్య వైశాధ్యాదితిశయ హేతుభూతైః సాధ్య పరమాత్మని సిద్ధ రంజక తమైః సర్వోప్యజీవ్యైః మధురకవి ప్రభ్రుతి సంప్రదాయ పరంపరయా నాధమునేరభి ఉపకర్తారం కాలవిప్రకర్షేభి పరమపురుష సజ్ఞల్పాత్ కదాచిత్ ప్రాదుర్భూయ సాక్షాదపి సార్వోపనిషత్  సారోపదేశతరం పరాంజ్ఞుశ మునిం  ‘ ‘” మాతాపితాబ్రాతేత్యాది ఉపనిషత్ ప్రసిద్ధ భగవత్ స్వభావదృష్ట్యా ప్రణమతి మాతేతి ‘.

వేదాంత దేశికులు వేదములను పరాశరాది ఋషుల కంటే ఆళ్వార్లే చక్కగా సులభంగా వర్ణించారని నిరూపిస్తున్నారు. ఆళ్వార్ల శ్రీసూక్తులు అందరికి అందుబాటులో ఉండటమే కాక రసవత్తరంగా కూడా ఉన్నాయని, అందువలన పరమాత్మలాగానే నమ్మాళ్వార్లు కూడా మనతో మాతపితల స్థానమే కాక సకల సంబంధాలు  కలిగివుంటారు అని అంటున్నారు.

యతిరాజ సప్తతిలో వేదాంత దేశికులు, “యస్య సారస్యవతంస్రోతో వకుళామోదవాసితం శృతీనాం విస్రయామాసం శఠారిం తం ఉపాస్మహే” అన్నారు. కాల ప్రవాహంలో సంభవించిన మార్పుల వలన వేదాల ప్రాభావం కొంత సన్నగిల్లినప్పుడు ఆళ్వార్ల శ్రీసూక్తులు ఆలోటును పూడ్చి వేదాలను పరిపుష్టంచేసి మళ్ళీ తమ పూర్వ ప్రాభవాన్ని పొందడానికి సహకరించాయని అర్థం.

పాదుకాసహస్రంలో ఆళ్వార్ల గురించి వారి శ్రీసూక్తుల గురించి దేశికులు ఎంతో ఉన్నతంగా చెప్పారు. ఉజ్జీవించడానికి ఆళ్వార్ల శ్రీసూక్తులను నేర్చుకోవటం, పరమాత్మ శ్రీపాదాలను శిరసున ధరించడం తప్ప మరోదారి లేదు అని 22వ శ్లోకంలో అంటారు.

అమృతవాదిని అనే ప్రబందంలోని 28వ పాటలో నమ్మాళ్వార్లే ఉన్నతమైన ఆచార్యులని, భక్తులను దరి చేర్చే శక్తి గలవారని చెప్పారు.

వేదాంతదేశికులు ఆళ్వార్లను, మన ఆచార్యులను, ఆళ్వార్ల శ్రీసూక్తులు ఎంతో ఉన్నతమైనవని ఈ గ్రంధంలో నిరూపించారు. ఆచార్యులను, ఆళ్వార్లపై 29 శ్లోకాలలో ఒక ఆర్తితో అనుభవించాము. దీని వలన పిళ్ళాన్, నంజీయర్, పెరియవచ్చాన్ పిళ్ళై, అళగియ మణవాళ జీయర్, పిళ్ళై లోకాచార్యులు, అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్, వేదాంతదేశికులు, మణవాళ మాముణులు మున్నగువారి వ్యాఖ్యానాలు ఆసక్తితో, ఆర్తితో చదవడానికి ఊనిక ఏర్పడుతుంది. అదే ప్రధాన ప్రయోజన మవుతుంది. ఆళ్వార్ల శ్రీసూక్తులు వేదాలను అర్థం చేసుకోవటానికి మార్గ నిర్దేశం చేస్తాయని మనకు తెలిపిన కాంచి శ్రీప్రతివాది భయంకరం స్వామికి దాసోహాలు సమర్పించడం, వారు చూపిన మార్గంలో నడవడానికి ప్రయత్నించడం తప్ప మనం చేయదగిన ప్రత్యుపకారం ఏమి ఉంటుంది?

“ఆళ్వార్ గళ్ వాళి అరుళిచెయ్యల్  వాళి

తళ్వాదుమిల్ కురవార్ తాం వాళి

ఏళ్ పారుం ఉయ్య అవర్గళ్ ఉరైత్తవైగళ్ తాం వాళి

శెయ్య మరై తన్నుడనే శేర్దు”

మనం సుఖ, దుఃఖాలనే మేఘాలచే ఆవరించబడినప్పుడు ఆళ్వార్ల శ్రీసూక్తులు మన హృదయంలో ప్రకాశించి మనకు దిశా నిర్దేశము చేయుగాక. రామానుజా మాకు దీనిని ప్రసాదించి అనుగ్రహింతురుగాక

 

అడియేన్ చూడామణి రామానుజ దాసి

మూలము : https://srivaishnavagranthams.wordpress.com/2018/02/26/dramidopanishat-prabhava-sarvasvam-28/

archived in https://srivaishnavagranthams.wordpress.com/

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org
pramAthA (preceptors) – https://guruparamparai.wordpress.com
SrIvaishNava Education/Kids Portal – http://pillai.koyil.org

ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం 27

శ్రీ:  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః   శ్రీమద్వరవరమునయే నమః

ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం

 << ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం – 26

శ్రీపరాశర భట్టరు – ఆళ్వార్లు

శ్రీపరాశర భట్టరు శ్రీవైష్ణవ సంప్రదాయంలో అసమాన ప్రతిభ గలవారుగా ప్రసిద్ది పొందినవారు.  సంప్రదాయ విషయాలలో వీరికి ఉన్నస్పష్టత, సిద్దాంత విషయాలలో జ్ఞానము భగవద్రామానుజులతో మాత్రమే పోల్చదగినది. అందువలననే భగవద్రామానుజులు “భగవద్గుణ దర్పణము”  అనే శ్రీవిష్ణు సహస్రనామ వ్యాఖ్యానం వీరిచేత రాయించారు. ఈ వ్యాఖ్యానం ఆళ్వార్ల శ్రీసూక్తుల ఆధారంగానే రచింపబడింది. గ్రంధ విస్తృతికి భయపడి ఆ పోలికలన్నీ ఇక్కడ వివరించటం లేదు. దానికి బదులుగా శ్రీరంగరాజ స్థవం నుండి కొన్ని ఉదాహరణలను చూద్దాం.

శ్రీపరాశర భట్టర్

భట్టరు శ్రీరంగరాజ స్థవం ప్రారంభ శ్లోకాలలో ఆళ్వార్ల ఎలా స్తుతించారో చూద్దాం.

ఋషిం జుషామహే కృష్ణ తృష్ణా తత్వమివోదితం !

సహస్రశాఖాం యొద్రాక్షీ ద్రామిడీం బ్రహ్మ సంహితాం!!

భట్టరు ఆళ్వార్లను ఋషి అంటున్నారు. ఇంకా వారు కృష్ణ భక్తి రూపమని, ఆళ్వార్లు వేరు, కృష్ణ భక్తి వేరు కాదని చెపుతున్నారు. వేదశాఖ లెన్నింటినో ద్రావిడ వేదంలో చూపారని కీర్తిస్తున్నారు.

పదమూడవ శ్లోకంలో

“అమతం మతం మతమథామతం స్తుతం

పరినిందితం భవతి నిందితం స్తుతం ఇతి

ఇతి రంగరాజాముదజూఘుష త్రయీ”

ఇందులోని మొదటి భాగంలో “యస్యామతం తస్యమతం” అన్న ఉపనిషత్ వాఖ్యాన్ని అలాగే ప్రయోగించారు. ఎవరైతే బ్రహ్మను తెలుసుకున్నానను కుంటాడో వాడు బ్రహ్మను తెలియనివాడు. ఎవరైతే బ్రహ్మను తెలుసుకో లేదనుకుంటాడో వాడు బ్రహ్మను తెలిసినవాడు అని అర్థము. ఈ శ్లోకం తరువాతి భాగంలో  “స్తుతం పరినిందితం భవతి నిందితం  స్తుతం” అన్న ప్రయోగంలో బ్రహ్మను నిండా స్తుతి చేస్తున్నట్లు అమరింది. ఇది ఉపనిషత్తులో లేదు అయినా ఆళ్వార్ల శ్రీముఖం నుండి వెలువడింది. పెరియ తిరువందాదిలో నమ్మల్వార్లు ….

“పుగళ్వోం పళిప్పోం, పుగళోం పళియొం,

ఇగళ్వోం మదిప్పోం, మదియోం ఇగళోం” అని అనుగ్రహించారు.

ఇందులోని స్వారస్యం ఏమిటంటే భట్టరు ఈ రెంటిని ‘త్రయీ’ యొక్క భాగాలే అంటారు. అర్థాత్ భట్టరు వారు ఉపనిషత్తులు, ద్రావిడవేదం రెండూ వేదం యొక్క రెండు పార్శ్వాలుగానే గణించాలి అని అభిప్రాయ పడుతున్నరు. ఈ విషయం  పదహారవ శ్లోకంలో “స్వం సంస్కృత ద్రావిడ వేద సూక్తైః “ అన్న ప్రయోగంలో స్పష్టమవుతున్నది.

21 వ శ్లోకంలో,  “దుగ్దాబ్దిర్జనకో జనన్యహమియం” అన్నచోట వారు, తొండరడిప్పొడి ఆళ్వార్ల  “తెళివిలా కలంగనీర్ సూళ్ తిరువరంగం”  కల్లోలంగా ప్రవహిస్తున్న కావేరినది అనుభవించినట్లు కూర్చినట్లు అమరింది.

 “జితబాహ్యాజినదిమణిప్రతిమా

  అపి వైదికయన్నివ రంగపురే !

  మణిమండప వపగణాన్  విదధే

  పరకాలకవిః ప్రణమేమహితాన్ !!

అన్న36వ శ్లోకంలో, భట్టరు, ఆళ్వార్లు పాడిన గోపురాలు, స్తంభాలు, మంటపాలను, పరమాత్మ యొక్క  విలక్షణమైన ఊర్ధ్వపుండ్రములతోను, నిరంతరం ధరించే శంఖచక్రాలతోను పోల్చారు.

41 వ శ్లోకంలో చంద్రపుష్కరణికి దక్షిణాన ఉన్న ఆళ్వార్లను కీర్తిస్తున్నారు.

పూర్వేణ తాం తద్వదుదారనిమ్న-

ప్రసన్న శీతాశసయమగ్న నాధాః !

పరాంకుశాద్యాః  ప్రథమే పుమాంసో

నిషేదివాంసో  దశ మాం దయేరన్  !!

చంద్ర పుష్కరణి తీరంలో ఉన్న పున్నాగ చెట్టు గురించి చెపుతూ భట్టరు ఈ క్రింది విధంగా వర్ణించారు .

పున్నాగ తల్లజమజస్రసహస్రగీతి –

సేకోత్థదివ్యనిజసౌరభమామనామః !! (49)

ఈ చెట్టు క్రింద పూర్వాచార్యులు పలువురు తిరువాయిమోళి వ్యాఖ్యానాలను చర్చించటం వలన ఈ  చెట్టుకూడా  తిరువాయిమోళి వాసననుపొందింది  అంటారు.

కులశేఖర ఆళ్వార్లు, డి యరంగత్తు అరవణైయిల్ పళ్ళి కోళ్ళుమ్ మాయోనై  మణత్తూణే పత్తి నిన్రు ఎన్ వాయారవెన్ను కోలో వాళ్తునాలే” అన్నారు. రంగానాధుని దివ్య నేత్రముల నుండి పొంగే కృపామృత ప్రవాహము ఆ లోగిలో నిలవలేక పట్టుకోసం అక్కడ ఉన్న స్తంభాలను పట్టుకున్నాయంటున్నారు ఆళ్వార్లు .

ఇదే విషయాన్ని భట్టరు

శేష శయలోచనామృత – నదీరయాకులితలోల మనానాం!

ఆలమ్బమివామోద – స్తంభద్వయమంతరంగమభియామః (59)

అని ఇక్కడి మంటప స్తంభాలనే  ఆమోద స్తంభాలుగా  వర్ణించారు.

ఇంకా 78 శ్లోకంలో

“వటదలదేవకీజఠరవేదశిరః కమలాస్తన –

శఠగోపవాగ్వపుషి రంగగృహే  శయితం !”

