Category Archives: sath sampradhAya sAram

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 55

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 54

ఎఱుంబి అప్పా అక్కడ ఉన్నంత కాలం, ఈ శ్లోకములో చెప్పిన విధంగా…

ఇత్తం ధినే ధినే కుర్వన్వృత్తిం పద్యుః ప్రసాధినీం
కృతీర్ కడాపదం చక్రే ప్రక్తనీం తత్ర వర్తనీం
ఇత్తం ధినే ధినే కుర్వన్ విరుత్తం భర్తుః ప్రసాధినీం
కృతి కణ్టా పదఞ్జచక్రే ప్రాక్తనీం తత్ర వర్తనీం

(ఈ విధంగా, సన్నిధిలో [తిరుమలైయాళ్వార్] కైంకర్యం చేస్తూ, తమ ఆచార్యులైన మణవాళ మాముణుల దివ్య మనస్సుని ప్రసన్న పరచే కైంకర్యములను నిత్యం నిర్వహిస్తూ, దినచర్యను (మణవాళ మాముణుల నిత్య దినచర్య వివరణ) కృపచేసి, అక్కడ నిత్యం అందరూ పఠించేలా చేశారు. మహా రాజు రహదారిలా ప్రసిద్ధికెక్కించారు.

వరవరమునిర్ పాదయుగ్మం వరదగురోః కరపల్లవ ద్వయనే
రహసి శీరసిమే నిధీయమానం మనసినిదమ్య నిధానవాన్ భవామి

(కందాడై అణ్ణన్ తమ లేత హస్థములతో మణవాళ మాముణుల పాదపద్మములను తమ శిరస్సుపై ఉంచుకునే ఆ దృష్యాన్ని స్మరణ చేస్తూ జీవించుటకు శక్తిని పొందుతున్నాను), తమ దివ్య చరణాలను అణ్ణన్ కు సమర్పించి “మీ స్వస్థలానికి వెళ్లండి” అని అన్నారు. అప్పా బాధతో ఎఱుంబికి బయలుదేరారు.

నాయనార్ ఏడు గొత్రాలను క్రమపచుట

అప్పా ఎఱుంబికి బయలుదేరే ముందు, శ్రీరంగంలో ఒక సంఘటన జరిగింది. అప్పాకి సంబంధించిన కందాడై ఆండాన్ సంబంధీకులు (అత్తవారి తరపున వారు) కొందరు, కందాడై నాయన్ ధర్మ పత్నిని ఆమె పుట్టింటి నుండి కందాడై ఆండాన్ తిరుమాలిగకి తీసుకువచ్చారు. వారు ఆమెను సరైన వాహనంలో తీసుకురాకపోవడం చూసి అప్పా బాధపడి, జీయరుతో తమ బాధను పంచుకున్నారు. జీయర్ కూడా దుఃఖపడ్డారు. వారు కందాడై అణ్ణన్ ను పిలిచి ఇది సరి కాదు, వారిని త్యజించడం మంచిదని అన్నారు. “వారి స్వరూపమును గురించి వారికి ఉపదేశించ గలమా?” అని కోరారు. “వారు ఎంబా దగ్గరి బంధువులు, అహంకారులు” అని అణ్ణన్ బదులిచ్చారు. “అలాగైతే, ఇక మనం ఆలోచించ వద్దు” అని పలికి, కందాడై ఆండానుతో పాటు వారి బంధువులను, ముదలియాండాన్ వంశస్థులను పిలిచి, వారికి శాస్త్ర సూచనలను ఉపదేశించి వారిపై తమ కరుణను కురిపించారు. తరువాత వారికి ఒక శాస్త్ర విధి గురించి వివరణ ఇచ్చారు. వాదూల గోత్రం (ముదలియాండాన్ వారి గోత్రం), హారీత గోత్రం (రామానుజుల వారి గోత్రం) వాళ్ళు, వారి వారసులు 7 గోత్రాల (వాదూల, శ్రీవత్స, కౌండిన్య, హారీత, ఆత్రేయ, కౌశిక, భారద్వాజ) వారిని మాత్రమే వివాహం చేసుకోవాలని వివరించారు. తమ ఈ నియమావళికి సంబంధించిన ఒక వ్రాత పత్రం తయారు చేసి, తిరుమంగై మన్నన్ తిరుమాలిగ (తిరుమంగై ఆళ్వార్ల దివ్య నివాసం) లో ఒక ఫలకాన్ని తయారు చేసి, ఈ గోత్రాలకు చెందిన వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నరో ఆయా ప్రాంతాలకు సందేశాన్ని పంపారు. ఈ చర్యతో ఎఱుంబి అప్పా సంతోషించేలా చేసారు. ఈ సమయంలో, వారి దివ్య తిరువడి పట్ల ప్రతికూలంగా ఉండేవారందరూ, వారి గురించి చెడుగా మాట్లాడేవారందరూ, పేదరికంతో బాధపడుతూ తమ జీవితాలను వృధా చేసుకున్నారు.

ఒక రోజు, జీయర్ తమ శిష్యులతో  “ఆలిన్మేలాల్ అమర్ న్దాన్ అడియిణైగళే” అనే పాశురం గురించి చర్చిస్తున్నారు; ‘ఆల్’ అనే పదం రెండు చోట్ల వస్తుంది. ఆ పదం ఒక సారి మర్రి చెట్టును, మరొక సారి లేత మర్రి ఆకుని సూచిస్తుందని వారు చర్చించుకుంటున్నారు. కానీ జీయర్ దయతో, ‘ఆల్’ అనే పదం ఆకును సూచించదని అన్నారు. అదే సమయంలో, ఆడుతూ పాడుతూ చిన్నపిల్లలా కనిపించే కందడై నాయన్, “ఓ జీయార్! ఆలంగట్టి (వడగళ్ల వాన) ని సూచిస్తుందా?” అని తమాషాగా అన్నాడు. వెంటనే, జీయర్ అతన్ని పిలిచి తన ఒడిలోకి తీసుకుని, “నీవు పూజ్యనీయమైన వంశానికి చెందినవాడవు కదా?” అని అడిగారు. అతనిని దర్శన ప్రవర్తకుడు (రామానుజ సిద్ధాంతానికి నాయకుడు) కామని ఆశీర్వదించారు.

మూలము: https://srivaishnavagranthams.wordpress.com/2021/09/10/yathindhra-pravana-prabhavam-55/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

శ్రీ రామానుజ వైభవము

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః  శ్రీ వానాచల మహామునయే నమః

ఎంపెరుమానార్లు మన సంప్రదాయానికి చేసిన ఎనలేని కృషిని ప్రతి ఒక్కరూ చిరకాలము గుర్తుంచుకునేలా స్వయంగా శ్రీ రంగనాథుడు మన సత్ సంప్రదాయానికి ఎంపెరుమానార్ దరిశనము (రామానుజ దర్శనం) అని నామకరణము చేశారు, అని మాముణులు ఉపదేశ రత్నమాలలో తెలియజేశారు. శ్రీరామానుజులు ఈ సత్ సంప్రదాయానికి స్థాపకులు కాదు, ఈ సంప్రదాయానికి వారు ఏకైక ఆచార్యులు కాదు. కానీ వారు ఈ సంప్రదాయాన్ని ముందుండి దృఢంగా మర్గదర్శకత్వము వహించి నిత్యము వర్ధిల్లేలా చేశారు, ఈ కారణంగా వారు గొప్పగా కీర్తింపబడ్డారు. వారు చేసిన కృషి ఎంత అపారమైనదంటే, మనము ఎంతో ప్రయత్నిస్తే , ఎంపెరుమానార్ల మహిమలను కొంత వరకు సంగ్రహించి అర్థం చేసుకోవడానికి సాధ్యము కావచ్చు. కానీ కీర్తి ప్రతిష్ఠల గురించి వివరించుట ఎవరికైనా కష్టమే. కానీ మన అద్భుతమైన గురువు పరంపర ద్వారా వారి సంబంధము కలిగి ఉండటం మన అదృష్టం, ఆ శక్తితో ఎంపెరుమానార్ల  మహిమలను కొద్ది కొద్దిగా ఆనందిద్దాం.

జన్మము మరియు ప్రారంభ రోజులు

ఈ ప్రసిద్ధమైన శ్లోకములో “అనంతః ప్రథమమ్ రూపం లక్ష్మణశ్చ తతః పరం బలభద్రః తృత్ల్యస్తు కలౌ కశ్చిద్ భవిష్యతి”,

ఈ శ్లోకములో అనేక యుగాలలో ఆదిశేషుని అనేక అవతారాల గురించి వివరించబడింది, వారి కలియుగ అవతారం గురించి కూడా సూచించబడింది. శ్రీరామనుజులు ఆదిశేషుని కలియుగ అవతారమని చరమోపాయ నిర్ణయంలో వివరించబడింది.

రామానుజ నూఱ్ఱందాదిలో, “మణ్మిశై యోనిగళ్ తోఱుం పిఱంతు ఎంగళ్ మాధవనే కణ్ణుఱ నిఱ్కిలుం కాణగిల్లా ఉలగోర్గళెల్లాం అణ్ణల్ ఇరామానుశన్ వందు తోన్ఱియ అప్పొళుతే నణ్ణరు జ్ఞానం తలైక్కొణ్డు నారణఱ్కాయినరే” అని అముదనార్లు ఎంబెరుమానుడి అవతారము కంటే ఎంపెరుమానార్ల అవతారము గొప్పదని కీర్తుంచారు. మాముణులు ఈ విషయాన్ని, “మనందరి స్వామి అయిన శ్రీమన్నారాయణుడు ఈ భూమిపైన అనేక అవతారములెత్తినప్పటికీ, ఈ లోక వాసులు అతడిని స్వామిగా స్వీకరించలేదు. కానీ ఈ ప్రపంచంలో ఎమ్పెరుమానార్లు అవతరించిన వెంటనే (శ్రీభాష్యం మొదలైనవి వివరించి), ప్రపంచ ప్రజలు వాస్థవ జ్ఞానాన్ని అర్థం చేసుకొని భగవానుడికి దాసులైనారు.

మాముణులు కూడా తమ ఆర్తి ప్రబంధంలో శ్రీ రామానుజుల జన్మని ఇలా కీర్తించారు, “ఎనైప్పోల్ పిళై సెయ్వార్ ఇవ్వులగిల్ ఉణ్డొ, ఉనైప్పోల్ పొఱుక్క వల్లార్ ఉణ్డో అనిత్తులగుం వాళప్పిఱంత ఎతిరాశ మామునివా ఏళైక్కు ఇరంగాయ్ ఇని”. అనగా “తప్పులు చేసే నా వంటివాడు మరొకడు ఉన్నాడా,  వాటిని క్షమించే మీ వంటి వారు మరొకరెవరైనా ఉన్నారా?  అందరి ఉద్ధరణకై అవతరించిన ఓ యతులకు రాజా! దయచేసి నాకు సహాయం చేయండి”.

వీటి నుండి, భగవద్ రామానుజులు మనందరి కష్టాలను తొలగించి, మనల్ని ఉద్దరించి ఆధ్యాత్మిక లోకంలో మనచే భగవానుడి నిత్య సేవ చేయించడానికి అవతరించారని మనం అర్థం చేసుకోవచ్చు.

వారు కేశవ సోమయాజి, కాంతిమతి అమ్మలకు కుమారుడిగా జన్మించారు. వారి మేన మామగారు అయిన పెరియ తిరుమలై నంబి “ఇళైయాళ్వార్” అని వారికి నామకరణము చేసి, తాప సంస్కారము నిర్వహించి శ్రీవైష్ణవంలోకి ప్రవేశింపజేశారు.

తమ ప్రారంభ రోజుల్లో, వారు యాధవప్రకాశుల వద్ద వేదాంతం అభ్యసించారు, వారు “భేదాభేదం” సిద్దాంత  ప్రతిపాదకులు (ఒకే సమయంలో బ్రహ్మం/ఆత్మ  విభిన్నమైనవి మరియు ఏకమైనవి కూడా). ఒక ప్రశ్న తలెత్తవచ్చు – వారు వేరే సిద్ధంతపు పండితుల వద్ద ఎందుకు అభ్యాసము చేశారు అని? ఎందుకంటే, వాళ్ళ తత్వశాస్త్రాన్ని పూర్తిగా అర్థం చేసుకొని, వారి లోపాలను బయటపెట్టి, విశిష్ట అధ్వైత సిద్దాంత విధానాన్ని స్థాపించడానికి వారు అలా చేశారని మన పెద్దలు వివరించారు. ఈ సూత్రాన్ని అర్థం చేసుకోవడానికి పెరియవచ్చాన్ పిళ్లై తమ ఆచార్యులైన నంపిళ్ళైలను పెరియ తిరుమొళి 5.8.7 వ్యాఖ్యానములో కీర్తించిన విధానాన్ని మనము గమనించాలి. వారు “అంతణన్ ఒరువన్” (అద్వితీయ బ్రహ్మణ) అని వివరిస్తూ ఇలా అన్నారు – “ముఱ్పడ ద్వయత్తైక్కేట్టు, ఇతిహాస పురాణంగళైయుం అతిగరిత్తు, పరపక్ష ప్రతిక్షేపత్తుక్కుడలాగ న్యాయమీమాంసైకళుం అతిగరిత్తు, పోతుపోక్కుం అరుళిచెయలిలేయాంపడి పిళ్ళైయైప్పోలే అతిగరిప్పిక్క వల్లవనైయిరే ఒరువన్ ఎన్బతు”, ఎవరైతే పప్రథమంగా ద్వయం అనుసందానము చేసి, తరువాత ఇతర సిద్దాంతముల చర్చలలో నెగ్గడానికి పురాణాలు, ఇతిహాసాలు, న్యాయం, మీమాంసము నేర్చుకుంటారో, ఆళ్వార్ల అరుళిచ్చెయల్ని (దివ్య ప్రబందాలను) వాటి అర్థములను నేర్చుకుంటూ మరియు బోధిస్తూ నంపిళ్ళై వారిలా తమ సమయాన్ని గడుపుతారో, వారిని విశిష్ట పండితుడని చెప్పవచ్చు). దీని నుండి మనం మన సిద్ధాంతాన్ని స్థాపించడానికి పూర్వ పక్షాన్ని (ఇతర తత్వవేత్తల వాదనలు) నేర్చుకోవడం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవచ్చు.

యాదవప్రకాశుల వద్ద శ్రీ రామానుజుల విధ్యాభ్యాస సమయంలో, వారి మధ్య కొన్ని విభేదాలు తలెత్తుతాయి. తత్వశాస్త్రంలో రామానుజులకి ఉన్న అపారమైన జ్ఞానం, ఇతరులకు వివరించే సామర్థ్యం కారణంగా కూడా వారు ప్రజాదరణ పొందసాగారు, ఈ కారణంగా శ్రీ రామానుజుల ప్రసిద్దిని వారు సహించలేక యాదవ ప్రకాశుల శిష్యులు కాశి యాత్రలో వారిని చంపాలని కుట్ర పన్నారు. కానీ సరైన సమయములో గోవిందులు (భవిష్యత్తులో ఎంబార్ అవుతారు) ఇచ్చిన సూచనతో, శ్రీ రామానుజులు వారి పన్నాగం నుండి తప్పించుకుంటారు. అడవిలో దారి తప్పిన శ్రీ రామానుజులకు సహాయం చేయడానికి బోయవాడి వేషంలో శ్రీ వరదరాజ పెరుమాళ్ (దేవ పెరుమాళ్) పెరుందేవి తాయర్లు వచ్చి తిరిగి వారిని కాంచీపురానికి చేర్చుతారు.

పంచ సంస్కారము

ఈ సమయంలో, శ్రీ రామానుజులు కాంచీపురంలో దేవ పెరుమాళ్ళ అంతరంగ సేవకుడైన తిరుక్కచ్చి నంబిని కలుసుకుంటారు. పూవిరుందవల్లి గ్రామస్థులైన వారు దేవ పెరుమాళ్ళకి క్రమం తప్పకుండా వింజామర సేవని అందిస్తుండేవారు. వారు యామునాచార్యుల ప్రియ శిష్యులు. దేవ పెరుమాళ్ళకు నంబి పట్ల ఉన్న గొప్ప అనుబంధం కారణగా వారితో నిత్యము సంభాషించేవాడు. శ్రీ రామానుజులు నంబి ఆదేశాన్ని స్వీకరించి, సమీపంలో ఉన్న బావి నుండి ప్రతిరోజూ దేవ పెరుమాళ్ళ కోసం నీరు తీసుకువచ్చే కైంకర్యాన్ని చేయ సాగారు. ఇప్పటికి, శ్రీ రామానుజులకు రక్షకాంబతో వివాహమై కాంచీపురంలో స్థిరపడ్డారు. వారిలో కొన్ని సందేహాలు తలెత్తినప్పుడు  దేవ పెరుమాళ్ళతో స్పష్టం చేయాలనుకొని, ఆ సందేహాలకు (అవి ఏమిటో చెప్పకుండా) సమాధానాలు పెరుమాళ్ళను అడిగి చెప్పమని నంబిని అభ్యర్థిస్తారు. నంబి శ్రీ రామానుజులు స్థితిని పెరుమాళ్ళకి వివరిస్తారు, పెరుమాళ్ళు నంబి ద్వారా శ్రీ రామానుజులకు 6 సూచనలు (ఆరు వార్తలు) అందిస్తారు. అవి:

  • నేను సర్వోన్నతుడిని
  • జీవాత్మ (ఆత్మ) మరియు పరమాత్మ (భగవానుడు) భిన్నమైనవి, ఒకటి కాదు
  • పూర్ణ శరణాగతియే నన్ను పొందే సాధనము
  • అలాంటి శరణాగతి చేసిన వ్యక్తి వారి ఆఖరి క్షణాల్లో నన్ను స్మరించాల్సిన అవసరం లేదు (నేను వారిని స్మరిస్తాను)
  • ఈ జన్మ తరువాత శరణాగతి చేసిన ఆ వ్యక్తి మోక్షాన్ని పొందుతాడు
  • మహా పూర్ణ (పెరియ నంబి) స్వామిని ఆచార్యులుగా స్వీకరించు

ఈ సంఘటన శ్రీ రామానుజుల జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు తీసుకుంది.

తిరుక్కచ్చి నంబి దేవ పెరుమాళ్ళ ఈ ఆరు సూచనలను (వార్తలను) శ్రీ రామనుజులకి వివరించి, వారి మనస్సులో ఉన్న సందేహాలకి సమాధానములు దొరికాయా అని అడుగుతారు. శ్రీ రామనుజులు నంబికి తమ ప్రణామాలు సమర్పించుకొని, దొరికాయని ధృవీకరిస్తారు. పెరుమాళ్ళు మరియు శ్రీరామనుజుల దివ్య మనస్సుల సమకాలీకరణకు నంబి ఆశ్చర్యపోతారు. ఈ వార్తలను విన్న తర్వాత, శ్రీరామనుజులు పెరియ నంబిని కలవడానికి శ్రీరంగానికి బయలుదేరారు.

నాథమునుల మనవడు అయిన అళవందార్ల (యమునాచార్యులు) ప్రధాన శిష్యులు పెరియ నంబి. దీనికి ముందు, సంప్రదాయానికి మొట్టమొదటి ఆచార్యులుగా ఉన్న అళవందార్లు, ఒకానొక సమయంలో కాంచీపురానికి వెళ్ళినపుడు కొంత దూరము నుండి శ్రీ రామరాజులను చూసి గొప్ప బోధకుడు కావాలని ఆశీర్వదిస్తారు. శ్రీ రామరాజులు కూడా, అళవందార్ల గురించి విన్న తరువాత, వారి శిష్యులు కావాలనుకున్నారు. కానీ అళవందార్లని కలుసుకోవాలని వారు శ్రీరంగము కావేరీ నది ఒడ్డుకి చేరే సమయానికి, మూడు నెరవేరని కోరికలతో అళవందార్లు పరమపదానికి చేరుకుంటారు. అవి 1) వ్యాస మరియు పరాశర ఋషుల పట్ల కృతజ్ఞత చూపించడం, 2) నమ్మాళ్వార్లకి కృతజ్ఞతలు, 3) బ్రహ్మ సూత్రానికి భాష్యము వ్రాయడం. మూడు ముడుచుకున్న వేళ్లతో అలవందార్ల దివ్య చరమ తిరుమేనిని చూసినప్పుడు, శ్రీరామరాజులు ఆ కోరికలను నెరవేరుస్తానని ప్రతిజ్ఞ చేస్తారు, వెంటనే ముడుచుకున్న వేళ్లు విప్పుకుంటాయి. ఆ తర్వాత శ్రీరామరాజులు నిరాశగా కాంచీపురానికి తిరిగి వచ్చి తన కైంకర్యాన్ని కొనసాగించ సాగారు. అనంతరం శ్రీరంగంలోని శ్రీవైష్ణవులు పెరియ నంబిని శ్రీ రామరాజులకు సంస్కారము గావించి సంప్రదాయ తదుపరి నాయకుడిగా తీర్చి దిద్దమని వారిని ప్రార్థించారు. పెరియ నంబి, శ్రీ రామరాజులను తన శిష్యుడిగా చేర్చుకోవాలనే ఉద్దేశ్యంతో కాంచీపురానికి బయలుదేరారు.

వారిద్దరూ కాంచీపురానికి దగ్గరగా ఉన్న మధురాంతకం అనే పట్టణంలో కలుసుకుంటారు. శ్రీ రామరాజులు ఏరికాత్త పెరుమాళ్ళ ఆలయానికి చేరుకుని, సపరివార సమేతంగా పెరియ నంబిని చూసి, తన ప్రణామాలను సమర్పించి, తనను శిష్యుడిగా స్వీకరించమని నంబిని అభ్యర్థిస్తారు. అందరూ కలసి కాంచీపురానికి వెళ్లి అక్కడ సంస్కారాలు పూర్తి చేయవచ్చని పెరియ నంబి వారు సూచిస్తారు. కానీ శ్రీ రామనుజులు ఎంతో అస్థిరత ఉన్న ఈ ప్రపంచంలో, తాను ఆళవందార్ల శిష్యుడిగా మారే అవకాశాన్ని కోల్పోయాడని, అలాంటివి మళ్లీ జరగకూడదనుకుంటున్నానని విన్నపిస్తారు. కావున, వారు వెంటనే నంబీని పంచ సంస్కారాన్ని చేయమని పట్టుబట్టగా నంబి సరేనంటారు. ఆ విధంగా శ్రీ రామానుజులు శాస్త్రం నిర్దేశించిన విధంగా సరైన పద్ధతిలో ఆచార్యుల ఆశ్రయం పొందడం యొక్క ప్రాముఖ్యతను ప్రదర్శించారు. ఆ తర్వాత వారందరూ కాంచీపురానికి చేరుకుంటారు, పెరియ నంబి తమ కుటుంబంతో కలిసి కొంతకాలం అక్కడ ఉండాలని నిర్ణయించుకుంటారు.

కాంచీపురంలో పెరియ నంబిని  తిరుక్కచ్చి నంబి స్వాగతిస్తారు. ఆపై వారు దేవ పెరుమాళ్ళకు  మంగళాశాసనము సమర్పిస్తారు. ఆ తరువాత, శ్రీ రామానుజులు పెరియ నంబి కోసమై తన నివాసంలోని ఒక భాగంలో వారికి ఉండడానికి సౌకర్యం కల్పించారు. పెరియ నంబి తన కుటుంబంతో ఆరు నెలలు అక్కడే ఉంటూ దివ్య ప్రబంధము, రహస్యాలు మొదలైనవి బోధిస్తారు.

సన్యాసాశ్రమ స్వీకారము

ఒకసారి, ఒక శ్రీవైష్ణవుడు శ్రీ రామానుజుల నివాసానికి వెళ్లి తాను ఆకలితో ఉన్నానని చెప్పగా, వారు తమ ధర్మ పత్నితో కొంచము అన్నము పెట్టమనగా, ఆవిడ ఏమీ మిగలలేదని చెప్తుంది. ఆ శ్రీవైష్ణవుడు నిరాశతో వెళ్ళిపోతాడు, శ్రీ రామానుజులు వంటగదిలోకి వెళ్ళి చూడగా ఆహార అవశేషాలు కనిపిస్తాయి. వారికి క్రోధము ముంచుకు వచ్చి ఆ కోపాన్ని తన భార్యపై చూపిస్తారు. గతంలో కూడా, రక్షకాంబ (శ్రీ రామానుజుల ధర్మ పత్ని) తిరుక్కచ్చి నంబి పట్ల అనుచితంగా వ్యవహరిస్తుంది. శ్రీ రామానుజులు తిరుక్కచ్చి నంబి యొక్క శేష ప్రసాదము పొందాలనే ఉద్దేశ్యముతో వారిని భోజనానికి తన నివాసానికి ఆహ్వానిస్తారు, తిరుక్కచ్చి నంబి వారి గొప్పతనాన్ని అర్థము చేసుకోకుండా,  శ్రీ రామానుజుల అంతరార్థాన్ని గమనించకుండా, వారు ప్రసాదం స్వీకరించిన తరువాత ఆ శేషాన్ని విసిరివేసి ఆ ప్రదేశాన్ని కడిగి శుద్దిచేస్తుంది. చివరికి, ఒకసారి బావిలో నుండి నీళ్ళు తోడుకునే సమయంలో రక్షకంబకి మరియు పెరియ నంబుల ధర్మ పత్నికి మధ్య గొడవ జరుగుతుంది. పెరియ నంబి తీవ్ర మనస్తాపానికి గురై, శ్రీ రామానుజులకు చెప్పకుండా తన కుటుంబంతో  శ్రీరంగానికి తిరిగి వెళ్ళిపోతారు. తర్వాత శ్రీ రామనుజులు జరిగిన విషయము గురించి తెలుసుకుని తీవ్రంగా బాధపడతారు.

వేంటనే భగవానుడి పట్ల పూర్తి నిబద్ధతతో తన లక్ష్యాన్ని నిర్దేశించుకొని సన్యాస ఆశ్రమం స్వీకరించాలని నిర్ణయించుకుంటారు. వారు కాంచీపురం దేవ పెరుమాళ్ళ ఆలయంలోని అనంత సరస్సు పుష్కరిణిలో పవిత్ర స్నానమాచరించి, దేవ పెరుమాళ్ళ వద్దకి వెళ్ళి, అతడిని ఆచార్యునిగా స్వీకరించి, సన్యాసులకు అనుగుణమైన త్రిదండము, కాషాయం మొదలైనవి ప్రసాదించమని అభ్యర్థించారు.  దేవ పెరుమాళ్ళు  శ్రీ రామానుజుల కోరికను మన్నించి, సన్యాస ఆశ్రమాన్ని ప్రసాదించి, వారికి  “రామానుజ ముని” అని నామకరణము చేసి, వారు ఉండటానికి ఒక మఠాన్ని కూడా ఇస్తారు. ఇది విన్న ముదలియాండాన్ మరియు కూరత్తాళ్వాన్లు వెంటనే కాంచీపురం చేరుకున్నారు, శ్రీ రామానుజుల నుండి పంచ సంస్కారాన్ని స్వీకరించి, నిత్యము వారికి సేవ చేయడం ప్రారంభించారు. యాదవప్రకాశులు కూడా, వారి తల్లి సలహా మేరకు, శ్రీ రామానుజుల శిష్యులు అవుతారు. ఆ విధంగా శ్రీ రామానుజులు రామానుజ మునిగా మారి సన్యాస జీవితాన్ని అద్భుతంగా ఆచరించడం ప్రారంభించారు.

శ్రీ రామానుజులు యతిరాజ (సన్యాసులకు నాయకుడు) గా ప్రసిద్ధి చెంది, యాదవ ప్రకాశులని తమ శిష్యుడిగా స్వీకరిస్తారు, వారిచే సన్యాస ఆశ్రమ స్వీకారము చేయించి గోవింద జీయర్ అని నామకరణము చేస్తారు. అతను శ్రీవైష్ణవ సన్యాసుల నిత్య ఆచరణలను వివరించే వ్యాఖ్యనము  “యతి ధర్మ సముచ్యం” అనే  వివరణాత్మక గ్రంథాన్ని వారు రచించేలా చేశారు. ఇది యాదవప్రకాశులను స్వీకరించిన శ్రీ రామనుజుల ఔన్నత్య భావాన్ని చూపుతుంది (ఇంతకు ముందు వారిని చంపడానికి ప్రయత్నించారు). వారికి విలువైన కైంకర్యాలను అప్పగిస్తారు.

కాంచీపురంలో ఉండి, వారు విలువైన శాస్త్ర భాగాలను ముదలియాండాన్ మరియు కూరత్తాళ్వాన్లకి బోధిస్తారు.

శ్రీ రంగ ప్రవేశము

శ్రీ రామానుజులను  శ్రీరంగంలోకి తీసుకువచ్చి సంప్రదాయాన్ని గొప్ప శిఖరాలకు ఎదిగించాలనే కోరికతో శ్రీరంగనాథుడు శ్రీ వరదరాజులని శ్రీ రామానుజులను పంపమని  అభ్యర్థనను పంపుతారు. శ్రీరంగనాథుని అభ్యర్ధనను శ్రీ వరదరాజ పెరుమాళ్ళు పట్టించుకోరు. ఒక ప్యూహ రూపంగా, శ్రీరంగనాథుడు తిరువరంగ పెరుమాళ్ అరాయర్ని శ్రీ వరదరాజుల ముందు దివ్య కీర్తనలను పాడమని, పెరుమాళ్ళని మెప్పించి  శ్రీరామానుజులను బహుమానంగా పొందమని కాంచీపురానికి పంపుతారు. అరయార్ కాంచీపురానికి చేరుకుని, తిరుక్కచ్చి నంబి ద్వారా ఎంబెరుమానుడిని సమీపించి, శ్రీ వరదరాజుల ముందు పాడతారు, అరైయర్ పాటకి శ్రీ వరదరాజుల మైమరచిపోతాడు. “నీకు ఏమి కావాలో కోరుకో, అనుగ్రహిస్తాను” అని శ్రీ వరదరాజు చెప్పిన వెంటనే, అరయార్ స్వామి తనతో పాటు శ్రీరామానుజులను  శ్రీరంగానికి పంపమని కోరతారు. ఎంపెరుమాన్ శ్రీరామానుజుల సహవాసాన్ని కోల్పోవలసి వస్తున్నందుకు బాధపడతారు – కానీ మాట ఇచ్చినందున, అరైయర్‌తో పాటు యతిరాజుని పంపుతాడు.

శ్రీరంగం చేరుకున్న తరువాత, అరైయర్ మరియు యతిరాజులకు గొప్ప స్వాగతం లభిస్తుంది. వారిరువురూ పెరియ పెరుమాళ్ (శ్రీరంగనాథుడు) సన్నిధికి చేరుకోగా, పెరియ పెరుమాళ్ళు వారిని ఎంతో సంతోషంగా స్వీకరిస్తారు. శ్రీరంగనాథుడు యతిరాజులకి “ఉడయవర్” (ఆధ్యాత్మిక మరియు భౌతిక జగత్తుకి యజమాని) అనే బిరుదును ప్రదానం చేస్తాడు, వారికి ఒక మఠాన్ని కేటాయించి, ఆలయ కార్యకలాపాలను పూర్తిగా సంస్కరించమని ఆదేశిస్తాడు. శ్రీ రామానుజులతో  సంబంధము ఉన్న వారందరికీ ముక్తిని ప్రసాదిస్తానని అభయమిస్తారు. పెరియ నంబికి ఎంతో రుణపడి ఉన్నానని భావిస్తూ ఉడయవర్లు వారికి ధన్యవాదాలు సమర్పించుకుంటారు. పెరియ నంబులు కూడా సంప్రదాయానికి మంచి రోజులు రాబోతున్నాయని చూచి ఎంతో ఆనందిస్తారు.  ఉదయవర్లు శ్రీరంగంలో తన సమయాన్ని గడపుతూ గొప్ప నైపుణ్యంతో ఆలయ నిర్వహణలను సంస్కరించడం ప్రారంభించారు.

