Monthly Archives: February 2014

శ్రీవైష్ణవ తిరువారాధనము

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమద్ వరవరమునయే నమః  శ్రీ వానాచల మహామునయే నమః

e-book – https://1drv.ms/b/s!AiNzc-LF3uwygw-nQocS0AiEjH_Z

ఈ సంచిక యొక్క ముఖ్య ఉద్దేశము శ్రీవైష్ణవ  తిరుమాళిగైలో నిత్య తిరువారాధనము యొక్క  వైశిష్టతని తెలియచేయడము. ఉభయవేదములను (సంస్కృత మరియు ద్రావిడ వేదము) అత్యంత ప్రమాణముగా కలిగి , ఎమ్పెరుమాన్ ను చేరడమే ముఖ్య ఉద్దేశము గా ఉండే  శ్రీ వైష్ణవులలో  క్రమముగా   వైదిక అనుష్ఠానములైన ఉదా: సంధ్యా వందనము మొదలగునవి ప్రాధాన్యత కోల్పోవుచున్నది.

శ్రీమన్ నారాయణుడు తన యొక్క అపారమైన కరుణచే తానే ఐదు స్వరూపములను ధరించిరి- పర ( శ్రీవైకుంఠము), వ్యూహ (వాసుదేవ, ప్రద్యుమ్న, అనిరుద్ద, సంకర్షణ మరియు క్షీరాబ్ది నాథుడిగా), విభవ (శ్రీ రామ, కృష్ణ, మొదలగు), అంతర్యామి (ఆత్మ) మరియు అర్చ (విగ్రహ రూపము). ఈ ఐదు స్వరూపముల పూర్తి వివరములకు,  http://ponnadi.blogspot.in/2012/10/archavathara-anubhavam–parathvadhi.html చూడగలరు. ఈ ఐదు రూపముమలో నున్న ఎమ్పెరుమాన్ల లో అర్చావతార లో ఉన్న ఎమ్పెరుమాన్ యొక్క సౌలభ్యత చాలా ఎక్కువ అందులోనూ మన గురించి మన ఇళ్ల లో వేంచేసి ఉండే పెరుమాళ్ యొక్క సౌలభ్యం మాటలకు అందనిది. గృహ తిరువారాధనం సక్రమముగా చేయడం ప్రతి శ్రీ వైష్ణవుడి కనీస  కర్తవ్యం.

శ్రీవైష్ణవుడిగా  అవుటలో భాగముగా,ఆచార్యుల వద్ద పంచ సంస్కారములను (సమాశ్రయనము) పొందవలెను. సంస్కారము యొక్క అర్థము  పవిత్రతను చేకూర్చడము -దీని ద్వారా ఏ అర్హత లేని ఒక జీవాత్మను విశేషమైన కైంకర్యము చేయుటకు అర్హతను చేకూర్చుట.

పెరియ నంబి (మహా పూర్ణులు) శ్రీ రామానుజులకు పంచ సంస్కారములను అనుగ్రహించుట

పంచ సంస్కారము యొక్క పద్దతిని ఈ ప్రమాణము ద్వారా అర్థము చేసుకోవచ్చును – “తాపః పుణ్డ్రః తదా నామః మంత్రో యాగ చ పంచమః”.క్రింది ఈ ఐదు ప్రక్రియలు పంచ సంస్కారములో భాగముగా నిర్వర్తించుదురు:

  • తాప – శంఖ చక్ర లాంఛనము – శంఖము మరియు చక్రముల యొక్క ముద్రలను వేడి చేసి మన యొక్క భుజములపై వేయడము.
  • పుణ్డ్ర  – ద్వాదశ (పన్నెండు) ఊర్ద్వ పుణ్డ్ర ధారణము – ఊర్ద్వ పుణ్డ్రములను (తిరుమణ్ మరియు శ్రీచూర్ణము) శరీరము పై పన్నెండు భాగములలో ధరించుట.
  • నామ (పేరు) – దాస్య నామము -ఒక కొత్త నామమును భగవాన్/ఆచార్య సంబంధమును తెలిపేలా ఆచార్యులు (రామానుజ దాసన్, మధురకవి దాసన్, శ్రీవైష్ణవ దాసన్) అనుగ్రహించుట.
  • మంత్ర – మంత్రోపదేశము – రహస్య మంత్రమును ఆచార్యుల నుండి నేర్చుకోవడము; మంత్ర – ఈ సంసార శోకము నుండి దాటించును  -ఇక్కడ మంత్రము అనగా తిరుమంత్రము, ద్వయము మరియు చరమ శ్లోకము ఇవి మనలను సంసారము నుండి విడుదల చేయును.
  • యాగ – దేవ పూజ -తిరువారాధనము యొక్క పద్దతిని నేర్చుకోవడము.