అని శ్రీరంగనాధులు ఆళ్వార్ల శ్రీసూక్తులనే తనకు నివాసస్తానంగా చేసుకున్నారని చెపుతున్నారు.

కిరీటచూడరత్న రాజిరాధిరాజ్యజల్పికా !

ముఖేందుకాంతిరున్ముఖం తరంగితేవ రంగిణః !!

అని 91వ శ్లోకంలో “ముడిచ్చోది” అనే ఆళ్వార్ల పాశుర భావాన్ని సంస్కృతంలో  చక్కగా చెప్పారు.

అలాగే “ముదలాం తిరువురువం మూన్నెంబర్ ఒన్న్రే ముదలాగుం మున్నుక్కుం మూన్నుక్కుం  ఎన్బార్” అన్న ఆళ్వార్ల పాశుర భావాన్ని“ త్రయో దేవస్తుల్యా” అన్న 116వ శ్లోకంలో చెప్పారు.

మన పూర్వాచార్యులు భట్టర్ల శ్రీసూక్తులను ఆళ్వార్ల శ్రీసూక్తులతో ఎంత అందంగా పోలిక చేసి చూపారో ఇప్పటి దాకా చూసాము.  ఇంత చక్కని వ్యాఖ్యానాలను మనకు నిర్హేతుక కృపతో అందించిన మన పూర్వాచార్యులకు భక్తితో శిరసువంచి దాసోహాలు సమర్పించటం తప్ప మనం చేయగల ప్రత్యుపకారమేముంటుంది.

అడియేన్ చూడామణి రామానుజ దాసి.

మూలము : https://srivaishnavagranthams.wordpress.com/2018/02/25/dramidopanishat-prabhava-sarvasvam-27/

archived in https://srivaishnavagranthams.wordpress.com/

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org
pramAthA (preceptors) – https://guruparamparai.wordpress.com
SrIvaishNava Education/Kids Portal – http://pillai.koyil.org

 

ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం 26

శ్రీ:  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః   శ్రీమద్వరవరమునయే నమః

ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం

 << ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం – 25

ఆళ్వార్ – ఆళ్వాన్

అతిమానుష స్తవంలో మూడవశ్లోకం ఆళ్వాన్లకు ఆళ్వార్లపై గల భక్తిని ప్రకటిస్తున్నది.

శ్రీమత్పరాంజ్ఞ్కుశ మునీంద్ర మనోనివాసాత్ తజ్జానురాగరసమజ్జనమంజసా22ప్య  I
అధ్యాప్యనారతతదుత్తిత రాగయోగం శ్రీరంగారాజా చరణాంబుజ మున్నయామః II

” శ్రీరంగారాజా చరణామ్బుజ మున్నయామహః”   అనే శ్లోక భాగమే ఇందులో జీవగర్ర. ఇది శ్రీరంగనాధుని శ్రీపాదపద్మాలను సంకేతిస్తున్నది. సాధారణ కవులు శ్రీరంగనాధుని శ్రీపాదపద్మాలు ఎర్రబడటానికి కారణం ఆ పాదాలమృదుత్వం లేదా మృదువైన పాదాలతో నడవటం వలన అని చెప్తారు.  కానీ శ్రీవైష్ణవుల శిరోమణి అయిన నమ్మాళ్వార్లు అలా అనడం లేదు. శ్రీపాదలు ఎర్ర బడటానికి ఒక అందమైన కారణం చెప్పారు.

నమ్మాళ్వార్ల లోతైన హృదయానికి చేరుకున్నపరమాత్మ శ్రీపాదలు అక్కడ భక్తిలో మునిగి, ఆ ప్రేమకు చిహ్నమైన ఎర్రని రంగులో ఉన్నవని వర్ణించారు.

పరమాత్మమీద నమ్మాళ్వార్లకున్న ప్రేమకంటే నమ్మాళ్వార్లమీద అళ్వాన్ కున్నప్రేమ పదిరెట్లు ఎక్కువ. అతిమానుషస్తవం రెండవ భాగంలో కృష్ణావతార అనుభవం వర్ణించడానికి నమ్మాళ్వార్ల దివ్యశ్రీసూక్తులే ఆధారంగా కనపడుతుంది.
సుందరబాహుస్తవంలో పన్నెండవ శ్లోకం ఈ విధంగా ఉంది.

“ వకుళధర సరస్వతీ విషక్త స్వర రస భావయుతాసు కిన్నరీషు!

 ద్రవతి ద్రుషదపి ప్రసక్తగానా స్విహ వనశైల తటీషు సుందరస్య !!

కిన్నెర బాలికలు తిరుమాలిరుంశోలైలో సుందరబాహుపెరుమాళ్ళ దగ్గరకువచ్చి, తమ మధురమైన గాత్రంతో  నమ్మాళ్వార్ల పాశురాలకు తగినట్లు స్వరపరచి గానం చేయగా, ఆ గానం విన్న రాళ్ళు కరిగి ప్రవహించి అది నూపుర గంగగా మారింది అంటున్నారు.

ఆళ్వార్లు “మరంగళుం ఇరంగుం వగై మణి వణ్ణా  ఎన్రు కూవుమాల్”  అన్న ఆళ్వార్ల పాశురాన్ని గుర్తు చేస్తున్నారు. ఆళ్వార్ల దైవిక ప్రేమలో పుట్టిన పాటలు రాయిని కూడా కరిగించగల శక్తివంతమైనవి. ఇక మామూలు మనుషుల గురించి చెప్పేదేముంటుంది. ఆ పాశురాలు మానవులందరినీ పరమాత్మ సన్నిధికి చేర్చే శక్తిగలవి.

            ఆళ్వాన్, ఆళ్వార్ల పాటలను ఈ భూలోకంలోనే కాక ఇతర అన్నిలోకాలలోనూ భగవంతుడిని చేరాలనుకునే  వాళ్ళు పాడతారు అని ఆళ్వార్లను తన ప్రత్యేకమైన శైలిలో కీర్తిస్తున్నారు.

            వరదరాజ స్తవం (59) లో పరమాత్మ ఎక్కడెక్కడ ఆనందంగా విశ్రాంతి తీసుకుంటారో చెపుతూ  “యత్స్య మూర్థా శఠారే” అని చెప్పారు. పరమాత్మకు విశ్రాంతి తీసుకోవటానికి పరమానందమైన ఆహ్లాదమైన ప్రదేశంగా ఆళ్వార్ల తిరుముడిని ఆళ్వాన్ చెపుతున్నారు.

          ఆళ్వాన్ల స్తవాలన్నీ ఆళ్వార్ల పాశురార్థాలుగానే ఉన్నాయి. అయినా కంచి ప్రతివాది భయంకరం  అణ్ణంగరాచార్య స్వామివారి వ్యాఖ్యానంలో పేర్కొన్నవాటిలో స్థాలిపులాక న్యాయంగా కొన్నింటిని ఇక్కడ చూద్దాం.

ఆళ్వార్ల  శ్రీసూక్తికి, ఆళ్వాన్ల స్తవాలతో ఉన్నపోలిక ఈక్రింద వివరించబడింది.

ఆళ్వాన్ల గ్రంధం ఆళ్వాన్ల వాక్కు ఆళ్వార్ల  శ్రీసూక్తి పోలిక
వైకుంఠ స్థవం (7) ఊర్ధ్వ పుంసాం…మూర్థిని… చకాస్తి 1. తిరుమురాలిన్జోలైమలైయే ఎన్ తలియే.
2. ఎన్ ఉచ్చియుళానే  (నా రసుపై అధిరోహిం చినవాడా)
ఆళ్వార్లు, పరమాత్మ దివ్యదేశాలలో వేమ్చేసినట్లు నా శిరసు మీద  వేమ్చేశారని చెపుతున్నారు.
శ్రీవైకుంఠ స్థవం (10) ప్రేమాగ్ర విహ్వలిత గిరా: పురుషా: పురాణా: 1. ఉళ్ళెల్లాంఉరుగి కురల్.
2.వేరారావేట్కైనోయ్ మేల్లావి ఉళ్ ఉలర్త .
3.ఆరావముదే అడియే నుడలం నిన్పాల్ అన్బాయే .
ఆళ్వార్లు పరమాత్మమీద ప్రేమవలన తనస్వరం పరవశించి కంపిస్తున్నదని, అందువలన తన ప్రేమ గొప్పదని అంటున్నారు.

దీనినే ఆళ్వాన్  మహాత్ములకు  పరమాత్మమీద భక్తివలన స్వరం కంపిస్తున్నదని, అంటున్నారు.

శ్రీవైకుంఠ స్థవం (10) ప్రేమాగ్ర విహ్వలిత గిర: పురుషా: పురాణా: 1.కేట్టు ఆరార్ వానవర్గళ్ సెవికినియ
2. తొండర్కముదుండ, సోల్ మాలైగళ్ సోన్నేన్
ఆళ్వార్లు తన మాటలు పరమాత్మకు, నిత్యసూరులకు, భక్తులకు మధురమైనవిగా అమరినవి అని అంటున్నారు.                                                                       ఆళ్వాన్  ఆళ్వార్ల వంటి మహాత్ముల వాక్కులు మధురమైనవి అని అంటున్నారు.
సుందరబాహు స్తవము (4) ఉదధిగ మంన్దరాద్రి మధి మన్థన లబ్ధ పయో ఆండాళ్  మదుర రసేన్దిరాహ్వాసుధ సుందరదోఃపరిగమ్!  మందిరం నాట్టియన్రు క్షీరసాగరమధనం గురించి చెప్పబడింది .
సుందరబాహు స్తవము (5) శశధర రిజ్ఞ్ఖణాఢ్యశిఖ ముచ్చిఖర ప్రకరం మదితవళ్ కుడుమి  మాలిరుం సోలై ద్రావిడ పాశురానికి సంస్కృత శ్లోకము
సుందరబాహు స్తవము (5) భిదురిత సప్తలోక  సువిశృజ్ఞ్ఖల శజ్ఞ్ఖరవమ్!! అదిర్ కురల్ శజ్ఞత్తు అళగర్ తమ్  కోయిల్ ద్రావిడ పాశురానికి సంస్కృత శ్లోకము  ప్రత్యక్ష అనువాదం
సుందరబాహు స్తవము (8) మొత్తం శ్లోకం పెరియాళ్వార్లు – కరువారణం తన్పిడి తణ్  తిరుమాలిరుంశోలైయే ద్రావిడ పాశురానికి సంస్కృత శ్లోకము  ప్రత్యక్ష అనువాదం
సుందరబాహు స్తవము (16,17) ప్రారూఢశ్రియ మాశ్రయే వనగిరేః   యం-అరుత-శ్రీ: ఆరూఢశ్రీ ఆండాళ్  ఏరుతిరుఉడైయాన్ ద్రావిడ పాశురానికి సంస్కృత శ్లోకము  ప్రత్యక్ష అనువాదం
సుందరబాహు స్తవము (40) మొత్తం శ్లోకం కొల్గిన్ర కోళిరుళై సుగిర్దిట్ట మాయన్ కుళల్ ద్రావిడ పాశురానికి సంస్కృత శ్లోకము  ప్రత్యక్ష అనువాదం
సుందరబాహు స్తవము (49) మొత్తం శ్లోకం ఆండాళ్ – కళి వండెంగుం కలన్దార్పోల్  మిళిర్ నిన్రు విళైయాడ
తిరుమంగై ఆళ్వార్ – మైవణ్ణ నరుం కుంజీ కుళల్ పిన్ తాళ మగరం సేర్ కుళైఇరుపాడి ఇలంగియాడ
ఆండాళ్, తిరుమంగై ఆళ్వార్ల అనుభవాన్ని ఆళ్వాన్ శ్లోకంలో కనపదుతుంది .
సుందరబాహు స్తవము (55) మొత్తం శ్లోకం ఆండాళ్ – సేమ్కమలనాణ్ మలర్ మేల్     తేనుగరుమన్నంపోల్ ద్రావిడ  పాశురానికి సంస్కృత శ్లోకము
సుందరబాహు స్తవము (62,63) మొత్తం శ్లోకం తణ్ తామరై సుమక్కుం
పాదపెరుమానై
ఆళ్వార్ల పాశురంలో ‘సుమక్కుం’ అన్న ప్రయోగ భావాన్ని ఆళ్వాన్  తమ శ్లోకంలో అనుభవించారు.
సుందరబాహు స్తవము (92) మొత్తం శ్లోకం తిరుమంగై  – నిలై యిడ మెంగుంమిన్రి ద్రావిడ  పాశురానికి సంస్కృత శ్లోకము. ఆళ్వాన్, ఆళ్వార్లు ఎంచుకున్న చందస్సులోనే పాడారు.                                            భాగంలో ఆళ్వార్ల, ఆళ్వాన్ల రచనలలోని పోలికలను చూసి తరించాము.