అలా శ్రీ రామానుజులు శ్రీరంగంలో ఉండి ఆలయ విధులను సమర్ధవంతంగా నిర్వహించారు. గోవింద (యదవప్రకాశులతో పాటు తీర్థయాత్రకు వెళుతున్నప్పుడు తన ప్రాణాలను కాపాడిన వారి పిన్నమ్మ కుమారుడు) శివ భక్తుడిగా మారి కాళహస్తీలో ఉంటున్నవారిని  శ్రీ రామానుజులు  తిరిగి సంప్రదాయములోకి తీసుకురావాలని ఆశించారు. పెరియ తిరుమలై నంబిని కాళహస్తికి వెళ్ళి శివభక్తుడిగా మారిన గోవిందుడిని సంస్కరించమని కోరతారు. వారు ఆళవందార్ల స్తోత్ర రత్నం మరియు దివ్య ప్రబంధ పాశురాల ఆధారంగా శ్రీమాన్నారాయణుడి  ఆధిపత్యాన్ని వివరిస్తారు. ఆ సూచనలను అలా కొన్ని సార్లు విని విని వారి మనస్సు మారి పరిశుద్దులై  శైవ సంబంధాన్ని విడిచిపెట్టి, ఒక్కసారిగా పెరియ తిరుమలై నంబి పాద పద్మాల యందు పడిపోతారు. నంబి వారిని ఎంతో సంతోషంతో స్వీకరించి, అతనికి పంచ సంస్కారాన్ని నిర్వహించి వెంట తీసుకొని వెళతారు. గోవిందులు నంబితో పాటు  తిరుమలలో ఉండి, అవసరమైన అన్ని పరమార్థాలను నేర్చుకుంటూ, పూర్తిగా నంబిని సేవిస్తారు. చివరికి గోవిందులు తిరిగి శ్రీరంగంలోకి వచ్చి శ్రీ రామానుజులతో శాశ్వతంగా ఉండిపోతారు.

వారి ఆచార్యులు

శ్రీ రామానుజులు పెరియ నంబుల తిరుమాలిగై (నివాసం) కి వెళ్లి, ముఖ్యమైన విషయాలన్నీ తనకు భోదించమని అభ్యర్థించారు. నంబి సంతోషించి, శ్రీ రామానుజులకు అత్యంత దివ్యమైన ద్వయ మహా మంత్రం యొక్క దివ్య అర్థాలను బోధిస్తారు. వారు శ్రీ రామానుజులను “ఈ అంశంలో తెలుకోవలసింది ఇంకా చాలా ఉంది; ఆళవందార్ల ప్రియ శిష్యుడైన తిరుక్కోష్ఠియూర్ నంబి వద్దకు వెళ్లి వారి వాద్ద అభ్యసించండి” అని ఆదేశిస్తారు.

శ్రీ రామానుజులు వెంటనే దివ్య పట్టణమైన తిరుక్కోష్ఠియూర్ కి బయలుదేరతారు. పట్టణంలోకి ప్రవేశించిన తరువాత, ఆ పట్టణ వాసులకి తిరుక్కోష్ఠియూర్ నంబి తిరుమాలిగ ఎక్కడ ఉందని అడుగుతారు. వారు చూపించిన దిశలో ప్రతి అడుగుకి సాష్ఠాంగ ప్రణామములు సమర్పించుకుంటూ వెళ్ళి వారి తిరుమాలిగకి చేరుకుంటారు, అప్పుడు నంబి మహిమను తెలుసుకున్న ఆ పట్టణ వాసులు ఆశ్చర్యపోతారు. శ్రీ రామానుజులు నంబి పాద పద్మాల యందు పడి, రహస్య అర్థాలను బోధించమని ప్రార్థించారు. కానీ నంబి అతనికి అర్థాలు నేర్పాలని పెద్దగా ఆసక్తి చూపరు, శ్రీ రామానుజులు నిరాశతో శ్రీరంగానికి తిరిగి వస్తారు.

శ్రీ రామానుజులు శ్రీరంగానికి తిరిగి వచ్చిన తరువాత, వారు తిరుక్కోష్ఠియూర్ నంబి నుండి రహస్య అర్థాలను నేర్చుకోవాలని ఆరాటపడుతుండేవారు. నంబి ఒకసారి శ్రీరంగానికి వచ్చినపుడు, తిరిగి వస్తుండగా, శ్రీరామనుజులకి రహస్య అర్థాలను బోధించమని నంపెరుమాళ్ళు నంబిని ఆదేశిస్తారు. శాస్త్రం ప్రకారం, అంకితమైన సేవ చేయని వారికి ఈ రహస్య అర్థాలను నేర్పరాదని నంబి నంపెరుమాళ్ళతో పలుకగా,  మంచి శిష్యుడిగా ఉండే అన్ని అర్హతలు శ్రీరామనుజులలో ఉన్నందున, అతనికి నేర్పడంలో తప్పేమీ లేదని నంపెరుమాళ్ళు అంటారు. అప్పుడు నంబి శ్రీ రామానుజులని తిరుక్కోష్ఠియూర్ వచ్చి అర్థాలను తెలుసుకోమని ఆదేశిస్తారు. శ్రీ రామానుజులు తిరుక్కోష్ఠియూర్కి వెళ్ళగా, తరువాత మరో సారి రమ్మని నంబి శ్రీ రామానుజులను తిరిగి పంపిచేస్తారు. అలా 18 సార్లు జరుగుతుంది. పరిస్థితిని తట్టుకోలేక, శ్రీ రామానుజులు తిరుక్కోష్ఠియూర్ నంబి యొక్క శిష్యుని ద్వారా తాను ఆ అర్థాలను తెలుకోవాలని ఆరాటపడుతున్నట్లు వారికి తెలియజేస్తాడు. చివరికి నంబి ఆ అర్థాలను బోధించడానికి అంగీకరించగా, శ్రీ రామానుజులు గితా చరమ స్లోకము యొక్క రహస్య అర్థాలను వారి నుండి తెలుసుకుంటారు. అర్హత లేని వారికి ఈ అర్థాలను చెప్ప వద్దని నంబి శ్రీ రామానుజులను ఆదేశిస్తారు. కానీ శ్రీ రామానుజులు ఈ అర్థాలను తెలుసుకోవాలని కోరుకునే వారికి అర్థాలను వెల్లడి చేస్తారు. ఇది విన్న నంబి క్రోధితులై శ్రీ రామానుజులను రమ్మని కబురు పంపుతారు. శ్రీ రామానుజులు వచ్చి నంబికి ఇలా వివరిస్తారు – రహస్య అర్థాలు తెలుసుకున్నవారు ఆ యదార్థ జ్ఞానాన్ని పొందడం ద్వారా ఉద్దరింపబడతారు అని వివరిస్తారు. శ్రీ రామానుజుల ఔన్నత్య స్వభావాన్ని అర్థం చేసుకొని, నంబి వారిని “ఎంపెరుమానార్” (ఎంపెరుమానుడు శ్రీమన్నారాయణుడి కంటే గొప్పవాడు) అని ప్రశంసిస్తారు. ఆ తరువాత నుండి మన సంప్రదాయము కూడా “ఎంపెరుమానార్ దరిశనం” (శ్రీ రామానుజ దర్శనం) అని పిలువబడింది. ఆపై కూరత్తాళ్వాన్లు మరియు ముదలియాండాన్ల అభ్యర్థన మేరకు ఎంపెరుమానార్లు వారికి  రహస్య అర్థాలను బోధిస్తారు.

తదనంతరం, తిరుక్కోష్ఠియూర్ నంబి  ఎంపెరుమానార్లకి తిరువాయ్మొళి యొక్క అర్థాలను బోధించమని తిరుమలై ఆణ్డాన్లని ఆదేశించారు. ఎంపెరుమానార్లు  ఉత్సాహంగా ఆణ్డాన్ వారి  నుండి అవసరమైన అన్ని అర్థాలను నేర్చుకోవడం ప్రారంభించారు. కొన్ని సందర్భాలలో, ఆణ్డాన్ మరియు ఎంపెరుమానార్ల మధ్య  కొన్ని పాశురార్థాలపై భిన్నాభిప్రాయాలు ఏర్పడతాయి. తిరువాయ్మొళి 2.3.3 వ “అఱియాక్ కాలత్తుల్లే” పాశురము నేర్చుకుంటున్నప్పుడు, ఎంపెరుమానార్లు  భిన్న అర్థాలను ఇవ్వడంతో ఆణ్డాన్ వారు బాధపడి వారి ఉపన్యాసాన్ని ఆపివేస్తారు. ఈ జరిగిన సంఘటన గురించి విన్న తిరుక్కోష్ఠియూర్ నంబి వెంటనే శ్రీరంగానికి బయలుదేరతారు. వారు ఎంపెరుమానార్ల గొప్పతనాన్ని ఆణ్డాన్ వారికి వివరించి, ఉపన్యాసాలను తిరిగి కొనసాగించమని ఆదేశిస్తారు. ఆండన్ వారు అంగీకరించి ఎంపెరుమానార్లకి తమ బొధనలు పునః ప్రారంభిస్తారు. తరువాత మరొక చిక్కు ఏర్పడి “ఆళవందార్లు అయితే  ఇలా వివరించరు” అని ఎంపెరుమానార్లు  అంటారు. “ఆళవందార్లను ఎన్నడూ కలవని నీకు ఎలా తెలుసు?” అని ఆండన్ వారు ప్రశ్నించగా, ఎంపెరుమానార్లు  “నేను ఆళవందార్లకి ఏకలవ్య శిష్యుడిని” అని బదులిస్తారు. అది విన్న ఆణ్డాన్ వారు, తిరుక్కోష్టియుర్ నంబి నోట ఎంపెరుమానార్ల వర్ణనని విని, అది స్వయంగా ఎంపెరుమానార్ల  నుండే విని గ్రహిస్తారు. ఎంపెరుమానార్లు ఒక విశేష అవతార పురుషులని వారు గ్రహించి, ఆళవందార్ల నుండి తాను వినలేకపోయిన అర్థాలను వినాలని ఆశిస్తూ ఎంపెరుమానార్లతో అతి గౌరవంగా వ్యవహరిస్తారు.

తిరువాయ్మొళి ఉపన్యాసాము పూర్తి అయిన తర్వాత, వారు పెరియ నంబి వద్దకి తిరిగి వెళతారు.  పెరియ నంబి ఎంపెరుమానార్లని వెళ్లి తిరువరంగ ప్పెరుమాళ్ అరైయర్లని సేవించి వారి నుండి కొన్ని రహస్య అర్థాలు నేర్చుకోవాలని సూచిస్తారు. ఎంపెరుమానార్లు  అరైయర్ల వద్దకి వెళ్లి, వారికి పాలు సిద్ధం చేయడం, పసుపు నూరడం వంటి సేవలు 6 నెలల పాటు నిష్ఠగా చేస్తారు. ఒకసారి ఎంపెరుమానార్లు నూరి సమర్పించిన పసుపు అరయార్ స్వామికి అంతగా నచ్చదు, వారు తమ  అసంతృప్తిని వ్యక్త పరచగా వెంటనే ఎంపెరుమానార్లు మరో పసుపు ముద్దని సిద్ధం చేసి వారికి సమర్పిస్తారు. అరైయర్ స్వామి ఎంతో సంతృప్తి పడతారు. అరయార్ స్వామి ఆనందంతో, ఆచార్యులపై సంపూర్ణంగా ఆధారపడాలనే “చరమోపాయం” (అత్యున్నత సాధనం) యొక్క రహస్య సూత్రాన్ని వారికి బోధిస్తారు.

ఎంపెరుమానార్లు  అనేక మంది ఆచార్యుల నుండి ఎందుకు అభ్యాసము చేయవలసి వచ్చిందని ఎవరైనా ఆశ్చర్యపోవచ్చు. ఒక రాజు యువరాజుకి శిక్షణ ఇవ్వమని అనేక మంత్రులను నియమించినట్లే, ఆళవందార్లు తమ అనేక శిష్యులకు తన జ్ఞాన సంపదనిచ్చి సరైన సమయంలో ఆ జ్ఞానాన్ని ఎంపెరుమానార్లకు అందించమని ఆదేశించారు. ఆళవందార్ల ఈ శిష్యులందరూ శ్రీరామానుజుల పట్ల గొప్ప అనుబంధం మరియు గౌరవాన్ని కలిగి ఉండేవారు, ఎందుకంటే వారు ఆళవందార్లకి చాలా ప్రియమైనవారు కనుక. ఈ కారణంగా ఎంపెరుమానార్ల కంటే మునుపటి ఆచార్యులు ఎంపెరుమానార్ల ఆచార్యులుగా గొప్ప ఖ్యాతిని పొందారు, ఇక ఎంపెరుమానార్ల  శిష్యుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, వారితో ఉన్న అనుబంధం కారణంగా వారి శిష్యులు గొప్ప కీర్తిని సాధించారు. ఎలాగైతే ఒక హారము మధ్యలో ఉన్న పతకము అటు ఇటు రెండు వైపులా అందాన్ని ఇస్తుందో అలాగే, ఎంపెరుమానార్లు కూడా వారి ముందు మరియు తరువాత ఆచార్యులకు ఎంతో కీర్తిని జోడించి ఇచ్చారు..

గద్య త్రయ పఠనము

తరువాత, అద్భుతమైన పంగుని ఉత్తరము రోజున శ్రీరంగంలో శ్రీరంగనాయకి రంగనాథుల ఎదుట ఎంపెరుమానార్లు గద్య త్రయాన్ని సేవించారు. వారు మన ఇంట్లో భగవానుడిని ఆరాధించే పద్ధతిని వివరిస్తూ నిత్య గ్రంధాన్ని కూడా సంకలనం చేశారు.

ఈ సమయంలో, ఎంపెరుమానార్లు శ్రీరంగంలో భిక్షాటన చేసి ఆ భిక్షని స్వీకరిచేవారు. శ్రీరంగ కోవెలలో వీరు చేసిన సంస్కరణలకి  ఇష్టపడని కొంతమంది, ఒక మహిళ సహాయముతో వారికి విషముతో కూడిన అన్నాన్ని భిక్షగా పెట్టే ఏర్పాటు చేశారు. ఆమె ఇష్టపడకున్నా ఆదేశాన్ని అనుసరించి, బాధతో ఎంపెరుమానార్లకి భిక్షని ఇచ్చింది. ఎంపెరుమానార్లు  ఏదో తప్పు జరుతుందని గమనించి, ఆ ఆహారాన్ని కావేరీ నదికి పడవేసి ఉపవాసము ఉంటారు. ఈ సంఘటన గురించి విన్న తిరుక్కోష్ఠియూర్ నంబి వెంటనే శ్రీరంగానికి చేరుకుంటారు. మండే ఎండలో ఎంపెరుమానార్లు వారికి స్వాగతం పలికేందుకు  కావేరీ ఒడ్డుకు వెళతారు. నంబిని చూసి,  తమ ప్రణామాలను ఆ మండే ఇసుకపైన అర్పించుకుంటారు, నంబి తనను లేవమని ఆజ్ఞాపిస్తారని అలాగే వేడి ఇసుకపైన వేచి ఉంటారు. నంబి ఒక క్షణం ఆశ్చర్యపోతుండగా, ఎంపెరుమానార్ల శిష్యుడు కిడంబి ఆచ్చాన్ నంబితో “ఇంత గొప్ప ఆచార్యుడిని ఇంత వేడిలో ఎలా బాధపడనివ్వగలరు మీరు?” అని అంటూ ఎంపెరుమానార్లని పైకి లేపుతారు. నంబి ఆచ్చాన్తో ఇలా అన్నారు, “నన్ను అగౌరవపరిచినప్పటికీ నీవు ఎంపెరుమానార్లని కంటికి రెప్పలా చూసుకుంటావని నేను గమనించాను. కాబట్టి, ఎంపెరుమానార్లకై  ప్రతిరోజూ నీవు ప్రసాదాన్ని సిద్ధం చేయాలి” అని ఆదేశిస్తారు. ఈ విధంగా, ప్రతి ఒక్కరూ ఎంపెరుమానార్ల పట్ల తమ శ్రద్దా భక్తులను చూపించారు.

యజ్ఞ మూర్తి ఓటమి

ఆ రోజుల్లో యజ్ఞ మూర్తి అనే ఒక మాయావాద పండితుడు అనేక విజ్ఞానులను చర్చలలో ఓడించి గొప్ప ప్రశంసలు అందుకుంటూ, సన్యాసిగా తమ శిష్య సంపదతో వారణాసిలో ఉంటుండేవారు. వారు శ్రీ రామానుజుల గురించి విని శ్రీరంగానికి చేరుకొని, శ్రీ రామానుజులను చర్చకి ఆహ్వానిస్తారు. చర్చకు శ్రీ రామానుజులు అంగీకరిస్తారు. యజ్ఞ  మూర్తి “నేను చర్చలో ఓడిపోతే, నీ పాదుకలను నా శిరస్సుపై మోసి, మీ పేరుతో పాటు మీ తత్వాన్ని స్వీకరిస్తాను”, ఉడయవర్లు  “నేను ఓడిపోతే ఈ సాహిత్యాన్ని మానేస్తాను” అని ఇరువులు చర్చకు ముందు ఒప్పందము ఏర్పరచుకుంటారు. ఇద్దరి మధ్య 17 రోజుల పాటు తీవ్ర చర్చ జరిగింది. 17 వ రోజున, యజ్ఞ  మూర్తులు గెలవడం ప్రారంభించి, ఆ రోజు చర్చ సమాపనము చేసుకొని గొప్ప గర్వంతో వెళ్లిపోతారు. శ్రీ రామానుజులు నిరాశతో వారి పేరరుళాళ పెరుమాళ్ళతో (వారి మఠం తిరువారాధన పెరుమాళ్) ఇలా మొరపెట్టుకున్నారు: “ఆళ్వార్ల నుండి ఆళవందార్ల వరకు పుష్కలంగా పోషించబడిన ఈ గొప్ప సంప్రదాయం నా కారణంగా నేల మట్టమవబోతుంది; ఒక మాయావాది చేత నాశనం అవుతుంది; ఇదే నీ సంకల్పమైతే, అలాగే కానివ్వు” అని మననము చేసుకుంటూ ప్రసాదం కూడా తినకుండా నిద్రలోకి జారుకున్నారు. మధ్యరాత్రిలో పేరరుళాళ పెరుమాళ్ళు కలలో కనిపించి, ఆళవందార్ల రచనలను ప్రయోగించి యజ్ఞ  మూర్తిపై విజయం సాధించమని ఆదేశిస్తారు.

మర్నాడు మేల్కొని శ్రీ రామానుజులు ఎంతో ఉత్తేజముతో తమ నిత్య అనుష్ఠానములు గావించుకొని తమ మఠ పెరుమాళ్ళ నుండి సెలవు తీసుకుంటారు. వారి గంభీర రాకను చూసి, యజ్ఞ  మూర్తులు గొప్ప జ్ఞానులు కనుక, ఈ విషయంలో ఏదో దివ్య జోక్యము ఉందని గ్రహించి, ఒక్కసారిగా శ్రీ రామానుజుల దివ్య పాదాల వద్ద పడి “నా ఓటమిని నేను స్వీకరిస్తున్నాను” అని ప్రకటిస్తారు. ఆశ్చర్యపోతూ, శ్రీ రామానుజులు “మీరు ఇంకా చర్చించకూడదనుకుంటున్నారా” అని అడగగా,  “పెరియ పెరుమాళ్ళు మీతో సంభాషించినందున, నాకు మీరు వేరు పెరియ పెరుమాళ్ళు వేరు కాదు అని అర్థమైంది. మీ సమక్షంలో నేను ఇక ఎలా నోరు తెరవగలను. అని యజ్ఞ మూర్తులు తెలియజేస్తారు. అయినా గానీ శ్రీ రామానుజులు బ్రహ్మం యొక్క గొప్ప గుణాలను వివరించి మాయావాద సూత్రాలను నాశనం చేస్తారు. యజ్ఞ మూర్తులు సమ్మతించి తన ఏకదండాన్ని (మాయావాద సన్యాసులు ధరించే ఏక దండం) విరిచి వేసి, తనకి త్రిదండ సన్యాసం (శ్రీవైష్ణవ సంప్రదాయ సన్యాసం) ప్రసాదించమని శ్రీ రామానుజులని అభ్యర్థించారు. పేరరుళాళ పెరుమాళ్ళ దివ్య జోక్యానికి జ్ఞాపకార్థముగా, తన నామాన్ని స్వీకరిస్తానని యజ్ఞ మూర్తుల  ప్రతిజ్ఞని నెరవేర్చడానికి, శ్రీ రామానుజులు వారికి  “అరుళాళ పెరుమాళ్ ఎంపెరుమానార్” అన్న నామాన్ని ప్రసాదిస్తారు. శ్రీ రామానుజులు స్వయంగా వారికి దివ్య ప్రబంధముల నిగూఢ అర్థాలను బోధిస్తారు. అరుళాళ పెరుమాళ్ ఆ తర్వాత ఎంపెరుమానార్లతోనే ఉంటూ తమ అంకితభావాన్ని నిరూపించుకున్నారు.

తిరుమల యాత్ర మరియు కైంకర్యాలు

ఉడయవర్లు శ్రీరంగంలో మహా అద్భుత రీతిలో ఆళ్వాన్, ఆండన్, అరుళాళ పెరుమాళ్ ఎంపెరుమానార్లు మొదలైనవారికి విద్యా బోధనలు కొనసాగిస్తున్నారు. అనేక మంది పండితులు ఉడయవర్ల మహిమల గురించి విని వారి ఆశ్రయం పొందాలని శ్రీరంగానికి చేరుకుంటారు. అనంతాళ్వాన్, ఎచ్చాణ్, తొండనూర్ నంబి, మరుదూర్ నంబి ఉడయవర్లను తమ ఆచార్యులుగా స్వీకరించడానికి వచ్చినప్పుడు, వాళ్ళని  అరుళాళ పెరుమాళ్ ఎంపెరుమానార్ల  శిష్యత్వం స్వీకరించమని వారు నిర్దేశిస్తారు. వాళ్ళు సంతోషంగా వారిని ఆచార్యులుగా స్వీకరిస్తారు. అరుళాళ పెరుమాళ్ ఎంపెరుమానార్లు వారిని ఎంపెరుమానార్ల పాద పద్మాలపైనే  పూర్తిగా ఆధారపడి ఉండాలని వారికి సూచిస్తారు.

తరువాత, ఉడయవర్లు తిరువాయ్మొళి అర్థాలను బోధించారు. వారు “ఒళివిల్ కాలం” దశకాన్ని వివరించడం మొదలుపెట్టినప్పుడు, “తిరుమల తిరుపతికి వెళ్ళి అక్కడ ఒక తోటను ఏర్పాటు చేసి, ప్రతిరోజూ తిరువేంకటముడయానుడికి పూల దండలు తయారు చేయడానికి ఎవరైనా సిద్ధంగా ఉన్నారా” అని అడిగారు. అనంతాళ్వాన్లు ఒక్కసారిగా పైకిలేచి ఈ కైంకర్యాన్ని నేను చేస్తాను అని స్వీకరిస్తారు. ఎంపెరుమానార్లు వారిని ఈ కైంకర్యాన్ని చేయమని ఆశీర్వదిస్తారు. అనంతాళ్వాన్లు  తిరుమలకు వెళ్ళి, ఒక కొలను మరియు తోటని నిర్మించి, ఆ తోటకి “ఇరామానుశ” అని పేరు పెట్టి తిరువేంకటముడయానుడికి సేవ చేయడం ప్రారంభిస్తారు.

ఉడయవర్లు కూడా తీర్థయాత్రకు వెళ్లాలని ఆశిస్తూ, నంపెరుమాళ్ళ అనుమతిని కోరతారు. అనుమతి పొందిన తరువాత, తిరుక్కోవళూర్ మరియు కాంచీపురంలో మంగళాశాసనాలు సమర్పించుకొని ఆ తరువాత తిరుమలకి బయలుదేరుతారు.

ఉడయవర్లు తమ శిష్యులతో కలిసి తిరుమల వైపు ప్రయాణిస్తుండగా మధ్యలో వాళ్ళు దారి తప్పుతారు. వారు దగ్గర్లో ఒక రైతును చూసి అతడిని దారి అడుగగా, ఆ రైతు మార్గాన్ని స్పష్టంగా వివరించడంతో, ఉడయవర్లు ఆ రైతుని అమానవుడిగా (శ్రీవైకుంఠం మార్గంలో మనకి దారిచూపించి నడిపించే వాడు) భావించి, ఎంతో కృతజ్ఞతతో సాష్ఠాంగ ప్రణామాలు అర్పించుకుంటారు. చివరికి వారు తిరుపతి కొండ వద్దకి చేరుకుని క్రింద ఆళ్వార్లను సేవిస్తారు.  వారు కొంతకాలం తిరుపతిలోనే ఉండి, అక్కడి రాజుని తన శిష్యుడిగా చేర్చుకుంటారు. తమ అనేక శిష్యులను అక్కడే స్థిరపరుస్తారు. ఈ వార్త విన్న అనంతాళ్వాన్లు మరియు అనేకమంది వచ్చి ఉడయవర్లని స్వాగతించి, తిరువేంకటముడయానుడికి మంగళాశాసనం చేయడానికి కొండపైకి రమ్మని ప్రార్థిస్తారు. అతి పవిత్రమైన ఆ కొండపైకి ఆళ్వార్లు కూడా అడుపెట్టలేదు, నేనెలా కాలు పెట్టగలను అని నిరాకరిస్తారు. కానీ శిష్యులు బ్రతిమాలగా, కొండ క్రింద స్నానమాచరించి తమను తాము శుద్ధి చేసుకొని,  పరమపదంలో ఎంపెరుమానుడి దివ్య  సింహాసనాన్ని భక్తితో అధిరోహిస్తున్నంత వినయముతో తిరుమల కొండపైకి ఎక్కడం ప్రారంభిస్తారు.

రాగానే, తిరుమల నంబి వారు ఆ తిరుమల వేంకటనాధుని తరపున నుండి స్వాగతం పలుకుతారు. ఉడయవర్లకి తమ ఆచార్యులు అయిన తిరుమలై నంబి వారు స్వాగతం పలకడం చూసి ఇబ్బందికరముగా అనిపించి, “నన్ను ఆహ్వానించడానికి మీ అంతటి వారు కాని, మామూలు మనిషి ఎవరూ కనిపించలేదా?” అని ప్రశ్నించగా, నంబి వినయంగా సమాధానమిస్తూ “నేను చుట్టూ వెతికాను కానీ నాకు నాకంటే తక్కువైన వ్యక్తి ఎవరూ కనిపించలేదు” అని అంటారు. అది విన్న ఉడయవర్లు మరియు వారి శిష్యులు ఆశ్చర్యపోతారు. ఆ తరువాత, జీయర్లు, ఏకాంగులు, ఆలయ కైంకర్యపరర్లు అందరూ వచ్చి ఉడయవర్లని స్వాగతిస్తారు. ఉడయవర్లు ఆలయం చుట్టూ ప్రదక్షణగా వెళ్ళి, స్వామి పుష్కరిణిలో స్నానమాచరించి, ద్వాదశ ఊర్ధ్వ పుండ్రాలను ధరించి, వరాహ పెరుమాళ్ళని సేవించుకొని, ప్రధాన ఆలయంలోకి ప్రవేశిస్తారు. అక్కడ విశ్వక్సేనులను సేవించి, ఆ తిరువేంకటనాధునికి మంగళశాసనాలు సమర్పించుకుంటారు. తిరుమల నిత్యసూరులకు నివాసము కాబట్టి రాత్రికి అక్కడ ఉండలేమని, వారు తిరుపతికి (కొండ క్రిందకి) తిరిగి వెళ్లాలని నిర్ణయించుకుంటారు. కానీ నంబితో పాటు అందరూ వారిని 3 రోజులు అక్కడే ఉండమని ప్రార్థించి ఒప్పిస్తారు. ఉడయవర్లు ఎటువంటి ప్రసాదం తీసుకోకుండా ఆ తిరువేంకటనాధుని దివ్య సౌందర్యాన్ని ఆస్వాదించుచూ అక్కడే 3 రోజులు ఉండిపోతారు. ఆ తరువాత, ఆ తిరువేంకటనాధుని వద్ద సెలవు తీసుకుంటానని అనుమతి కోరగా, ఆ సమయంలో ఆ తిరువేంకటనాధుడు ఉడయవర్లను నిత్య విభూతి మరియు లీలా విభూతి రెండింటికి స్వామిగా ప్రకటించి వారికి వీడ్కోలు పలుకుతారు.

వారు తిరుమలకి వీడ్కోలు పలికి, క్రింద తిరుపతిలో ఒక సంవత్సరం పాటు ఉంటారు. ఈ సమయంలో వారు తిరుమలై నంబి నుండి శ్రీ రామాయణాన్ని, వాటి నిగూఢ అర్థాలను నేర్చుకుంటారు. ఉపన్యాసాలు ముగిసిన పిదప, వారు శ్రీరంగానికి తిరిగి వేళ్ళడానికి నంబి నుండి అనుమతి కోరుతారు. నంబి ఉడయవర్లకి బహుమతి ఇవ్వాలని అనుకున్నప్పుడు, సంప్రదాయ స్థాపించే ప్రయత్నాలలో తనకి సహాయంగా గోవింద పెరుమాళ్ళని (తిరుమలై నంబి ప్రియ శిష్యుడు) తనతో పాటు పంపించమని ఉడయవర్లు ప్రార్థిస్తారు. నంబీ సంతోషంగా ఉడయవర్లతో  గోవింద పెరుమాళ్ళని పంపుతారు. ఉడయవర్లు  శ్రీరంగానికి తిరుగు ప్రయాణం ప్రారంభించారు.

ఉడయవర్లు  గోవింద పెరుమాళ్ళతో గడికాచలం (షోలింగూర్) చేరుకుని అక్కరక్కని  ఎంపెరుమాన్లకి మంగళశాసనాలు సమర్పించుకుంటారు. తరువాత తిరుప్పుట్కుళి చేరుకుని జటాయు మహారాజుకి, మరగాతవల్లి తాయర్లని, విజయరాఘవ ఎంపెరుమానుడికి మంగళశాసనాలు సమర్పించుకుంటారు. ఆపై వారు కంచి చుట్టూ ఉన్న వివిధ దివ్య దేశాలను  దర్శించుకొని, తిరుక్కచ్చి నంబి వద్దకి చేరుకుంటారు. ఈ సమయంలో, గోవింద పెరుమాళ్ళు తమ ఆచార్యులైన పెరియ తిరుమలై నంబి నుండి దూరమైన బాధ కారణంగా నిర్జీవముగా ఉంటారు.  అతని దుఃఖాన్ని అర్థం చేసుకున్న ఉడయవర్లు, గోవింద పెరుమాళ్ళని వెళ్లి  తమ ఆచార్యుల దర్శనము చేసుకోమని కొందరు శ్రీవైష్ణవులను తోడుగా పంపుతారు. వారు కంచిలోనే ఉండి, తిరుక్కచ్చి నంబితో పాటు దేవ పెరుమాళ్ళని సేవించుకుంటారు. గోవింద పెరుమాళ్ళు తిరుమలై నంబి నివాసానికి చేరుకుని తలుపులు మూసి ఉన్నందున ద్వారం వద్దనే వేచి ఉంటారు. ఆ ఊరి వాసులు గోవింద పెరుమాళ్ళ రాక గురించి తిరుమల నంబికి సమాచారం అందించినప్పుడు, వారు తలుపు తెరవడానికి నిరాకరించి,  ఉడయవర్ల వద్దకి తిరిగి వెళ్లి వారినే ఏకైక శరణుగా భావించమని ఆదేశిస్తారు. గోవింద పెరుమాళ్ళు తమ ఆచార్యుల దివ్య సంకల్పాన్ని పూర్తిగా అర్థం చేసుకుని, ఉడయవర్ల వద్దకి తిరిగి చేరుకుంటారు.  గోవింద పెరుమాళ్ళ వెంట తోడుగా వెళ్లిన శ్రీవైష్ణవులు ఉడయవర్లకి జరిగిన సంఘటన గురించి వివరిస్తారు. తిరుమలై నంబి వారి ఆదేశాలను విని ఉడయవర్లు చాలా సంతోషిస్తారు.