ద్రావిడ  పాశురానికి సంస్కృత శ్లోకము. ఆళ్వాన్, ఆళ్వార్లు ఎంచుకున్న చందస్సులోనే పాడారు.

ఈ భాగంలో ఆళ్వార్ల ,ఆళ్వాన్ల రచనలలోని పోలికలను చూసి తరించాము.

అడియెన్ చూడామణి రామానుజ దాసి

మూలము : https://srivaishnavagranthams.wordpress.com/2018/02/24/dramidopanishat-prabhava-sarvasvam-26/

archived in https://srivaishnavagranthams.wordpress.com/

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org
pramAthA (preceptors) – https://guruparamparai.wordpress.com
SrIvaishNava Education/Kids Portal – http://pillai.koyil.org

 

ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం 25

శ్రీ:  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః   శ్రీమద్వరవరమునయే నమః

ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం

 << ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం – 24

పరాంజ్ఞ్కుశ  పయోనిధి –  నమ్మాళ్వార్లనే పయోనిధి

              స్వామి రామానుజుల గ్రంధాలలో ఆళ్వార్ల ప్రబంధాల ప్రభావం ఎంత ఉందో తెలుసుకోవటానికి ఇప్పటి దాకా చాలా విషయాలను చూసాము. వారికి ఆళ్వార్ల మీద ఎంతటి భక్తి భావం ఉందో కూడా చూసాము. ఇప్పుడు సంస్కృతంలో గ్రంధాలను అనుగ్రహించిన ఆచార్యుల మీద ఆళ్వార్ల ప్రభావం ఎలా ఉందో తెలుసుకోవటానికి ప్రయత్నము చేద్దాము.

12 ఆళ్వారులు

స్వామి కూరత్తాళ్వాన్

 

ఆళ్వాన్  అని ప్రసిద్దిగాంచిన కూరత్తాళ్వాన్ స్వామి రామానుజుల ప్రియశిష్యులు, “పంచ స్తవము” అనే స్తుతి గ్రంధాలను రాసిన మహామేధావి. వీరి మొదటి స్తవం శ్రీవైకుంఠ స్తవము. ఈ గ్రంధాన్ని వీరు “యో నిత్యమచ్యుత ” అని అద్భుతమైన ఆచార్య స్తుతితో ప్రారంభించారు . ఆ తరువాత రెండు శ్లోకాలలో ఆళ్వార్లను స్తుతించారు. స్వామి రామానుజులకు ఆళ్వార్ల మీద అపారమైన భక్తి ఉన్నందున వీరు కూడా ఆళ్వార్లను స్తుతించారని అంటారు . ఇక ఈ రెండు శ్లోకాలను వివరంగా చూద్దాం.

 

 

 

 

త్రైవిద్య వృధ్ధజన మూర్థ విభూషణం యత్ సమ్పచ్చ సాత్విక జనస్య యదేవ నిత్యమ్ I
యద్వా శరణ్యమశరణ్య జనస్య పుణ్యం తత్ సంశ్రయేమ వకుళాభరణాంజ్ఞ్రియుగ్మమ్ II

స్వామి నమ్మాళ్వార్

 త్రైవిద్యవృత్తజన మూర్థ విభూషణం:  ఆళ్వార్ల శ్రీపాదాలే “త్రైవిద్యవృత్తజన మూర్థ విభూషణం”. వేదాలను అభ్యసించిన వేద మూర్తుల శిరస్సులకు ఆళ్వార్ల శ్రీపాదాలే ఆభరణం అంటున్నారు. అవియే “సాత్విక జనస్య నిత్యమ్ సంపత్” – శుద్ధసాత్వికుల నిత్య సంపద. ఆళవందార్లు   తమ “మాతా పితా” అనే శ్లోకంలో ఆళ్వార్ల శ్రీపాదాలే తమకు సర్వస్వం అని చెప్పుకున్నారు.

మశరణ్యజనస్య శరణ్యం: ఆళ్వార్ల శ్రీపాదాలే ఏదిక్కు లేనివాడికి దిక్కు….. లోకంలో ప్రజలు డబ్బునో, పరపతి గల వారినో ఆశ్రయిస్తారు. కానీ భగవద్కైంకర్య నిష్టులు ఇలాంటి నీచమైన వాటిని మనసా వాచా ఆశ్రయించరు. తమ త్రికరణాలను భగవంతుడి మీదే నిలుపుతారు. ఆళ్వార్లె ఇటువంటి భాగవత గోష్టికి నాయకులు కావున ఆళ్వార్ల శ్రీపాదాలనే ఆశ్రయిస్తారు. ఆళ్వార్ల శ్రీపాదాలు మాత్రమే ఈ లోకంలోని ఈతిబాధల నుండి చేతనులను రక్షించగల శక్తిగలవి. శరీరాన్ని శుష్కించి తపస్సులో మునగటమో, పాపాలను పోగొట్టు కోవటానికి తీర్థాలు వెతకటమో చేయనవసరం లేదు, ఆళ్వార్ల శ్రీపాదాలను శరణాగతి చేస్తేచాలు, అవి మన పాపాలను పోగొట్టి మనలను పవిత్రులుగా చేయగలవు .

ఇక తరువాతి శ్లోకాన్ని చూద్దాం :

భక్తిప్రభావ భవదద్భుత భావబంధ సంధుక్షిత ప్రణయ సారరసౌఘ పూర్ణః !

వేదార్థరత్ననిధి రచ్యుత దివ్యధామ జీయాత్ పరాఙ్కుశపయోధిః అసీమభూమా!! 

   ఈ శ్లోకములో  ఆళ్వార్లను ఒక సముద్రంగా చిత్రీకరించారు.  ఇలా చెప్పటానికి నాలుగు కారణాలు ఉన్నాయి.

1.  భక్తిప్రభావ భవదద్భుత భావబంధ – సందుక్షిత ప్రణయ సార రసౌఘపూర్ణః = సముద్రం వివిధ నీటి వనరులతో నింప బడుతుంది. అలాగే పరాంఙ్కుశ సముద్రం కూడా భక్తి అనే అద్భుత నవరస భరితమైన పవిత్రభావ ప్రవాహంతో నిండిన సముద్రం.

2.సముద్రం ముత్యాలు, పగడాలు, ఇంకా ఎన్నో వెలలేని విలువైన సంపదలకు నిలయం. ఆవిధంగానే ఇది వెలలేని విలువైన వేదాంత  రత్నాలకు నెలవు.

3.  సముద్రం పరమాత్మకు శయన మందిరం. అచ్యుత దివ్య ధామము.  ఆయన సముద్రం మీద శయనిస్తారు, రామావతారంలో సముద్రం మీద ఒక ఆనకట్టను నిర్మించాడు. అయినా  ఆయనకు వైకుంఠం కన్నా, ఆ పాల కడలి కన్నా, తిరువేంకటము కన్నా నా హృదయమే ఇష్టం కాబట్టి వాటిని వదిలివేసి వచ్చి నా హృదయంలో స్థిరపడ్డాడు. “కల్లుం, కనైకడలుం, వైకుంద వానాడుం పుల్లెండ్రోళిందన కొల్ ఏ పావం, వెళ్ళ నెడియాన్  నిరంగరియాన్ ఉళ్ పుగుందు నిన్రాన్ అడియేనదు ఉళ్ళతగం” (కల్లుం – తిరుమల, కనైకడలుం – పాలసముద్రము, వైకుంద వానాడు – శ్రీవైకుంఠంము, పుల్లెండ్రోళిందన కొల్ ఏ పావమే – నే చేసిన పాపమేమిటో తృణ ప్రాయంగా వదిలి వేసి, వెళ్ళ నెడియాన్  నిరంగరియాన్ ఉళ్ పుగుందు నిన్రాన్ అడియేనదు ఉళ్ళతగం = నల్లని వాడు వెంటనే వచ్చి నా హృదయంలో స్థిరపడ్డాడు)

“కొండల్ వణ్ణన్ సుడర్ ముడియాన్ నాన్గు తోళన్ కునిసార్గన్ ఒణ్ సంగదై వాళాళియాన్ ఒరువన్ అడియే నుళ్ళానే” (నల్లని వాడు ప్రకాశమానమైన శిఖ గలవాడు చతుర్భుజములవాడు  శంఖ, చక్రం, గధ, శార్జము, ఖడ్గం, మొదలైన ఆయుధములు గలవాడు) ఈ పాశురాల అర్థము తిరువాయిమోళిలో చక్కగా వివరించబడింది.

4. సముద్రము అంతుచిక్కనంత పెద్దది. ఆసీమ భూమా  అని పిలువబడుతున్నది. “కణ్ణినుణ్ శిరుత్తాంబినాల్”  అనే ప్రబంధంలో మధుకవి ఆళ్వార్లు నమ్మాళ్వా ర్లను “అరుళ్ కొండాడుం అడియవర్” అని వర్ణించారు.

ఈ ప్రకారంగా పరంజ్ఞుశ పయోనిధి ఔన్నత్యాన్నిఆళ్వార్లు కీర్తించారు .

అడియెన్ చూడామణి రామానుజ దాసి

మూలము : https://srivaishnavagranthams.wordpress.com/2018/02/23/dramidopanishat-prabhava-sarvasvam-25/

archived in https://srivaishnavagranthams.wordpress.com/

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org
pramAthA (preceptors) – https://guruparamparai.wordpress.com
SrIvaishNava Education/Kids Portal – http://pillai.koyil.org

 

ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం 24

శ్రీ:  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః   శ్రీమద్వరవరమునయే నమః

ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం

 << ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం – 23

ఉపనిషత్ వాక్యాలు పరస్పర విరుద్ధంగా గోచరిస్తాయి, వేరు వేరు అర్థాలను చెప్పినట్లుగా కనపడతాయి. కానీ తరచి చూస్తె సత్యం బోధపడుతుంది.

కొన్ని వాక్యాలు జీవాత్మ పరమాత్మా వేరని చెప్పగా మరికొన్ని అభేదం చెపుతాయి.

               వేదాంతులెవరూ జీవాత్మ తత్వాన్ని తృణీకరించలేరు. లోకంలో సుఖదుఃఖాలను అనుభవించేది ఎవరు? అని ప్రశ్నిస్తే ఖచ్చితంగా ఏతత్వజ్ఞాని కూడా పరమాత్మ అని చెప్పరు. కావున జీవాత్మ భావాన్ని అంగీకరించేతీరాల్సి వుంటుంది.  పైగా పరమాత్మ, జీవాత్మ ఒకటే అని సిధ్దాంతికరించిన వారు కూడా లోకంలో సుఖదుఃఖాలను అనుభ వించే జీవాత్మ పరమాత్మను పోలిన వాడని చెపుతారు కానీ పరమాత్మ అని చెప్పారు.. ఇలా చెప్పటం వలన జీవపర ఐక్యం అన్న వాదన బోధింపబడుతుంది . జీవాత్మ పరమాత్మ భావాలు ఒకటి కాదు, అందుకని వ్యతిరేకమైనవి కావు. జీవాత్మ అనేవాడు పరమాత్మ యొక్క మనో, జ్ఞాన, ఉపాదుల వలన ఏర్పడిన వాడు అని చెప్పటం వలన జీవాత్మ పరమాత్మా ఒక్కటే అన్న సిద్దాంతం చేయబడింది. వేదాంత సిద్దాంతలన్నింటిలో జీవాత్మ పరమాత్మ భావాలను ఒప్పుకుంటారు. కానీ అన్వయంలోనే భేదాలు వస్తాయి.

                జీవాత్మ పరమాత్మ సంబంధ విషయమైన ప్రశ్నను పరిష్కరించడంలో వేదాంతులలో భిన్న స్వరాలు వినిపిస్తాయి. అద్వైతులు ఈ భేదభావాన్ని గౌణంగా పరిగణిస్తారు. అద్వైతుల వాదనలో జీవపరభావం  జీవుడికి అజ్ఞానం ఉన్నంత వరకే, ఒకసారి అజ్ఞానం తొలగి జ్ఞానం ఏర్పడితే  జీవుడు పరమాత్మలో ఐక్యం చెందుతాడు. అప్పుడు జీవపర భేదం అన్న ప్రశ్నకు అవకాశమే లేదు అని చెపుతారు. ఈ సిద్దాంతాన్ని నిరూపించటానికి ఉపనిషత్తుల నుండి, వేదాల నుండి అనేక వాక్యాలను ఉటంకిస్తారు.