తిరిగి శ్రీరంగంలో

తరువాత, వారు కాంచీపురం నుండి బయలుదేరి శ్రీరంగం చేరుకుంటారు. స్థానిక శ్రీవైష్ణవులు వారిని ఉత్సాహంగా స్వాగతిస్తారు,  ఉడయవర్లు సరైన క్రమంలో (సన్నిధుల) వెళ్లి పెరియ పెరుమాళ్ళ సన్నిధికి చేరుకుంటారు. పెరియ పెరుమాళ్ళు వారిని ఎంతో ప్రేమతో స్వాగతించి, ప్రయాణం విషయాల గురించి ఆరా తీసి, తీర్థం, శ్రీ శఠగోపము మొదలైన గౌరవాలను అందిస్తారు.  ఉడయవర్లు శ్రీరంగంలో  సంప్రదాయ బోధనలను కొనసాగిస్తారు.

గోవింద పెరుమాళ్ళు కూడా చాలా సంతోషంగా కాళక్షేపాలు (ఉపన్యాసాలు) మరియు కైంకర్యాలలో పాల్గొనసాగారు. అది చూసి కొందరు శ్రీవైష్ణవులు గోవింద పెరుమాళ్ళను ప్రశంసించగా, వారు స్వీకరించి సంతోషపడతారు. అది చూసి, ఉడయవర్లు అతనితో “ఎవరైనా ప్రశంసిస్తే, ఆ ప్రశంసలను నేరుగా స్వీకరించ కూడదు. అందుకు బదులుగా, ప్రశంసలు అందుకునే అర్హత నాకు లేదని చెప్పాలి” అని వివరిస్తారు. ఇది విన్న గోవింద పెరుమాళ్ళు ఇలా సమాధానమిచ్చాడు – “నేను కాళహస్తిలో అల్ప స్థితిలో ఉండేవాడిని. ఇప్పుడు ఎవరైనా నన్ను ప్రశంసిస్తే, అది కేవలము మీ గొప్ప కృప కారణంగా నేను సంస్కరించబడి ప్రశంసలు అందుకునే స్థితికి తీసుకువచ్చింది – కాబట్టి వాస్థవానికి ఈ ప్రశంసలన్నీ మీకు మాత్రమే చెందుతాయి ”. ఇది విని ఎంబెరుమానార్లు గోవింద పెరుమాళ్ళకి గొప్ప నిష్ఠని అనుగ్రహిస్తారు. వారు గోవింద పెరుమాళ్ళని ఆలింగనం చేసుకొని, “నీ మంచి గుణాలను నాకు కూడా ఇవ్వుము” అని అంటారు.  ప్రాపంచిక సుఖాల పట్ల గోవింద పెరుమాళ్ళ నిర్లిప్తత గమనించిన ఎంబెరుమానార్లు వారిని సన్యాసాశ్రమ స్వీకారము చేపట్టమని ఆదేశించారు. వారు సన్యాసాశ్రమ స్వీకారము చేసి ఎంబెరుమానార్లు నుండి ‘ఎంబార్’ అన్న నామాన్ని పొందుతారు.

అనంతరం, అరుళాళ పెరుమాళ్ ఎంపెరుమానార్లు మన సంప్రదాయంలోని సారాన్ని వెలికి తీసి జ్ఞాన సారము మరియు ప్రమేయ సారము అనే రెండు గ్రంథాల రచన గావించారు.

కాశ్మీర్ యాత్ర మరియు శ్రీ భాష్యము

ఎంపెరుమానార్లు వేదాంత సూత్రాలను స్పష్టంగా స్థాపించాలన్న సంకల్పముతో, కూరత్తాళ్వాన్ మరియు ఇతర శిష్యులతో కలిసి భోదాయన వృత్తి గ్రంథాన్ని (బ్రహ్మ సూత్రానికి వ్యాఖ్యానం) పొందడానికి కాశ్మీర్కి వెళతారు. ఆ గ్రంథాన్ని సేకరించి శ్రీరంగం వైపు తిరుగు ప్రయాణము ప్రారంభం చేస్తారు. దారిలో, కశ్మీర్ నుండి కొంతమంది దుండగులు గ్రంథాన్ని లాక్కొని పారిపోతారు. ఎంపెరుమానార్లు గ్రంథాన్ని పూర్తిగా చదవను కూడా లేదు అని విచారపడుతుండగా,  కూరత్తాళ్వాన్లు వారిని ఓదార్చి,  ఎంపెరుమానార్లు విశ్రమిస్తుండగా తాను ఆ గ్రంథాన్ని చదివానని తెలుపుతారు. శ్రీరంగం తిరిగి వచ్చిన అనంతరం, ఎంపెరుమానార్లు బ్రహ్మా సూత్రము యొక్క వ్యాఖ్యానాన్ని తాను చెబుతుండగా కూరత్తాళ్వాన్లని వ్రాయమని ఆదేశిస్తారు. వివరించిన సూత్రాలలో ఏమైనా భిన్నాభిప్రాయాలు ఉంటే, అక్కడే వ్రాయడం ఆపివేయమని ఆదేశిస్తారు. ఒకసారి, ఆత్మ యొక్క నిజమైన స్వభావాన్ని ఎంపెరుమానార్లు వివరిస్తున్నప్పుడు, వారు శేషత్వం (సేవకు) గురించి నొక్కిచెప్పకుండా దానిని జ్ఞాతృత్వము (జ్ఞాన నివాసం) అని వివరిస్తారు. ఆళ్వాన్లు వెంటనే వ్రాయడం ఆపివేస్తారు, ఎందుకంటే ఆత్మకి అతి ముఖ్యమైన స్వభావం శేషత్వ జ్ఞానం కాబట్టి. ఎంపెరుమానార్లు కోపంతో ఆళ్వాన్లకి తాను చెప్పింది వ్రాయమని ఆగ్రహిస్తారు.  ఆదేశిస్తారు. ఆళ్వాన్ అప్పటికీ నిరాకరించగా ఎంపెరుమానార్లు తన క్రోధాన్ని అణచుకోలేకపోతారు. ఎంపెరుమానార్ల ఈ చర్య గురించి ఏమనుకుంటున్నారో తన సహచరులు అడిగినప్పుడు, ఆళ్వాన్ కేవలం “వారు యజమాని, నేను వారి యాజమాన్యాన్ని. వారికి నాపై పూర్తి హక్కులు ఉన్నాయి” అని తెలుపుతారు. కొంత సమయము తర్వాత, ఎంపెరుమానార్లు పరిస్థితిని విశ్లేషించి, తన తప్పును గ్రహించి, ఆళ్వాన్లకి క్షమాపణ కోరి, సరైన అర్థాలను వ్యాఖ్యానిస్తారు. ఈ విధంగా శ్రీభాష్యం, వేదాంత దీపం, వేదాంత సారం, వేదాంత సంగ్రహం, గీతా భాష్యముని ఎంపెరుమానార్లు అనుగ్రహించారు. ఈ విధంగా,  ఈ సూత్రాలకు స్పష్టమైన  వ్యాఖ్యానము చేసి ఆళవందార్ల దుఃఖాన్ని తొలగించారు.

దివ్య దేశ యాత్ర

శ్రీవైష్ణవులు ఉడయవర్ల వద్దకి వెళ్లి, “యతిరాజులు మీరు ఇతర సిద్దాంతులను ఓడించి మన సిద్దాంతాన్ని స్థాపించారు. ఇక దయచేసి తీర్థయాత్రకు వెళ్లి వివిధ దివ్య దేశాలను కూడా సేవించండి.” అని విన్నపించుకుంటారు. వారితో ఏకీభవిస్తూ, ఉడయవర్లు వారితో పాటు నంపెరుమాళ్ళ వద్దకి వెళ్లి తన తీర్థయాత్రను ఆరంభించుటకు వారి అనుమతి కోరతారు. నంపెరుమాళ్ళు వారిని అనుమతిస్తారు.

ఎందరో శ్రీవైష్ణవులతో కలిసి ఉడయవర్లు తమ తీర్థయాత్రను ప్రారంభించి, భారత దేశములోని అనేక దివ్య దేశాలను క్షేత్రాలను సేవిస్తారు. వారు చోళ నాడుతో ప్రారంభించి, ఆ ప్రాంతంలో ఉన్న తిరుక్కుడందైతో పాటు అనేక దివ్యదేశాలను దర్శిస్తారు. ఆ తరువాత తిరుమాలిరుంజోళై, ఆ ప్రాంతంలో దివ్యదేశాలను సేవించి, తిరుప్పుల్లాణికి వెళ్లి సేతు సముద్రాన్ని దర్శించుకొని, ఆళ్వార్ తిరునగరికి చేరుకుంటారు. వారు నమ్మాళ్వార్ ‘పొలిందు నిన్ఱ పిరాన్’ కి మంగళాశాసనాలు సమర్పించుకుంటారు. నమ్మాళ్వార్లు ఎంపెరుమానార్లని చూసి సంతోషించి, వారికి సకల మర్యాదాలు ఇస్తారు. ఉడయవర్లు నవ తిరుపతిలోని అన్ని దేవాలయాలను సేవిస్తారు. అంతటా వారు అనేక వ్యతిరేక తత్వవేత్తలను ఓడించి, విశిష్ట అధ్వైత తత్వాన్ని దృఢంగా స్థాపిస్తారు.

తర్వాత వారు తిరుక్కుఱుంగుడికి చేరుకుంటారు. నంబి ఉడయవర్లని స్వాగతించి అర్చక ముఖేన వారితో సంభాషిస్తారు. తాను “వివిధ రూపాలలో అవతారము దాల్చిన తర్వాత కూడా నేను ఇంత మంది శిష్యులను సంగ్రహించలేకపోయాను, ఇంత మందిని నీవు ఎలా సంస్కరించగలుగుతున్నావు?” అని నంబి ప్రశ్నిస్తారు. “నీవు శిష్యుడిగా అడిగితే మాత్రమే నేను నీకు జవాబు ఇస్తాను” అని ఉడయవర్లు చెబుతారు. నంబి (తిరుక్కురుంగుడి పెరుమాళ్) వెంటనే ఉడయవర్లకి సింహాసనాన్ని అందించి వినయంగా పక్కన నిలుచుంటారు. ఉడయవర్లు తమ ఆచార్యులైన పెరియ నంబిని సింహాసనంపై ధ్యానిస్తూ, తాను సింహాసనం పక్కన ఆసీనమై ఉండి, ద్వయ మహా మంత్ర విశిష్ఠతని నంబికి వివరిస్తూ, ఈ ద్వయ మహా మంత్ర శక్తితోనే ఈ పవిత్ర మార్గాన్ని అందరినీ స్వీకరించమని ప్రేరేపిస్తాను అని వివరిస్తారు. నంబి సంతోషించి, శ్రీరామనుజులను తమ ఆచార్యులుగా స్వీకరించి, పరమానందముతో వారికి “శ్రీవైష్ణవ నంబి” అన్న నామధేయాన్ని ప్రసాదిస్తారు.

అనంతరం, ఉడయవర్లు తిరువణ్పరిసారం, తిరువాట్టాఱు, తిరువనంతపురాన్ని సేవిస్తారు.  వారు తిరువనంతపురంలో ఒక మఠాన్ని స్థాపించి, ఆ ప్రాంతంలో అనేక తత్వవేత్తలపై గెలుపుని సాదిస్తారు. ఆ తర్వాత వారు ఈ ప్రాంతంలోని ఇతర దివ్యదేశాల పెరుమాళ్ళని సేవించుకొని పశ్చిమ తీరం గుండా వెళ్లి ఉత్తర భారతదేశములోకి ప్రవేశిస్తారు. వారు మథుర, శాలగ్రామం, ద్వారక, అయోధ్య, భద్రికాశ్రమం, నైమిశారణ్యం, పుష్కరం, అలాగే గోకులం, గోవర్ధనం, బృందావనం మొదలైన చోట్ల తమ మంగళశాసనాలు సమర్పిస్తారు, ఎందరో అన్య తత్వశాస్త్ర పండితులను ఓడిస్తారు.

వారు కాశ్మీర్‌ కి చేరుకుని సరస్వతీదేవి స్వయంగా అధ్యక్షత వహించే సరస్వతి భండారానికి (సాహిత్య కేంద్రం) వెళ్తారు. ఆమె స్వయంగా ఉదయవర్లని స్వాగతించి, ఛాందోగ్య ఉపనిషత్తు శ్లోకమైన  “తస్య యతా కప్యాసం” అర్ధాన్ని వివరించమని అడుగుతుంది (బాల్యంలో  శ్రీరామానుజులకు వారి గురువులు యాదవ ప్రకాశులకు మధ్య ఈ శ్లోకము కారణాగానే విభేదాలు తలెత్తుతాయి). ఉడయవర్లు దానికి లోతైన వివరణ ఇచ్చి సరైన అర్థాన్ని స్థాపిస్తారు. సరస్వతి దేవి ఆ వివరణతో ఎంతో సంతోషించి, శ్రీభాష్యాన్ని (బ్రహ్మ సూత్ర వ్యాఖ్యానం) తన శిరస్సుపై ఉంచి వారిని స్తుతిస్తుంది. వారికి “శ్రీ భాష్యకారర్” అనే బిరుదుతో కీర్తించి, శ్రీ హయగ్రీవ భగవానుడి అర్చామూర్తిని వారికి అందజేస్తుంది. తాను ఎందుకు అంత సంతోషించారని ఉడయవర్లు అడిగినప్పుడు, సరస్వతి దేవి బదులిస్తూ – గతంలో శంకరుడు ఆమెను దర్శించాలని  వచ్చినపుడు అదే శ్లోకానికి అర్థాన్ని అడుగగా, వారు దానిని ఖచ్చితమైన వివరణ ఇవ్వలేక అసంబద్ధమైన వివరణ ఇచ్చారు. ఆమె “నాకు నచ్చిన సరైన అర్థాన్ని నీవు వివరించినందున, నేను సంతోషిస్తున్నాను” అని తెలుపుతుంది. ఇది చూసిన పండితులు ఉత్తేజితులై ఉడయవర్లతో వివాదానికి దిగుతారు. ఉడయవర్లు వాళ్ళందరినీ చర్చలో ఓడించి సిద్దాంతాన్ని పునః స్థాపిస్తారు. ఇది చూసిన ఆ ప్రాంతపు రాజు దిగ్భ్రాంతులై ఉడయవర్లకి శిష్యులౌతారు. చర్చలో ఓడిన పండితులు కోపంతో ఉడయవర్లకి చేతబడి చేసి చంపడానికి ప్రయత్నిస్తారు. కానీ అది వారిపై తిరగబడి వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకోవడం ప్రారంభిస్తారు. రాజు వచ్చి అందరినీ కాపాడమని ఉడయవర్లని అభ్యర్థించగా, వాళ్ళని చివరకు వారు శాంతపరచుతారు. వారందరూ ఉడయవర్ల శిష్యులుగా మారతారు.

తరువాత వారు వారణాసికి వెళ్లి గంగలో పవిత్ర స్నానం గావించుకొని కణ్డమెన్నుం కడి నగరం దివ్య దేశ పెరుమాళ్ళని దర్శించుకుంటారు. తరువాత పురుషోత్తమ ధామన్ (జగన్నాథ పురి) కి చేరుకుని జగన్నాధ ఎంపెరుమానుడికి మంగళశాసనాలు సమర్పించుకుంటారు. మాయావాద సిద్దాంత వేత్తలను ఓడించి అక్కడ ఒక మఠాన్ని స్థాపిస్తారు. ఆపై వారు శ్రీ కూర్మము, సింహాద్రి, అహోబిలం మొదలైన క్షేత్రలను దర్శిస్తారు.

వారు చివరికి తిరుమలకి చేరుకుంటారు. ఆ సమయంలో, కొంతమంది శైవులు మూలవర్లైన తిరువేంకటేశ్వరులు రుద్ర స్వరూపులని ఒక సమస్య తలెత్తుతారు. ఉడయవర్లు అప్పుడు ఇలా అంటారు – “మీరు మీ స్వామి ధరించే విశేష ఆయుధాలు/చిహ్నాలను వారి ముందు ఉంచండి, మేము వారి ముందు శంఖ చక్రాలని ఉంచుతాము. వారికి నచ్చిన ఆయుధాలని ఎంచుకొని తన స్వరూపాన్ని వారినే స్వయంగా నిర్ణయించుకోనివ్వండి.” అని అంటారు. అందరినీ సన్నిధిలో నుండి బయటకు పంపించి, తాళం వేసి ఆ రాత్రికి అందరూ వెళ్లిపోతారు. వాళ్ళు ఉదయాన్నే తిరిగి వచ్చి తలుపు తెరిచి చూచి నపుడు, ఉడయవర్లు మరియు ఇతర శ్రీవైష్ణవులు సంతోషపడేలా భగవానుడు శంఖ చక్రాలతో అలంకృతులై ఉంటారు. ఆ తర్వాత ఉడయవర్లు తిరుపతికి దిగి వచ్చి అక్కడి నుండి ముందుకి తన ప్రయాణాన్ని కొనసాగిస్తారు.

ఆ తరువాత వారు ఆ ప్రాంతములోని కాంచీపురం, తిరువల్లిక్కేణి, తిరునీర్మలై మొదలైన ఇతర దివ్య దేశాలను సేవిస్తారు. ఆపై వారు మధురాంతకము చేరుకొని తొండై మండలములోని అనేక పండితులను జయించుతారు. తరువాత తిరువహీంద్రపురం మరియు కాట్టుమన్నార్కోయిల్ దివ్య దేశాలను దర్శిచారు.

ఈ విధంగా, వారు అనేక దివ్య దేశాలను సేవించి తమ యాత్రని పూర్తి చేసుకొని తిరిగి శ్రీరంగానికి చేరుకుంటారు. శ్రీ రంగములో అమలనాదిపిరాన్ ని పఠించి పెరియ పెరుమాళ్ళని సేవిస్తారు. పెరియ పెరుమాళ్ళు వారి క్షేమాన్ని అడగగా, “నిత్యము నీ చింతన చేసే మాకు, చింతలు ఉండవు” అని ఉడయవర్లు బదులిస్తారు. వారు శ్రీ రంగములోనే ఉంటూ వారి నిత్య కైంకర్యాలను నిర్వహించసాగుతారు.

భట్టర్ల జననం

శ్రీరంగంలో ఈ సమయంలో, ఒక రోజు కూరత్తాళ్వాన్  వర్షం కారణంగా తన భిక్షాటన కోసం బయటకు వెళ్లలేకపోయారు. వారు తన సాయంత్రం అనుష్టానాలను పూర్తి చేసుకొని, ఆ పూటకి ప్రసాదాన్ని తీసుకోలేదు. రాత్రి అయ్యింది, నంపెరుమాళ్ళ ఆలయములో నైవేధ్య ఘంటానాదము మ్రోగిస్తున్నారు. వారి ధర్మ పత్ని ఆండాళ్, తన భర్త యొక్క ఈ స్థితికి దుఃఖిస్తూ, “మీ భక్తుడు ఇక్కడ ఉపవాసం ఉన్నాడు, నీవు అక్కడ విందు భోజనము చేస్తున్నావు” అని నంపెరుమాళ్ళతో ఆమె మొరపెట్టుకుంది. ఆమె మనోభావన అర్థం చేసుకున్న నంపెరుమాళ్ళు వెంటనే తన సేవకులతో ప్రసాదాన్ని ఆళ్వాన్ తిరుమాలిగకి పంపుతాడు. వారి రాకతో ఆళ్వాన్ ఆశ్చర్యపోయి అతని భార్య వైపు చూడగా, ఆమె జరిగిన విషయం వెల్లడిచేసింది. తన దుస్థితిని ఎంపెరుమానుడిపై మోపడం ఆళ్వాన్ కి నచ్చలేదు. అయినా కనీ వారు 2 గుప్పిళ్ళ ప్రసాదము తీసుకొని, కొంత తాను తిని మిగిలినది తన భార్యకు ఇచ్చారు. ఈ రెండు గుప్పిళ్ళ ప్రసాదముతో  ఆండాళ్ ఇద్దరు అందమైన శిషువులకు జన్మనిస్తుంది. 11 రోజుల అశౌచం తరువాత, 12 వ రోజున, ఎంబార్ మరియు ఇతర శ్రీవైష్ణవులతో కలిసి ఎంపెరుమానార్లు ఆ శిశువులను ఆశీర్వదించడానికి ఆళ్వాన్ నివాసానికి ఆసక్తిగా వెళ్ళారు. ఎంబార్ని పిల్లలను తన వద్దకు తీసుకురమ్మని ఎంపెరుమానార్లు చెప్పాగా, ఎంబార్ భట్టర్ని తన చేతిలో తీసుకుని వస్తారు. ఎంపెరుమానార్లు  పిల్లలను ప్రేమగా తన చేతిలో తీసుకొని ఆశీర్వదిస్తారు. వారు ఎంబార్‌తో ఇలా అంటారు “ఈ బిడ్డలో ఒక దివ్యమైన కాంతిని నేను చూస్తున్నాను, ఒక దివ్య సుగంధము వెదజల్లుతున్నాడు. నీవు ఏమైనా చేశావా?” అని అడుగుతారు. ఎంబార్ సమాధానమిస్తూ “నేను ఈ పిల్లలకు రక్షణగా ద్వయ మహా మంత్రాన్ని పఠించాను” అని అంటారు. “ఓ, నీవు నాకంటే ఒక అడుగు ముందే ఉన్నావు. నీవే ఈ పిల్లలకి ఆచార్యునిగా ఉండు” అని ఎంపెరుమానార్లు ఎంబార్ని ఆదేశిస్తారు. ఆపై వారు పరాశర మహర్షి, వేదవ్యాస మహర్షి జ్ఞాపకార్థం ఆ పిల్లలకి “పరాశర భట్టర్” , వేదవ్యాస భట్టర్  , అని నామకరణం చేసి ఆళవందార్లకు తాను చేసిన రెండవ ప్రతిజ్ఞని నెరవేరుస్తారు. తమ పర్యవేక్షణలో ఎంబార్ల తో పిల్లలకి  సమాశ్రయణం చేస్తారు. వారు పరాశర భట్టర్ని పెరియ పెరుమాళ్ (శ్రీ రంగనాథుడు) పెరియ పిరాట్టి (శ్రీ రంగనాయకి) వారికి దత్తతు ఇవ్వమని ఆళ్వాన్ని ఆజ్ఞాపించారు. ఆళ్వాన్ అంగీకరిస్తారు. పరాశర భట్టర్ పసితనమంతా పెరియ పిరాట్టి చూసుకున్నది, పెరియ పెరుమాళ్ళ ముందు నైవేద్యము ఉంచినప్పుడు, పెరుమాళ్ళకు ముందే నేరుగా భట్టర్ తన చేతిని కుండలో పెట్టి తినేవారు, పెరియ పెరుమాళ్ళు సంతోషంగా ఆ తర్వాత భోగాన్ని స్వీకరించేవారు. భట్టర్ అతి చిన్న వయస్సులోనే అత్యంత తెలివైన వ్యక్తిగా ఎదిగి, ఎంపెరుమానార్లు మరియు ఎంబార్ల కాలము తర్వాత మన సంప్రదాయానికి నాయకుడు అవుతారు.
ఎంబార్ల పూర్వాశ్రమ సోదరుడు, శిరియ గోవింద ప్పెరుమాళ్ళ భార్య ఒక బిడ్డకు జన్మనిస్తుంది,  ఎంపెరుమానార్లు అతనికి “శ్రీ పరాంకుశ” అని నామకరణం చేసి, ఆళవందార్లకి తాను ఇచ్చిన మూడవ ప్రతిజ్ఞని నెరవేర్చుతారు.
ముదలియాండాన్ ఎంపెరుమానార్ల పట్ల ఎంతో భక్తి భావముతో ఉండేవారు. ఎంపెరుమానార్లు కూడా అతని పట్ల ఎంతో ప్రేమతో ఉండేవారు. పెరియ నంబి కుమార్తె అయిన అత్తుళాయ్ ఇంట్లో పని మనిషిగా వెళ్లమని ఆదేశించినప్పుడు, సంశయం లేకుండా, వారు ఎంపెరుమానార్ల ఆదేశాలను పాటిస్తారు.
ఎంపెరుమానార్ల ఆచార్యులైన పెరియనంబి, ఆళవందార్ల ప్రియ శిష్యుడు మాఱనేర్ నంబి యొక్క చరమ సంస్కారాలు చేసినప్పుడు, స్థానిక శ్రీవైష్ణవులు వారిని విరోధిస్తారు. ఎందుకంటే పెరియ నంబి ఒక బ్రాహ్మణుడు,  మాఱనేర్ నంబి ఒక నీచ జాతికి  చెందినవాడు. వాళ్ళు వెళ్లి ఎంపెరుమానార్లకి ఫిర్యాదు చేస్తారు. ఎంపెరుమానార్లు పెరియ నంబిని పిలిచి వివరణ అడుగగా, పెరియ నంబి మాఱనేర్ నంబి యొక్క గొప్పతనాన్ని వివరించి తాను చేసినది సబబేనని సమర్థిస్తారు.  ఎంపెరుమానార్లు సంతోషించి, అక్కడ ఉన్న అందరితో, తాను పెరియనంబితో ఎల్లప్పుడూ ఏకీభవిస్తానని, కానీ అందరికీ తెలియజెప్పుడానికి మాత్రమే వారి నుండి ఈ వివరణ కోరారని తెలియజేస్తారు.

తిరునారాయణపురం యాత్ర

ఈ సమయంలో, అందరూ శ్రీరంగంలో ఎమ్పెరుమానార్ల మార్గదర్శకత్వంలో సంతోషంగా జీవిస్తున్నప్పుడు, శైవ సిద్దాంత సంబంధం ఉన్న దుష్ట రాజు శివుడి ఆధిపత్యాన్ని స్థాపించాలని ఆశిస్తారు. పండితులందరినీ పిలిచి, శివ ఆధిపత్యాన్ని స్వీకరించి హస్థాక్షేపము చేయమని బలవంతం చేసేవారు. ఆళ్వాన్‌ శిష్యుడైన నాలురాన్ రాజుతో ఇలా అన్నాడు: “అజ్ఞానుల అంగీకారం వల్ల ఏమి లాభము? మీరు శ్రీరామనుజులు మరియు ఆళ్వాన్ని  అంగీకరింప గలిగితే మాత్రమే అది నిజం అవుతుంది. అది విన్న రాజు శ్రీరామనుజులను రాజభవనానికి తీసుకురమ్మని వారి మఠానికి తన సైనికులను పంపుతారు. ఆ సమయంలో శ్రీరామనుజులు వారి స్నానం కోసం వెళ్ళగా, మఠం ఉన్న ఆళ్వాన్ రాజు ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకుంటారు. శ్రీరామనుజుల వలె కాషాయ వస్త్రాలు ధరించి, వారి త్రిదండం చేతపట్టుకొని రాజ బటులతో రాజ భవనానికి వెళతారు. తరువాత మఠానికి తిరిగి వచ్చిన శ్రీరామనుజులు జరిగిన విషయం గురించి తెలుసుకుంటారు. రానున్న ఆపద కారణంగా అక్కడి నుంచి వెళ్లిపోమని హెచ్చరించబడతారు. వారు ఆళ్వన్ వారి శ్వేత వస్త్రాలను ధరించి తమ శిష్యులతో కలిసి శ్రీరంగం నుండి వెళ్లిపోతారు. వారు తప్పించుకున్న విషయం తెలుసుకున్న కొందరు సైనికులు వారిని వెంబడించడం ప్రారంభించారు. కానీ శ్రీరామనుజులు కొంత ఇసుకను చేతిలోకి తీసుకొని పవిత్రం చేసి వారి శిష్యులకు అందించి సైనికులు వచ్చే దారిలో చల్లమని ఆదేశిస్తారు. సైనికులు ఆ ఇసుక మీద అడుగుపెట్టగానే తీవ్ర నొప్పిని అనుభవించి వారిని వెంటాడటం మానుకుంటారు. 
అప్పుడు ఎమ్పెరుమానార్లు సురక్షిత ప్రదేశంగా భావించి మేల్కోటె (తిరునారాయణపురం) వైపు ప్రయాణం మొదలుపెడతారు. అడవి మార్గంలో, వారు నల్లాన్ చక్రవర్తిచే (ఎమ్పెరుమానార్ల శిష్యుడు) నిర్దేశించబడిన కొందరు వేటగాళ్ళని కలుస్తారు. అప్పటికి 6 రోజులు కాలినడకన ప్రయాణిస్తూ ఆకలితో ఉన్న వీరిని  వాళ్ళు స్వాగతిస్తారు. వారు ఎమ్పెరుమానార్ల యోగ క్షేమాలను అడిగి, వారు ఆ శ్రీవైష్ణవులతో ఉన్నారని తెలుకొని,  ఎమ్పెరుమానార్ల దర్శనము పొంది పునీతులౌతారు. వాళ్ళు కొంచం తేనె మరియు ధాన్యం అందించగా, వాటిని ఎమ్పెరుమానార్ల మినహా అందరూ స్వీకరిస్తారు. వాళ్ళని సమీప గ్రామంలో బ్రాహ్మణ కుటుంబం ఉండే చోటికి తీసుకొనివెళ్లి వారి భోజనము కోసం ముడి పదార్థాలను వారికి అందేలా చేస్తారు.
అక్కడ ఉన్న బ్రాహ్మణుడి (కొంగిలాచ్చాన్) భార్య అందరికీ తన ప్రణామాలను అందించి,  వండిన ప్రసాదాన్ని స్వీకరించమని ప్రార్థించింది. తాము అందరి నుండి స్వీకరించలేమని చెప్పి శ్రీవైష్ణవులు ఆహారాన్ని స్వీకరించడానికి నిరాకరించారు. వెంటనే ఆమె తాను ఎమ్పెరుమానార్ల శిష్యురాలని, కొంతకాలం క్రితం శ్రీరంగంలో ఉన్నప్పుడు తాను ఎమ్పెరుమానార్ల చేత సమాశ్రయణం పొందానని వివరించింది. నేను శ్రీరంగంలో ఉండే ఆ రోజుల్లో రాజులు, వారి మంత్రులు వచ్చి ఎమ్పెరుమానార్ల  ఆశీర్వాదాలు తీసుకునేవారు. కానీ వారు ప్రతి రోజూ భిక్షాటనకి వెళ్లేవారు. “ఎందుకు ఈ వ్యత్యాసము?” అని నేను వారిని అడిగినప్పుడు వారు, “వారికి నేను భగవత్ జ్ఞానం ప్రసాదిస్తాను” అని తెలిపారు. అదే జ్ఞానము నాకు కూడా ప్రసాదించమని నేను వారిని ప్రార్థించగా వారు నన్ను సంప్రదాయంలోకి ప్రవేశపెట్టారు. మేము మా స్వస్థలానికి తిరిగి రావాల్సి వచ్చినప్పుడు, వారి ఆశీర్వాదాలు కోరగా, వారు నాకు తమ దివ్య పాదుకలను అనుగ్రహించారు. తరువాత మేము ఇక్కడే ఉండిపోయాము. ఇదంతా విన్న ఎమ్పెరుమానార్లు (తను ఎవరో వెల్లడి చేయకుండా), తన వెంట వచ్చిన శ్రీవైష్ణవులను ఆమె తయారు చేసిన ప్రసాదాన్ని  స్వీకరించమని ఆదేశిస్తారు. కానీ ఆమె కదలికని గమనించమని వారు ఒక శ్రీవైష్ణవుడిని నియమిస్తారు. ఆమె వంట పూర్తి చేసి, పుజ గదిలోకి వెళ్లి, కోయిళ్ ఆళ్వాన్ (పూజ గది) ఎదుట ధ్యానం చేసింది. అర్చామూర్తి భిన్నంగా ఉన్నట్టు ఆ శ్రీవైష్ణవుడు గమనించి ఎమ్పెరుమానార్లకి ఈ విషయాన్ని తెలియజేస్తారు. లోపల ఏమి చేశావని ఎమ్పెరుమానార్లు ఆమెను ప్రశ్నించగా ఆమె సమాధానమిస్తూ “ఎమ్పెరుమానార్లు నాకు ఇచ్చిన దివ్య పాదుకలకు నా ప్రార్థనలు సమర్పించాను, వారికి నైవేధ్యాన్ని అర్పించాను” అని తెలుపుతుంది. వాటిని బయటకు తీసుకురమ్మని అడుగగా, ఆమె తెచ్చిన పాదుకలని గమనించి అవి తనవేనని వారు గుర్తిస్తారు. అప్పుడు వారు ఆమెను “ఎమ్పెరుమానార్లు ఇక్కడ ఉన్నారని నీకు తెలుసా?” అని అడుగగా ఆమె దీపం వెలిగించి అందరి పాదాలను పరిశీలిస్తుంది. ఆమె ఎమ్పెరుమానార్ల దివ్య చరణాలను చూసి పరమానందంతో “ఇవి ఎమ్పెరుమానార్ల దివ్య తిరువడి లాగా ఉంది, కానీ మీరు తెల్ల వస్త్రాలు ధరించి ఉన్నందున నేను గుర్తించలేకపోతున్నాను” అని తెలుపుతుంది. ఎమ్పెరుమానార్లు తమ  గుర్తింపు ఆమెకు వెల్లడి చేసి తాను ఉపదేశించిన సూచనలను తిరిగి చెప్పమంటారు. ఆమె సంతోషంగా వారికి చెప్పగా,  వారు అందరినీ ప్రసాదం తీసుకోమని అనుమతిస్తారు. స్వయంగా వారు మాత్రం భగవానుడికి అర్పించలేదని స్వీకరించరు. అప్పుడు ఆమె కొన్ని పండ్లు, పాలు, బెల్లము వారికి అందించగా వారు వాటిని తమ పెరుమాళ్ళకి సమర్పించిన తరువాత వారు భుజిస్తారు. ఆమె ఆ భాగవతులందరి శేషాన్ని తీసుకొని తన భర్తకు అందజేస్తుంది, కానీ ఆమె తినదు. ఆమె భర్త ఎందుకు అని అడిగినప్పుడు,  “మీరు  ఎమ్పెరుమానార్లను మీ ఆచార్యగా ఇంకా స్వీకరించలేదు. వారు ఎంతో దూరము నుండి మన ఇంటికి వేంచేశారు. మీరు వారిని ఆచార్యులుగా స్వీకరిస్తానని హామీ ఇస్తేనే నేను ప్రసాదం తీసుకుంటాను” అని ఆమె చెప్పగా వారు ఒప్పుకున్న తరువాత ఆమె ప్రసాదం స్వీకరిస్తుంది. మర్నాడు ఉదయం, వారు ఎమ్పెరుమానార్ల వద్దకు వెళ్లి వారికి శరణాగతులౌతారు. ఎమ్పెరుమానార్లు అతనికి మంత్రం ఉపదేశించి శిష్యుడిగా స్వీకరిస్తారు. ఎమ్పెరుమానార్లకు కాషాయ వస్త్రం మరియు త్రిదండం లభిస్తుంది, అక్కడ కొన్ని రోజులు ఉండి, తరువాత పశ్చిమం వైపు ముందుకి తమ ప్రయాణం ప్రారంభిస్తారు.
వారు శాలగ్రామం చేరుకున్నారు. ఆ రోజుల్లో ఆ ప్రదేశము బౌద్ధులు మరియు జైనులతో నిండి ఉండేది. వాళ్ళు శ్రీరామనుజులను పెద్దగా పట్టించుకునే వారు కాదు. అక్కడ ఉన్న చెరువులో తమ దివ్య పాదాలను కడగమని వారు ముదలియాండాన్ ని ఆదేశిస్తారు. ఎమ్పెరుమానార్ల పాద తీర్థముతో పవిత్రమైన ఆ చెరువు నీటిని తీసుకున్న ప్రతి ఒక్కరూ ఎమ్పెరుమానార్ల వైపు ఆకర్షితులయ్యారు. వడుగ నంబి, ఎమ్పెరుమానార్లు తన సర్వస్వంగా భావించి ఆచార్య భక్తికి గొప్ప నిదర్శనమౌతారు. ఆ తర్వాత వారు తొండనూర్ చేరుకొని అక్కడ విఠ్ఠల దేవరాయుల (ఆ ప్రాంతపు రాజు) కుమార్తెని పట్టి పీడుస్తున్న దెయ్యం నుండి ఆమెను విముక్తులను చేస్తారు. ఆ రాజు తమ సపరివార సమేతంగా ఎమ్పెరుమానార్ల శిష్యులౌతారు, ఆ రాజుకి విష్ణు వర్ధన రాయ అన్న నామాన్ని అనుగ్రహిస్తారు. ఇది విన్న 12000 మంది జైన సిద్దాంత వేత్తలు ఎమ్పెరుమానార్లతో వాద్వివాద చర్చకు దిగి వస్తారు, ఎమ్పెరుమానార్లు తమకి వారికి మధ్య ఒక తెర ఉంచి వారందరితో ఒకేసారి చర్చించారు. తెర వెనుక, తమ వేయి పడగల ఆదిశేష రూపాన్ని దాల్చి వారి ప్రశ్నలన్నింటికీ ఒకేసారి సమాధానం ఇస్తారు. ఓడిపోయిన అనేక పండితులు వారి శిష్యులుగా మారతారు. రాజు కూడా ఎమ్పెరుమానార్లని కీర్తిస్తారు.
ఈ విధంగా, ఎమ్పెరుమానార్లు తొండనూర్లో ఉండ సాగారు, వారి తిరుమణ్ నిండుకుందని విచారించ సాగారు. వారు నిద్రిస్తుండగా తిరునారాయణపురం పెరుమాళ్ళు తన కలలో కనిపించి, “తిరునారాయణపురంలో నేను నీ కోసం ఎదురు చూస్తున్నాను. ఇక్కడ తిరుమణ్ కూడా ఉంది” అని అంటారు. రాజు సహాయంతో, ఎమ్పెరుమానార్లు తిరునారాయణపురానికి చేరుకుని పెరుమాళ్ళని సేవించడానికి వెళ్తారు. కానీ ఆశ్చర్యంగా అక్కడ దేవాలయం లేదని గమనిస్తారు. అలసట తీర్చుకోడానికి కాసేపు విశ్రమించగా, ఎంపెరుమాన్ మళ్లీ తన కలలో కనిపించి తాను భూస్థాపితమైన అసలు స్థానాన్ని చూపుతారు. ఎమ్పెరుమానార్లు తవ్వి పెరుమాళ్ళని వెలికితీసి, నమ్మాళ్వార్లు తమ తిరువాయ్మొళిలో  తిరునారణన్ ఎంపెరుమాన్ ని కీర్తిస్తూ సమర్పించిన “ఒరు నాయగమాయ్” పదిగాన్ని అర్పిస్తారు. వారికి  తిరుమణ్ కూడా లభిస్తుంది, తమ శరీరంపై పన్నెండు చోట్ల ఆ తిరుమణ్ ని ధరిస్తారు. పిదప ఆ పట్టణాన్ని ఖాలీ చేయించి, దేవాలయాన్ని పునః నిర్మించి, అక్కడ పెరుమాళ్ళ సేవకై అనేక అర్చకులను ఏర్పాటు చేస్తారు.
ఉత్సవ విగ్రహం లేకపోవడం వలన, ఉత్సవాల నిర్వహణకి అవకాశం లేనందున ఎమ్పెరుమానార్లు విచారిస్తుండగా, పెరుమాళ్ళు మళ్లీ వారి కలలో కనిపించి, “ఢిల్లీ బాద్ షా రాజ భవనంలో రామప్రియుడు (ఉత్సవ మూర్తి) ఉన్నాడని” వెల్లడి చేస్తారు. వెంటనే ఎమ్పెరుమానార్లు ఢిల్లీక్ఇ వెళ్లి, విగ్రహాన్ని తిరిగి ఇవ్వమని రాజును కోరతారు. రాజు వారిని తన కుమార్తె యొక్క అంతఃపురానికి తీసుకువెళ్లి విగ్రహాన్ని చూపిస్తారు. ఆ రాజ కుమార్తె ఆ విగ్రహాన్ని ఎంతో ప్రేమగా చూసుకుంటుంది. పెరుమాళ్ళని చూసి సంతోషించిన ఎమ్పెరుమానార్లు “చెల్లప్పిళ్ళై ఇటురా” అని పిలుస్తారు. పెరుమాళ్ళు ఒక్కసారిగా బయటకు దూకి ఎమ్పెరుమానార్ల ఒడిలోకి వచ్చి కూర్చుంటారు. బాద్ షా ఆశ్చర్యపోతారు, అనేక ఆభరణాలు మొదలైన వాటిని పెరుమాళ్ళకి సమర్పించి, వారిని ఎమ్పెరుమానార్లతో పాటు పంపుతారు. పెరుమాళ్ళ నుండి వీడి ఆ రాజ కుమారి విరహ వేదనని భరించలేక  ఎమ్పెరుమానార్ల గోష్టిని అనుసరించడం ప్రారంభిస్తుంది. తిరునారాయణపురం సరిహద్దులో, పెరుమాళ్ళు ఆమెను ఆండాళ్ని స్వీకరించినట్లుగా ఈ రాజ కుమారిని తనలోకి స్వీకరిస్తారు. ఎమ్పెరుమానార్లు ఆమెకి తుళుక్క నాచియార్ అన్న నామాన్ని ఇచ్చి పెరుమాళ్ళ దివ్య తిరువడి వద్ద ఆమె ప్రతిష్ఠ చేస్తారు. ఉత్సవ విగ్రహాన్ని ఆలయం లోపల పునః ప్రతిష్ఠాపన చేసి అక్కడ ఉత్సవాలను నిర్వహిస్తారు.

శ్రీరంగానికి తిరిగి వచ్చుట

ఈ విధంగా, వారు పన్నెండు సంవత్సరాలు తిరునారాయణపురంలో ఉండి అనేక కైంకర్యాలలో పాల్గొని మన సంప్రదాయ అభివృద్ధి కోసం అనేక శ్రీవైష్ణవులను పోషించారు. శైవరాజు మరణించాడని శ్రీరంగంలోని మారుతి శిఱియాండాన్ ద్వారా విని వారు సంతోషిస్తారు. వారు శ్రీరంగానికి తిరిగి వెళ్ళాలని నిర్ణయించుకుంటారు. వారి శ్రీరంగ ప్రయాణం గురించి విన్న తిరునారాయణపుర శిష్యులు దుఃఖ సాగరంలో మునిగిపోతారు. ఎమ్పెరుమానార్లు వారిని ఓదార్చి వారి కోరిక తీర్చడానికి, అక్కడ తమ విగ్రహం ప్రతిష్టాపనకి ఆమోదము పలుకుతారు. ఈ విగ్రహాన్ని “తమర్ ఉగంద తిరుమేని” అని కీర్తిస్తారు. అనంతరం వారు తిరునారాయణపురం నుండి బయలుదేరి శ్రీరంగం చేరుకొని పెరియ పిరాట్టి మరియు పెరియ పెరుమాళ్ళకి మంగళశాసనం చేసి, మన సంప్రదాయ పోషణ శ్రీరంగం నుండి కొనసాగిస్తారు.
శ్రీరంగంలో, పెరియ పెరుమాళ్ళకి మంగళశాసనం చేసి, ఆలయ ప్రదక్షిణ చేస్తూ తమను తాము పునరుజ్జీవనం చేసుకుంటూ, అన్య శ్రీవైష్ణవులతో పాటు ఉడయవర్లు కూరత్తాళ్వాన్ల తిరుమాలిగకి వెళతారు. ఆళ్వాన్ ఎంతో భక్తితో, ఉడయవర్ల దివ్య పాదాలపై పడి, పట్టుకుని అక్కడే మైమరచి పడుంటారు. ఉడయవర్లు వారిని పైకి లేపి భావపూరులై వారిని ఆలింగనం చేసుకుంటారు, వారి నేత్రములు కోల్పోయిన కూరత్తాళ్వాన్లని చూస్తూ బాధతో మూగబోతారు. వారి కళ్ళ నిండా నీళ్ళు మరియు వణుకుతున్న కంఠ స్వరంతో, వారు ఆళ్వాన్తో “మన దర్శనం (సంప్రదాయం) కోసం, నీవు నీ  దర్శనం (కళ్ళు) కోల్పోయావు” అని బాధతో అంటారు. “నా అపచారాల పరిణామమే ఇది” అని ఆళ్వాన్ వినయంగా అంటారు. ఉడయవర్లు వారిని ఓదార్చుచూ “నీవు ఎలా అపచారానికి పాల్పడగలవు? దీనికి కారణము నా అపచారమే ఉండాలి” అని అంటారు. చివరికి అందరూ తమను తాము కుదుటపరచుకుంటారు,  ఉడయవర్లు తమ మఠానికి తిరిగి వస్తారు.
ఈ సమయంలో, కొంతమంది శ్రీవైష్ణవులు ఉడయవర్ల వద్దకు వచ్చి, తిరుచిత్రకూటం (ఇప్పుడు చిదంబరం అని ప్రసిద్ధి చెందింది) ఆలయాన్ని కొందరు దుర్మార్గులు [శైవులు] ధ్వంసం చేశారని కబురందిస్తారు. పెరుమాళ్ళ ఉత్సవ మూర్తిని సురక్షితంగా తిరుపతికి చేర్చారని వారు తెలుసుకుంటారు. వెంటనే వారు తిరుపతికి బయలుదేరి, శ్రీ గోవిందరాజ పెరుమాళ్ళ మందిర నిర్మాణానికి ఆదేశిస్తారు, గోవిందరాజ పెరుమాళ్ళని పోలి ఉండే నూతన మూల మూర్తిని ప్రతిష్ఠిస్తారు. తిరుమలలో తిరువెంకటేశ్వరునికి మంగళశాసనాలు అందించి, శ్రీరంగానికి బయలుదేరుతారు. మార్గంలో కాంచీపురంలో ఆగి, దేవ పెరుమాళ్ళకి  మంగళశాసనాలు అందించి తిరిగి శ్రీరంగం చేరుకుంటారు. మన సంప్రదాయ పోషణ శ్రీరంగం నుండి కొనసాగిస్తారు.
అనంతరం, ఉడయవర్లు ఆళ్వాన్ని పిలిచి, సమస్థ కోరికలను నెరవేర్చగల దేవ పెరుమాళ్ళని సేవించి తాను కోల్పోయిన దృష్టిని తిరిగి ప్రసాదించమని దేవ పెరుమాళ్ళని ప్రార్థించమని ఆదేశిస్తారు. ఆళ్వాన్ సంకోచిస్తారు కానీ ఉడయవర్లు వారిని అలా చేయమని బలవంతం చేయగా, ఆళ్వాన్ వరదరాజ స్థవం అనుసందానము చేసి, చివరికి తన అంతరంగ నేత్రాలతో పెరుమాళ్ళని చూడాలని ప్రార్థిస్తారు. పెరుమాళ్ళు సంతోషంగా వారికి ఆ వరాన్ని ప్రసాదిస్తారు, ఈ విషయాన్ని ఆళ్వాన్  ఉడయవర్లకి వివరిస్తారు. ఉడయవర్లు దానితో సంతృప్తి చెందకుండా, ఆళ్వాన్ని కాంచీపురానికి తీసుకువచ్చి దేవ పెరుమాళ్ళ ఎదుట  వరదరాజ స్థవం పూర్తిగా పఠించమని ఆళ్వాన్ని కోరుతారు. ఉడయవర్లు మరొక కార్య పూర్తికై వేరొక చోటికి వెళ్ళగా, ఆ సమయంలో ఆళ్వాన్ తన  పారాయణం పూర్తి చేస్తారు. దేవ పెరుమాళ్ళు తన కోరిక ఏమిటో అడగమంటారు. “నేను పొందిన ఫలము నాలూరాన్ కూడా పొందాలి” అని అంటారు. దేవ పెరుమాళ్ అనుగ్రహిస్తారు. ఉడయవర్లు తిరిగి వచ్చి జరిగిన విషయాన్ని తెలుకొని తన కోరికను పాటించనందుకు పెరుమాళ్ళు మరియు ఆళ్వాన్ ఇద్దరినీ ఆగ్రహిస్తారు. దేవ పెరుమాళ్ళు అప్పుడు దేవ పెరుమాళ్ళని మరియు ఉడయవర్లను ఇరువురినీ చూసేలా దృష్టిని ఆళ్వాన్ కి ప్రసాదిస్తారు. ఆళ్వాన్ పునీతులై దేవ పెరుమాళ్ళ దివ్య అలంకరణ, ఆభరణాలు మొదలైనవి దర్శిస్తారు.  ఉడయవర్లు సంతృప్తి చెందుతారు.

కోయిల్ అణ్ణర్

ఉడయవర్లు నాచియార్ తిరుమొళి అర్థాల ఉపన్యాసమిస్తున్నప్పుడు, వారు “నాఱు నఱుం పొళిల్” పాశుర అర్ధాన్ని వివరించడం ప్రారంభించారు. ఇది తిరుమాలిరుంజోలై ఎంపెరుమానుడికి 100 ఆండల పాయసము మరియు 100 ఆండల వెన్నను సమర్పిస్తానని ఆండాళ్ కోరికకు సంబంధించిన పాశురమిది. వెంటనే ఉడయవర్లు తిరుమాలిరుంజోలై దివ్య దేశానికి బయలుదేరి ఆండాళ్ తరపున వారు సమర్పిస్తారు. ఆ తర్వాత వారు శ్రీవిల్లిపుత్తూర్కి వెళ్లి ఆండాళ్ రంగమన్నార్ ఎంపెరుమన్ లకి తమ మంగళాశాసనాము సమర్పింస్తారు. ఒక సోదరుడిలా ఉడయవర్లు తన కోరికను నెరవేర్చినందుకు సంతోషించి వారిని”నం కోయిల్ అణ్ణర్” (శ్రీరంగం నుండి వచ్చిన నా అన్న) అని పిలుస్తుంది. ఆ తర్వాత వారు ఆళ్వార్తిరునగరికి వెళ్లి ఆళ్వార్కి మరియు ఆదినాతర్లకి తమ మంగళాశాసనాలు సమర్పించుకొని తిరిగి శ్రీరంగానికి వచ్చి  మన సంప్రదాయ పోషణ శ్రీరంగం నుండి కొనసాగిస్తారు.

వారి శిష్యులు

వారికి ఉన్న అనేక శిష్యులతో పాటు 74 సింహాసనాధిపతులను కూడా వారు స్థాపించారు (సంప్రదాయానికి నాయకత్వం వహించి అందరికీ ఉపదేశాలు ఇచ్చే ఆచార్యులు). వారి కాలంలో, అనేక శ్రీవైష్ణవులు వివిధ కైంకర్యాలలో నిమగ్నమై ఉండేవారు:
  • కూరత్తాళ్వాన్, ముదలియాండాన్, నడాదూర్ ఆళ్వన్, భట్టర్ మొదలైనవారు వారికి శ్రీభాష్య ప్రచారములో సహకరించేవారు. 
  • అరుళాళ ప్పెరుమాళ్ ఎంపెరుమానార్ ఎంపెరుమానార్ల పెరుమాళ్ళకి తిరువారాధనము చేసేవారు. 
  • కిడంబి ప్పెరుమాళ్ మరియు కిడంబి ఆచ్చాన్ తిరుమడప్పళ్ళిని (వంట గది) చూసుకునేవారు. 
  • ఉడయర్ల కోసము తైల తయారీ వడుగ నంబి చూసుకునేవారు. 
  • గోమడత్తాళ్వాన్ ఉడయర్ల పాత్రలు, పాదులను ఎత్తుకెళ్లేవారు. 
  • పిళ్ళై ఉఱంగా విల్లి దాసర్ కరువూలం (ఆభరణాలు మొదలైనవి) చూసుకునేవారు.
  • అమ్మంగి పాలు తయారు చేస్తే ఉక్కలాళ్వాన్ ప్రసాదము పంచిపెట్టేవారు. 
  • ఉక్కలమ్మాళ్ తిరువాలవట్ట (వింజామర) కైంకర్యము చేసేవారు. 
  • మారుతి ప్పెరియాణ్డాన్ ఉడయర్లు ఉపయోగించే చిన్న చిన్న పాత్రలను ఎత్తుకునేవారు.
  • మారుతి చ్చిఱియాణ్డాన్ మఠము కోసము సరుకులు చూసుకునేవారు. 
  • తూయ ముని వేళం పవిత్ర జలాలు తెచ్చేవారు. 
  • తిరువరంగమాళిగైయార్ శ్రీ బండారం చూసుకునేవారు. 
  • వండర్ మరియు సెండర్ (పిళ్ళై ఉఱంగా విల్లి దాసర్ల అల్లుళ్ళు) రాజు వద్ద ఉద్యోగము చేసి ఆ పెద్ద మొత్తాన్ని మఠంలో ఇచ్చేవారు. 
  • ఇరామానుశవేళైక్కారర్ ఉడయవర్లకి అంగ రక్షకుడిగా ఉండేవారు. 
  • అగళంగ నాట్టాళ్వాన్ ఇతర సిద్దాంతపు పండితులతో చర్చలలో పల్గొనేవారు.

వారి కీర్తిని వెల్లడిచేసినవారు

ఉడయవర్ల గొప్పతనాన్ని పెరియ పెరుమాళ్, తిరువేంకటముడైయాన్, పేరరుళాళన్, తిరునారాయణ ప్పెరుమాళ్, ఆళగర్, తిరుక్కుఱుంగుడి నంబి, నమ్మాళ్వార్, శ్రీమన్ నాథమునిగళ్, ఆళవందార్, పెరియ నంబి, తిరుక్కోష్ఠియూర్ నంబి, తిరుమలై నంబి, తిరుమాలై ఆండాన్, ఆళ్వార్ తిరువరంగప్పెరుమాళ్ అరైయర్, వారి అనేక శిష్యులు, బ్రహ్మ రాక్షసి మరియు మూగ వ్యక్తి అందరూ కొనియాడారు. సంక్షేపముగా చూద్దాము.
  • పెరియ పెరుమాళ్ళు ఉడయవర్లకి ఉభయ విభూతులను అనుగ్రహించి వారి అనుచరులకు విరివిగా పంచమని అనుమతించారు. 
  • పెరియ పెరుమాళ్ళు ఉడయవర్లకి అనుగ్రహించిన బిరుదుని పునః దృవీకరిస్తూ  తిరువేంకటముడైయాన్ (తిరుమల తిరుపతి) వారిని “ఉడయవర్” అని స్థాపించారు. వారు ఉడయవర్లకి మాట ఇచ్చినందుకు తుంబైయూ క్కొండి అనే పెరుగు అమ్మే స్త్రీకి మోక్షాన్ని అనుగ్రహించారు. 
  • పేరరుళాళన్ (కాంచీపురం) యజ్ఞమూర్తుల చర్చలో ఓడించేందుకు ఉడయవర్లకి సహాయం చేస్తారు. యాదవ ప్రకాశులకు సమాశ్రయణం చేసి తమ శిష్యులుగా స్వీకరించమని ఆదేశిస్తారు. 
  • తిరునారాయణన్ (మేల్కోటె) ఉడైయవర్లచే ఆ దివ్య క్షేత్రాన్ని పునః నిర్మితం చేయించి, సెల్వ పిళ్ళైని (ఉత్సవర్లు) ఎత్తుకొని ఆలింగనం చేయించుకొని ఉడైయవర్లకి ప్రియ పుత్రుడైనారు.
  • యవర్ల గొప్పతనాన్ని అళగర్ (తిరుమాలిరుంజోలై) రెండు సంఘటనలలో తెలిపారు – ఉయవర్ల ఆచార్య పరంపరలో వస్తున్నారని పెరియ నంబి వారసులను ఉడైయవర్ల శిష్యుల బృందంలో చేరమని ఆదేశించడం, ఉడైయవర్లకి శరణాగతులైన వారు ఎన్నడూ అనాధులు కారు అని కిడంబి ఆచ్చాన్ కి తెలుపుతారు.
  • తిరుక్కుఱుంగుడి నంబి ఉడైయవర్లని తమ ఆచార్యులుగా స్వీకరించి, శ్రీవైష్ణవ నంబిగా ప్రసిద్ధికెక్కారు
  • నమ్మాళ్వార్లు ఈ ప్రపంచంలో బాధపడుతున్న ఆత్మల గురించి చింతించారు, కానీ తర్వాత ఎంపెరుమానార్లు అవతరించబోతున్నారని చూసి సంతోషంగా “పొలిగ! పోలిగ! పోలిగ!” అని పాడారు.
  • శ్రీమన్ నాథమునులు ఇలా అన్నారు – “మనం బోధిస్తే కొద్దిమంది ఆత్మలకు మాత్రమే సహాయపడతాము, కానీ శ్రీరామానుజులు బోధించినట్లయితే, అది అందరికీ ప్రయోజనకరంగా ఉంటుంది, వీర నారాయణపురం సరస్సు పట్టణంలోని అందరికీ ఉపయోగకరంగా ఉన్నట్లు”.
  • ఆళవందార్లు ఉడయవర్లని “ఆం ముదల్వన్ము”(మన సంప్రదాయానికి తగిన నాయకుడు) అని కీర్తించారు.
  • పెరియ నంబి శ్రీరామానుజుల మధ్య ఆచార్య శిష్యుల సంబంధం ఉన్నప్పటికీ వారి గొప్పతనాన్ని పరిగణనలోకి తీసుకుని ఆయనకు నమస్కారం చేశారు.
  • తిరుక్కోష్టియూర్ నంబి ఉడయవర్లకి “ఎంపెరుమానార్” (ఎంపెరుమాన్ కంటే గొప్పైనవాడు) అనే బిరుదును ప్రదానం చేశారు.
  • తిరుమలై ఆండాన్ కి  ఉడయవర్లతో కొన్ని విభేదాలు ఉండేవి. వారు ఉడయవర్ల గొప్పతనాన్ని గ్రహించిన తర్వాత, వారిని గొప్పగా కొనియాడి తన కుమారుడిని ఉడయవర్ల శిష్యుడిగా మారమని ఆదేశించారు.
  • తిరువరంగ ప్పెరుమాళ్ అరైయర్ “ఆచార్య అభిమానం” అనే అతి గోప్యమైన బోధనలను ఉడయవర్లకి వివరిస్తారు, వారి కుమారుడిని ఉడయవర్ల శిష్యుడిగా మారమని ఆదేశించారు.
  • ఉడయవర్ల శిష్యులు వారి దివ్య తిరువడి యందు పూర్తి విశ్వాసాన్ని కలిగి ఉండి, వారినే ఉపాయము మరియు ఉపేయముగా భావించారు.
  • అముదనార్లు ఇరామానుశ నూఱ్ఱందాది రచించారు. క్రమేణా ఈ ప్రబందము నాలాయిర దివ్య ప్రబంధంలో భాగమైంది.
  • బ్రహ్మ రాక్షసుడు (స్థానిక రాజు యొక్క కుమార్తెని ఆవహించిన రాక్షసుడు) యాదవ ప్రకాశులను కాదని శ్రీ రామానుజులను నిత్యసూరులకు నాయకుడని కీర్తించాడు.
  • యవర్ల అనుగ్రహముతో ఒక మూగ వ్యక్తి కొన్ని సంవత్సరాలు అదృశ్యమయ్యాడు, మళ్లీ కనిపించి “ఉయవర్లు మరెవరో కాదు, విశ్వేశ్వరుడు” అని తెలిపి మళ్లీ అదృశ్యమవుతాడు.
  • ఈ విధంగా అనేక మంది ఉయవర్ల గొప్పతనాన్ని చాటారు. శ్రీమన్ నాథమునుల నుండి మొదలు పెట్టి అనేక ఆచార్యులు ఉండగా, ఉయవర్లకి ప్రత్యేక గొప్పతనం ఎందుకు అంటే? ఇది దేని వలన అంటే –భగవానుడు అనేక అవతారాలు ధరించినా, గీతను బోధించడం, శరణగతులకు ఆశ్రయం మొదలైన విశేష లీలల కారణంగా. శ్రీ రాముడు మరియు శ్రీ కృష్ణుడు విశేషంగా కీర్తింపబడ్డారు.
  • అనేక దివ్యదేశాలు ఉన్నప్పటికీ, కోయిల్ (శ్రీరంగం), తిరుమల (తిరుపతి), పెరుమాళ్ కోయిల్ (కాంచీపురం) మరియు తిరునారాయణపురం వంటి క్షేత్రాలకు ఆచార్యుల ప్రత్యేక సంబంధము ఉన్న కారణంగా వారిని విశేషంగా కీర్తించారు.
  • ఎంతో మంది ఋషులు ఉన్నప్పటికీ, వేద వ్యాస భగవాన్, పరాశర భగవాన్, శౌనక భగవాన్, సుఖ భగవాన్, నారద భగవాన్ మొదలగు వారు వేదం, వేదాంతం, పురాణ మరియు ఇతిహాసంలో వారి సహకారం కారణంగా వారిని విశేషంగా కీర్తించారు.
  • అనేక మంది ఆళ్వార్లు ఉన్నప్పటికీ, వాస్థవాలు, సిద్ధాంతాలు మొదలైన వాటిని స్పష్టంగా వెల్లడిచేసినందుకు నమ్మాళ్వార్లని వవిశేషంగా కీర్తించారు.
  • అదేవిధంగా, ఉడయవర్లు ఈ అంశాలన్నింటిలో ముఖ్యమైన సహకారం అందించి మన సిద్ధాంతం మరియు సంప్రదాయానికి బలమైన రహదారి వేసి మన సంప్రదాయానికి విశేషంగా పోషణ అందించారు.

వారి చివరి రోజులు

ఉడయవర్ల శిష్యులందరూ వారి ఆచార్య నిష్ఠ కారణంగా, ఎంపెరుమానార్లు నమ్మాళ్వార్ల తిరువడి కావడం చేత, నమ్మాళ్వార్లు స్వయంగా తమ తిరువాయ్మొళి “పొలిగ పొలిగ పొలిగ” పదిగములో ఎంపెరుమానార్ల అవతార కాలజ్ఞానము చేసినందున ఎంపెరుమానార్ల దివ్య చరణాలకు సంపూర్ణ శరణాగతులై ఉండేవారు. అలాగే, ఆళ్వార్ల తిరువాయ్మొళి ఆధారంగా మన సంప్రదాయాన్ని స్థాపించినందున, ఉడయవర్లను నమ్మాళ్వార్ల విశేష శిష్యుడిగా కీర్తించారు. వారిని ఆళవందార్ల  ప్రియ శిష్యుడిగా కూడా భావిస్తారు, ఎందుకంటే వాళ్ళు ఒకరినొకరు కలుసుకోక పోయినప్పటికీ వారు ఆళవందార్ల  దివ్య హృదయాన్ని పూర్తిగా అర్థం చేసుకొని వారి కోరికలను నెరవేర్చారు.