                 భేద శృతిని చెప్పేవారు విభిన్నమైన రీతిలో వాదిస్తారు. వీరు అద్వైతులు దర్శించిన అభేద శ్రుతులను అంగీకరించరు. జీవాత్మ, పరమాత్మ  వేరు వేరు అన్న తత్వాలని అంగీకరిస్తారు. అచేతన భౌతిక ప్రపంచంలాకాక జీవాత్మ, పరమాత్మ ఇద్దరు స్వతంత్ర ఆత్మలని, చేతనులని, ఇద్దరి మధ్య భేదం ఉందని భావిస్తారు. అజ్ఞానమేజీవాత్మ,పరమాత్మల మధ్య భేద భావానికి కారణమని అద్వైతులు చెప్పే సిధ్దాంతాన్ని పూర్తిగా ఖండిస్తారు. దీనికి వారు లెక్క లేనన్ని ఉపనిషత్ వాక్యాలను ఉదాహరణగా ఉటంకిస్తారు.

                  వీరు తమ వాదనకు అనుకూలమైన శృతి వాఖ్యాలను మాత్రం గ్రహించి, వ్యతిరేకంగా ఉన్నవాటిని పూర్తిగా తృణీకరిస్తారు. అనుకూలమైన వాటిని మాత్రంగ్రహించి  వ్యతిరేకమైన వాటిని వదిలివేయటం శాస్త్ర సమ్మతం కాదు.

                   భేదాభేద వాదులు రెండు ఆత్మలను అంగీకరిస్తున్నారు.  అయితే అది ఎంత వరకు అంటే వాళ్ళు ఏ వాదానికి సంబంధించిన వాళ్ళో అంతవరకు మాత్రమే. వీరు కొత్త విధమైన తత్వావిచారం ఎమీ చేయటం లేదు. ఉన్న దానినే మళ్ళి చెప్పారు. ఈ భేదాభేద వాదాన్ని స్వీకరిం చడానికి కానీ, తృణీకరించడానికి కానీ సరి అయిన ఉపనిషత్ వాక్యాలను ఏవి  ఉదాహరించి చూపటం లేదు.

                 విశిష్టాద్వైతంలో ఉపనిషత్తులకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. వీరు భేదం లేక ఐఖ్యం అన్న అర్థాన్ని స్పురింపజేసే  ఉపనిషత్ వాక్యాలను గొప్పవని అంగికరించట, తక్కువని త్రుణీకరించటమో లేదు. ఈ ప్రశ్నకు జవాబు ఉపనిషత్ లోనే దొరుకుతుంది దీనికోసం ప్రత్యేకమైన గ్రంధాల నుంచి ఉదాహరించాల్సిన అవసరం లేదు. ఉపనిషత్ చూపే మార్గంలో పొతే చాలు పరిష్కారం దొరుకుతుంది అన్నది వీరి భావాన.

విశిష్టాద్వైతంలో మూడు రకాల ఉపనిషత్ వాక్యాలను పరిగణనలోకి తీసుకుంటారు.

  1. భేదశృతి – జీవాత్మ పరమాత్మా వేరు వేరు అని తెలిపే శృతి వాక్యాలు.
  2. అభేద శృతి –  జీవాత్మ పరమాత్మా వేరు కాదు. ఒకటే అని తెలిపే శృతి వాక్యాలు.
  3. ఘటక శృతి –  జీవాత్మ పరమాత్మా వేరు కాదు అని, వేరు వేరు తత్వాలని తెలిపే శ్రుతులకు భిన్నంగా ఉన్నరెండు రకాల శృతి వాక్యాలను ఏకంగా క్రోడీకరించినవి.

మొదటి రెండు వాదనలను చూసాము కాబట్టి మూడవ వాదనను చూద్దాం.

                   వీటిలో ముఖ్యమైన భాగాలు ప్రాచీన ఉపనిషత్తులుగా చెప్పబడే అంతర్యామి బ్రాహ్మణంలోను, సుభాలోపనిషత్తులోను కనపడతాయి . వీటిలో జీవాత్మకు పరమాత్మకు ఉన్న సంబంధం శరీరాత్మ సంబంధం వంటిదిగా చెప్పబడింది. జీవాత్మ పరమాత్మ ఆధ్యాత్మిక శరీరం, పరమాత్మ చేతనాచేతనములన్నింటిని తన శరీరముగా ఉన్నవాడు. కావున పరమాత్మ జీవాత్మకు అంతర్యామి, అంతరాత్మ. ఈ సంబంధము జీవాత్మకు, పరమత్మకు నిత్యమైంది. ఇది లేకపోతె వారు లేరు. అర్తాత్ జీవాత్మ పరమాత్మ ఇద్దరూ ఒకటే, కానీ. కావున శరీర భేదంతో ఇద్దరూ వేరుగా ఉన్నారు. వాళ్ళు ఒకే వ్యక్తిగా ఉన్నారు. స్వామి రామానుజులు శరీరం, ఆత్మ రెంటిని స్పష్టంగా వివరించారు, ఇది ఇక్కడ అప్రస్తుతం.

            విశిష్టాద్వైతులు అద్వైతం, ద్వైతం, విశిష్టాద్వైతం మూడు నిత్యమని చెపుతారు. జీవాత్మ స్వరూపం, స్థితి, కర్మాచరణ అన్ని పరమాత్మలోనే చేరి వున్నాయి. జీవాత్మ లేకుండా పరమాత్మ, పరమాత్మ లేకుండా జీవాత్మ లేరు. ఈ తత్వంలోనే వారిరువురి స్వరూపం సిద్దిస్తుంది. స్వభావ రీత్యా ఆ రెండు వేరు వేరుగా ఉంటాయి, పరమాత్మ ఈ సంసారంలో కట్టుబడడు, వీటికి అతీతమైన వాడు.  పరమాత్మ సకల కల్యాణగుణ పరిపూర్ణుడు, అపహతపాప్మ.  ఏ పాపములు అంటని వాడు. సర్వజ్ఞుడు, సర్వశక్తుడు, సర్వాంతర్యామి. సృష్టి, స్థితి, సంహారం చేయగల వాడు. కాలప్రమాణాలకు అందనివాడు .జీవాత్మ, సంసారం, సుఖం దుఃఖం కర్మబంధనాలకు కట్టుబడ్డ వాడు తనను తాను రక్షించుకోలేనివాడు, పూర్తిగా పరమాత్మ మీద ఆధారపడిన వాడు, వాడికే స్వాభావికంగా దాసుడు, ఈ విషయాన్ని మరచిపోయిననాడు దుఃఖిస్తున్నాడు. ఈ రకంగా పరమాత్మా, జీవాత్మ పూర్తిగా వేరువేరు తత్వాలు. ఉపనిషత్తులలోని ఘటక శృతి ఆధారంగా ఈ శరీర శరీరీ భావాన్నిబట్టి ఈ రెండు ఒకే సమయంలో వేరుగానూ, ఒకటిగాను  అర్థం చేసుకోవచ్చు . ఈవిధంగా  ఉపనిషత్తులలోని భేదాభేద గందరగోళానికి విశిష్టా ద్వైతంలో పరిష్కారం లభిస్తుంది. విశిష్టాద్వైతం కొత్తదో లేక విప్లవాత్మకమైన మార్పో కాదు. బోధాయనులు, వేదాంతులు,  టంకణులు, ద్రమిడులు, గుహదేవులు, వంటి మహర్షుల మనోభావాలకు సంబందించిన స్మృతి, శృతి, ఇతిహాస, పురాణాలకు సరిపోయే విధంగా వివరించటమే దీని లక్ష్యం. వైధికమైన భారతదేశపు ఉన్నతమైన సంప్రదాయాలను, అర్థవిశేషాలను కాపాడటం, ఈ దేశ ప్రాచిన వేదాంత పరంపరను రక్షించటం విశిష్టాద్వైతం యొక్క లక్ష్యం. ఒక రకమైన వాదన చేసేవారు తక్కువ అని మరొకరు ఎక్కువ అని భావించక అందరిని, అన్నింటిని సమన్వయపరచటయే ఈ సిధ్దాంతంలోని గొప్పదనం. ఉపనిషత్తులలోని సకల వాక్యాలను సమన్వయపరచేదే విశిష్టాద్వైతం. ఉపనిషత్తుల నుండి కర్మ, జ్ఞాన, భక్తి , ప్రపత్తి మార్గాలకు సంబంధించిన సూత్రాలను  క్రోడికరించి ఆచరింప చేయటమే విశిష్టాద్వైతం ఔన్నత్యం.

                మన ఆచార్యులు ఇతర సిధ్ధాంతపరులని చూడకుండా వదిలివేసిన ఘటక శృతులను ఉపనిషత్తులలో శోధించి ప్రవచించగలిగారంటే ఆళ్వార్ల దివ్యప్రబంధమే దానికి పక్కబలంగా ఉపకరించిందని పెద్దల అభిప్రాయము. తిరువాయ్మొళి మొదటి రెండు పత్తులు (రెండు వందల పాశురాలు) బ్రహ్మ సూత్ర సారాన్నే చెపుతున్నది.

                    ఆళ్వార్ల  “ఉడల్ మిసై ఉయిరెన కరన్దెగుం పరన్దుళన్” (తిరువాయ్మొళి 1-1-7) అన్న పాశుర భాగం ఉపనిషత్ వ్యాక్యాలు చెప్పే ఘటక శృతినే వివరిస్తున్నది.

                      శరీర శరీరి  భావాన్ని ఇక్కడ ఆళ్వార్లు చక్కగా చూపించారు. స్వామి రామానుజులు ఈ పాశురాలలో ఉపనిషత్ సారాన్ని, బ్రహ్మసూత్రాలను దర్శించగలిగారు .

                     ఇక్కడ మాత్రమే కాదు మరొక సందర్భంలో కూడా ఉపనిషత్తులలోని ప్రశ్నలకు ఆళ్వార్ల తిరువాయ్మొళిలో జవాబు లభిస్తుంది. అది కూడా చూద్దాం.

                    ఉపనిషత్ వాక్యాలు కొన్ని బ్రహ్మ నిర్గుణుడని చెపుతుంది. మరికొన్ని సూత్రాలు బ్రహ్మ సగుణుడని, సకల కళ్యాణ గుణ పరిపూర్ణుడని చెపుతుంది. వివిధ వ్యాఖ్యానాలలో వేరు వేరుగా వివరణ ఇవ్వబడింది. విశిష్టా ద్వైతులు దీనిని రెండు పక్కలుగా వివరించారు. బ్రహ్మకు హేయగుణములు లేవు కానీ కళ్యాణ గుణములున్నాయి అని ఉపనిషత్ వాక్యాల ఆధారంగా  విశిష్టాద్వైతులు వివరణ ఇచ్చారు. హేయగుణములు నిర్గుణం. కళ్యాణ గుణములు సగుణం.

                      ఆళ్వార్ల తిరువాయ్మొళిలోనే ఈ వివరణ కూడా కనపడుతుంది. సకల చరాచర ప్రపంచానికి నాయకుడైన పరమాత్మ సకల కళ్యాణ గుణములు కలవాడు .

                       బ్రహ్మ అన్న పదమే ‘బృ’ అన్న ధాతువు నుండి పుట్టింది. ‘బృ’అంటే పెద్ద అని అర్థము కదా!

                   స్వామి రామానుజులు బ్రహ్మ అన్న శబ్దాన్ని ఆళ్వార్ల తిరువాయ్మొళిలోని పాశురాన్నే తీసుకొని  వివరణ ఇచ్చారు.

‘ఉయర్వర ఉయర్నలం ఉడైయవన్ ఎవన్ వన్’

ఉయర్ వర = అనవధికాతిశయ

ఉయర్ =అసంఖ్యేయ

నలం ఉడైయవన్= పురుషోత్తముడు

ఆళ్వార్ల మనసు ఆచార్యులైన స్వామి రామానుజుల నోట పలకగా విన్నవారే అదృష్టవంతులు కదా!