శ్రీ రామాయణం, విభీషణ శరణాగతి ఘట్టం ద్వారా శరణాగతి సూత్రాన్ని ఉడయవర్లు వివరిస్తున్నప్పుడు, పిళ్ళై ఉఱంగా విల్లి దాసర్ కలవరపడ్డారు. ఉడయవర్లు గమనించి, దాసర్ని కారణమేమిటో అడిగారు. దాసర్లు, ” తన సమస్థం విడిచిపెట్టి శ్రీరాముడికి శరణాగతి చేయాలని వచ్చిన విభీషణుడితో అంత నిరీక్షణ చేయిస్తే, మన స్థితి ఏమిటి? మనకి మోక్షం లభిస్తుందా?” అని అడిగారు. ఉడయవర్ల “నా తనయా విను! నాకు మోక్షం లభిస్తే నీకు మోక్షం లభిస్తుంది; పెరియ నంబి లభిస్తే నాకు లభిస్తుంది; ఆళవందార్లు పొందితే, పెరియ నంబి పొందుతారు, అలా నమ్మాళ్వార్ల వరకు ఇది వర్తిస్తుంది. నమ్మాళ్వార్లు తమకి ముక్తి లభించిందని అప్పుడే తమ తిరువాయ్మొళిలో చాటారు; కాబట్టి నీకు ఖచ్చితంగా మోక్షము లభిస్తుంది ” అని చెప్పి దాసర్లని ఓదార్చారు.

మనకి మోక్ష సాధనము ఎంపెరుమానార్లని, వారిని వారి భక్తులని సేవించుటయే మన లక్ష్యమని రామానుశ నూఱ్ఱందాది దివ్య ప్రబంధంలో అముదనార్లు స్థాపించారు.

భవిష్యత్తులో అందరు కొలిచి పూజించేలా ఎంపెరుమానార్ల అర్చా మూర్తిని చేసి, వారి జన్మస్థలమైన శ్రీపెరుంబుదూర్లో ప్రతిష్టించడానికి తనకి అనుమతి ఇవ్వమని ముదలియాండాన్ ఎంపెరుమానార్ల కోరుతారు. ఎంపెరుమానార్ల ఆదేశాల మేరకు ఒక అందమైన అర్చా మూర్తిని ఒక భక్తుడైన శిల్పి తయారు చేస్తాడు.  ఎంపెరుమానార్లు సంతృప్తి పడేల శ్రీరంగంలో తయారు చేయబడిన ఆ అర్చా మూర్తిని వారు ఆలింగనము చేసుకొని శ్రీపెరుంబుదూర్కి పంపి గురు పుష్యమి నాడు (తై పూసం) అక్కడ ప్రతిష్ఠాపన చేయిస్తారు.

ఈ విధంగా ఉడయవర్లు 120 సంవత్సరాలు అద్భుతమైన జీవితాన్ని కొనసాగిస్తున్నారు. వారు ఇక ఈ భౌతిక జగతిని వీడి, నిత్యసూరులతో ఆధ్యాత్మిక లోకానికి చేరుకోవాలనే తపనను అనుభవిస్తుంటారు. వారు గద్య త్రయం పఠించి పెరియ పిరాట్టి ద్వారా పెరియ పెరుమాళ్ళని ఆశ్రయించి తనని వెంటనే ఈ భౌతిక కంకెళ్ళ నుండి విడుదల చేయమని పెరియ పెరుమాళ్ళని ప్రార్థింస్తారు. ఆ రోజు నుండి 7 రోజున ఎంపెరుమానార్లను విముక్తులను చేయాలని పెరియ పెరుమాళ్ళు నిర్ణయించుకొని ఆ విషయాన్ని వారికి తెలియజేస్తారు. అప్పుడు ఎంపెరుమానార్ల “నాతో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సంబంధం ఉన్న వారందరూ నాలాగే అదే ఫలము పొందాలి” అని పెరుమాళ్ళని ప్రార్థించగా ఆతడు సంతోషంగా అంగీకరిస్తాడు. పెరియ పెరుమాళ్ళకి వీడ్కోలు పలికి ఉడయవర్లు గంభీరముగా బయటకు వచ్చి తమ మఠానికి చేరుకుంటారు. తరువాత 3 రోజులు వారు తమ శిష్యులకు అద్భుతమైన ఉపదేశార్థాలను కురిపిస్తుంటారు. శిష్యులందరూ “ఆచార్యులు అకస్మాత్తుగా ఎందుకు ఇన్ని  అద్భుతమైన ఉపదేశార్థాలను మనకి బోధిస్తున్నారు?” అని ఆశ్చర్యపోతారు. ఇక వారితో విషయాన్ని దాచలేక ఎంపెరుమానార్లు – “నేను ఈ రోజు నుండి మొదలు నాలుగవ రోజున పరమపదానికి అధిరోహించాలనుకుంటున్నాను, పెరుమాళ్ళు కూడా అందుకు సమ్మతించారు” అని దయతో వెల్లడి చేశారు. అది విన్న శిష్యుల గుండెలు పగిలి, ఉడయవర్లు వారిని విడిచిపెట్టిన వెంటనే వారందరూ తమ ప్రాణ త్యాగము చేస్తామని అంటారు. అది విన్న ఉడయవర్లు “మీరు అలా చేస్తే, మీరు నా సంబంధులు కారని భావిస్తాను, కాబట్టి మీరు అలా చేయవద్దు ” అని వారిని ఓదార్చారు.

అనంతరం ఎంపెరుమానార్లు అందరికీ విలువైన ఉపదేశాలను ఇస్తూనే ఉన్నారు, తన శిష్యులకు వివిధ బాధ్యతలను అప్పగిస్తారు. కూరతాళ్వాన్ల ప్రియమైన కుమారుడైన పరాశర భట్టర్ పట్ల ప్రతి ఒక్కరూ అంకితభావముతో ఉండాలని వారు ఆదేశిస్తారు. తాను ఎవరిపట్లైనా అమైనా అపరాధాలు చేసి ఉంటే క్షమాపణ కోరి మళ్లీ తమ తుది ఉపదేశాలను అనుగ్రహిస్తారు.  వారు ప్రధానంగా, అందరూ ప్రతి ఒక్కరి గుణాలను ప్రశంసిస్తూ సహోదరుల వలె సహరిస్తూ  పనిచేయాలని అందరినీ సూచిస్తారు. ప్రతి ఒక్కరూ ఫలమాశించకుండా కైంకర్యాలపై దృష్టి పెట్టాలని ఆదేశిస్తారు. శ్రీవైష్ణవులను ఎప్పుడూ ద్వేషించకపోవడం, లౌకిక వ్యక్తులను కీర్తించకపోవడం యొక్క ప్రాముఖ్యతను కూడా వారు నొక్కి చెబుతారు.

తర్వాత వారు భట్టర్ని పెరియ పెరుమాళ్ళ సన్నిధికి తీసుకువచ్చి, అతని తీర్థ గౌరవాలను స్వీకరించిన తరువాత ఇకపై సంప్రదాయానికి భట్టర్ నాయకత్వం వహిస్తారని ప్రకటిస్తారు. ఎంపెరుమానార్లు భట్టర్ని మేల్కోటెకి వెళ్లి వేదాంతిని (భవిష్యత్తులో వారిని నంజీయర్ అని పిలువబడతారు) సంస్కరించమని ఆదేశిస్తారు. ఎంబార్ వరిష్ఠ ఆచార్యులైనందున వారున్నంత కాలము తమ శిష్యుడైన భట్టర్కి మార్గనిర్దేశం చేస్తారు. పరమపదాన్ని అధిరోహించే రోజున, వారు తమ నిత్య అనుష్టాన క్రమాలు –  స్నానము చేయడం, 12 పుండ్రాములు (తిలకం) ధరించడం, సంద్యావందనం మొదలైనవి చేసి, గురుపరంపరను ధ్యానిస్తూ, పద్మాసనములో కూర్చుని తమ తిరువాధన పెరుమాళ్ళకి తిరువారాధన చేసి, పరవాససుదేవునిని తమ మనస్సులో ఉంచుకొని, ఆళవందార్ల దివ్య స్వరూపాన్ని ధ్యానిస్తూ, తమ విశాల నేత్రాలను తెరిచి, తమ శిరస్సుని ఎంబార్ ఒడిలో ఉంచి, తమ దివ్య పాదాలను వడుగ నంబి ఒడిలో ఉంచి, దివ్య తేజముతో ఆదిశేషుని రూపములో పరమపదానికి అధిరోహిస్తారు. అది వీక్షించిన వారి శిష్యులందరూ వేరు లేని చెట్టులా నేల మీద పడి వారి హృదయం పగిలేలా విలపిస్తారు. కొంతసేపు తర్వాత వారు తమను తాము ఓదార్చుకుంటారు. పెరియ పెరుమాళ్ళు తనకి కలిగిన నష్టాన్ని గ్రహించి నిరాశకు గురై తాంబూలము తీసుకోకుండ నిరాకరిస్తారు. అప్పుడు వారు తమ సామాగ్రిని ఉత్తమ నంబి ద్వారా పంపుతారు. మఠంలో, ఎంపెరుమానార్ల విమల చరమ తిరుమేనికి స్నానము గావించి, 12 పుండ్రాలను ధరింపజేసి ధూప దీప ఉపచారములు అందిస్తారు. పిళ్ళాన్ వారి అభిమన పుత్రుడు అయినందున ఎంపెరుమానార్ల పవిత్ర చరమ కైంకర్య ఉపచారాలను వారు నిర్వహిస్తారు. శ్రీరంగంలోని శ్రీవైష్ణవులు ఉపనిషత్తులు, దివ్య ప్రబంధ సేవాకలములు గొప్ప ఆర్భాటంగా ఏర్పాటు చేస్తారు. వారుని తీసుకువెళ్లే వీధులలో బాజా బజంత్రీలు, మేళ తాళాలు, అరైయర్ల సేవ, స్తోత్ర పఠనము, పుష్పాలు, బియ్యంతో అత్యంత వైభవంగా ఏర్పాట్లు చేస్తారు. పెరియ పెరుమాళ్ళ ఆదేశాల మేరకు, నంపెరుమాళ్ళ వసంత మండపం క్రింద త్రవ్వి యతి సంస్కార విధి ప్రకారం ఎంపెరుమానార్లని భూమిలో ఉంచుతారు. అనంతరం, పెరియ పెరుమాళ్ళ ఆదేశాల మేరకు వారి దివ్య చరమ తిరుమేనిని ఉంచిన మండపము పైన ముదలియాండాన్లు ఎంపెరుమానార్ల ఒక ప్రత్యేక విగ్రహాన్ని ప్రతిష్టిస్తారు .

క్రమంగా, ఎంపెరుమానార్లు పరమదానికి చేరుకున్నారన్న వార్త అనేక శ్రీవైష్ణవుల వరకు చేరుకుంటుంది. వారు తీవ్ర వేదనకు గురౌతారు. వారి నుండి వీడినందుకు విరహాన్ని భరించలేక కొందరు తక్షణమే తమ జీవితాన్ని త్యాగము చేస్తారు. శ్రీరంగం చేరుకున్నవారు భట్టర్ని తమ ఎదుట చూసి తమను తాము ఓదార్చుకొని సంతోషిస్తారు.

ఈ విధంగా ఎంపెరుమానార్లు ప్రతి ఒక్కరి అభ్యున్నతి కొరకై పరిపూర్ణ జీవితాన్ని గడిపారు. పెరుమాళ్ళ మహిమలను వివరించవచ్చు కానీ ఎంపెరుమానార్ల మహిమలను ఎవరూ వివరించలేరు. ఎంపెరుమానార్ల సహస్రాబ్ధి (1000 వ సంవత్సర వేడుకలు) వరకు, మనము వారి జీవితం మహిమలను ఆస్వాదించాము. ఆ అనుభవం మన హృదయంలో శాశ్వతంగా ఉంచుకొని మన ఆళ్వార్లు మరియు ఆచార్యుల ఆకాంక్షలకు తగినట్లుగా నిజమైన రామనుజ దాసులుగా జీవిద్దాము.

శ్రీమన్ మహాభూతపురే శ్రీమత్ కేశవ యజ్వనః |
కంతిమద్యాం ప్రసూదాయ యతిరాజాయ మంగళం ||

శ్రీమతే రమ్యజామాతృ మునీంద్రాయ మహాత్మనే |
శ్రీరంగవాసినే భూయాత్ నిత్యశ్రీర్ నిత్య మంగళం ||

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

గమనిక :  http://ponnadi.blogspot.com/2017/04/sri-ramanuja-vaibhavam.html

మూలము : https://srivaishnavagranthamstelugu.wordpress.com

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

విరోధి పరిహారాలు – 36

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః

శ్రీ వైష్ణవుల రోజువారీ జీవితంలో వివిధ రూపాలలో ఎదుర్కొంటున్న అడ్డంకుల గురించి ఎమ్పెరుమానారు, వంగి పురత్తు నంబికి వివరిస్తారు. వంగి పురత్తునంబి ఈ విశేషాలను ఒక అద్భుతమైన గ్రంథ రూపంగా “విరోధి పారిహారంగళ్ (విరోధి పరిహారాలు) అనే గ్రంథంలో గ్రంథస్తపరిచారు.

ఈ సంచికలోని శీర్షికలు శ్రేణిగా ఆంగ్లములో ఈ పుస్తకము –  https://srivaishnavagranthamstelugu.wordpress.com/virodhi-pariharangal/ లో చూడవచ్చు.

దయచేసి మునుపటి శీర్షికను ఇక్కడ చుడండి – https://srivaishnavagranthamstelugu.wordpress.com/2020/08/12/virodhi-pariharangal-35/

70. అనాప్త  విరోధి  –  అప్రామాణికమైన సూత్రాలను అర్థం చేసుకోవడంలో అవరోధాలు

ఎమ్పెరుమానార్ పట్ల ఎంతో అంకితభావంతో ఉండిన వడుగ నంబి

అనాప్త (ప్రామాణికం కాని అంశాలు/వ్యక్తులు, మనకు అనుకూలం కాని అంశాలు) ఆప్త (ప్రామాణికమైన అంశాలు/వ్యక్తులు, మనకు అనుకూలమైన అంశాలు)కు వ్యతిరేకమైనది. ఈ విభాగంలో చర్చించిన విషయాలు కూడా అదే సూత్రాన్ని ప్రతిబింబిస్తాయి. అనువాదకుల గమనిక: ఈ విభాగం మునుపటి భాగాన్ని ఇంకొంచం ముందుకు తీసుకెళుతుంది. జీవాత్మ యొక్క ఆధ్యాత్మిక పురోగతికి అనుకూలం కాని అంశాలు ఈ శీర్షికలో చర్చించబడ్డాయి.

  • ప్రపత్తికి (సంపూర్ణ శరణాగతి) విరుద్ధమైన ఉపాయాంతరములపై ​​(కర్మ, జ్ఞాన, భక్తి యోగాలు భగవానుడి నిత్య కైంకార్యం సాధించడనికి సాధనాలని) నమ్మకం కలిగి ఉండటం ఒక అడ్డంకి. భగవానుడి నిత్య కైంకర్యం పొందడానికి ఏకైక మార్గము భగవానుడికి సంపూర్ణ శరణాగతి చేయడమేనని ఆళ్వారులు వివరించారు, ఆచరించారు కూడా. కర్మ యోగం, జ్ఞాన యోగం, భక్తి యోగం మొదలైన వివిధ ప్రక్రియలు మన సొంత ప్రయత్నంపై ఆధారపడి ఉంటాయి, అందుకని భగవాన్ నిత్య దాసుడన్న జీవాత్మ యొక్క స్వరూపానికి అది విరుద్ధం. అందువల్ల, అటువంటి ఉపాయాంతరములపై విశ్వాసం కలిగి ఉండటం అననుకూలమైనది కాదు. జీవాత్మ యొక్క నిజమైన స్వరూపానికి తగినది కాదు. అనువాదకుల గమనిక: భగవానుడికి సంపూర్ణ శరణాగతి చేయుట, ఆయనకు శాశ్వతమైన కైంకార్యాన్ని సాధించే ఏకైక మార్గమని మన ఆళ్వారులు / ఆచార్యులు పూర్తిగా నిర్ధారించారు. పిళ్ళై లోకాచార్యులు ఈ సూత్రాన్ని శ్రీవచన భూషణ దివ్య శాస్త్రం యొక్క రెండవ ప్రకరణంలో వివరించారు. ఈ సుత్రాంలో, ఉపాయాంతర త్యాగం చేయడం అవసరమని వివరిస్తున్నారు. ఎందుకంటే మనం సంపూర్ణంగా భగవత్ ఆధీనులం అన్న దానికి ఉపాయాంతరాలు విరుద్ధం కావడం వల్ల కానీ, జ్ఞానం లేదా సామర్థ్యం లేక కాదు. తరువాతి సూత్రాలలో, వారు ఈ సూత్రాన్ని చాలా వివరంగా వివరించారు.  సూత్రం 127 లో ఒక ప్రశ్నను లేవనెత్తుతున్నారు, “వేదాంతాలు వీటిని (కర్మ, జ్ఞాన, భక్తి యోగాలు) ఉపాయములుగా ఎందుకు కీర్తిస్తారు?” తరువాత వారే ఇలా బదులిస్తున్నారు, ఒక వ్యాధి ఉన్నవారికి వైద్యం చేసేటప్పుడు, వాళ్ళు (అమ్మలు మొదలైనవారు) వారికి ఇష్ఠమైన ఆహార పదార్ధాలలో ఔషదాన్ని కలిపిస్తారు. ఇక్కడ శాస్త్రం (జివత్మాను సంరక్షించే తల్లి లాంటిది) భగవాన్ను (నిజమైన ఔషధం) ఉపాయాంతరములతో (అవి స్వయం ప్రయత్నం మీద ఆధారపడి ఉంటాయి) కలిపి ఇస్తుంది.  వ్యాధి నయమయ్యేది ఔషధంతోనే కాని ఆహార పదార్థాలతో కాదు అని మాముణులు అందంగా వివరిస్తున్నారు. అదేవిధంగా, మనకి భగవానుడే ఈ సంసారం నుండి ఉపశమనం పొందే నిజమైన ఉపాయం (సాధనం),  ఉపాయాంతరములు ఎప్పటికీ నిజమైన ఉపాయములు కాలేవు. ఔషదాన్ని ఇతర ఆహార పదార్ధాలతో కలిపినప్పుడు, వ్యాధిని నయం కావడానికి ఎక్కువ సమయం పడుతుందని వారు వివరించారు. అదేవిధంగా, కర్మ, జ్ఞాన, భక్తి యోగాల ద్వారా వెళితే, సంసార బారి నుండి విరుగుడు పొందడానికి ఎక్కువ సమయం పడుతుంది. కానీ సూటిగా ఎమ్పెరుమాన్ని ఆశ్రయించడం అనేది వ్యాధిని నయం చేయడానికి నేరుగా ఔషధం తీసుకోవడం లాంటిది – ఫలితం వెంటనే ఉంటుంది. తరువాతి సుత్రాములలో, ఎన్నో అద్భుతమైన అర్ధాలను పిళ్ళై లోకాచార్యులు మరియు మాముణులు వెల్లడించారు – వీటిని ఆచార్యుల నుండి కాలక్షేప రూపంగా వినడం ప్రయోజనకరం.
  • అనుకూలం కాని వ్యక్తులతో స్నేహం చేయడం మానేయాలని తెలుసుకున్న తరువాత కూడా, అయోమయ స్థితితో ఉండటం ఒక అడ్డంకి. అనుకూలం కాని వ్యక్తులతో సంబంధాన్ని వదులుకోవాలని బలమైన నిశ్చయంతో ఉండాలి. అనువాదకుల గమనిక: ఇక్కడ అనుకూలం కాని వ్యక్తులు అంటే సాధారణంగా దేవతాంతరములుతో సంబంధం ఉన్నవారు,  భౌతిక సాధనలు చేయువారు, నిరంతరం భగవత్, భాగవత, ఆచార్య అపచారాలు చేయువారు అని అర్థం. ఎందుకంటే ఈ రకమైన వ్యక్తులు క్రమేణా మన ఆలోచనలను కూడా ప్రభావితం చేసి చివరికి వారిలాగా మారేలా  చేస్తారు.
  • మన అంతిమ లక్ష్యానికి అడ్డంకులుగా ఉన్న నిగూఢ ప్రయోజనాలలో ఆసక్తి కలిగి ఉండటం ఒక అడ్డంకి. కేవలం తమ సుఖం కోసం మాత్రమే అయ్యుండి, భగవాన్ యొక్క శాశ్వతమైన కైంకర్యానికి విరుద్ధమైన దేనినైనా ప్రయోజనాంతరం అంటారు. ఇటువంటి ఉద్దేశ్యాలను వదులుకోవాలి. అనువాదకుల గమనిక: మన అంతిమ లక్ష్యం ఏమిటంటే, పరమపదంలో శాశ్వతంగా భగవానుడికి భగవదానందం కొరకు మాత్రమే సేవ చేయడం. భౌతిక / ఇంద్రియ సుఖాలు, దేవతాంతరములకు సేవ చేయడం, భౌతిక వ్యక్తులకు సేవ చేయడం, కైవల్యం – తాను ఆనందం పొందడం, వ్యక్తి తమ ఆనందం కొరకు భగవాన్ని సేవించడం, అహంకారంతో భగవాన్కు సేవ చేయడం మొదలైన ఇతర లక్ష్యాలు జీవాత్మ స్వరూపానికి అనుకూలమైనవి కావు, అందువలన వాటికి దూరంగా ఉండటం మంచిది.
  • శ్రీమన్నారాయణుడే పూజించగల దేవుడు అన్న సూత్రానికి విరుద్ధమైన దేవతాంతరములపై విశ్వాసం కలిగి ఉండటం ఒక అడ్డంకి. ఒక వైష్ణవుడికి, శ్రీమన్నారాయణుడు మాత్రమే ఆరాధించగల దేవుడు అన్న ముఖ్యమైన సూత్రాన్ని అర్థం చేసుకోవాలి, నిష్ఠగా అనుసరించాలి. దేవతాంతర భజనం (ఆరాధించడం) ఆ సూత్రానికి విరుద్ధం కాబట్టి చేయకూడదు. అనువాదకుల గమనిక: మహోన్నత నాధుడు స్వయంగా శ్రీమన్నారాయణుడు కావడం వలన, ప్రాపంచిక కార్య వ్యవహారాలకై, అనేక  తామస, రాజస స్వభావం గల ఆరాధకులకై, వాళ్ళు నెమ్మదిగా ఆధ్యాత్మిక అభివృద్ధి చెందడానికి దేవతాంతరములను శ్రీమన్నారాయణుడు  సృష్ఠించాడు. లేకపోతే నాస్తికత్వం ప్రబలమౌతుంది కాబట్టి. కానీ పూర్తిగా సత్వ గుణంలో ఉన్న వారి శుద్ధ భక్తులకు అతను మాత్రమే పూజ్యనీయుడు. వైష్ణవుడంటే శ్రీమన్నారాయణుడకు, అతని శుద్ధమైన భక్తులకు పూర్తి విశ్వాసకులుగా ఉండటం, వారిని మాత్రమే ఆరాధించడం అని అర్థం.
  •  ద్వయ మహామంత్రంలో వివరించిన సూత్రాలకు విరుద్ధమైన మంత్రాలపై విశ్వాసం కలిగి ఉండటం ఒక అడ్డంకి. ద్వయ మహామంత్ర యొక్క మాధుర్యం మరియు లోతైన అర్థాల కారణంగా శ్రీవైష్ణవులు నిరంతరం పఠించాలి, ధ్యానించాలి. రహస్య త్రయం ఈ మంత్రసంబంధిత స్వభావం ఉన్నందున, ద్వయ మహామంత్రాన్ని కీర్తించడం ద్వారా రహస్య త్రయం (తిరుమంత్రం – అష్టాక్షరం, ద్వయ మహామంత్రం మరియు గీతా చరమ స్లోకం) ఇక్కడ సూచించబడింది. కాబట్టి శ్రీవైష్ణవులు రహస్య త్రయాన్ని అనుసరించాలి. ఇతర మంత్రాలేవైనా – ప్రధానంగా దేవతాంతరములకు  సంబంధించిన మంత్రాలకు పూర్తిగా దూరంగా ఉండాలి. అనువాదకుల గమనిక: ముముక్షుప్పడిలో, పిళ్ళై లోకాచార్యులు తిరుమంత్రము యొక్క కీర్తిని వివరిస్తున్నారు. శ్రీమన్నారాయణుడకు సంబంధించిన మంత్రాలు రెండు రకాలు అని వారు వివరింస్తున్నారు – వ్యాపకం (భగవాన్ యొక్క సర్వవ్యాపకత్వాన్ని వివరించేవి) మరియు అవ్యాపకం (భగవాన్ వివిధ రూపాల్లో వెల్లడి చేసిన ఇతర గుణాలను వివరించేవి). విష్ణు గాయత్రిలో కీర్తించ బడినందున విష్ణు మంత్రాలకు (నారాయణ, వాసుదేవ, విష్ణు) ఎక్కువ ప్రాముఖ్యత ఉందని వారు నొక్కిచెబుతున్నారు. విష్ణు గయిత్రి మంత్రం నారాయణ మంత్రంతో మొదలవుతుంది కాబట్టి, అన్ని విష్ణు మంత్రాలలో ఇది గొప్పదని వారు వివరిస్తున్నారు. ఇతర మంత్రాలలో లేని అన్ని ప్రథానాంశ అర్ధాలను వివరించడంలో నారాయణ మంత్రం పూర్ణమైనదని వారు వివరిస్తున్నారు. ఇక్కడ ప్రథానాంశ అర్ధాలు అంటే అర్థపంచకాన్ని (ఐదు తత్వాలు / సూత్రాలు అనగా – జీవత్మ (ఆత్మ), పరమాత్మ (దేవుడు), ఉపాయం (సాధనాలు), ఉపేయం (లక్ష్యం) మరియు వీరోధి (ఆటంకాలు))  సూచిస్తుంది. వేదానికి, ఋషులకు, ఆళ్వారులకు, ఆచార్యులకు నారాయణ మంత్రం చాలా ప్రియమైనదని వారు వివరిస్తున్నారు. ద్వయ మహామంత్రం కేవలం నారాయణ మంత్రం యొక్క వివరణ, చరమ శ్లోకం అదే సూత్రానికి మరింత వివరణ. ఈ విధంగా, ముముక్షువులకు (పరమపదంలో శ్రీమన్నారాయణుని శాశ్వత కైంకర్యమైన మోక్షాన్ని కోరుకునే వాడు)  రాహస్య త్రయం ప్రధాన కేంద్రంగా ఉండాలి.
  • భగవత్ ప్రీతి అనే అత్యున్నత స్థితికి విరుద్ధమైన ప్రాపంచిక / ఇంద్రియ సుఖాలపై ఆసక్తి కలిగి ఉండటం ఒక అడ్డంకి. భోగ్యం – ఆనందించేది. భగవాన్ / భాగవతులకు కైంకార్యం చేస్తున్న జీవాత్మ భగవానుడిని ఆనందపరుస్తాడు/సంతృప్తిపరుస్తాడు. భగవదానందాన్ని చూసి, జీవాత్మ కూడా ఆనందిస్తాడు.  మరే ఇతర ప్రాపంచిక సుఖాలైనా సరే జీవాత్మ యొక్క ఈ స్థాయికి అడ్డంకి.  అనువాదకుల గమనిక: కులశేఖర ఆళ్వారులు పెరుమాల్ తిరుమోళి 4.9 పాసురంలో ఇలా వివరిస్తున్నారు, “పడియాక్కిడంతు ఉన్ పవళవాయ్ కాణ్బేనే” – ఇక్కడ ఆళ్వార్ తిరుమల వేంకటేశ్వరుని సన్నిధి ఎదుట మెట్టుగా కావాలని ప్రార్థిస్తున్నారు, కోరుకుంటున్నారు. పైగా ఆ వేంకటేశ్వరుని దివ్య చిరునవ్వుని కూడా చూడాలని అంటున్నారు. మెట్టుగా ఉండటం అంటే అచిత్ (జ్ఞానం ఉండదు) లాంటిది, కాని భగవత్ ఆనందాన్ని దర్శించడం అంటే భగవాన్ యొక్క ఆనందాన్ని ప్రతిస్పందించడం అని అర్థం. ప్రతిస్పందన జ్ఞానం యొక్క ఉనికిని సూచిస్తున్నందున, ఇక్కడ శ్రీవైష్ణవ సత్సాంప్రదాయం యొక్క అత్యున్నత సూత్రం తెలుస్తుంది. అనగా, తమ యజమాని సంపూర్ణ నియంత్రణలో ఉన్న ఒక నిర్జీవ వస్తువు ఉన్నట్లుగా ఉండాలి, అయినప్పటికీ, భగవానుడి ఆనందానికి ప్రతిస్పందిస్తే భాగవాన్ అమితానందాన్ని పొందుతారు. ఇది ఒక అమాయక పిల్లవాడి లాంటిది, పూర్తిగా తండ్రి నియంత్రణలో ఉంటాడు, అయినప్పటికీ, తండ్రి పిల్లవాడిని సంతోషపెట్టినప్పుడు, పిల్లవాడు అ తండ్రికి స్పందిస్తాడు, అప్పుడు ఆ తండ్రి అమితానందాన్ని పొందుతాడు. అందువలన, చివరికి, భగవానుడే ప్రథమంగా ఆనందించేవాడు, మాధ్యమిక ఆనందం పొందేవాడు జీవాత్మ – అదీ కూడా భగవత్సుఖాన్నే అనుభవిస్తాడు.
  • మోక్ష శాస్త్రానికి విరుద్ధమైన బంధ శాస్త్రం (భౌతిక సంపద, భాగ్యము, సమృద్ధి మొదలైన వాటికి సంబంధించిన సాహిత్యాన్ని అధ్యయనం చేయడం) పై దృష్టి పెట్టడం ఒక అడ్డంకి. మోక్ష శాస్త్రం అంటే భగవానుడికి శాశ్వతమైన కైంకర్యం చేసే మార్గాన్ని చూపిస్తుంది. బంధ శాస్త్రం అంటే ఇంద్రియ సుఖసాధన,  ఈ సంసారంలో అనేక జన్మలకు దారితీస్తుంది. మోక్ష శాస్త్రంపై దృష్టి పెట్టాలి, బంధ శాస్త్రాన్ని విస్మరించాలి.
  • తమ సొంత శరీరాంశాలు, శారీరిక జాగ్రత్తలపై ఎక్కువ ఆసక్తి కలిగిఉండటం మన అత్యున్నత లక్ష్యమైన ఆచర్య సేవకది విరుద్ధము, అది ఒక అడ్డంకి. చరమ కైంకర్యం – చరమ  పర్వ నిష్ఠ – అత్యున్నత సేవ, ఇది “ఆచార్యులే సర్వస్వం అని భావించి అటువంటి ఆచార్యలకు సేవలందించడం”. ఉపదేశ రత్నమాలలో, మాముణులు పాసురం 65లో “ఆచార్యన్ చిచ్చన్ ఆరుయిరైప్ పేణుమవన్ తేచారుం చిచ్చన్ అవన్ చీర్ వడివై ఆచైయుడన్ నోక్కుమవన్” – ఆచార్యుడు శిష్యుని వాస్తవ స్వభావంపై దృష్ఠిపెట్టాలి, శిష్యుడు ఆచార్యుని పట్ల సంపూర్ణ భక్తితో వారి తిరుమేనిని (దేహాన్ని) మరియు వారి శారీరక అవసరాలపై పూర్తిగా దృష్టి పెట్టాలి. ఆచార్యుని యొక్క రోజువారీ అవసరాల (ఆహారం, వస్త్రం,  ఆశ్రయం మొదలైనవి) బాధ్యత శిష్యుడిది కాబట్టి, శిష్యుడు తమ సొంత  అవసరాలకు మించి వారిని చూసుకోవాలి. మన శారీరిక జాగ్రత్తలపై ఆసక్తి మానుకోవాలి. అనువాదకుల గమనిక: ఉపదేశ రత్తమాల శ్రీవచన భూషణ దివ్య శాస్త్రం యొక్క సారాన్ని వెలికితీస్తుంది. మాముణులు పిళ్ళై లోకాచార్యుల చేత వివరించబడిన సూత్రాల సారాన్ని అందంగా సంగ్రహించి వాటిని అర్థం చేసుకోవడానికి చాలా తేలికగా తమిళ్ పాసురాల రూపంలో అందించారు. ఆచార్యులపై దృష్టి కేంద్రీకరించడం, మరియు వారికి సేవలందించే ప్రాముఖ్యత  పిళ్ళై లోకాచార్యుల చేత  నొక్కి చెప్పబడింది, అదే ఇక్కడ మాముణులు చేత వివరించబడింది.