అడియెన్ చూడామణి రామానుజ దాసి

మూలము : https://srivaishnavagranthams.wordpress.com/2018/02/22/dramidopanishat-prabhava-sarvasvam-24/

archived in https://srivaishnavagranthams.wordpress.com/

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org
pramAthA (preceptors) – https://guruparamparai.wordpress.com
SrIvaishNava Education/Kids Portal – http://pillai.koyil.org

ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం 23

శ్రీ:  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః   శ్రీమద్వరవరమునయే నమః

ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం

 << ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం – 22

భగవద్రామానుజులు అనుగ్రహించిన గ్రంధాల లోతైన అధ్యయనము:

                  భగవద్రామానుజుల గ్రంధాలను లోతుగా అధ్యయనము చేస్తేగాని అర్థం కావు.  వారి మాటలలోని అంతరార్థాలను తెలుసుకోకుండా పై పై పదాలను మాత్రమే చదివితే అర్థం కావు. ఆళవందార్లు, ఆళ్వార్లు , భట్టరు , వేదాంతదేశికులు మొదలైన వారి రచనలతో పోల్చి చూసినప్పుడు వీరి శైలి, పదవిన్యాసంలో, వాక్యనిర్మాణంలో అంతరార్థాల  విషయంలో ఈ భేదం స్పష్టంగా కనపడుతుంది.

                  భగవద్రామానుజుల గ్రంధాల అధ్యయనము చేయడానికి ఉద్యమించినవారు పదాలకూర్పును, చెప్పే శైలిని చూసి మురుసిపోయి అక్కడే ఆగిపోతే అంతరార్థాలు బోధపడవు, రామానుజుల మనసు అర్థంకాదు. భగవద్రామానుజుల గ్రంధాలు నమ్మాళ్వార్ల రచనలనే కాక ఇతర గ్రంధాలను కూడా ఎంత విస్తారంగా ప్రతిధ్వనిస్తున్నాయో ఒక్కసారి చూద్దాము.

గీతా భాష్యం ప్రారంభంలో భగవద్రామానుజులు ఆళవందార్లను స్తుతిస్తూ చేసిన తనియన్ ను మొదట చూద్దాం .

యత్పదాంభోరుహధ్యానవిద్వాస్తాశేషకల్మషః  !

వస్తుతాముపయాతోహం యామునేయం నమామితం !!

               భగవద్రామానుజులు పంచాచార్య పదాశ్రితులన్న విషయం జగద్విదితం. ఎందుకు వీరు పంచా చార్యులను ఆశ్రయించారంటే ఆళవందార్లను ప్రత్యక్షంగా ఆశ్రయించలేక పోయారు. భగవద్రామానుజులు శ్రీరంగం చేరక ముందే ఆళవందార్లు పరమపదించటం వలన వారి దగ్గర అధ్యయనం చేయలేక పోయారు. ఆళవందార్లు అప్పటికే తమ ప్రియశిష్యులు ఐదు గురిని రామానుజులకు శ్రీవైష్ణవ సాంప్రదాయ విషయాలన్నింటిని విశదపరచమని ఏర్పాటు చేశారు.  శ్రీకృష్ణుడికి సాందీపుడు అరవై నాలుగు కళలు నేర్పినట్లు ఐదుగురు ఆచార్యులు రామానుజులకు సంప్రదాయ రహస్యాలను బోధించారు. అర్థాత్ భగవద్రామానుజులు ఆళవందార్ల మనోభావాలను ఐదుగురు ఆచార్యుల ముఖంగా అందుకున్నారు. అందువలననే గీతాభాష్య ప్రారంభంలో తమకు ప్రత్యక్షంగా బోధించిన ఆచార్యులను కాక తమ పరమాచార్యులైన ఆళవందార్లను స్తుతించారు.

                  కూరత్తాళ్వాన్,  పరాశరభట్టర్, వేదాంత దేశికులవారు వారి గ్రంధాలలో గురుపరంపరతో సహ ఆచార్యులందరిని ప్రస్తావించారు.  రామానుజులు మాత్రం ఎందుకు గురుపరంపరను, తమ ఆచార్యులను స్తుతించలేదన్న ప్రశ్న ఇక్కడ ఉదయిస్తుంది.

            రామానుజులు ఈ తనియన్లో వారందరిని ప్రత్యక్షంగా ప్రస్తావవించకపోయినా పరోక్షంగా ప్రస్తావన చేశారన్నది స్పష్టంగా కనపడుతుంది. అదెలాగంటే …….

              “యత్పదాంబోరుహ”  అన్న పదంలో “య్, అ, త్ , ప్, అ, త్, అ, మ్, ప్,  ఓ, ర్, ఉ, హ్, అ” అన్న పద్నాలుగు అక్షరాలు ఉన్నాయి. వాటిని ఏడు పాదాలజంటలకు సంకేతంగా తీసుకోవాలి. ఈ ఏడుగురు ఎవరంటే వారి ఆచార్యులైన ఐదుగురు, ఆళవందార్లు , నమ్మాళ్వార్లవిగా స్వీకరించాలి .

                 ఇదే విషయాన్ని మరొక విధంగా చూస్తె “యత్పదాంబోరుహ”  అన్న పదం షష్టి తత్పురుష సమాసంగా తీసుకుంటే ‘యస్య- పదాంబోరుహ ’ అని విడదీయాలి . “ఎవరి పాద పద్మాలో !….” అన్న అర్థం లో

దీనికి  మళ్ళి మూడు రకాలుగా  అర్థం చెప్పుకోవచ్చు .

  1. ఆళవందార్ల శ్రీపాద పద్మాలను వారి తిరుమేనిలో చూసి నమస్కరించటం .
  2. ఆళవందార్ల శ్రీపాదాలు – అంటే … వారిచే అర్చించబడ్డ పరమాత్మ .
  3. ఆళవందార్ల శ్రీపాదాలు – అంటే …  శిష్యులను ఆచార్యుల శ్రీపాదాలుగా భావించడం మన సంప్రదాయం కావున  ఆళవందార్ల శ్రీపాదాలంటే వారి శిష్యులైన రామానుజుల ఆచార్యులు ఐదుగురు.

* “పదాంబోరుహ” అన్న శబ్దం ‘ప’ అన్న అక్షరంతో మొదలవుతుంది. పెరియనంబులు రామానుజులకు పంచ సంస్కారం చేసి మంత్రోపదేశం చేశారు. వారి తిరునామం పరాంజ్ఞుశ దాసులు, ఇక్కడ ‘ప’ అన్న అక్షరం పరాంజ్ఞుశ దాసులకు సంకేతంగా స్వీకరించాలి .

                            పై వివరణ ప్రకారం రామానుజులు తమ గీతా భాష్యంలోని ఆచార్య తనియన్లో గురుపరం పరను స్మరించారని పెద్దలు నిర్వహం చేశారు. కూరత్తాళ్వాన్ శిష్యులైన తిరువరంగత్తముదనార్లు తమ రామానుస నూత్తందాదిలో రామానుజులకు వారి పూర్వాచార్యులతో ఉన్న సంబంధాన్నే ప్రముఖంగా ప్రస్తావించారు.

                           జ్ఞాన సంపన్నుల లక్షణము ఇక్కడ చక్కగా వవరించబడింది. సాధారణ కవులయితే పదముల అర్థంతో ఆగుతారు. జ్ఞానుల రచనలలో అంతరార్థాలను తరచి చూడకపోతే విషయం బోధపడదు. రామానుజులవారు అనుగ్రహించిన గ్రంధాలకు కాలం ఎంత పెరిగినా అర్థాలు మాత్రం నిత్య నూతనంగానే ఉంటాయి.

అడియెన్ చూడామణి రామానుజ దాసి

మూలము : https://srivaishnavagranthams.wordpress.com/2018/02/21/dramidopanishat-prabhava-sarvasvam-23/

archived in https://srivaishnavagranthams.wordpress.com/

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org
pramAthA (preceptors) – https://guruparamparai.wordpress.com
SrIvaishNava Education/Kids Portal – http://pillai.koyil.org

ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం 22

శ్రీ:  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః   శ్రీమద్వరవరమునయే నమః

ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం

 << ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం – 21

 

ఆళ్వార్లను ప్రకాశింపచేసిన శ్రీభాష్యం 

              శ్రీభాష్య ప్రారంభంలో చేసిన మంగాళాశాసనము శ్రీనివాసుడికే కాదు నమ్మాళ్వార్లకు కూడా వర్తిస్తుంది. అది ఎలాగా అన్నది చూద్దాం :

అఖిల-భువన-జన్మ-స్తేమ -భంగాది – లిలే

అఖిల-భువన-జన్మ-స్తేమ –భంగాదులుగా వుండువాడు భగవంతుడు. “తేన సహ లీలా యస్య” ఈ పరమాత్మతో ఆయనదే అయిన లీలను ఆడువాడు నమ్మాళ్వార్లు. అందువలన అఖిల-భువన-జన్మ-స్తేమ -భంగాది – లీల నమ్మాళ్వార్లకు కూడా వర్తిస్తుంది.

భగవంతని లీలలను ఆళ్వార్లే పాడారు. ఎన్నుడైయ పందుం కళలుం తంతు పోగు నంబి”  (నా బంతి, కాలు ఇచ్చిపో నంబి )అని, విళైయాడ పోదుమిన్ ఎన్న పొందమై” (ఆట లాడదానికి ఎంత బాగా వస్తున్నావు) అని పాడారు.

ఈ మాటలు మరొక వ్యాఖ్యానానికి హేతువవుతున్నది. – భువన జన్మ  స్తేమ భంగాది లీలా అఖిలం యస్య” భువన జన్మ స్తేమ భంగాది లీలయే ఈ అండ సృష్టికి ప్రధాన కారణము. అర్థాత్ భగవంతుడు అందరికి అన్నీ అయి ఉన్నాడంటే, ఆళ్వార్లు మాత్రము ఉణ్ణుం శోరుం పరుగుం నీరుం, తిన్నుం వేట్రిలైయుం ఎల్లాం కణ్ణన్” అని అన్నారు? మనకు బతకడానికి కొన్ని వస్తువులు, పెరగడానికి కొన్ని వస్తువులు, అనుభవానికి కొన్ని వస్తువులు అవసరమవుతాయి. కానీ ఆళ్వార్లకు అన్నింటికి కృష్ణుడు ఒక్కడే చాలు.

వినత-వివిధ-భూత-వ్రాత-రక్షైక –దీక్షె

సమస్త భువనాలను రక్షించువాడు భగవంతుడే అయినా భక్తుడి దృష్టిలో భగవంతుడు పూర్ణుడుగా కనపడటంలేదు. (స్తనంజయ ప్రజకు) స్తన్యపానంచేసే పిల్లలకు ఆకలి తీరడానికి పాలు  లభించటం వలన  ఆబిడ్డ చూపు తల్లి స్తనములమీదే వుంటుంది. అలాగే భగవత్కైంకర్యం చేసే దాసులకు ఆయన శ్రీపాదలమీదే దృష్టి వుంటుంది .

కోవెలలో భగవంతుడి  శ్రీపాదాలే శ్రీశఠారి లేక శఠగోపురం అని నమ్మాళ్వార్లను  పిలుస్తారు. అంటే నమ్మాళ్వార్లకు భగవంతుడి శ్రీపాదాలకు బేధం లేదు, రెండు ఒక్కటే అని బోధపడుతుంది. రక్ష కావాలని కోరుకునే దాసవర్గానికి భగవంతుడి శ్రీపాదరూపంలో  ఆళ్వారులే లభిస్తారు.

శృతి శిరసి విదీప్తే…..

శృతి శిరస్సుగా పిలవబడేది వేదాంతము.

శృతి శిరసి విదీప్తే అనగా వేదాంతములో బాగా ఆరితేరిన వారు అని అర్థము. వేదాంతము పరబ్రహ్మను తెలుసుకోవటము కొరకేనని నమ్మినవారు ఆళ్వార్లు . అందువలన ఈ ప్రయోగము వారికి సరిపోతుంది.

వేదమే ఆళ్వార్లను, తత్ విప్రాసో విపన్యవో జాక్రవాక్మస్సమింతతే”.  విప్రా అన్న పదం ఆళ్వార్లకే వర్తిస్తుంది. “న సూద్రా భగవద్భక్తా విప్రా భాగవతాస్మ్రుతా”  అన్నట్లు దాసులుగా ఉన్న ఒకరు మాయాలోకంలో చిక్కి ప్రవర్తించరు .  “ఫణస్తుతౌ“, “విపన్యవ” అంటే పరబ్రహ్మ కల్యాణగుణాలను కీర్తించేవారు అన్న అర్థం  ఉన్నందున ఆ పద్దతిలో అసమానమైన పాశురాలను పాడిన ఆళ్వార్లనే సంకేతిస్తుంది. ” తేవిర్ శిరంద తిరుమార్కు తక్క తైవ కవిజ్ఞర్“.   “జాగ్ర వాగ్మస” …..ఎప్పుడు జాగ్రదవస్తలో ఉండటం.  పరమాత్మను తప్ప వేరేవారిని చూడని, వాడిని తప్ప మరేది తలచని , వాడినే అనుభవించే వారు ఆళ్వార్లు .  పై వాక్యానికి అర్థము, వ్యాకరణము కూడా ఆళ్వార్లె.  “కణ్ణార కండుకళివదోర్  కాదలుత్రర్క్కుం ఉండో  కణ్ గళ్ తుంజుదలే” అని పాడారు.

ఈ వేదవాక్యంలోని వి” అనే ప్రయోగాన్ని శ్రీభాష్య శ్లోక చివరి శబ్దమైన “సమిందతే “ లోని  సమ్” ను స్పురింప చేస్తుంది.

బ్రహ్మణి

అన్నింటిలోను పెద్దదని చూపే బృ”  అన్న పదముతో ప్రారంభమవుతున్న ప్రయోగము బ్రహ్మము. పరబ్రహ్మమే ఆళ్వార్ల దగ్గర ప్రేమతో కట్టుబడటమే ఆయన ఔన్నత్యము . పెరియ తిరువందాదిలో ఆళ్వార్లు దీనిని   “యాన్ పెరియన్ , నీ పెరియై ఎన్పడనై  యార్ అరివార్” అని పాడారు. అందువలన పరబ్రహ్మనికి సరిఅయిన పర్యాయపదం పెద్ద.

శ్రీనివాసే

ఆళ్వార్లకు శ్రియః పతిత్వం లేనందున శ్రీనివాసే  అన్న పదాన్ని ఆళ్వార్ల పరంగా అన్వయించటం కుదరదు అనవచ్చు . శ్రియఃపతిత్వం పరమాత్మకు ఎకదేశ హక్కు అయనప్పటికీ ఆళ్వార్లు  శ్రీనివాసులే….ఇంకా తరచి చూస్తే సాంప్రదాయంలో పలువురు శ్రీనివాసులున్నారు .

లక్ష్మణో లక్ష్మీసంపన్న ….లక్ష్మణుడు లక్ష్మీ సంపన్నుడు

సతునాగవర శ్రీమాన్ ……గజేంద్రుడు కూడా శ్రీమంతుడే ,

అంతరిక్షగత శ్రీమాన్ ……విభీషణుడు నడి సముద్రం మీద నిలబడ్డాడు. అయినా అయన  శ్రీమంతుడే, ఇక్కడ ఉదాహరించిన వారి శ్రీ ఒక్కోక్కరికి ఒక్కొక్క విధంగా చెప్పబడింది. అది ఎలాగంటే లక్ష్మణుడికి శ్రీ అంటే కైంకర్యం. గజేంద్రుడుకి శ్రీ అంటే ఆయన శ్రీమన్నారాయణునికి తన చేతిలోని పుష్పాన్ని సమర్పించాలని భావించిన మనఃనైర్మల్యం , విభీషణుడికి తన సమస్తసంపదలను, బందువులని వదిలివేసి శ్రీరాముడిని శరణాగతి చేయటం శ్రీ అవుతుంది.

ఇక ఆళ్వార్ల విషయానికి వస్తే. వ్యాఖ్యాతలు వారి దగ్గర శ్రీ ఉండటం కాదు వారె శ్రీ కదా అని చాలా అందంగా చెప్పారు. ఇంకా ఆళ్వార్లు పాడిన పాశురాలలో ప్రపన్నాధికారుల గుణాలన్నీ ఉండటం వలన శ్రీనివాసుడు తానే అమ్మవారిలా మారారు. అప్పుడు ఆళ్వార్లె  శ్రీనివాసునిగా మారారు అని కూడా భావించవచ్చు .

ఈ విధంగా భగవద్రామానుజులు శ్రీమన్నారాయణుని అనుభవించినట్లుగా ఆళ్వార్లను అనుభవించారు అని స్పష్టమవుతున్నది.  భగవద్రామానుజుల శ్రీభాష్య రచనలో ప్రారంభం నుండి చివరిదాకా ఆళ్వార్ల ప్రభావం స్పష్టంగా కనపడుతుంది.

శ్రీభాష్యంలోని చివరి సూత్రమైన అనావృత్తిశబ్దాద్ అనావృత్తిశబ్దాద్‘. ఇందులోని అనావృత్తి శబ్దానికి అర్థం ఈ మాయా బంధనాలు వదిలి ముక్తిని పొందిన జీవాత్మ ఈలోకానికి తిరిగి రాదు .

తిరిగి రానందుకు కారణము , శబ్దాత్” అంటే వేదం చెపుతున్నది కావున …వేదం , న చ పునరావర్తతే  న చ పునరావర్తతే “ అంటుంది. ఈ మాయా బంధనాలు వదిలి వెళ్ళిన జీవాత్మ తిరిగి రావటం లేదు. ఇది వేదాంత సూత్రం, కానీ ఉన్నతమైన జ్ఞానం గలవారు, సాంప్రదాయబద్దమైనవారు అయిన రామానుజులు ఈ సూత్రానికి వ్యాఖ్యాతలలా కాక  ఒక ముఖ్యమైన విషయాన్ని దర్శించారు. పరబ్రహ్మనికే ఎందుకు శృతి కట్టుబడి వుంది? వేదాంతులందరికి జీవుడు మొదలైన విషయాలలో భేద భావం ఉన్నా అంతిమంగా మోక్షము లేక విడుదలనే ఎందుకు కోరతారు? అద్వైతికి అవిద్య వలన బాధింపబడిన బ్రహ్మము, ముక్తి  వలన బాధింప బడకుండా ఉంది అన్న విషయాన్ని వివరించటమే పెద్దసమస్య. బ్రహ్మము మునుపే అవిద్యచే బాధింప బడకుండా ఉంటే దానికి బహు అన్న భావమే రాదు. బ్రహ్మము ఒక్కటే. జీవాత్మ తిరిగి రాదు అన్నది మొత్తంగా కాక పరస్పర సంబంధం పరంగానే అంటే బ్రహ్మసూత్రం, వేదాంతం మొత్తం తప్పవుతుంది. అందువలన  బ్రహ్మసూత్రం జీవుడు తిరిగి వస్తాడా? అన్న ప్రశ్నను లేపి వేదము చెప్పటం వలన రాదు అని ప్రకటిస్తున్నది. ఈ సూత్రకారులు అద్వైతంలో దీనిని ఏమాత్రం అంగికరించలేదని ఈ అనుమానాన్ని తోలగదోయటం వలననే తెలుస్తున్నది.   స్వతంత్రమైన పరబ్రహ్మాన్ని నమ్మే ద్వైతికి ఆ పరబ్రహ్మను ఒక శృతి వాక్యంతో కట్టడి చేయటం సాధ్యమా అన్నది ప్రశ్న. పరబ్రహ్మ స్వతంత్రుడు, ఆయన కోరుకుంటే జీవాత్మను  మళ్ళీ ఈలోకానికి పంపగలడు అని భావిస్తాడు..

కానీ ఒక విశిష్టాద్వైతికి ఈ ప్రశ్న తీసివేయ తగినది కాదు, జవాబు చెప్పటం కూడా కష్టమే. ఎందుకంటే జీవాత్మ పరబ్రహ్మానికి ప్రకారము, అందువలన పరబ్రహ్మనికి ప్రకారము అయినవాడు మళ్ళీ ఈలోకానికే రావటమంటే, ఆ విద్యలో ఈ లోకము తెలియుటే అవుతుంది. అయినా, విశిష్టాద్వైతంలో పరబ్రహ్మ మాత్రమే స్వతంత్రుడు, జీవుడిని కట్టడి చేయగల శక్తి గలవాడు.  పరమాత్మా జీవుడిని ఎందుకు మళ్ళీ పంపకూడదు. ఈ ప్రశ్నకు జవాబు తెలుసుకోవటానికి రామానుజులు వేదాంతాన్ని కూడా దాటి వెళ్ళి, పరిశోధించారు. శృతి ఎందుకు ఇలా చెప్పింది అన్నవిషయాన్ని తర్కించి, పురాణ, లౌకిక విషయాలకు అనుగుణంగా జవాబు చెప్పారు.

పరబ్రహ్మకు జీవుడికి మధ్య సంబంధం అంశ/అంశి భావాన్ని దాటి నిజమైన అనుభవం లభించే విధంగా ప్రేమికుడు /ప్రేయసి అనే స్థితి కూడా ఉంది. పరబ్రహ్మకు జీవుడికి ఉండే సంబంధము కేవలం జ్ఞానానికి సంబందించిందేకాక అలౌకికానుభవం కూడా వుంటుంది. ఇది పరమ చేతనుడు చేతనుడిని  ప్రేమతో ఆలింగనం చేసుకునే స్థితి. జీవుని స్థితిని గురించి తెలుసుకోకుండా కేవలం ఆధారంగా ఉండే స్థితిని దాటి పరమ చేతనుడు చేతనుని పొందటంలో అనేక ప్రయత్నాలు, స్థాయిలు ఉన్నాయి. ఆయన అత్రుప్తామ్రుతుడు, అపారమైన ప్రేమ కలవాడు. ఎప్పటికి వదలని అచ్యుతుడు. జీవుడు నాకు ప్రేమప్రదుడని ఊరికే అంటాడా?

దీనికి నమ్మాళ్వార్లు తమ పాశురాలలో జవాబును పొందారు. అనుభవంలో  నమ్మాళ్వార్ల అనుభవానికి సాటి మరొకటి ఉంటుందా? ఈ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకునే రామానుజులు న చ పరమపురుష సత్య సంకల్ప అత్యర్త  ప్రియం జ్ఞానినం లభ్ద్వా కదాచిత్ ఆవర్తయిష్యతి”

స్థిరసంకల్పుడైన పరమపురుషుడు తనకు ప్రియమైన, తనపై మరులు గొన్న చేతనుని ఎంతో శ్రమించి పొందిన తరువాత వదులుతాడా! కృష్ణుడిని తాను తిన్న వెన్నను తిరిగి ఇవ్వమంటే ఇస్తాడా?

చేతనుడిని పొంది అనుభవించటంలో పరమాత్మ కోరిక ఎంతటిదో నమ్మాళ్వార్లు తమ పాశురాలలో ఇలా వివరించారు. ఎన్నిల్ మున్నం పారిత్తు తానెన్నై ముట్ర  ప్పరుగినాన్” అన్నారు. వాడు నన్ను పూర్తిగా అనుభవించాడు. ఈ ప్రేమను వర్ణించడానికి మాటలు చాలవు. అనుభవిస్తేగాని అర్థం కాదు. ఈ విధంగా ప్రేమరోగంలో మునిగివున్న వాడు పొందిన జీవుడిని వదులుతాడా?

     వాసుదేవస్సర్వం ఇతి స మహత్మా  సుదుర్లభః” అని శ్రీకృష్ణుడు గీతలో నిర్వేదంగా చెప్పిన మాటలను శ్రీభాష్యంలో స్వామి రామానుజులు ఉదాహరించి నమ్మాళ్వార్లు పాడిన ఉణ్ణుం చోరుం పరుగుం నీర్ తిన్నుం వెత్తిలైయుం ఎల్లాం కణ్ణన్”  అని అన్నారు. కృష్ణుడు కోరుకున్నదానికి నమ్మాళ్వార్ల పాట జవాబుగా అమరింది.

శ్రీభాష్యం అర్థం చేసుకోవటానికి, అనుభవం పోందటానికి ఆళ్వార్ల శ్రీసూక్తి అనుభవం ఎంతో అవసరం అని రామానుజులవారు తెలియజేసారు.

ఆళ్వార్ల, ఏమ్బెరుమానార్ల, జీయర్ల శ్రీపాదాలే శరణం.

 

అడియెన్ చూడామణి రామానుజ దాసి

మూలము : https://srivaishnavagranthams.wordpress.com/2018/02/20/dramidopanishat-prabhava-sarvasvam-22/

archived in https://srivaishnavagranthams.wordpress.com/

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org
pramAthA (preceptors) – https://guruparamparai.wordpress.com
SrIvaishNava Education/Kids Portal – http://pillai.koyil.org

 

ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం 21

శ్రీ:  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః   శ్రీమద్వరవరమునయే నమః

ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం

 << ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం – 20

శ్రీభాష్యం మంగళ శ్లోకము-దివ్య ప్రబంధ అనుభవం –రెండవ భాగము

వినత-వివిధ-భూత-వ్రాత-రక్షైక-దీక్షే

పై శ్లోక భాగానికి అర్థమేమిటో చూద్దాం …..