తరువాతి భాగం మనం వచ్చే సంచికలో కొనసాగిద్దాము.

అడియేన్ శ్రీదేవి రామానుజ దాసి

హిందీలో : http://ponnadi.blogspot.com/2014/09/virodhi-pariharangal-36.html

మూలము : https://srivaishnavagranthamstelugu.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org

స్తోత్రరత్నం – తనియన్లు

స్తోత్రరత్నం – తనియన్లు

                                                       శ్రీమతే శఠకోపాయ నమః                                                         

  శ్రీమతే రామానుజాయ నమః 

శ్రీమద్వరవరమునయే నమః

alavandhar

శ్రీయామునాచార్యులు , కాట్టుమన్నార్ కోయిల్

స్వాదయన్నిహ సర్వేషాం త్రయ్యంతార్థం సుదుర్గ్రహం|

స్తోత్రయామాస యోగీంద్రః తం వన్దే యామునాహ్వయం||

అవగాహనకు క్లిష్ఠతరమైన వేదాంతార్థాలను సులభముగా తమ స్తోత్రమున అదించిన, యోగులలో శ్రేష్ఠులైన శ్రీయామునాచార్యులను సదా సేవిస్తాను.

యత్ పదాం భోరుహ ధ్యాన విధ్వస్తాశేషకల్మషః |

వస్తుతాముపయాతోహం యామునేయం నమామి తం ||

ఎవరి దివ్యకృపతో నా కల్మషములన్నీ నాశనము చెందినవో మరియు ఒక వస్తువుగా గుర్తించబడ్డానో, పూర్వము అసత్ (అచేతనము)గా ఉండి యామునాచార్యుల పాదముల ధ్యానముతో ప్రస్తుతం సత్(ఆత్మ/ చేతనము) గా భావిస్తున్నానో ఆ శ్రీయామునాచార్యులకు  నమస్కరిస్తున్నాను.

నమో నమో యామునాయ యామునాయ నమో నమః |

నమో నమో యామునాయ యామునాయ నమో నమః | |

మరలా మరలా శ్రీయామునాచార్యులను ఆరాధిస్తాను. నిరంతరం వారికి నమస్కరించుటను నిరోధించుకోలేను.

అడియేన్ నల్లా శశిధర్ రామానుజదాసః

ఇటు తరువాత అవతారికను తెలుసుకుందాం.

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org
pramAthA (preceptors) – http://acharyas.koyil.org
SrIvaishNava education/kids portal – http://pillai.koyil.org

ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం 10

శ్రీ:  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమద్వరవరమునయే నమః

ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం

 << ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం – 9

భగవద్రామానుజులు చేతనులలో అంతర్యామిగా ఉన్న శ్రీరంగనాథుని  చూసారు.

వారి   శ్రీరంగ గద్యం ‘ స్వాధీన త్రివిధ చేతనాచేతన స్వరూప స్థితి ప్రవృత్తి భేదం’ అని ప్రారంభించి నారాయణుడే సకల ఆత్మలను, వస్తువులను నియంత్రించు వాడు, అందువలననే ఈ లోకంలో ఆత్మలు ఆత్మలుగాను, లోకము లోకముగాను ఉన్నవి.

నంపెరుమాళ్ – సకల లోకాలను నియంత్రించువాడు

వాటి స్థితి, స్వరూపము  అయన అధీనములో ఉన్నాయి. ఆయన రక్షకత్వం వలననే ఈ జగత్తు, ఆత్మలు తమ స్థితిని పొంది ప్రస్తుతము ఉన్న రూపంలో ప్రకాశిస్తునాయి. ఈ ప్రవృత్తి నివృత్తి అనే క్రియలు ఆయన మనో సంకల్పానికి తగినట్లుగానే నడుస్తున్నవి. ఈ లోకము, ఇక్కడి మనుష్యుల స్థితి, ప్రవృత్తి  సమస్తం ఆయన వలననే నిర్వహింపబడుతున్నవి.

 

ఈ విషయము వేదాలలోను, ఉపనిషత్తులలో, మునులచే అనుగ్రహిమ్చబడిన పలు గ్రంధాలలో సుస్పష్టంగా కనపడుతుంది. స్వామి రామానుజుల వారి ఈ అభిప్రాయం వారు  అనుగ్రహించిన గ్రంధాలలో పలు చోట్ల కనపడుతుంది.

సకల చేతనాచేతనముల స్వరూపము, స్థితి, ప్రవృతి సమస్తం ఆయన సంకల్పమే అని స్వామి ఎలా చెప్పారో అదే విధంగా తిరువాయిమోళిలో కనపడుతుంది.

ఆళ్వార్ – రామానుజుల మార్గదర్శకులు

తిరువాయ్మొళి మొదటి శతకంలోని మొదటి దశకం (తిరువాయ్మొళి) ఈ ప్రకరణానికి సమానార్థకంగా ఉంది .

స్వరూపము

నామ్ అవన్ ఇవన్ ఉవన్ అవళ్ ఇవళ్ ఉవళ్ ఎవళ్

తామ్ అవర్ ఇవర్ ఉవర్ అదు ఇదు ఉదు ఎదు

వీమ్ అవై ఇవై ఉవై అవై నలమ్ తీంగవై

అమ్ అవి ఆయ్  అవై ఆయ్ నిన్ర అవరే  1.1.4

ఇక్కడ పరమాత్మ అనుగ్రహిమ్చినవే నామ్, అవన్, అవళ్, అదు, అవర్, అవై,ఇవై,( మనము , వాడు, ఆమె , అది,వాళ్ళు ,అవి,ఇవి ) అనేవి అన్ని మనకు తెలిసిన మనుషులు , వస్తువులకు సంబందించిన స్థితి ,  స్వరూపము .

నారాయణ – స్వాధీన త్రివిధ చేతనాచేతన స్వరూప

తిరుక్కురుగై పిరాన్  పిళ్ళాన్  దీనిని  వివిధ నిర్దేశములతో నిర్దిష్టమైన సమస్త వస్తువుల స్వరూపము భగవదాధీనము అని చెపుతున్నారని వివరించారు. దీని వలన మనము చూస్తున్న సమస్త వస్తువులు ఆయన సంకల్పమే అని బోధపడుతున్నది.

స్థితి

అవరవర్ తమతమదు అఱి  వఱి వఱి వకై

అవరవర్ ఇఱైయవర్ ఎన వడి  అడైవర్గళ్

అవరవర్ ఇఱైయవర్ కుఱైవిలర్  ఇఱైయవర్

అవరవర్ వితి వళి అడైయనిన్రనరే      1.1.5

ఒక్కొక్కరు వారి వారికి తగినట్లు వాస్తవాలను స్వీకరించి వేరు వేరు పురుషార్థాలను పొందటం కోసం వేరు వేరు దైవాలను కొలుస్తారు. అలాంటి వారు వారి కర్మ ఫలానికి తగినట్లు ఫలితాలను పొందుతారు. కానీ ఆయా దైవాలలో నారాయణుడే ఉండి వారి ఉపాసనలను స్వీకరించి ఫలితాన్ని ఇస్తున్నాడు.

నారాయణ – స్వాధీన త్రివిధ చేతనాచేతన స్వరూప స్థితిగా

పిళ్ళాన్ ఈ విషయంగా, సర్వ కర్మల సమారాధ్యుడై సకల ఫల ప్రదాయి కావటంచేత  జగద్రక్షణము ఆధీనమై అన్నారు. సకల కర్మల చేత ఆయనే పూజిమ్పబడటం వలన ఆయనే ఫల ప్రదాత అవుతున్నాడు. అందు వలన జగద్రక్షణము ఆయన దివ్య సంకల్పమని స్పష్ట మవుతున్నది.

ప్రవృత్తి :

నిన్ఱనర్ ఇరుందనర్ కిడందనర్ తిరిందనర్

నిన్ఱల ర్ ఇరుందిలర్ కిడందిలర్ తిరిందిలర్

ఎన్రుం ఓర్ ఇయల్వినర్ ఎన నినైవరియవర్

ఎన్రుం ఓర్ ఇయల్వోడు నిన్న్రవెంతిడరే ‘

వేదవేదాంతములు తెలియ జేయు పరమాత్మ- హృదయము, స్పందనలను నుండి వేరు పడి ఉన్నాడు. ఆయనే సమస్త కర్మలను కర్మలు లేని స్థితిలోను  ఉన్నాడు .

నారాయణ – స్వాధీన త్రివిధ చేతనాచేతన స్వరూప స్థితి ప్రవృత్తి

పిళ్ళా న్  ఈ పశురాన్ని, “చేతనాచేతనత్మక సమస్త వస్తు వస్తువుల సమస్త ప్రవృత్తి, నివృత్తులు  పరమపురుష సంకల్పాధీనములు అని చెపుతున్నాయి” అని వివరించారు. అంటే  ప్రాణులు, అప్రాణులు, సమస్త చేతనాచేతనముల కర్మాకర్మలు ఈశ్వరుని సంకల్పమే అనే విషయం స్పష్టముచేస్తున్నారు.

ఈ మూడు పాశు రాలు చేతనాచేతనముల సమస్త  ప్రవృత్తి, నివృత్తులు పరమపురుష సంకల్పా ధీనములు అని చెపుతున్నాయని భగవద్రామానుజుల భావమే కాదు, అది ఆళ్వార్ల మనోభావాలు కూడా. దానిని వీరు వివరించారన్నది  సుస్పష్టం మవుతున్నది.

అడియేన్ చూడామణి రామానుజ దాసి

మూలము :  https://srivaishnavagranthams.wordpress.com/2018/02/05/dramidopanishat-prabhava-sarvasvam-10/

archived in https://srivaishnavagranthams.wordpress.com/

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org
pramAthA (preceptors) – https://guruparamparai.wordpress.com
SrIvaishNava Education/Kids Portal – http://pillai.koyil.org

తత్త్వత్రయం – శ్రీ పిళ్ళైలోకాచార్యుల తత్వ త్రయ గ్రంథ పరిచయము

శ్రీ:  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమద్వరవరమునయే నమః  శ్రీవానాచల మహామునయే నమః

మనము ఇంతవరకు అయిప్పసి (తులా మాసము) మాసములో అవతరించిన ఆళ్వారాచార్యుల దివ్యానుభవములను తెలుసుకుంటున్నాము. మరిన్ని వివరముల కొరకు https://srivaishnavagranthamstelugu.wordpress.com/thathva-thrayam/ లింక్ చూడవచ్చును. ఇప్పుడు మనము పరమ కారుణికులు, దివ్య వైభవము కలిగిన శ్రీ పిళ్ళై లోకాచార్యుల గురించి మరియు వారు రచించిన చిన్న శ్రీభాష్యమైన “తత్వత్రయము” గ్రంథము, దానికి స్వామి మణవాళ మహామునులు అనుగ్రహించిన వ్యాఖ్యానావతారికను తెలుసుకుందాము.

ఎమ్బెరుమానార్, శ్రీ పిళ్ళై లోకాచార్యులు, స్వామి మణవాళ మహామునులు – తిరుప్పవళ వణ్ణం దివ్య దేశం

“తత్వ త్రయము” అను ఈ గ్రంథము “చిన్న శ్రీ భాష్యము” గా మన సంప్రదాయములో ప్రసిద్ధి గాంచినది. శ్రీ భాష్యకార బిరుదాంకితులైన భగవద్రామానుజులు బ్రహ్మ సూత్రములకు అద్భుతమైన, సరళమైన వ్యాఖ్యానమును అనుగ్రహించారు. ఆ వ్యాఖ్యానమే “శ్రీ భాష్యము” గా సుప్రసిద్ధమైనది. విశిష్టాద్వైత సిద్ధాంతమునకు అవసరమైన అన్ని ప్రధాన ప్రమాణములు ఇందులో ఇమిడియున్నవి. అయితే శ్రీ భాష్యము సంస్కృతములో ఉండుట చేత సంస్కృత భాషాప్రవేశము లేనివారికి శ్రీ భాష్యము నందలి విషయములు తెలుసుకొనుటకు కష్టసాధ్యముగానుండెను. శ్రీ పిళ్ళై లోకాచార్యులవారు శ్రీభాష్యము యొక్క సారమును “తత్వ త్రయము” అను గ్రంథములో పొందు పరిచి ద్రావిడ భాషలో సామాన్యులకు సైతం సులభముగా అర్థమగు రీతిలో రచించారు. ఈ గ్రంథములో వేదాంతము నందలి ప్రాథమిక విషయములైన చిత్తు, అచిత్తు మరియు ఈశ్వరుడు అను మూడు విషయముల గూర్చి విశదీకరించుట జరిగినది. తత్వ త్రయం గ్రంథము యొక్క సారాంశము ఈ లింకులో చదువుకొనవచ్చును.

https://srivaishnavagranthamstelugu.wordpress.com/2017/02/13/simple-guide-to-srivaishnavam-thathva-thrayam-in-short/

ఇక స్వామి మణవాళ మహాముణులు ఈ గ్రంథమునకు అనుగ్రహించిన ఉపోద్ఘాతమును చూద్దాము.

“అనాది మాయయా సుప్తః” అనునట్లు, అనంతకోటి సంవత్సరాలుగా ఎడతెగని ఈ కాల చక్రములో జీవుడు పంచ భూతాత్మకమైన ఈ ప్రకృతి సంబంధము చేత కర్మలు ఆచరించుచూ వాటి వల్ల సంక్రమించే పుణ్య పాపముల ఫలితముగా జనన మరణ చక్రములో పడి అలమటిస్తున్నాడు. అజ్ఞానమనెడి అంధకారంలో చిక్కుకున్న జీవుడు తాను వేరు ప్రకృతి వేరు అన్న సత్యమును (తెలిసినచో కేవలము భగవత్కళ్యాణ గుణములనే స్మరిస్తూ భగవంతుని అనుభవిస్తూ ఈ ప్రకృతిని విస్మరించెడివాడు) మరచి తానూ ప్రకృతిలో ఒకనిగా భావించి ఈ ప్రకృతినే అనుభవిస్తూ కాలము గడుపుతున్నాడు. అటువంటి అజ్ఞానముతో జీవుడు.

  • “దేహోऽహమ్, మనుష్యోహమ్”, నేను దేహిని, మనుష్యుడును – అనే మాయలో దేహము తానూ ఒకరే అని భ్రమపడుతున్నాడు.
  • “ఈశ్వరోऽహమ్ అహం భోగి”, నేనే ఈశ్వరుడను, స్వతంత్రుడను – తానూ శరీరమూ వేరన్న భావము జీవునికి కలిగిననూ, తానే భగవంతుడనని భావించి, తాను స్వతంత్రుడనని భ్రమిస్తున్నాడు.
  • తాను పరతంత్రుడనని భావించిననూ, భగవంతుని సేవకుడైన జీవుడు, తగు భగవత్కైంకర్యములను చేయక ప్రాపంచిక భోగములలో మునిగి తేలుచున్నాడు.

“యోऽన్యథా సంతమానం అన్యథా ప్రతిపద్యతే, కిమ్ తేన న కృతం పాపమ్ చోరేణాత్మాపహారినా”, జీవుడు తన యొక్క స్వరూపజ్ఞానమును (తాను భగవంతుని దాసుడనన్న సత్యమును) విస్మరించి ప్రాపంచిక కార్య కలాపము లందు నిమగ్నుడగుట ఆత్మచౌర్యమే అవుతుంది. తనది కాని వస్తువైన ఆత్మను తనదిగా భావించి తనది కాని శరీరమునకు ఆత్మను ఆపాదించి అశాశ్వతమైన, కర్మ ప్రదమైన ప్రాపంచిక సుఖములను భవించుట పాపములలోకెల్లా మహా పాపమైనదని దీని భావము.

“విచిత్ర దేహ సంపత్తిర్ ఈశ్వరాయ నివేదితుం, పూర్వమేవ కృతా బ్రహ్మన్ హస్తపాదాది సంయుతా”, అని చెప్పినట్లు పూర్వము ప్రళయ సముద్రము నందు విశ్వము గాఢాంధకారమై యుండి, సృష్టి చేయునపుడు, సర్వేశ్వరుడు తన యొక్క నిర్హేతుక కృప చేత అప్పటివరకు అస్థిత్వము లేని జీవునికి శరీరమును, ఇంద్రియములను ఇచ్చి వాటి ద్వారా తనకు దాస్యము చేసి తరించి చివరికి తన శ్రీచరణాలను చేరమని  ఆశీర్వదించెను.

శ్రీనమ్మాళ్వారులుశ్రీరంగనాథుని యందు జీవులను అనుక్షణం ప్రేమతో అనుగ్రహించెడి  “వ్యూహ సౌహార్ద్రత” అను కళ్యాణగుణమును బాగుగా అనుభవించియున్నారు.

తిరువాయ్మొళి  3.2.1 లో, “అన్నాళ్ నీ తంద అక్కైయిన్ వాళి ఉళల్వేన్” అని  చెప్పినట్టుగా, జీవుడు భగవదనుగ్రహము చేత పొందిన శరీరేంద్రియములను దుర్వినియోగ పరుచుచూ భౌతిక సుఖలోలుడై కాలము గడుపుచున్నాడు. నది దాటుటకు పడవను పొంది నది దాటకపోగా, ఆ పడవలో సముద్రములోనికి పోయి అలలాడినట్లు, ఈ జీవుడు పాంచ భౌతిక శరీరమును తానేయని భ్రమించి స్వార్థ పూరిత కర్మలు ఆచరించుచూ సంసార సాగరములో కొట్టుమిట్టాడు చున్నాడు. చేసిన కర్మల ఫలితముగా మరల మరల జన్మించుచూ తాపత్రయ గ్రస్థుడై గర్భస్థ, జన్మ, కౌమార, యవ్వన, మరణ అనెడి దశలను గడిపి చేసిన పాప కర్మల ఫలితముగా నరకముననుభవించి, పుణ్య కర్మల ఫలితముగా ఉత్తమ జన్మలెత్తుతూ అలా పడుతూ లేస్తూ ఈ జననమరణ చక్రములో తిరుగుచున్నాడు. “ఏవం సంస్మృతి చక్రస్థే భ్రామ్యమాణే స్వకర్మభిః జీవే దుఃఖాకులే కృపా కాపి ఉపజాయతే “, అనునట్లు భగవానుడైన శ్రీ మహా విష్ణువు జీవుల పట్ల తనకు గల నిర్హేతుక కృప చేత జీవులను సంసార సాగరము నుంచి ఉద్ధరించుటకు అనేక అవతారాల ఎత్తి ధర్మ రక్షణ, శిష్ట రక్షణ చేస్తూనే ఉన్నాడు. “జాయమానమ్ యమ్ పశ్యేన్ మధుసూదనః సాత్విక స్సతు విజ్ఞేయః సవై మోక్షార్థ చిన్తకః”, జీవుడు తల్లి గర్భములో జనించునపుడు తాను ఎటుల తరించవలెనో తెలుసుకుని సత్యమైన జ్ఞానమును పొంది సాత్వికుడై విష్ణువును ఆశ్రయించి మెలిగినపుడే ముముక్షుత్వము సాధించినవాడు అవుతాడు.   

సత్యమైన నిజ జ్ఞానము పొందేందుకు రెండు దారులు కలవు : 1) శాస్త్రము 2) ఉపదేశము (ఆచార్యోపదేశముగా పొందేది )

శాస్త్రాధ్యయనము వలన కొన్ని ఇబ్బందులు కలవు.
  • “శాస్త్ర జ్ఞానం బహు క్లేశం”, అనునట్లు శాస్త్రాధ్యయనము బహు క్లిష్టతరమైనది. అందు విషయము అంత సులభగా అవగతపడదు. పదములకు గల నానార్థముల వలన శాస్త్ర వాక్యాలకు వివిధములైన అర్థములు స్ఫురించి ఏ అర్థమును అన్వయించు కొనవలెనో తెలియక చివరికి అజ్ఞానావస్థలోనే మిగిలిపోయే ప్రమాదం కలదు.
  • ఒకవేళ అంత శ్రమను ఓర్చి శాస్త్ర జ్ఞానము సొంతముగా పొందగోరిననేమి, “అనంత భారమ్ బహు వేదితవ్యం అల్పచ్చ కాలో బహవశ్చ విఘ్నాః”, అనునట్లు జీవుడు తనకు గల పరిమిత జీవిత కాలములో మరియు, పరిమితమైన బుద్ధి చేత అనంత సాగరమైన శాస్త్రమును తెలియగోరుట అసాధ్యమే అవుతుంది.
  • చివరగా జీవులలో ఆడవారు, శూద్రులు శాస్త్రాధ్యయనమునకు నిషిద్ధులు. అయితే ముముక్షుత్వమునకు వారు అర్హులు.

అయితే శాస్త్రాధ్యయనము చేసిన పెద్దలైన ఆచార్యులను ఆశ్రయించి వారి వద్ద శాస్త్ర జ్ఞానమును ఉపదేశముగా పొందవచ్చును. దానికి ఎటువంటి ఆంక్షలు లేవు. శాస్త్రజ్ఞులైన గురువులు అపారమైన శాస్త్ర జ్ఞానమును అవపోశన పెట్టినవారు గనుక శిష్యుని యొక్క బుద్ధి పరిమితులను బట్టి శిష్యుడు సుకరముగా తరించుటకు ఎంత జ్ఞానము అవసరమో అంతే ఉపదేశిస్తారు. ఏ భాషలో (అంటే అత్యంత క్లిష్టమైన భాషలో శాస్త్రమున్ననూ దానిని సంస్కరించి శిష్యునికి అర్థమగు నట్లు లలితముగా చిన్న చిన్న పదాలతో ఆళ్వార్లు రచించిన పాశురముల వలె గురువు శాస్త్రార్థములను శిష్యునికి ఉపదేశిస్తాడు.) చెబితే శిష్యునికి అర్థమవుతుందో ఆ భాషలో గురువు ఉపదేశిస్తాడు.

అందువలన పరమ కారుణికులైన శ్రీ పిళ్ళై లోకాచార్యులు వేదాంత శాస్త్రమును ఆసాంతం అధ్యయనం చేసిన శాస్త్రజ్ఞులైననూ జీవుల పట్ల గల నిర్హేతుక కృప చేత అందరికీ అర్థమగునట్లు లలితమైన భాషలో వేదాంతమునకు మూల వస్తువులైన చిత్తు, అచిత్తు మరియు ఈశ్వరుడు అను మూడు విషయముల గూర్చి ఈ తత్వ త్రయమను గ్రంథమును రచించియున్నారు.

పూర్వాచార్యులైన నడువిల్ తిరువీధి పిళ్ళై భట్టర్, మరియు పెరియ వాచ్చాన్ పిళ్ళై వంటివారు కూడా క్లిష్టతరమైన వేదాంత శాస్త్రమును సులభ రీతిలో జనులకు అర్థమగునట్లు తమ గ్రంథములు ద్రావిడ భాషలో రచించుటకు కారణం జీవులపట్ల తమకు గల నిర్హేతుక కృప మాత్రమే. ఎందుకంటే మన పూర్వాచార్యులు

  • అహంకార రహితులు
  • జీవుల పట్ల ఎల్లప్పుడూ అక్కర కలిగినవారు
  • ఎప్పుడూ తమ స్వార్ధము, గొప్పతనము చూసుకోనివారు

మరి ఇందరు ఆచార్యులు ఒకే విషయముపై ఇన్ని గ్రంథములు రచించుట ఎందులకు? ఒకరు రచించిన గ్రంథమునే మిగిలిన వారందరునూ ఒప్పుకొని అన్వయించ వచ్చును కదా? దీనికి స్వామి మణవాళ మహాముణులు అనుగ్రహించిన వివరణ చూద్దాము:

  • ఆళ్వార్లు ఏకకంఠులు (అంటే శరీరములు వేరు వేరైననూ పాడిన పాశురములు ఒక్కటే), ఒకే విషయమగు భగవద్గుణానుభవము గురించి పన్నెండుగురు ఆళ్వార్లు ప్రతిపాదించుట చేత శరణాగతి సిద్ధాంతము మరింత స్థిరీకరించబడినది. ఆళ్వార్లు రచించిన దివ్య ప్రబంధమందలి మూల వస్తువు శరణాగతి తత్వమే కదా.  అదే విధముగా పూర్వాచార్యులు కూడా ఏకకంఠులు అగుట చేత దుష్కరమైన వేదాంత తత్వమును వివిధ గ్రంథముల ద్వారా ఒకే విషయమును ఒకే విధముగా ఒక గ్రంథమునకు ఇంకొక గ్రంథము భావ వ్యత్యాసము లేకుండా అంగీకృతముగా నుండు విధమున అనుగ్రహించారు. అందుచేత సిద్ధాంత ప్రమాణములుగా ఈ గ్రంథములు విలసిల్లుచున్నవి.
  •  ఒక గ్రంథమున క్లుప్తముగా వివరించిన విషయము మరొక గ్రంథములో విస్తారముగా చెప్పియుండును. ఇందువలన ఒకదానికి మరొకటి సామరస్యముగానుండును.

ఇదే సూత్రము ఒకే ఆచార్యుడు రచించిన అనేక గ్రంథములకూ వర్తించును. ఒక గ్రంథమందు ప్రతిపాదించిన విషయములను మరొక గ్రంథము ఆదరించుచూ సమన్వయము గలవైయుండును.

శ్రీ పిళ్ళై లోకాచార్యులు, స్వామి మణవాళ మహాముణులు – శ్రీపెరుంబుదూరు

ఈ విధముగా పరమాద్భుతమైన తత్వత్రయ గ్రంథము యొక్క పరిచయము చెప్పబడినది. విశిష్టాద్వైత సిద్ధాంతమందలి క్లిష్టమైన వేదాంత సూత్రములు ఈ గ్రంథములో అత్యంత సులభతరంగా వివరించబడినవి. స్వామి మాణవాళ మహాముణుల యొక్క వ్యాఖ్యానము ఈ గ్రంథమునకు మరింత వన్నె తెచ్చినది. ఈ గ్రంథము నిజానికి ఒక ఆచార్యుని ఆశ్రయించి వారి ముఖేన వినదగిన శాస్త్రము. ఆ అవకాశము లేని వారికి ఈ అనువాదం ఒక సుగమవారధిగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము. పరమ కృపా పూర్ణులైన మన పూర్వాచార్యుల దివ్య శ్రీచరణాలను మనసా స్మరించి ఈ గ్రంథములోని మరిన్ని విషయాలను వచ్చే అధ్యాయాలలో తెలుసుకుందాము!

అడియేన్ శ్రీనివాస రామానుజ దాసన్

మూలము : http://ponnadi.blogspot.in/2013/10/aippasi-anubhavam-pillai-lokacharyar-tattva-trayam.html

పొందుపరిచిన స్థానము: https://srivaishnavagranthamstelugu.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

అనధ్యయన కాలము మరియు అధ్యయన ఉత్సవము

శ్రీ:  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః  శ్రీవానాచల మహామునయే నమః

e-book – https://1drv.ms/b/s!AiNzc-LF3uwyhV63nRcaHTfJ4iwK

మన శ్రీ వైష్ణవ సత్సాంప్రదాయము ఉభయ వేదాంత ఆధారితము. ఉభయ అనగా రెండు మరియు వేదాంతము అనగా శీర్ష భాగము. సంస్కృతమున వేదము (ఉ: ఋగ్, యజుర్, సామ, అథర్వణ) మరియు వేదాంతము (ఉపనిషత్తులు) అను రెండు భాగములు, ఇంకను ద్రావిడమున వేదము (దివ్య ప్రబంధము) మరియు వేదాంతము (వ్యాఖ్యానములు) అను రెండు భాగములు కలవు. ఈ రెండూ రెండు కనులుగా పరిగణింపబడి, ఒకే ప్రాముఖ్యము కలిగి ఉన్నవి. ఆయినను, ఆళ్వార్ల ద్వారా దివ్య ప్రబంధములు వెలువరింబడటము వలనను, వారు ఎమ్పెరుమాన్ల దివ్య కటాక్షముతో అకళంకిత జ్ఞానము పొందిన వారగుట చేత సంస్కృత వేద సారము అయిన నాలాయిర దివ్య ప్రబంధములను సకల జీవుల ఉజ్జీవనమునకై మాత్రమే వెలువరించడము వలన, మనకు వాటి యందు అధిక ప్రావణ్యము కలదు.

అధ్యయనము అనగా పఠనము, అభ్యసించడము, పునశ్చరణ మొదలుగునవి. వేదము ఆచార్యుల వద్ద శ్రవణము గావించి, దానిని మరల మరల మననము చేయడము ద్వారా అభ్యసింపబడుతుంది. వేద మంత్రములు నిత్యానుష్టానములో భాగముగా కూడా పఠింప బడతాయి. అనధ్యయనము అనగా వేద పఠనము నిలిపి వేయడము. సంవత్సరములో కొన్ని సమయములలో వేదము పఠింపబడదు. ఈ సమయము ఇతర శాస్త్ర భాగములు అయిన స్మృతి, ఇతిహాసములు, పురాణములు మొదలగు శాస్త్రములను పఠించడానికి ఉపయుక్తము. అధ్యయన కాలము నందును అమావాస్య, పౌర్ణమి మొదలగు దినములలొ వేద పఠనము నిషిద్ధము. ఈ సాంప్రదాయము సంస్కృత వేదముతో సమానముగా పరిగణింప బడే ద్రావిడ వేదమునకు కుడా కలదు. మనము ఇప్పుడు దివ్య ప్రబంధము అనధ్యయన కాలము యొక్క ప్రాశస్త్యమును తెలుసుకొందాము.

అధ్యయనోత్సవము అనధ్యయన కాలములో భాగము. అధ్యయనోత్సవము నమ్మాళ్వార్ల మోక్షమును స్తుతిస్తుంది. అధ్యయనోత్సవము మరియు అనధ్యయన కాలము మన సాంప్రదాయములో పరస్పరాన్వయములు. ఈ చరిత్ర అంతయు శ్రీ పెరియ వాచ్చాన్ పిళ్ళై స్వామి ప్రసాదించిన “కలియన్ అరుళ్ పాడు” (http://srivaishnava-literature.blogspot.in/p/kaliyan-arul-padu.html)  అను గ్రంథమున వివరింపబడినది (శ్రీ పుత్తూర్ కృష్ణ స్వామి అయ్యంగార్లచే ప్రచురింపబడిన (పెరియ వాచ్చాన్ పిళ్ళై శ్రీ సూక్తమాల -1 లో భాగముగా).

ఇక ఈ గ్రంథములో పొందుపరచ బడిన ఐతిహ్యములను క్లుప్తముగా తెలుసు కొందాము.

  • శ్రీమన్నారాయణుడు, తమ నిర్హేతుక కరుణా కటాక్షములచే సకల జీవుల ఉజ్జీవనమునకై, ఈ సంసారములో కోయిల్ (శ్రీరంగం), తిరుమలై (తిరువేంకటమ్), పెరుమళ్ కోయిల్ (కాంచిపురమ్) మొదలగు పుణ్య క్షేత్రములలో అర్చారూపములో సర్వ సులభుడుగా, సర్వారాధ్యుడుగా వేంచేసారు.
    ఆళ్వారులలో చివరివారైన తిరుమంగయాళ్వార్, శ్రీమన్నారాయణుని నిర్హేతుక కృపచే అనుగ్రహింప బడి, ఎన్నో అర్చావతారములను సేవించిన పిమ్మట శ్రీ రంగము వేంచేసి, అచ్చటనే అనేక మహత్తర కైంకర్యములను సమర్పిస్తూ నివసించారు. తిరుమంగయాళ్వార్ తనను తాను “ఇరున్తమిళ్ నూల్ పులవన్ మంగయాళన్” గా (ఇరున్తమిళ్ నూల్ – తిరువాయ్మొళి, పులవన్ – కవి, తిరువాయ్మొళి ప్రబంధములో ప్రావణ్యము కలవారైన, మంగయాళన్ – తిరుమంగయాళ్వార్) అభివర్ణించుకొని, తిరువాయ్మొళి యందు మిక్కిలి ప్రావణ్యము కలిగి, ఆ పాశురములను నిత్యమూ అనుసంధిచు చుండెడివారు.

  • ఒకానొక తిరుక్కార్తె (కార్తీక మాసం, కృత్తిక నక్షత్రము, పౌర్ణమి తిధి) దినమున, నంపెరుమాళ్ మరియు దేవేరుల తిరుమంజనమ్ (దివ్య స్నానం) తరువాత వేంచేసి యుండగా, ఆ గొప్ప భక్త సందోహములొ, తిరుమంగయాళ్వార్, తిరునెడుందాండగమ్ అను దివ్య ప్రబంమును వ్యక్త పరచి ఎంపెరుమాన్ సమక్షములొ దివ్యముగా గానము చేశారు. తిరువాయ్మొళి పాశురములను కూడ దివ్యముగా గానము చేశారు.
  • నంపెరుమాళ్ ఆ దివ్య గానమునకు ఎంతో ఆనందించి, తిరుమంగైయాళ్వార్లను వరము కోరమనగా, ఆళ్వార్ రెండు వరములను కోరెను.
  • తిరుమంగై యాళ్వార్లకు రెండు కోరికలుండెడివి
      • అవి తిరువాయ్మొళికి సంస్కృత వేదముతో సామ్యము.
      • మరియు నంపెరుమాళ్ సమక్షములో మార్గశిర శుక్ల పక్ష ఏకాదశి అనగా వైకుంఠ ఏకాదశి నాడు అధ్యయనోత్సవము (నమ్మాళ్వార్ మోక్షము) సందర్భములో తిరువాయ్మొళి దివ్య ప్రబంధము అనుసంధానము.
  • ఎంపెరుమాన్ సంతోషముగా ఆ వరములను ఆమోదించి, వెంటనే ఆ సభను, తన తిరుమేనికి అద్దగా మిగిలిన నూనెను, చాలా సమయము నుంచి దివ్య ప్రబంధమును గానము చేయుచున్న కలియన్ కు స్వరము చెడకుండ ఉండునట్లు ఈయ వలసినదిగా ఆజ్ఞాపించెను.
  • అనంతరమ్ ఆళ్వార్ తిరునగరిలో అర్చారూపములో వేంచేసి యున్న నమ్మాళ్వార్లకు వర్తమానము పంపగా, వెంటనే నమ్మాళ్వార్ అక్కడ నుంచి శ్రీ రంగమునకు చేరుకున్నారు.
  • తిరుమంగై ఆళ్వార్ వైకుంఠ ఏకదశి మొదలు 10 రోజులు తిరువాయ్మొళి అనుసంధానమునకు ఆదేశించారు. ఉదయమున వేద పారాయణము సాయం వేళల తిరువాయ్మొళి అనుసంధనము జరిగెడెది. చివరి రోజున, నమ్మాళ్వార్ నంపెరుమాళ్ దివ్య చరణములను తమ శిరస్సుతో తాకే ఘట్టము ఎంతో భక్తి పారవశ్యముతో అనుకరింపబడెడిది. ఉత్సవముల అనంతరము, నమ్మళ్వార్ తిరిగి అళ్వార్ తిరునగరి చేరుకొనేవారు. ఇలా ప్రతి సంవత్సరము సంభవించేది.
  • కొంత కాలము తరువాత, కలియుగ ప్రభావమున, సాంప్రదాయములు అడుగంటి, దివ్య ప్రబంధములు లుప్తములయి, నమ్మాళ్వార్ శ్రీ రంగమును దర్శించడము ఆగి పోయినది.
  • పిమ్మట శ్రీమన్ నాథమునులు అవతరించి, కాల క్రమమున శ్రీమన్నారాయణుని దయతో, ఆళ్వార్లు మరియు దివ్య ప్రబంధముల గురించి తెలుసుకొన్నారు. శ్రీమన్ నాథముని, ఆళ్వార్ తిరునగరి దర్శించి, మధురకవి ఆళ్వార్ల కణ్ణినుణ్ శిరుత్తాంబును అభ్యసించి, నమ్మాళ్వార్ల కరుణా ప్రభావముతో 4000 దివ్య ప్రబంధములను మరియు అందలి భావములను గ్రహించిరి.
  • శ్రీమన్ నాథమునులు తమ శిష్యులకు దివ్య ప్రబంధమును ఉపదేశించి, శ్రీ రంగమునకు వేం చేసి మరల అధ్యయనోత్సవమును ఉద్ధరించారు. అంతే గాక, ఆళ్వార్ల మరియు 4000 దివ్య ప్రబంధముల ప్రాశస్త్యమును నమ్మాళ్వార్ల ద్వారా గ్రహించి, నమ్మాళ్వార్ల మోక్షోత్సవమును కూడ పునరుద్ధరించి, వారి శ్రీ రంగ దర్శనమును తిరిగి ఏర్పాటు చేశారు.
  • ఎంపెరుమాన్ తిరువాయ్మొళి దివ్య ప్రబంధమునకు వేద సామ్యము ధ్రువీకరించి నందు వలన. శ్రీమన్ నాథమునులు వేదమునకు వలెనే తిరువాయ్మొళి మరియు ఇతర దివ్య ప్రబంధములకు అనధ్యయన కాలము నిర్ణయించిరి. ఈ అనధ్యయన కాలము తిరుక్కార్తె దినమున ప్రారంభమయి, కోవెలలో అధ్యయన ఉత్సవము ప్రారంభమయే ముందు ముగుస్తుంది. అలాగే అధ్యయన కాలము అధ్యయన ఉత్సవము మొదటి రోజున ప్రారంభమయి, తిరుక్కార్తె దినమున ముగుస్తుంది.
  • నమ్మాళ్వార్లకు ఆళ్వార్ తిరునగరి యందు ఆహ్వానము పంపే సాంప్రదాయమును మరల ఏర్పరచి, ఈ సమయములో నిత్య తిరువారాధనలో దివ్య ప్రబంధానుసంధానము నుండి శ్రీ వైష్ణవులందరికీ విరామమును ఏర్పాటు చేసారు (దివ్య ప్రబంధము యొక్క మననము, ధ్యానమునకు విరామము లేదు).
  • అంతేగాక ఎంపెరుమాన్లకు తిరుక్కార్తెనాడు అలంకరించిన శుద్ధ తైల శేషమును, నమ్మాళ్వార్లకు, కలియనుకు మరియు మిగిలిన ఆళ్వార్ల కంఠములకు కూడా అలంకరించి, ఆ శేషమును శ్రీ వైష్ణవులందరికీ ప్రసాదించ వలనదిగా అజ్ఞాపించారు.
  • నమ్మాళ్వార్ల తిరువిరుత్తమ్, తిరువాశిరియమ్ పెరియ తిరువన్తాది మరియు తిరువాయ్మొళిలకు నాలుగు వేదములతో సామ్యము. మిగిలిన ఆళ్వార్ల దివ్య ప్రబంధములకు వేదాంగములైన శీక్షా, కల్పము, వ్యాకరణము, నిరుక్తము, చంధస్సు మరియు జ్యోతిషములతో సామ్యము. ఈ దివ్య ప్రబంధములు తిరుమంత్రము, ద్వయము మరియు చరమ శ్లోకముల నిగూఢ భావములను విశదీకరిస్తాయి.
  • ఇంకను నాథమునుల ఆదేశానుసారము,
    • శ్రీ వైకుంఠ ఏకాదశి మునుపు అమావాస్య నుండి మొదటి పది రోజులు ముదలాయిరము (తిరుపల్లాండు, పెరియాళ్వార్ తిరుమొళి, నాచ్చియార్ తిరుమొళి, పెరుమాళ్ తిరుమొళి,  తిరుచ్ఛంద విఱుత్థం,  తిరుమాలై , తిరుప్పళ్లిఎళ్ళుచ్చి, అమలనాదిపిరాన్, కణ్ణినుణ్ శిరుత్తాంబు, పెరియ తిరుమొళి, తిరుక్కురుందాండగం, తిరునెడుందాండకం) అనుసంధింపబడుతుంది.
    • శ్రీ వైకుంఠ ఏకాదశి దినము తిరువాయ్మొళి తొడక్కము (ప్రారంభము) అనుసంధింపబడుతుంది.
    • శ్రీ వైకుంఠ ఏకాదశి దినము ఉదయము వేదపారాయణము, సాయమువేళలో తిరువాయ్మొళి దినమునకు ఒక పత్తు, 10 దినములు అనుసంధింపబడుతుంది. చివరిరోజున ఇ నమ్మాళ్వార్ తొళల్తో ఘనముగా శాత్త్ఱుమురై  నిర్వహింపబడుతుంది.
  • ఇరవై ఒకటో దినము ఇయర్పా (ముదల్ తిరువన్తాది, ఇరణ్డామ్ తిరువందాది, మూన్ఱామ్ తిరువన్తాది, నాన్ముగన్ తిరువన్తాది, తిరువిరుత్తమ్, తిరువాసిరియమ్, పెరియ తిరువందాది, తిరువెళుకూట్రిరుక్కై, శిఱియ తిరుమడల్, పెరియ తిరుమడల్) అనుసంధిప బడుతుంది. (గమనిక: ఎమ్పెరుమానార్ల కాలములో నంపెరుమాళ్ ఆజ్ఞతో ఇరవై ఒకటో దినము సాయంకాలము ఇయఱ్పా శాఱ్ఱుముఱై ముగిసిన పిమ్మట పెరుమాళ్ళ పురప్పాడు సమయములో రామానుజ నూఱ్ఱందాది అనుసంధిప బడుతోంది).
  • నాథమునుల ఆదేశానుసారము బ్రాహ్మణులకు వేదాధ్యయనము విధింప బడినటుల ప్రపన్నులయిన శ్రీ వైష్ణవులు విధిగా దివ్య ప్రభన్దమును అభ్యసించవలెను.
  • అనధ్యయన కాలము అయినను, మార్గశిర మాసములో వేకువ ఝామున, భగవంతుని మరియు భాగవతులకు సుప్రభాతము పాడుటకు ఉద్ద్యేశించిన పాశురములు కలిగిన తొణ్డరడిప్పొడి ఆళ్వార్ల తిరుప్పళ్ళియెళ్ళుచ్చి మరియు ఆణ్డాళ్ ప్రసాదించిన తిరుప్పావై అనుసంధింపబడతాయి.
  • ఈ సాంప్రదాయము ఉయ్యకొండార్, మణక్కాల్ నంబి, ఆళవందార్, పెరియ నంబి మరియు ఎమ్పెరుమానార్ల కాలములో కొనసాగింది.
  • ఒకప్పుడు కారణాంతరముల వలన నమ్మాళ్వార్ శ్రీ రంగము చేరుకోలేకపోయారు. అప్పుడు ఎమ్పెరుమానార్ అన్ని దివ్య దేశములలో నమ్మాళ్వార్ అర్చా విగ్రహమును ప్రతిష్ఠింప వలసినదిగా అదేశించారు. తిరుమల పర్వత శ్రేణి అంతా శ్రీమన్నాయణుని శరీరముగా భావింప బడుట వలన, ఆళ్వారుల దివ్య విగ్రహమును ఆ తిరుమల పర్వత శ్రేణి క్రింది భాగములొ ప్రతిష్ఠింప బడింది. ఇంకా అన్ని దివ్య దేశములలో అధ్యయన ఉత్సవము వైభవముగా నిర్వహించ వలసినదిగా ఎమ్పెరుమానార్ ఆదేశించారు.
  • తిరుక్కురుగైప్పిరాన్ పిళ్ళై ఎమ్పెరుమానార్ అనుఙ్ఞతో తిరువాయ్మొళి వ్యాఖ్యానం సాయించారు. అంతట ఎమ్పెరుమానార్ ఆనందముతో ఆ వ్యాఖ్యానమును కూడా శ్రీ భాష్యముతో అనుసంధించ వలసినదిగా ఆజ్ఞ్యాపించారు.
  • ఎమ్పెరుమానార్ శ్రీ రంగంలో చాలా కాలం అసంఖ్యాకమైన శ్రీ వైష్ణవ సముదాయముతో నివసించారు. వారికి ఎంతో గహనము మరియు ముఖ్యములైన సంప్రదాయ రహస్యములను వివరిస్తూ సదా పెరియ పెరుమాళ్కు మంగళాశాసనం గావించారు.
  • స్వామి ఎమ్పెరుమానార్ పరమపదమును అలంకరించగా భట్టర్ (ఆళ్వాన్ వరపుత్రులు మరియు శ్రీ రంగనాథ శ్రీ రంగ నాచియర్ల దత్త పుత్రుడు) అరుళాళ పెరుమాళ్ ఎమ్పెరుమానార్ ఎంబార్ కందాడై ఆండాన్ తదితరులు శ్రీ రంగంలో మరి ఇతర దివ్య దేశములలోను ఎమ్పెరుమానార్ విగ్రహమును సకల జీవుల ఉజ్జీవనమునకై ఎమ్పెరుమాన్ ఆజ్ఞ్యతో ప్రతిష్టించారు.
  • శ్రీమన్ నాథమునులు కణ్ణినుణ్ శిఱుతాంబు యొక్క నిగూఢమైన భగవద్భావములను గ్రహించి నాలాయిర దివ్య ప్రబంధమున చేర్చినట్టు, ఎమ్పెరుమాన్ అభిమతము మేరకు రామానుజ నూఱ్ఱందాది కూడ చేర్చడమైనది. సద్బ్రాహ్మణునకు ప్రతి నిత్యము గాయత్రి జపము విధింపడినటుల ప్రపన్నులయిన శ్రీ వైష్ణవులకు రామానుజ నూఱ్ఱందాది నిత్యానుసంధానము విధింపడినది.
  • తరువాతి ఆచార్యులందరు రామానుజులచే వెలువరింపబడిన సంప్రదాయ రహస్యములను సకలుర ఉజ్జీవనమునకై ప్రచారము చేయుచూ కాలక్షేపము చేసారు. కలియన్ అరుళ్ళప్పాడు ప్రబంధము సమాప్తము.

తదనంతరము పరాశర భట్టర్ తిరునారాయణ పురమునకు దిగ్విజయము చేసి వేదాంతిని వాదమున జయించి తన శిష్యునిగా స్వీకరించారు. వేదాంతి సన్న్యాసము స్వీకరించి నంజీయరుగా ప్రసిద్ధులయినారు. భట్టర్ వేదాంతిని వాదమున జయించి అధ్యయనోత్సవము ప్రారంభమునకు ముందు రోజు శ్రీ రంగమునకు వేంచేశారు. పెరియ పెరుమాళ్ళకు తిరుమంగై ఆళ్వారు సాయించిన తిరునెడుందాండకము నందలి రహస్యములను విశదీకరించి వాదమున వేదాంతిని జయించిన విధమును తెలియజేయగా, పెరియ పెరుమాళ్ మిగుల ఆనందించి, భట్టరులను బాగుగా ప్రశంశార్హులుగా ఆఙ్యాపించి, శ్రీ రంగములో అధ్యయనోత్సవము తిరునెడుందాండకముతో ప్రారంభము అగునట్లు శాసించారు. దీనితో మన సత్సంప్రాదాయమున అధ్యయనోత్సవము యొక్క పూర్వాపరాలను తెలిసికొన్నాము.

 

అధ్యయనోత్సవముల సందర్భములో అన్ని దివ్య దేశములలోనూ 21 దినములు జరిగే ఉత్సవములు ఇలా ఉంటాయి.

  • ఎమ్పెరుమాన్, నాచియార్లు, ఆళ్వార్లు మరియు ఆచార్యులు 21 దినములునూ ఒక పెద్ద సభలో ఆసీనులు అవుతారు. ఎమ్పెరుమాన్ మరియు నాచియార్లు సభ మధ్య భాగమునను, ఆళ్వారాచార్యాదులు వారికి రెండు వైపుల రెండు వరుసలలో ఆసీనులవుతారు ఎదురెదురుగా ఆసీనులవుతారు.
  • అనేక దివ్య దేశములలో నమ్మాళ్వార్ ఆళ్వార్ గోష్ఠికి తిరుమంగై ఆళ్వార్ మరియు ఎమ్పెరుమానార్లతో కలసి (శ్రీ వైష్ణవ సంప్రదాయమునకు వారు చేసిన కైంకర్యమునకు) నాయకత్వము వహిస్తూ, ఆళ్వారాచార్యాదులతో ఆసీనులవుతారు.
  • వానమామలై, తిరుక్కుఱుంగుడి మొదలగు దివ్య దేశములలో నమ్మాళ్వార్ అర్చా విగ్రహము లేకపోవడము వలన, తిరుమంగై ఆళ్వార్ మరియు ఎమ్పెరుమానార్ల ఆధ్వర్యములో ఉత్సవములు జరుగుతాయి.
  • శ్రీ పెరుంబూదూర్ దివ్య దేశము ఎమ్పెరుమానార్ అవతార స్థలము అయినందు వలన మరియు ఆణ్డాళ్ నాచియార్ ఎమ్పెరుమానార్ను జ్యేష్ఠ సోదరునిగా భావించి నందు వలనను, ఆణ్డాళ్ నాచియార్ ఎమ్పెరుమాన్ మరియు నాచియార్లతో ఆసీనురాలు కాక, ఆళ్వార్ ఎమ్పెరుమానార్ గోష్ఠీని అలంకరిస్తారు.
  • వైకుంఠ ఏకాదశి మొదలుకొని సాయం సమయమున పరమపద ద్వారము తెరవబడుతుంది. నమ్మాళ్వార్, మరియు ఆ దివ్య దేశము ఆచారమును బట్టి మిగిలిన ఆళ్వారాచార్యాదులు, పరమపద ద్వారమునకు అభిముఖముగా నిలచి, ఎంపెరుమాన్లకు మంగళాశాసనములు చేస్తూ పురప్పాడులో పాల్గొంటారు.
  • పగల్పత్తు మొదట 10 దినములు తిరుమొళి తిరునాల్ అనగా మధ్యాహ్న సమయములో ముదలాయిరము మరియు పెరియ తిరుమొళి అనుసంధింపబడతాయి. పురప్పాడు జరుగు దివ్య దేశములలో ఆ సమయములో ఉపదేశరత్తిన మాలై అనుసంధింపడుతుంది.
  • వైకుంఠ ఏకాదశి మొదలు 10 దినములు తిరువాయ్మొళి తిరునాల్ అనగా సాయము సమయములో తిరువాయ్మొళి అనుసంధింపడుంది.
  • 20వ దినము తిరువడి తొళల్ మరియు తిరువాయ్మొళి శాఱ్ఱుమురైతో ముగుస్తుంది. తిరువడి తొళల్ సందర్భములో అర్చకులు నమ్మాళ్వార్లను తమ హస్తములతో తోడ్కొని వెళ్ళి ఆయన శిరమును ఎమ్పెరుమాన్ పాదములమీద ఉంచుతారు. ఆ పిమ్మట నమ్మాళ్వార్ తులసీదళములతో అలంకరింపబడతారు.
  • 21వ రోజు
    • సాయంకాలము – ఇయర్పా అనుసంధానము
    • రాత్రి – పురప్పాడు (ఊరేగింపు)లో రామానుజ నూఱ్ఱందాది గోష్ఠి మరియు ఇయల్ శాఱ్ఱు
  • 22వ రోజు – తిరుప్పల్లాణ్డు తొళక్కమ్ (ప్రారంభము) మరియు 4000 దివ్య ప్రబంధము అనుసంధానము మొదలు

ఇక ఆయా దివ్య దేశములలో జరిగే అధ్యయన ఉత్సవములలోని విశేషాంశాములను తెలుసు కొందాము ఇక ఆయా దివ్య దేశములలో జరిగే అధ్యయన ఉత్సవములలోని విశేషాంశాములను తెలుసుకొందాము.

  • శ్రీరంగము
    • 22 రోజులు ఉత్సవములు – అనగా ప్రారంభములో ఒక రోజు తిరునెడున్తాణ్డగమ్ అనుసంధానము, తరువాత 21 రోజులు ఉత్సవము.
    • అరయర్లు నమ్పెరుమాళ్, నాచియార్లు మరియు ఆళ్వారాచార్యాదుల ఎదుట పాశురములను అనుసంధింస్తూ వాటి అర్ధములకు, భావములకు అనుగుణముగా అభినయిస్తారు.
    • అరయర్ సేవ సమయములో నంపెరుమాళ్ మరియు నాచియార్లు ఎత్తైన మండపము మీద ఆసీనులవుతారు. ఆళ్వారాచార్యాదులు వారికి అభిముఖముగా ఆసీనులవుతారు.
  • ఆళ్వార్ తిరునగరి
    • అరయర్ సేవలో అభినయముతో పాశురనుసంధానము. అరయర్ స్వాములు అనుసంధించిన పాశురములను తరువాతి రోజు అధ్యాపక స్వాములు అనుసంధిస్తారు.
    • పగల్పత్తు 10వ రోజున (వైకుంఠ ఏకదశి ముందు దశమి) నమ్మాళ్వార్ ఎంపెరుమానార్ల ప్రత్యేక దర్శనము – శ్రీ రంగనాధ స్వామి వారి శయన భంగిమలో ఉన్న నమ్మాళ్వార్ శ్రీ పాదముల వద్ద శ్రీ రంగ నాచియార్ల భంగిమలో ఎంపెరుమానార్ దర్శనము ఇస్తారు.

                        నమ్మాళ్వార్ – ఎంపెరుమానార్

    • అన్ని దివ్య దేశములలోను పగల్పత్తు చివరి రోజైన 20వ రోజున తిరువడి తొళళ్ (నమ్మాళ్వార్ ఎంపెరుమాన్ పాద కమలములను చేరుకోవడము) జరుగుతుంది. కాని ఇక్కడ తిరుముడి తొళల్ అంటే అర్చకులు తమ శ్రీ హస్తములతో ఎంపెరుమాన్ను తీసుకువెళ్ళి ఎంపెరుమాన్ శ్రీ పాదములను స్వామి నమ్మాళ్వార్ శిరమున ఉంచుతారు. ఈ అద్భుత దృశ్యము కన్నుల పండుగై, పరగత స్వీకారమును ధృఢపరుస్తుంది (పరగత స్వీకారము అనగా స్వయముగా శ్రీమన్నారాయణుడే సకల జీవులను తన నిర్హేతుక కృపాకటాక్షములతో కరుణించి తన అధీనమునకు చేర్చుకోవడము).
    • 22 దినములు అధ్యయనోత్సవములు – చివరిలో మరి ఒక రోజు “వేడు పడై
      తిరుమంజనమ్” (విశేష స్నానోపచారము).
    • ఈ చివరి రోజున, పొలిందు నిన్ఱప్పిరాన్ ఎంపెరుమాన్ సర్వుల ఉజ్జీవనముకై నమ్మాళ్వర్లను తిరిగి లీల విభూతికి పంపుతారు.
    • తిరుప్పల్లాండు తొడక్కమ్ (మొదలు) తరువాత వచ్చే విశాఖ నక్షత్రమున (నమ్మాళ్వార్ తిరునక్షత్రమున) ప్రారంభము అవుతుంది.
  • తిరు తులైవిల్లిమంగలమ్
    • నమ్మాళ్వార్ తిరువాయ్మొళిలో దేవ పిరాన్ ఎంపెరుమాన్లను తమ తల్లి దండ్రులుగా సంభావించారు. నమ్మాళ్వార్లకు దేవ పిరాన్ అనిన అమితమైన అభిమానము. అందువలన, పూర్వము, ఆళ్వార్ శ్రీ రంగము నుండి తిరిగి వచ్చునప్పుడు, తిరువిల్లి మంగలమ్ చేరి, అక్కడే మాసి విశాఖమువరకు వేంచేసి, ఆళ్వార్ తిరునగరికి చేసుకునేవారు.
    • ఈ వృత్తాంతము అనుసారము, ఆళ్వార్ తిరునగరిలో మాసి మాసములో జరిగే 13 రోజుల ఉత్సవముల చివరిలో మాసి విశాఖదినమున నమ్మాళ్వార్ తులైవిల్లిమంగల దివ్య దేశమునకు వేంచేసి, ఆ దినము అంతా తిరుమంజనము, గోష్ఠి మొదలగునవి సేవించి తిరిగి ఆళ్వార్ తిరునగరి చేరుకుంటారు.
    • తరువాతి దినము తిరుప్పల్లాండు తొడక్కమ్ (అప్పటి వరకు ఈ దివ్య దేశములో అనధ్యయన కాలము).
  • తిరువాలి / తిరునగరి మరియు తిరునాంగూర్ దివ్యదేశములు
    • సాధారణముగా తిరుక్కార్తె దీపము కలియన్ తిరు నక్షత్రము ఒకేసారి వస్తాయి. కానీ ఎప్పుడైనా ఒకే నెలలో రెండు కార్తీక నక్షత్రములు వచ్చి నపుడు, రెండవ కార్తీక నక్షత్రమును తిరుమంగై యాళ్వార్ తిరు నక్షత్రముగా నిర్ణయిస్తారు. అనధ్యయన కాలము మిగిలిన దివ్య దేశములలో తిరుక్కార్తె దీపము నుండి మొదలు అయినా, ఈ దివ్య దేశములలో మాత్రము తిరుమంగైయాళ్వార్ తిరువవతారము సందర్భములో 4000 దివ్య ప్రబంధము అనుసంధానము మరియు వైభవముగా ఉత్సవములు అయిన తరువాతే అనధ్యయనకాలము మొదలు అవుతుంది.
  •  తిరుమెయ్యమ్
    • 21 రోజుల అధ్యయనోత్సవములతో కలియన్ తిరువడి తొళల్ (కలియన్ శ్రీమన్నారాయణుని పాదారవిందములను సేవించడము) కూడ పగల్పత్తు చివరి రోజున వైభవముగా జరుగుతుంది.
  • శ్రీ పెరుంబూదూర్
  • మకర మాసం పుష్యమి నక్షత్రము వరకు 3 దినముల పాటు గురు పుష్యమి వైభవముగా జరుగుతుంది. శ్రీ పెరుంబూదూర్ దివ్య దేశములో ఎంపెరుమానార్ అర్చా విగ్రహము ప్రతిష్ఠింప బడి నందు వలన దీనికి అధికమైన ప్రశస్తి కలదు.
    అధ్యయనోత్సవము గురు పుష్యమి ఒకేసారి సంభవిస్తే అధ్యయనోత్సవము మొదట నిర్వహింప బడుతుంది.
  • తిరుచేఱై, తిరుమళిశై మొదలగు దివ్య దేశములలో కూడ బ్రహ్మోత్సవములు లేదా ఆళ్వార్ ఉత్సవములు మరియు అధ్యయనోత్సవములు ఒకేసారి వస్తే అధ్యయనోత్సవములు మొదట నిర్వహింప బడతాయి.

ఇయర్పా తరువాతి దినమున సాధారణముగా కోవెలలో దివ్య ప్రబంధానుసంధానము తిరుప్పల్లాండు అనుసంధానముతో యదా విధిగా తిరిగి మొదలు అవుతుంది. ఇలాగే ఆయా దివ్య దేశములకు మాత్రమే ప్రత్యేకములైన విశిష్ఠతలు ఉన్నాయి.

అనధ్యయన కాలము నందు గృహములలో దివ్య ప్రబంధము అనుసంధానము ఆయా దివ్య దేశములలో ఆచారములను బట్టి వివిధములుగా మారుతూ ఉంటుంది

  • అనేక దివ్య దేశములలోని స్వగృహములలో దివ్య ప్రబంధానుసంధానము ఆ దివ్య దేశము యొక్క సంప్రదాయమును అనుసరించి ఉంటుంది. ఉదాహరణకు, తిరుక్కార్తె దీపము లేదా అనధ్యయన కాలము మొదలు అయిన దినము నుండే స్వగృహములలో దివ్య ప్రబంధానుసంధానమునకు విరామము ఇవ్వ బడుతుంది. తిరిగి దివ్య దేశములలో తిరుప్పల్లాండు తొడక్కమ్ అనుసంధానము మొదలు అయినప్పటి నుంచి (సాధరణముగా ఇయర్పా శాఱ్ఱుమురై తరువాతి దినము నుండి) స్వగృహములలో దివ్య ప్రబంధానుసంధానము మొదలు అవుతుంది.
  • ఒక సంప్రదాయము ప్రకారము దివ్య ప్రబంధానుసంధానము తాయ్ హస్తము (కూరత్తాళ్వాన్ తిరునక్షత్రము) నుండి తిరిగి మొదలు అవుతుంది. ఈ సంప్రదాయమునకు నాంది, పూర్వము శ్రీ వైష్ణవులు అధ్యయనోత్సవములను నంపెరుమాళ్ మరియు నమ్మాళ్వార్లతో సేవించడానికి గాను శ్రీ రంగమునకు విశేషముగా వెళ్ళేవారు. ఉత్సవములు పూర్తి అయిన తరువాత తిరిగి స్వగృహములను చేరుకునేందుకు చాల రోజులు అయ్యేది. దీని స్మృత్యర్ధముగాను, స్వగృహములలో దివ్య ప్రబంధానుసంధానము తై హస్తము (కూరత్తాళ్వాన్ తిరునక్షత్రము) నుండి తిరిగి మొదలు అవుతుంది.
  • అన్ని సంప్రాదాయ రహస్యముల వలెనే, ఈ విషయములోను మన పెద్దల నుండి ఆయా దివ్య దేశములలోని శిష్ఠాచారములను గ్రహించి వాటినే పాటించాలి.

మరి అనధ్యయన కాలములో అభ్యసించి అనుసంధించి దగిన సంప్రదాయ రహస్యములు?

కొన్ని సూచనలు

  • సాధారణముగా దేవాలయములలో అనధ్యయన కాలము నందు తిరుప్పావై బదులు ఉపదేశరత్తిన మాలై మరియు కోఇల్ తిరువాయ్మొళి/రామానుజ నూఱ్ఱందాది బదులు తిరువాయ్మొళి నూఱ్ఱందాది అనుసంధానము జరుగుతుంది.
  • మార్గశిర మాసములో తిరుప్పళ్ళియెళ్ళుచ్చి / తిరుప్పావై అనుసంధానము తిరిగి మొదలు అవుతుంది.
  • కోవెలలో అధ్యయనోత్సవములో 4000 పాశురములను ఒకసారి అనుసంధిస్తారు.
  •  అనధ్యయనకాలములో స్వగృహములందు తిరువారాధనములో 4000 దివ్య ప్రబంధము అనుసంధింపబడదు (కానీ మార్గశిర మాసములో కోవెలలో వలెనె తిరుప్పావై మరియు తిరుప్పళ్ళియెళ్ళుచ్చి అనుసంధింప బడతాయి).
    • స్వగృహములలో పూజామందిర ద్వారములు తెరిచే సమయములో జితన్తే స్తోత్రము మొదటి 2 శ్లోకములను, కౌసల్యా సుప్రజా రామ శ్లోకమును, కూర్మాదీన్ శ్లోకమును అనుసంధిస్తాము, కానీ ఆళ్వార్ల పాశురములను ధ్యానించుట / మననము చేయుటకు ఏమీ ఆటంకము లేదు.
    • అలాగే తిరుమంజన సమయములో మనము నిత్యము పంచ సూక్తములను, వెణ్ణై అళైన్ద కుణున్గుమ్ పథికము మరియు కొన్ని ఇతర పాశురములను అనుసంధిస్తాము, కానీ, అనధ్యయన కాలమందు పంచ సూక్తములను మాత్రమే అనుసంధిస్తాము.
    • మంత్ర పుష్పముతో చెన్ఱాయ్ కుడైయమ్ పాశురమ్ అనుసంధిస్తాము, కానీ అనధ్యయన కాలములొ ఎమ్పెరుమానార్ దరిశనమ్ ఎన్ఱే పాశురమును అనుసంధిస్తాము.
    •  శాఱ్ఱుముఱై సమయములో మనము నిత్యమూ అనుసంధించే శిఱ్ఱమ్ శిరుకాలే, వంగక్కడల్ మరియు పల్లాండు పాశురముల బదులు ఉపదేశరత్తిన మాలై మరియు తిరువాయ్మొళి నూఱ్ఱందాది పాశురములను అనుసంధించి, సర్వ దేశ దశాకాలేషు… మరియు వాళి తిరునామములతో కొనసాగిస్తాము.
  • మన పూర్వాచార్య విరచితములయిన సంస్కృత స్తోత్త్ర గ్రంథములను, మరియు ఙానసారము, ప్రమేయసారము, సప్త కాదై, ఉపదేశరత్తిన మాలై, తిరువాయ్మొళి నూఱ్ఱందాది మొదలైన తమిళ ప్రబంధములను అభ్యసించుటకు ఇది మంచి సమయము. అలాగే మన పూర్వాచార్యుల తనియన్లను వాళి తిరునామములను అభ్యసించి అనుసంధించు కొనవచ్చును.
  • అలాగే, మన సంప్రదాయ రహస్య గ్రంథములను సేవించి మననము చేసికొనవచ్చును.