వినత = సమర్పించబడ్డ

వివిధ = వేరువేరుగా ఉన్న (పలు విధాలుగా ఉన్న)

భూత = జీవాత్మలు

వ్రాత = గుంపులు

రక్షైకదీక్షే= వీటి రక్షణ మాత్రమే లక్ష్యంగా ఉన్నవాడు.

        ఇది పరమాత్మకు మాత్రమే అపాదించదగిన మాట, ( పలు విధాలుగా ఉన్న జీవాత్మలను రక్షణ మాత్రమే తమ లక్ష్యంగా కలవాడని అర్థం.

       ఇది రామానుజులు చెప్పిన అర్థం కాదు . శ్రుత ప్రకాశికా భట్టరు, వేదాంత దేశికులు కూడా వేరు వేరు అర్థాలను చెప్పారు.

       సంస్కృతంలో ఈపదాల అర్థం చూద్దాం . ‘ వ్రాత ‘ అన్న పదానికి సమూహ, పరిషత్  అనే పదలు సమానార్థకాలు. ఇది ఒక గుంపు లేక జాతిని తెలియజేస్తుంది. ఉదాహరణకు  బ్రాహ్మాణ సమూహము…. పెద్ద బ్రాహ్మాణ సమూహాలను  బ్రాహ్మాణులు గుంపుగా ఉన్నచోటును తెలియజేస్తుంది. ఈ సమాసపదము షష్టి తత్పురుషలో ఉంది. రాజపరిషత్ అనే మరొక పదము యొక్క అర్థము రాజుల సమూహము. మంత్రులు,  ప్రజలు, వంటి అందరు ఉండి రాజు అధ్వర్యంలో నడుస్తున్నసభ. ఈ సమాసపదము కూడా షష్టితత్పురుషలో ఉన్నా బ్రాహ్మణ సమూహము వంటిది కాదు.

       అందువలన ఇలాంటి పదాలు ఒక సమూహము, గుంపు  అనే అర్థాలనే కాక రాజుకి, మంత్రికి కుడిన వేరు వేరు అర్థాలను తెలియజేస్తాయి.

      ‘వ్రాత’ అన్న పదము దాసుల సమూహాన్ని మాత్రమే కాకా వారితో సబంధం ఉన్న వాటిని కూడా తెలియజేస్తుంది. ‘వివిధ’  అన్న సంకేతం వీటిని చూపిస్తున్నది. అలాంటి దాసులతో సంబంధం గల వేరు వేరు గుణాలు, స్థితులు, విభజనలు కలిగి వుండవచ్చు అని తెలుస్తున్నది. అయినప్పటికీ అలాంటి భేద భావము చూపకుండా పరమాత్మ అందరిని రక్షిస్తున్నాడు .

దీనిని నిరూపించే ప్రమాణమును చూదాము.

పసుర్ మనుష్యపక్షిర్వా ఏ చ వైష్ణవ సమార్చయాః

తేనైవ తే ప్రయాస్యంతి తద్విష్ణోః పరమం పదం !

           ఒక జంతువో, మనిషో, పక్షియొ ఒక వైష్ణవుడి దగ్గర ఆశ్రయం పొందితే ఆ సంబంధం చేతనే ఆ జీవి ఉన్నతమైన పరమపదమును పొందగలడు. మనిషి అన్న ప్రయోగము జంతువులు, పక్షులు మొదలైన వాటి మధ్య ఉండటమే  పై శ్లోకములోని  గొప్పదనము. మనిషి అన్న ప్రయోగము ప్రత్యేకముగా లేదు, కానీ సంబంధము మాత్రమే ముఖ్యము అని తెలుస్తున్నది.  పరమాత్మ వీడు మనిషి తెలివి గలవాడు అనో, ఇవి జంతువులు తెలివి లెనివనో  భావించక సంబంధము మాత్రమే చూసి రక్షిస్తాడు. ‘ఏవ’ అన్న పదము ఇతరములేవి ముఖ్యము కావు  అని తెలియజేస్తున్నది.

          ఈ అర్థము చాలా ముఖ్యము ఎందుకంటే, ఇది పరమాత్మ యొక్క ఉన్నతమైన గుణాలలో ఒకగుణ విశేషణాన్ని తెలియజేస్తుంది. తమదాసులను కూడా దాటి వారి సంబంధీకులకు కూడా తమకరుణను చూపువాడు అని అర్థము . ఈ అర్థమును గ్రహించ కుంటే ‘వివిధ వ్రాత’ అన్న పదాలు అర్థరహితమైపోతాయి .

          ఈ అర్థమే రామానుజులు కోరుకున్నది, దానినే ఆళ్వార్లు కూడా మనసారా తమ పాశురాలలో పాడారు. ఉదాహరణకు ‘పిడిత్తార్ పిడిత్తార్ వీత్తిరుందు పెరియ వానుళ్ నిలావువారే’ (తిరువాయిమోళి 6-10-11 ), “ఏమర్ కీళ్ మెల్ ఎళుపిరప్పుం విడియా  వెన్నరకత్తు ఎన్నుం సేర్దాల్ మారినరే” అని పలు సందర్భాలలో ఆళ్వార్లు చెప్పారు.

శ్రీనివాస…..

          బ్రహ్మసూత్రాలలో ఎక్కడా లక్ష్మి సంబంధం ప్రత్యేకించి చెప్పినట్లు కనపడదు. కానీ   రామానుజులు గ్రంధ సంగ్రహంగా అనుగ్రహించిన ప్రారంభ శ్లోకంలో పరమాత్మ శ్రీనివాసుడని చెప్పారు. ఇది ఆళ్వార్లందరి కంటే ఉన్నతుడైన  పరమాత్మను శ్రీఃయపతిగా దర్శించి నందు వలన, ‘శ్రీ’ లేని స్వామిని దర్శించలేకపోవటం చేత చెప్పి ఉండవచ్చు.

భక్తి రూపా శేముషీ భవతు …..

          జ్ఞానులకు ఇది ఒక విచిత్రమైన ప్రార్థన. శ్రీనివాసుని గురించిన జ్ఞానము వృద్ది చెందాలనో, శ్రీనివాసుని పై నేను భక్తి కలిగి వుండాలనో కాక శ్రీనివాసునిపై నామనసు భక్తిగా మారాలని కోరుకుంటున్నారు.

          ఈ ఒక్క పదంతో రామనుజులు ఆళ్వార్ల నిష్టను గ్రహించి విశిష్టాద్వైత జీవగర్ర లాంటి తత్వాన్ని ప్రవచించారని బోధపడుతుంది . మనకు జ్ఞానమార్గమని భక్తిమార్గమని రెండు మార్గాలున్నాయి. చారిత్రకంగా ఈ రెండు మార్గాలకు ఉన్న భేదాల గురించి విస్త్రుతంగా చర్చించబడింది.  భగవద్రామానుజుల విశిష్టాద్వైత వేదాంతాన్ని భక్తి మార్గమని తప్పుగా నిర్వచించారు.  ఇందులో ఉన్న గందరగోళం ఏమిటంటే భక్తి మార్గము నిస్సారమైన, వదిలి వేయవలసిన జ్ఞాన మార్గములోని భేదము. జ్ఞాన మార్గము భక్తి అనే ఉత్త భావావేశమైనది అని చెప్పవచ్చు.

         విశిష్టాద్వైతం జ్ఞానం మార్గం, భక్తి మార్గం రెండూ  విభిన్నమార్గాలని చెప్పదు, రెండు ఒకటేనని చెపుతుంది. ఆత్మ విషయంలో జ్ఞానం భక్తి రూపమైనది, వేరే రూపమైనది కాదు . అందువలన జ్ఞానము నిస్సారమైన సూత్రాల సమాహారం కాదు.  భక్తి ఉత్త భావావేశమైనది కాదు. నిరతిశయ, నిరవధిక కల్యాణ గుణములతో మన మనసును ఆకర్షించు స్వరూప రూపములతో అందరిని పాలించు ప్రేమ స్వరూపముగా నిర్హేతుకమైన కృపా సముద్రుడు అనే జ్ఞానమే భక్తి .

         భక్తి అంటే పక్వముకాని జ్ఞానహీనుల కోసం ఏర్పాటైన మార్గమని లోకంలో ఒక అపప్రద ఉంది (తాము జ్ఞానవంతులమన్న ఊహ వలన ఇటువంటి ప్రచారము చేసారేమో). ఇది వారు తమను తాము గొప్పగా భావించి చెప్పుకున్న విశేషములు. దీనికి శాస్త్రములో ప్రమాణములు లేవు అని సప్రమాణముగా చెప్పవచ్చు. ఇదే ఆళ్వార్ల ‘మదినలం’ అన్న మాట యొక్క అర్థము .

   

 

రామానుజుల ‘శేముషీ’ ….అమరకోశములో ‘మది’,  ‘శేముషీ’ రెంటికి ఒకే అర్థము చెప్పబడింది. ‘నలం’ (మంచి) అంటే భక్తి .  ఆళ్వార్లు, పరామాత్మ తమకు చేసిన ఉపదేశాల వలన జ్ఞానము జనించింది, భక్తి అంటే పరామాత్మను గురించిన జ్ఞానము అని అంటున్నారు. ఆళ్వార్లు చూపిన మార్గాన్ని రామానుజులు గట్టిగా పట్టుకున్నారు, లోకానికి ప్రకాశవంతమైన మార్గాన్ని చూపించారు, ఆళ్వార్లు వారికి మర్గానిర్దేశకులుగా నిలిచారు.

 

అడియెన్ చూడామణి రామానుజ దాసి

మూలము : https://srivaishnavagranthams.wordpress.com/2018/02/19/dramidopanishat-prabhava-sarvasvam-21/

archived in https://srivaishnavagranthams.wordpress.com/

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org
pramAthA (preceptors) – https://guruparamparai.wordpress.com
SrIvaishNava Education/Kids Portal – http://pillai.koyil.org

ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం 20

శ్రీ:  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః   శ్రీమద్వరవరమునయే నమః

ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం

 << ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం – 19

శ్రీభాష్యం మంగళ శ్లోకము – దివ్య ప్రబంధ అనుభవం – మొదటి భాగము

భగవద్రామానుజులు తమ శ్రీభాష్యం ప్రారంభంలో ఈ మంగళ శ్లోకాన్ని చెప్పి ప్రారంభించారు.

అఖిలభువనజన్మ స్తేమభంగాదిలీలె

వినతవివిధభూతవ్రాతరక్షైకదీక్షే!

శృతిశిరసి విధీప్తే బ్రాహ్మణి శ్రీనివాసే

భవతు మమ పరస్మిన్ శేముషీ భక్తిరూపా!

           మహాచార్యులైన భగవద్రామనుజుల వారి శ్రీసూక్తిగా వెలువడిన ఈ శ్లోకం సకల భక్త గోష్టికి సదా సర్వదా  అమృతతుల్యము. ఇది భక్తుల హృదయాలలో భక్తి రూపాపన్న జ్ఞానాన్ని నిలుపుతుంది.

ఈ శ్లోకానికి ఆళ్వార్లు అనుగ్రహించిన ప్రబంధాలు, ఆచార్యుల శ్రీసూక్తులు  మూలాధారంగా చెప్పవచ్చు. ముందుగా ఆళ్వార్ల ప్రబంధాలకు ఈ శ్లోకానికి ఉన్న సంబంధాన్ని చూద్దాం.

పరమాత్మ జగత్సృష్టి, స్థితి, సంహారాలను లీలగా చేస్తున్నాడని చెప్పే ‘అఖిలభువనజన్మ స్తేమ భంగాదిలీలె’ అన్న శ్లోక భాగంలోని మాటలు బ్రహ్మసూత్రాలలోని రెండవదైన

‘జన్మాద్యస్య యతః’

అని, ఆ సూత్రంమే

‘యతోవా ఇమాని భూతాని జాయంతే’

అనే ఉపనిషత్ వాక్యం యొక్క మూలం అన్నది  స్పష్టంమవుతున్నది. స్తేమ అన్న పదం రక్షణ, దీర్గ కాలము నిలిపి వుంచుట అన్న అర్థాన్నిస్తాయి. ఇందులో పరమాత్మ తత్వమైన లోక రక్షణత్వము  కూడి వుంది. ఇలా రక్షణ గురించి రామానుజులు ఇంతకు ముందే చెప్పారు. మళ్ళీ

‘వినత వివిధ భూత వ్రాత రక్షైక దీక్షే’

అన్నారు. శ్రీనివాసుడి లక్ష్యము తన భక్తులను రక్ష్మించటమే అని తెలుస్తున్నది.