అనధ్యయన కాలములో దివ్య ప్రబంధము యొక్క అభ్యాసము కాని, అనుసంధానము లేకున్నను, వాస్తవమునకు ఈ సమయములో మనము ఆనందముగా సేవించుటకు చాలా సంప్రదాయ విశేషాలు ఉన్నాయి. వాటిలో కొన్ని ముఖ్యమైనవి:

  • మనము ఎంతో ఆతురతతో ఎదురు చూసే అద్భుతమైన అధ్యయన ఉత్సవము – శ్రీ వైష్ణవులకు ఎంతో ప్రాముఖ్యము కలది – భగవదనుభవముతో నిండిన 20+ ఆహ్లాద భరితమైన దినములు.
  • ఆణ్డాళ్ నాచియార్ వరప్రసాదమైన అద్భుత ధనుర్మాస తిరుప్పావై అనుభవము.
  • మన పూర్వాచార్యులచే ఎంతొ సరళము దివ్యము అయిన సంస్కృతములోను అందిచ బడ్డ స్తోత్ర గ్రంథములు మరియు తమిళ ప్రబంధములను నేర్చుకొని తరించగలిగే మహత్తరమైన అవకాశము.

ఈ విధముగా మనము అనధ్యయన కాలము మరియు అధ్యయన ఉత్సవములకు సంబంధించిన కొన్ని ముఖ్యాంశములను ఈ శీర్షికలో గ్రహించాము.

మణవాళ మాముణుల తిరువావతారముతో తిరువాయ్మొళి మరియు నమ్మాళ్వార్ల వైభవము దశ దిశలా ప్రసరింపబడింది. వారు సకల మానవాళి ఉజ్జీవనమునకు దివ్య ప్రబంధము, అందలి రహస్యములను సర్వులకు అందజేయుటకు తమ యావజ్జీవనము కృషి చేశారు. అంతియేగాక మణవాళ మాముణులు తమ ప్రవృత్తి లోను ఆళ్వారాచార్యాదులచే ఉటంకింపబడిన సదాచారములను, గుణములను ఎల్లప్పుడూ వ్యక్తపరిచారు. వీరి సద్వృత్తి, సదాచారములకు నంపెరుమాళ్ ఎంతగానో ఆనందించి భగవద్విషయము (నంపిళ్ళై స్వామి వారి ఈడు వ్యాఖ్యానము మరియు ఇతర తిరువాయ్మొళి వ్యాఖ్యానముల ఆధారముగా) ఒక సంవత్సరము పాటు ప్రవచనము చేయ వలసినదిగా ఆదేశించారు. అంతట ప్రవచనము ముగింపులో ఆణి తిరుమూలా నక్షత్రమున శ్రీ రంగనాధులు ఒక చిన్న బాలుని రూపములో ఏతెంచి మణవాళ మాముణుల ను తమ ఆచార్యునిగా సంభావించి, వారి పట్ల కృతఙ్ఞతతో “శ్రీ శైలేశ దయాపాత్రమ్…….” శ్లోకమును సమర్పించారు.

 

మనమందరమూ కూడ ఇక ముందు రాబొయే ఈ ప్రశస్తమైన ఉత్సవములందు అన్వయించుకునేందుకు సంసిద్దులమవుదాము.

అడియేన్ అనంతరామన్ రామానుజదాసన్

మూలము: http://ponnadi.blogspot.in/2013/11/anadhyayana-kalam-and-adhyayana-uthsavam.html

పొందుపరిచిన స్థానము: https://srivaishnavagranthamstelugu.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

శ్రీమద్రామానుజుల 72 అపూర్వ వార్తలు

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్ వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః

swamy-in-unjal

శ్రీమద్రామానుజుల 72 అపూర్వ వార్తలు

లీలా విభూతి నుండి నిత్య విభూతికి తరలి పోయే సమయములో ఆచార్యుల విషయములోను, తోటివారి విషయములోను, లోకములోను నడచుకొన వలసిని విధానము గురించి తమ శిష్యులకు చెప్పిన 72 అపూర్వ వార్తలు.

  1. మీ ఆచార్యుల పట్ల , శ్రీవైష్ణవుల పట్ల చూపే భక్తిలో భేదము పాటించ రాదు.
  2. ఆచార్యుల బోధనలను పరి పూర్ణముగా విశ్వసించాలి.
  3. ఇంద్రియములకు దాసులు కావద్దు.
  4. ఙ్ఞాన సముపార్జనతో ఆగిపోవద్దు.
  5. భగవంతుడి లీలను తెలిపే రచనలను చదవటములో ఆనందమును అనుభచండి.
  6. ఒక సారి మీ ఆచార్యులు ఙ్ఞానేత్రమును తెరిచిన తరువాత తిరిగి ఇంద్రియ భోగములకు దాసులు కాకండి.
  7. సుఖదుఃఖములను సమానముగా స్వీకరించండి.
  8. గంధము, పుషములు, సెంటు వంటి సువాసన ద్రవ్యములకు దాసులు కావద్దు.
  9. భాగవతుల కథలను, ఔన్నత్యములను, నిరంతరము స్మరించటము వలన భగవంతుడు మిమ్మల్ని తనవారిగా స్వీకరిస్తాడు.
  10. భాగవత కైంకర్యము చేసే వారి కంటే ఎవరూ ముందుగా భగవంతుడిని చేరుకోలేరనే విషయాన్ని మీ మనసులలో దృఢముగా చిత్రించుకోవాలి.
  11. అత్యంత ఙ్ఞాన వంతుడైనా, భగవంతుడికి, భాగవతులకు కైంకర్యము చేయక పోతే నాశము తప్పదు.
  12. శ్రీవైష్ణవుల జీవనము లౌకిక సంపదలు ఆర్జించటము కోసమని అనుకోవద్దు.
  13. పరమపదము చేరటమే లక్ష్యముగా జీవనము సాగించాలి.
  14. భాగవతులను పొరపాటున కూడా అమర్యాదగా పిలవరాదు.
  15. శ్రీవైష్ణవులను చూసిన మాత్రముననే నమస్కరించటము మరచిపోకండి.
  16. భగవంతుడి ముందు, భాగవతుల ముందు, పెద్దల ముందు విలాసముగా కూర్చో కూడదు.
  17. నిద్రించే సమయములో భగవంతుడివైపు, భాగవతులవైపు, గృహ దేవతవైపు కాళ్ళు చాచరాదు.
  18. నిద్ర లేవగానే గురుపరంపరను అనుసంధానము చేయాలి.
  19. భాగవత గోష్ఠి కనపడితే భగవంతుడి కన్నా ముందు భాగవతులకు నమస్కారము చేయాలి.
  20. భాగవత గోష్ఠిలో నామ సంకీర్తనమో, ప్రబంధ సేవో జరుగుతున్నప్పుడు భక్తితో నమస్కరించాలి. మధ్యన లేచి వెళ్ళరాదు. అది దోషాలన్నిటిలోను పద్ద దోషము.
  21. శ్రీవైష్ణవులు మిమ్మల్ని చూడటానికి వస్తుంటే మీరే ముందుగా ఎదురేగి ఆహ్వానించడము మరవకండి. వారు బయలుదేరి నపుడు కొంత దూరము కూడా వెళ్ళి సాగనంపండి. ఇలా చేయక పోవటము పాపము.
  22. శ్రీవైష్ణవుల ఎడ భక్తితో ప్రవర్తించండి. వారి కృప మీమీద ప్రసరించేదాకా వేచి ఉండండి. అందుకని తరచుగా వారి ఇళ్ళకు వెళ్ళటము, వారి పేరును మీపేరు ముందు చేర్చుకోవటము, జీవనము కోసము వారి మీద ఆధారపడటము లాంటి పనులు చేస్తే, అవి మీ స్తాయిని దిగజారుస్తాయి.
  23. కోవెలను, గోపురమును చూడగానే భక్తితో చేతులు జోడించండి.
  24. ఎంత అందముగా మలచబడ్డా వింత దేవుళ్ళవైపు చూడకండి.
  25. వింత దేవుళ్ళ చేష్టలను విని ఆశ్చర్య పోకండి.
  26. శ్రీవైష్ణవులు భగవత్, భాగవత, ఆచార్య గ్రంధములను సేవించే సమయములో వారితో వాదనకు దిగరాదు.
  27. శ్రీవైష్ణవుల నీడను దాటరాదు.
  28. మీ నీడను శ్రీవైష్ణవుల మీద పడనీయకండి.
  29. అపవిత్రమైన వాటిని తాకితే స్నానము చేయనిదే శ్రీవైష్ణవులను తాకరాదు.
  30. పేదవారైన శ్రీవైష్ణవులు మిమ్మల్ని ముందుగా నమస్కరించితే, వారిని తక్కువగా చూడవద్దు. అది పాపము.
  31. శ్రీవైష్ణవులు మిమ్మల్ని ముందుగా నమస్కరించి “దాసుడిని” అనగానే, మిమ్మల్ని మీరు గొప్పగా తలచ కూడదు.
  32. ఎవరైనా శ్రీవైష్ణవుల లోపాలు (అతి నిద్ర, సోమరి తనము, తక్కువ కులములో పుట్టి వుండటము….)తెలిసి వుంటే ఎవరిదగ్గర చెప్పరాదు. వారిలోని మంచిని మాత్రమే అందరితో పంచుకోవాలి.
  33. అనుకోకుండానైనా భగవంతుడికిగాని, భాగవతులకుగాని శ్రీపాదములను కడిగిన తీర్థమును వారి ముందే పంచుకోవద్దు.
  34. తత్వ త్రయము, మంత్ర త్రయము తెలియని వారి శ్రీపాద తీర్థమును ఎట్టి పరిస్తితులలోను తీసుకోరాదు.
  35. ఆచార్య శ్రీపాద తీర్థమును తీసుకోవటము ఎట్టి పరిస్తితులలోను మరువరాదు.
  36. మీ అంచనాలకు మించి భాగవతుల స్థాయికి ఎదగ వద్దు.
  37. నాస్తికుడిని పొరపాటున తాకినా వేంటనే భాగవతుల శ్రీపాద తీర్థముతో పవిత్ర స్నానము చేయాలి.
  38. ఙ్ఞాన, వైరాగ్య, భక్తి సంపన్నులు ఈ దేహమును ఒక వస్త్రముగా భావిస్తారు. అలాంటి వారికి కైంకర్యము చేయండి.
  39. వారి జన్మనిరూపణ చేయకుండా మీరు కైంకర్యము చేసి తరించటము కోసము వచ్చిన పవిత్రులుగా భావించండి.
  40. నాస్తికుల గృహములలో భగవంతుడి శ్రీపాద తీర్థము అయినా తీసుకోరాదు.
  41. నాస్తికుల గృహములలో భగవంతుడి విగ్రహాలకు పూజ చేయ రాదు.
  42. పవిత్ర స్థలములలో నాస్తికులున్నా భగవత్ప్రసాదము తీసుకోవచ్చు.
  43. శ్రీవైష్ణవులు భగవత్ప్రసాదము ఇచ్చినప్పుడు, ఉపవాస దినము అని నిరాకరించరాదు.
  44. భగవంతుడికి సమర్పించే ప్రసాదముల పవిత్రత కంటే దానిని స్వీకరించిన భగవంతుడు పరమ పవిత్రుడని తెలుసుకోవాలి.
  45. శ్రీవైష్ణవుల ముందు ఆత్మస్తుతి చేసుకోరాదు.
  46. ఇతరులను చిన్నబుచ్చ రాదు.
  47. ప్రతి క్షణము భగవత్, భాగవత కైంకర్యములో గడపాలి.
  48. రోజులో కొంతభాగము , కనీసము ఒక గంట అయినా ఆచార్య సూక్తులను చేప్పుకోవాలి.
  49. రోజూ ఆళ్వార్ల, ఆచార్యుల రచనలను చదవాలి.
  50. స్వార్థపరుల గొష్ఠిలో చేర రాదు.
  51. కపట శ్రీవైష్ణవ వేషధారుల గొష్ఠిలో చేర రాదు.
  52. పుకారులను, అపవాదులను మాట్లాడటము, ప్రచారము చేయటము చేయరాదు.
  53. ఇతర మతవాదులతో చేరి ,వాదించి పాపము పెంచుకోకుండా శ్రీవైష్ణవుల గొష్ఠిలో చేరండి.
  54. భగవత్, భాగవత దూషణ చేసేవారు లౌకికముగా ఎంత పెద్దవారైనా వారి వైపు చూపు తిప్పకండి.
  55. సత్యమును విశ్వసించే విషయములో ద్వైదీభావము గల మేధావులతో చేరకండి.
  56. మోక్షమునకు ప్రపత్తి కాక ఇతర మార్గాలను అవలంభించే వారితో చేరకండి.
  57. తత్వ త్రయము, మంత్ర త్రయములను విశ్వసించని వారితో చేరకండి.
  58. ఐశ్వర్యము, లౌకిక సుఖముల వెంట పరుగులు తీసేవారికి దూరముగా వుండండి. కలిగినంతలో భగవంతుడికి సమర్పించి సంతోషముగా జీవనము సాగించండి.
  59. శ్రీవైష్ణవులెవరైనా మీకు అపకారము చేసినా, అనాదరణ చేసినా, వారికి అపకారము చేయ తలపెట్టరాదు. ఆత్మ నిగ్రహము కలిగి వుండాలి.
  60. పరమపదములో చోటు కోరుకుంటే, శ్రీవైష్ణవుల నుండి లబ్ది పొందకండి.
  61. భగవతుడిని ప్రపత్తి చేసిన వారు, విధి, విధానములకు భంగము రాకుండా భాగవతులతో నడచుకుంటారు.
  62. భగవతుడికి సమర్పించే గంధము, పుష్పములు, తమలపాకులు, వస్త్రము, నీరు రుచి, వాసన చూడరాదు.
  63. భగవంతుడికి సమర్పించే ప్రసాదముల పవిత్రత కంటే దానిని స్వీకరించేవాడు పరమ పవిత్రుడని తెలుసుకోవాలి.
  64. ప్రసాదములు ఉత్తమ జన్మ, పవిత్ర జీవనము ఉన్న వారు తయారు చేస్తేనే తీసుకోవాలి.
  65. కంటికింపైన వన్నీ భగవతుడికి సమర్పించ రాదు.
  66. భగవతుడికి సమర్పించ తగిన పదార్థములుగా మన గ్రంధములలో పేర్కొనిన వాటిని మాత్రమే సమర్పించాలి.
  67. భగవతుడికి సమర్పించి ఆయన కటాక్షించిన, పదార్థములను స్వీకరించండి . కాని వాటీని భోగ వస్తువులుగా చూడ రాదు.
  68. శాస్త్రములలో తెలిపిన విధముగా కైంకర్యము చేయాలి.
  69. మంత్ర త్రయమును ధ్యానము చేయు విషయములో శ్రధ్ధ గౌరవము లేని వారికి, లౌకిక విషయములో శ్రధ్ధ గౌరవము అమితముగా కల వారికి ఆత్మహాని నిశ్చయము.
  70. భాగవత కైంకర్యము జీవిత లక్ష్యము కావాలి. వారికి అసంతృప్తి కలిగితే అది ఆత్మహాని హేతువవుతుంది.
  71. ఎవరైతే భగవతుడిని కేవలము రాతి విగ్రహముగాను, అచార్యులను సామాన్యునిగాను, సకల పాపాలను పోగొట్టే పవిత్ర జలములను సాధారణ నీరుగాను, పవిత్ర మంత్రములు కేవల శబ్దములనుగాను, భగవంతుడు ఎవరి కంటే గొప్పవాడు కాడని భావించే వాడు నరకములో ఉండే వాడని గుర్తించాలి.
  72. భగవంతుడే తానుగా కోరి ఒకరిచే పూజ చేయించుకుంటే వారు ఎంతో గొప్పవారు, సమర్దులు. వారి పట్ల అమర్యాదగా నడచుకోవడము గొప్ప పాపము. పర్యవసానము చాలా తీవ్రముగా వుంటుంది. అది భగవంతుడిని అవమాన పరచడమే అవుతుంది. వారి శ్రీపాద తీర్థము, భగవంతుడి శ్రీపాద తీర్థము కన్నా పవిత్రమైనది. ఆ విషయము మనసు నందు నిలుపుకొని సదా భాగవత సేవలో నిమగ్నమై వుండాలి.

ఆధారము: వైణవన్ కురల్

తెలుగు సేత చక్రవర్తుల చూడామణి

English translation Courtesy: vaiNavan kural magazine.

archived in https://srivaishnavagranthamstelugu.wordpress.com

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://srivaishnavagranthams.wordpress.com
pramAthA (preceptors) – http://guruparamparai.wordpress.com
srIvaishNava education/kids portal – http://pillai.koyil.org

రామానుజుల వారి అపారమైన కరుణ

శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్ వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః

ramanuja-1తిరువరన్గత్తు అముదనార్లు వారి “రామనుజ నుత్తన్దాది” అను గ్రంధము నందు 25వ పాసురమున వారు ఎమ్పెరుమానార్లను (రామనుజులను) ఈ విధముగ కీర్తించారు “కారేయ్ కరుణై ఇరామానుస“.

ఇందున ఎమ్పెరుమానార్లను మేఘములుగా పోల్చారు. మేఘములు ఎంతో ఉతమమైనవి కావున ఈ విధముగ పోలిక చెప్పినట్లు మనకి తెలుస్తుంది. మేఘములు  ఉతమమైనవిగా పేర్కొనుటకు కల కారణములు:

  • మేఘములు ఎవ్వరు అర్ద్ధించకున్నప్పట్టికిని సముద్రము నన్దు నీరును భూమి మీదకు తెచ్చును .
  • మేఘములు మంచి – చెడు, ధనవంతుడు – పేదవాడు అను భేధములను చూపక  చల్లటి వర్షపు రూపములొ అందరికి నీరును అందించును.
  • మేఘములు నల్లటి వర్ణము కలిగి, పుష్కలముగ నీరు వున్డునట్లు కనిపించుచు, అందరికి నీటిని అందించుటకు సిద్ధముగ ఉండునట్లు శోభించును.

అదే విధముగ ఎమ్పెరుమానార్లు శాస్త్రము యొక్క సారమును అర్హత – అనర్హత విచారణ చేయక; అందరి జనులయందు భేద భావములు చూడక అందిచినారు. వారు అందరిపట్ల పరమ కారుణ్యముతో  వారిని ఆధ్ద్యత్మికంగా  ఉద్ధరించుటకు భాసిల్లిరి.

పిళ్ళై లోకాచర్యులు వారు రచించిన “శ్రీవచనా భుషణం” అను గ్రంధమున వారు పెరియళ్వార్ మరియు ఎమ్పెరుమానార్లు యొక్క ఉత్తమమైన గుణమును ఈ విధముగ ప్రస్తావించారు:

పెరియళ్వార్లకు భగవంతునికి మంగళాశాసనము చేయుట విషయములొ సాంప్రదాయము నందు పెద్ద పీఠ వేస్తారు. వారు ఎల్లప్పుడు శ్రీమన్నారాయణునికి మంగళాశాసనము చేస్తూనే ఉంటారు. 255 సూత్రమునందు , ఎమ్పెరుమానార్లు కూడా అదే విధముగ భగవంతుని యొక్క శ్రేయస్సుని కాంక్షిస్తున్టారు అని పేర్కోన్నారు.

periyazhwar-ramanujar అల్లాతవర్కళైప్ పోలే కేట్కిఱవర్కళుడైయవుమ్, చొళ్ళుకిఱవర్గళుడైయవుమ్ తనిమైయైత్ తవిర్క్కైయన్ఱిక్కే, ఆళుమాళార్ ఎన్గిఱవనుడైయ తనిమైయైత్ తవిర్క్కైక్కాయిఱ్ఱు భాశ్యకారరుమ్ ఇవరుమ్ ఉపతేచిప్పతు

அல்லாதவர்களைப் போலே கேட்கிறவர்களுடையவும், சொல்லுகிறவர்களுடையவும் 
தனிமையைத் தவிர்க்கையன்றிக்கே, ஆளுமாளார் என்கிறவனுடைய தனிமையைத் 
தவிர்க்கைக்காயிற்று பாஷ்யகாரரும் இவரும் உபதேசிப்பது

అనువాదము:
అందరి అచార్యుల / ఆళ్వారుల ఉపదేశములా కాకుండ పెరియళ్వార్ మరియు రామానుజులవారు వారి శిష్యులకు భగవంతుని యొక్క ఏకాoతమును పోగొట్టు దాసులుగ మెలుగునట్లు తీర్చిదిద్దేవారు.

మామునిగళ్ వారు ఆ గ్రంధ వ్యాఖ్యానము నందు ఈ విషయము ఎంతో అందముగ ప్రతిపాదించారు:

  • ఇతర అచార్యులు/ఆళ్వారులు జీవులకు ముఖ్యముగ జ్ఞానోపదేశము చేసి వారిని సంసార సాగరము నుండి ఉద్ధరించెడి వారు
  • వారు వారి శిష్యులకు భాగవత శేవ యందు ప్రీతిని కలిగించి వారిని చక్కని భాగవతులుగా తీర్చి సంసారము నందు వారిని వారి సాంగత్యమును వీడక ఉండునట్లు చేసి వారిని కాపాడేవాళ్లు.
  • కాని పెరియాళ్వార్ మరియు రామానుజులు వారు మాత్రము ఎల్లప్పుడు ఆ శ్రీ హరి యొక్క దివ్య మంగళ విగ్రహము మీదనే ధ్యాస ; పెరుమాళ్ యొక్క క్షేమము, శుఖమును మాత్రమే కాంక్షిoచే వారు.
  • పిళై లోకాచార్యులు పైన చెప్పిన స్తోత్రము నందు రామానుజులను “భాష్యకారర్” అని ప్రతిపాదించడములోని వైశిష్ట్యమును మాముణులు అద్భుతముగ వర్ణించారు. వేదాన్తమునకు, వేదాన్త సూత్రములకు భాష్యమును రచించి లోకానికి “శ్రీ భాష్యము” రూపములో అందించారు రామానుజులు.  అందువలన వేదాన్త సారము పెరుమాళ్ మంగాళా శాసనమే అని మనము అర్ధము చేసుకొనవచ్చును.

అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్లు విరచితమయిన “ఆచార్య హ్రుదయం చూర్ణికై” 204వ స్తోత్రము నందు సీతాపిరాట్టి ( శ్రీ మహాలక్శ్మి ), ప్రహ్లాదాళ్వాన్, విభీషణాళ్వాన్ , నమ్మళ్వార్ మరియు ఎమ్పెరుమానార్ల యొక్క నిర్హేతుక కారుణ్యము గురించి వివరించారు:

తాయ్క్కుమ్ మగనుక్కుమ్ తమ్బిక్కుమ్ ఇవర్క్కుమ్ ఇవరడి పన్ణిణ్తవర్క్కుమే ఇవైయుళ్ళతు

தாய்க்கும் மகனுக்கும் தம்பிக்கும் இவர்க்கும் இவரடி பணிந்தவர்க்குமே இவையுள்ளது

అనువాదము :
అమ్మ (సీతమ్మ), తనయుడు(హిరణ్యకశ్యపుడి తనయుడు  ప్రహ్లాదుడు), చిన్న తమ్ముడు (రావణుడి చిన్న తమ్ముడు విభీషణుడు), అతడు(నమ్మళ్వార్లు), అతని యందు శరణాగతి చేసినవాడు( ఎమ్పెరుమానార్లు); వీరికి మాత్రమే ఈ గుణములు కలవు

మాముణులు వారి వ్యాఖ్యానమున ఈ గుణములను గూర్చి ఈ విధముగ చెప్పారు

ఈ గుణములు ఏమనగ:

  • సంబంధ జ్ఞానము – ప్రతి జీవాత్మ (సంసారము మరియు పరమపదము నందు) భగవంతుడితో సంబంధము కలిగియుండును ముఖ్యముగ పిత – పుత్ర (తండ్రి – తనయుడు) సంబంధము మరియు శేషి – శేష ( యజమాని – దాసుడు) సంబంధము . కొందరు
    తెలుసుకొందురు, మరి కొందరు తెలుసుకొనలేరు.
  • జీవాత్మల పాప కర్మలను చూచి ధుఃఖ పడుట – అజ్ణ్యానము చేత జీవాత్మలు వారి స్వరూపమునకు విరుధ్ధముగ అనేక కర్మలు చేసుట చూచి ధుఃఖ పడుట.
  • పరమ కారుణ్యము – భగవంతుడు ఈ జీవాత్మల పాపపు చేష్టితములను చూచి
    విసుగు చెందును.అయినప్పటికి; ఈ భాగవతోత్తములు పరమ కారుణ్యముతొ ఈ జీవాత్మల స్ధితిని చూచి వారికి జ్ఞానబొధ చేసి వారికి భగవంతుడితో సత్-సంబంధమును కుదుర్చి వారికి సహాయమును చేయును.
  1. సీతా పిరాట్టి కారుణ్య హ్రుదయము కలదై; తన యందు రావణుడి ఆలోచనలు తెలిసినప్పటికిని; రావణుడిని సత్ప్రవర్తన మార్గములొ పెట్టుటకు హితబోధ చేసెను. ఒక తల్లి తన బిడ్డ చేసెడి తప్పిదములను ఏవిధముగ క్షమించునో అదే విధముగ సీతమ్మ రావణుడి తప్పులను మన్నించెను.ఆపై రావణుడికి శ్రీ రామునితో స్నేహము చేయమని; తనను తాను రక్షించుకొనమని కూడ చెప్పెను. sita_advising_ravana
  2. ప్రహ్లాదుడు తన తండ్రియగు హిరణ్యకశ్యపుడు తనని విష్ణు భక్తుడిగ ఉన్నందుకు ఎంత శిక్షించినప్పటికి వేదాన్తము యొక్క సారమును బోధించెను.అదే విధముగ (గురుకులము నందుగల) అసుర పుత్రులకు వారు అడగకున్నప్పటికి  పరమ ఉత్క్రుష్టమైన భక్తి మార్గమును ఉపదేశిoచెను. prahladha
  3. నమ్మాళ్వార్లు నిర్హేతుక కారుణ్యముతొ సంసార సాగరమున చిక్కుకొని; బయటపడలేని జీవులకు భగవద్విషయమును బోధించిరి.nammazhwar
  4. చివరిగ; నమ్మాళ్వార్ల పాద పద్మములుగ పరిగణించపడె ఎమ్పెరుమానార్లు అనేక కష్టములకోర్చి శాస్త్ర రహస్యములను నేర్చుకొని; ఎవరైతే జిగ్ఞాశ కలిగియున్నారో వారికి అర్హత – అనర్హత విచారణ చేయక జ్ఞానమును అందించినారు. వారు ఎంతో ప్రయాసకోర్చి వారి శిష్యులను గురువులుగా; సిమ్హాసనాధిపతులుగా నియమించి శాస్త్ర రహస్యములను తెలుసుకొవాలి అనే కొరికను అర్హతగ భావించి జ్ఞానమును అందించవలసిందిగ ఆదేశించెను. swamy-in-unjal

ఎమ్పెరుమానార్ల అనంతమయిన కీర్తిని “చరమోపాయ నిర్ణయమ్” అను అద్భుతమయిన గ్రంధమున నాయనారాచ్చాన్ పిళ్ళైవారు మనకు ప్రసాదించారు.

మామునులచే విరచితమయిన “ఉపదేశ రత్నమాలై” అను గ్రంధమున ఎమ్పెరుమానార్లను అందరు ఏ గుణమును చూచి కీర్తించురో పొందుపరిచారు. 37వ పాసురమున ఎమ్పెరుమానార్లకు వారి ముందు ఉన్న ఆచార్యపురుషులకు గల భేదమును విశ్లేషించారు.

ఓరాణ్ వళియాఇ ఉపడేసిట్తార్ మున్నోర్
ఎరార్ ఎతిరాసరర్ ఇన్నరుళాల్
పారులగిల్ ఆసై ఉడయోర్క్కెల్లామ్ ఆరియర్గాళ్ కూరుమ్ ఎన్ఱు
పేసి వరమ్భరుత్తార్ పిన్

ஓராண் வழியாய் உபதேசித்தார் முன்னோர்
ஏரார் எதிராசர் இன்னருளால் 
பாருலகில் ஆசை உடையோர்க்கெல்லாம் ஆரியர்காள் கூறும் என்று  
பேசி வரம்பறுத்தார் பின்

అనువాదము
ఎమ్పెరుమానార్లకు ముందు ఉన్న ఆచార్య పురుషులు తమ శిష్యులలొ శ్ర్ఱేష్టులగు వారిని ఎన్నుకొని, వారిని పూర్తిగ పరీక్షించి, వారిచే శేవలు పొంది అప్పుడు తృప్తిపడిన తరువాత వారికి శాస్త్రరహస్యములను ఉపదేశము చేసేవారు. కాని ఎమ్పెరుమానార్లు వారిలా కాకుండ; ఎంతో కష్ట పడితే తప్ప దొరకని ఆ జ్ఞానమును (భగవద్విషయమును) అందరికి అందించాలి అని 74 ఆచార్యులను(వారి శిష్యులను) ఏర్పాటు చేసి; నేర్చుకోవాలనే ఉత్సాహముకలవారి అందరికి భోదచెయమని ఉపదేశించెను. ఎమ్పెరుమానార్లే కొన్ని సమయములందు స్వయముగ వారే అడిగిన వారికి ఉపదేశించెను. ఆచార్యపురుషులలొ ఎమ్పెరుమానార్లకు ముందు వారిని “అనువృత్తి ప్రసన్నాచార్యులు” (శిష్యులచే శేవ పొందిన పిదప ఉపదేశము చేసేవారు) గ పేర్కొందురు. అయితే; ఎమ్పెరుమానార్లు మాత్రము మొదటి “కృపామాత్ర ప్రసన్నాచార్యులు” (కారుణ్యముతొ శాస్త్ర రహస్యములను ఉపదేశము చేసిన ఆచార్యులు )గ ప్రసిద్ధిని పొందారు.

ఈ విధముగా; మనము ఎమ్పెరుమానార్ల కీర్తిని తిరువరన్గత్తు అముదనార్,  పిళ్ళై లోకాచార్యర్,  అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్, నాయనారాచ్చాన్ పిళ్ళై మరియు మనవాళ మామునిగళ్ వారి మాటలలో చుశాము. ఇందువలన మన ఆచార్యులు ఎల్లప్పుడు ఎమ్పెరుమానార్లే మనకు ఆశ్రయముగ చెప్తారు అనడంలొ అతిశయోక్తి లేదు. మనము కూడ ఎమ్పెరుమానార్ల పాద పద్మములు మాత్రమే మనకు ఆశ్రయముగ పరిగ్రహించి తరించుదాము.

రామానుజ తిరువడిగళే శరణమ్
జై శ్రీమన్నారాయణ

అడియేన్ .!

Source:

http://ponnadi.blogspot.co.uk/2013/05/unlimited-mercy-of-sri-ramanuja.html