శ్లోకం మొదటి భాగంలోనే  చెప్పబడిన ఈ  రక్షణత్వము మళ్ళీ ఎందుకు చెప్పారు?

మన ఆచార్యులు ఎప్పుడు ఏది చెప్పిన శృతి ప్రమాణము తోనే చెపుతారు. ఇక్కడ రామానుజుల ఈ పద ప్రయోగం చూసినప్పుడు దీని మూలం ఆళ్వార్ల పాశురాలలో కనపడుతుంది.

తిరువాయిమోళి 1 – 3- 2 లో   ‘ఎళివరుం ఇయల్వినన్’ అన్న  పాశుర భాగంలో నమ్మళ్వార్లు పరమాత్మ గుణానుభవము చేశారు.  ఆయన యొక్క అప్రాకృత, అసంఖ్యాక, కల్యాణ గుణములను అనుభవిస్తున్నారు.  ఇంకా అయన మోక్షప్రదత్వమును ‘విడాన్ తెళితరు నిలైమై అదు ఒళివిలన్’ అన్నారు.

ఇంతకు ముందే చెప్పిన గుణాలతో ఇది కూడా చేరి వుంటుంది కదా! మళ్ళి చెప్పాలా! అన్న ప్రశ్నకు మన పూర్వాచార్యులు మోక్షప్రదత్వము పరమాత్మ గుణాలలో అత్యున్నత మైనదని అందువలన ఇక్కడ పునరుక్తి దోషము రాదని వివరించారు. ఆళ్వార్లు రెండవ పత్తులో  ‘అణైవదరవణైమేల్’ అని మోక్షప్రదత్వాన్ని   అనుభవించారు. స్వామి దేశికులు కూడా ద్రమిడోపనిషత్ తాత్పర్య రత్నావళిలో  తిరువాయిమోళి యొక్క  ప్రధానఉదేశ్యము  మోక్షప్రదత్వము అని చెప్పారు. అందువలన పరమాత్మ కున్న మోక్ష ప్రదత్వము అనే గుణము విడిగా అనుభవించదగినది అని చెపుతున్నారు. ఇక ‘వినత వివిధ భూత వ్రాత రక్షైక దీక్షే’ అన్న ప్రయోగంలో రక్షకత్వము అంటే సామాన్యఅర్థంలో కాక మోక్షప్రదత్వము అని బోధపడుతుంది.

వాదికేసరి అళగియ మనవాళ జీయర్ స్వామికి ముందు ఎవరూ తమ సంస్కృత రచనలలో ఆళ్వార్ల శ్రీసూక్తులను ప్రమాణంగా చూపలేదు కావున ఇక్కడి శ్రీభాష్య పంక్తిలో శ్రుత ప్రకాశికాభట్టరు, ‘జగదుద్భవ – స్థితి – ప్రణాశ – సంసార విమోచన‘ అని ఆళవందార్లను ఉదాహరించారు.

అడియెన్ చూడామణి రామానుజ దాసి

మూలము : https://srivaishnavagranthams.wordpress.com/2018/02/18/dramidopanishat-prabhava-sarvasvam-20/

archived in https://srivaishnavagranthams.wordpress.com/

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org
pramAthA (preceptors) – https://guruparamparai.wordpress.com
SrIvaishNava Education/Kids Portal – http://pillai.koyil.org

 

ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం 19

శ్రీ:  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమద్వరవరమునయే నమః

ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం

 << ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం – 18

దివ్య ప్రబంధ(అరుళిచ్చెయల్) అనుసంధానం

దివ్య ప్రబంధము (అరుళిచ్చెయల్) మీద మన ఆళ్వార్లకు ఆచార్యులకు అసమాన్యమైన అభిమానం ఉన్నదన్న విషయం విదితమే. పండితులు, పామరులు అన్న భేదం లేకుండా కోవెలలో స్వామి సన్నిధిలో, వీధిలో జరిగే శోభాయాత్రలో పెరుమాళ్లకు ముందు నడిచే గోష్టి దివ్య ప్రబంధాన్ని సేవించడం మనకు తెలిసిన విషయమే . దివ్య ప్రబంధాన్ని నేర్చుకున్న పెద్దలు అలా వీధిలో పరమాత్మా ముందు సేవిస్తూ గోష్టిగా నడుస్తుంటే ఆ ఆనందం చెప్పనలవి కాదు, చూసిన కళ్ళదే భాగ్యం కదా! దివ్యప్రబంధ పారాయణమే ఆ స్వామి వీనులకు విందైనదని మన పూర్వాచార్యులు తెలుసుకొని ఈ ఏర్పాటును చేశారు. ఈ ఏర్పాటుకు ఎప్పుడైనా విధి వశాత్తు భంగం వాటిల్లినా అతి త్వరలో మళ్ళీ జరిపించెందుకు తగిన ఎర్పాట్లు చేశారు. శ్రీవైష్ణవులైన వారందరు  ఈ కైంకర్యాన్ని కోరుకుంటారు.

                కోవెలలలో నిర్వహించే అన్ని కైంకర్యాలలో ఆళ్వార్లు అనుగ్రహించిన ప్రబంధాల ప్రాముఖ్యతను గురించి మన ఆచార్యులు ఎంతగానో కీర్తించారు. అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ తమ ఆచార్య హృదయంలో ఈ పద్దతుల గురించి చక్కగా వివరించారు. శ్రీ వేదాంత దేశికులు కూడా ఇలాంటి ప్రబంధ గోష్టులను ఆదరించి తాము  కూడా అందులో పాల్గొన్నట్లు తెలుసున్నది. మన ఆచార్యులు దివ్య ప్రబంధానికి చేసిన విపులమైన వ్యాఖ్యానాల ద్వారా వారికి  ఆళ్వార్ల మీద, వారు పాడిన పాశురాల మీద ఎంత భక్తి, ఆదరాలు ఉన్నాయో,  అలాగే ఆళ్వార్ల, వారి పాశురాల ప్రభావం ఆచార్యుల మీద ఎంత ఉందో తెలుస్తుంది. దివ్య  ప్రబంధానికి శ్రీవైష్ణవం, విశిష్టాద్వైతం అంటే అతిశయోక్తి కాదు. ఆచార్యుల గ్రంధాలను చూస్తేనే ఈ విషయం బోధపడుతుంది.

          దివ్య ప్రబంధ వ్యాఖ్యానాలు, గురుపరంపరా ప్రభావం మొదలైన గ్రంధాలలో చూపిన ఐతిహ్యాల నుండి భగవద్రమానుజుల వంటి ఆచార్యులు, సంస్కృతంలో వేదాంత గ్రందాల రచనలు చేసిన ఆచార్యులకు వీటి మీద ఎంత గొప్ప ఆసక్తి ఉందో తెలుసుకోవచ్చు. భగవద్రమానుజుల సమకాలీనులు, కూరత్తాళ్వాన్ల శిష్యుడు అయిన శ్రీ తిరువరంగత్తముదనార్లు భగవద్రమానుజుల గురించి రాసిన ‘రామానుజ నూత్తందాది’ భగవద్రమానుజులకు దివ్య ప్రబంధం మీద వున్న అపారమైన పట్టును, ప్రేమను తెలియజేస్తుంది.  ఈ పాశురాలను తప్పక నేర్చుకోవాలా! అన్న ప్రశ్నకు తావే లేదు. వాటిని అర్థంతో నేర్చి, ఇతరులకు  చెప్పి అనుభవించినప్పుడే జీవితానికి అర్థం పరమార్థం దక్కుతుంది అనడంలో సందేహం లేదు.

ప్రతి పనిని విమర్శించేవారు కూడా ఉంటారు కదా! కొందరు వ్యక్తులు, కొన్ని సమూహాలు, అసత్య వాదాలు, అర్థ రహిత వాదాలు చేయటం లోకంలో కనపడుతుంది. సాంప్రదాయ పద్ధతులను వివరించేటప్పుడు వీటికి వేద ప్రమాణాలు లేవని వాదిస్తారు. ఇలాంటి శుష్క వాదాలు చేసేవారు వేదంలోని అంతరార్థాలను ఎరుగరు. కానీ వారి వాదనలను వాక్చాతుర్యంతోను, తప్పుడు వాదాలతోనూ నోరు మూయించాలని ప్రయత్నిస్తారు. వేదాలపై  అధిపత్యం లేను వారిని బెదిరించి అదలించి గందరగోళ పరచి నోరుమూయిస్తారు.

ఆగమాలు, వేదాలు నేర్వకుండానే కొందరు కోవేలలో విగ్రహా ప్రతిష్టకు ఆదారాలే లేవంటారు. ఎంతో కొంత నేర్చినవారు తాము ఏది మాట్లాడిన చెల్లుతుందని తమకు ఆ అధికారం ఉందని భ్రమ పడతారు. మన ఆచార్యులు ఎందుకు చెపారు? ఏమి చేశారు, అని లోతుగా తెలుసుకోకుండా నోటికి వచ్చింది చెప్పటం, చేతికి వచ్చింది రాయటం మంచిది కాదు, అది వినాశ హేతువవుతుంది.

ఒక వైపు దివ్యప్రబంధము మీద మన ఆచార్యుల వ్యాఖ్యానాలు మేరుసమానంగా ఉండగా ‘దివ్యప్రబందానికి ఏ మహిమ లేదు’ అని చెప్పేవారి గోష్టి కూడా ఉంది. కోవెలలో దివ్య ప్రబంధము సేవించటం అనూచానంగా వస్తున్నఆచారమని తెలిసినా, దానికి చారిత్రక ఆధారాలు ఉన్నా, వాటికి సంబంధించిన వివరాలు రామానుజుల వారి గ్రంధాలలో ఉన్నా, అలాగా ఎక్కడ ఎవరు చెప్పలేదని వితండ వాదం చేసేవారున్నారు.

ఇది ఒక గుడ్డి వాదన. రామానుజులు రాసిన తొమ్మిది గ్రంధాలలో ఏది వారు ప్రత్యక్షంగా శిష్యులకు బోధించ లేదు, కానీ అందులో చెప్పిన విషయాలు వారి శిష్యప్రశిష్యులు ఆచరించారు, ఇప్పటికి అవి కొనసాగుతూ వస్తున్నాయి. నిత్య గ్రంధం ఒక్కదానిలోనే స్వామి ఆజ్ఞాలను మనం చూడగలుగుతున్నాము. ఇది వారి చివరి గ్రంధము. ఇందులో కోవెలలో నిర్వహించవలసిన కైంకర్య విధానాలను వివరించారు.

స్వామికి దివ్యప్రబంధం మీద అపారమైన భక్తి , ప్రేమ ఉండటం వలన వారు తమ గ్రంధాలలో దివ్య ప్రబందానికి సముచిత స్థానాన్ని ఇచ్చారు. దివ్యప్రబంధం వీనుల విందైనది (సేవిక్కినియ సెంజొల్) అని ప్రసిద్ది గాంచినది. నమ్మాళ్వార్ల తిరువాయిమోళి 10 -6-11 లో ‘కేట్పార్ వానవర్ గళ్ సేవిక్కినియ సెంజొలే’ అని అన్నారు.

నమ్మాళ్వార్ల తిరువాయిమోళి తోనే నిరంతరం మునిగి వుండే స్వామి, ‘శ్రీ సూక్తైః స్తోత్రైః అభిస్తూయ’ అని అన్నారు. అది ఒక శబ్ద ప్రవాహము  అది స్తోత్రం, ఎదో ఒక స్తోత్రం కాదు  శ్రీ సూక్తి స్తోత్రం …….చేవులకింపైనది.

భగవద్రామానుజులు తమకు ఆళ్వార్ల శ్రీసూక్తులపై ఉన్న అధికారం, మమకారం ప్రకటితమయ్యేట్టుగా వీటిని ఆళ్వార్ల పాశురాలు అనకుండా ఆళ్వార్లె  పేర్కోన్నట్టుగా ‘చెవికింపైన మంచి మాటలు’ అనేవారు.

అడియెన్ చూడామణి రామానుజ దాసి

మూలము : https://srivaishnavagranthams.wordpress.com/2018/02/17/dramidopanishat-prabhava-sarvasvam-19/

archived in https://srivaishnavagranthams.wordpress.com/

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org
pramAthA (preceptors) – https://guruparamparai.wordpress.com
SrIvaishNava Education/Kids Portal – http://pillai.koyil.org