పంచ సంస్కారము యొక్క ముఖ్య ఉద్దేశమును మన పూర్వాచార్యులు రెండు విధములుగా వివరించినారు~:

  • శాస్త్రము చెప్పిన విధముగా, “తత్వ ఙ్ఞానాన్ మోక్ష లాభః” -బ్రహ్మమును గురించి తెలుసుకొని,ఒకరు మోక్షమును పొందుట.ఆచార్యుల ద్వారా,శిష్యులు అర్థ పంచకమును తెలుసుకొనుట (బ్రహ్మము – శ్రియఃపతిః, జీవ – ఆత్మ, ఉపాయము -శ్రియఃపతిఃని చేరడము, ఉపేయము – ఫలితము  అనగా శ్రీ వారి శ్రీ చరణములు , విరోధి – ఆత్మకు ఫలితములను చేరకుండా వచ్చేఆటంకములు )రహస్య త్రయము (తిరుమంత్రము, ద్వయము మరియు చరమ శ్లోకము) ద్వారా అంతిమ ఫలితమును చేరుటకు యోగ్యతను చేకూర్చును -నిత్య విభూతి యందు శ్రియఃపతి కైంకర్యమును చేయుట.
  • నిత్య జీవితములో, భగవంతునికి ,భాగవతులకు మరియు ఆచార్యులకు కైంకర్యమును చేయుట .ప్రస్తుత పరిస్తితులలో,ఎవరైనా సులభముగా తనయొక్క అర్చావతార(విగ్రహము) భగవంతునికి సేవలు చేయవచ్చు- ముఖ్యముగా గృహములో తిరువారాధనము ద్వారా మరియు దివ్య దేశ
  • ఎమ్పెరుమానులku కైంకర్యము చేయడము ద్వారా.

ఈ యొక్క సంచిక ద్వారా,ప్రతీ శ్రీవైష్ణవ గృహములలో నిత్య తిరువారాధనము యొక్క ప్రాముఖ్యతని వివిధ ప్రమాణములచే చూద్దాము.

ప్రస్తుత పరిస్థితులలో(బాధకరమైన)  – చాలా శ్రీవైష్ణవ గృహములలో నిత్య తిరువారాధనము జరుగుటలేదు. సాలగ్రామ ఎమ్పెరుమాన్ (శ్రీ మూర్తి, తీర్థ  నారయణుడు) గృహములలో ఉన్నప్పడికినీ కూఢా ,చాలా సమయములలో పూర్తిగా మరచిపోతున్నారు.చాలా మంది తమ యొక్క జీవితములలో తీరికలేక ఎమ్పెరుమాన్ యొక్క సౌలభ్యమును అనగా స్వామి మన యొక్క ఆచారము/అనుష్ఠానములను కూడా చూడక మన కొరకై తానే ఈ రూపములో దిగివచ్చినాడు అని మరిచిపోవుచున్నారు,

శ్రీ వైష్ణవుడు తిరువారాధనము చేయకపోవుటకు గల ముఖ్య కారణము తిరువారాధనము చేయు క్రమము నందు అవగాహన లేక మరియు దాని యొక్క విశిష్టత తెలియకపోవడమే.

క్రింది భాగములో మనము వివిధ ప్రమాణములైన వేదము, ఇతిహాసము, పురాణము, భగవత్ గీతా, దివ్య ప్రబంధము, పూర్వాచార్య అనుష్ఠానములు/ఉపదేశములు/ఐదిహ్యములు మరియు చివరగా రహస్య గ్రంథములలో తిరువారాధ యొక్క ప్రాముఖ్యతని చూద్దాము.

వేదము:

ఎవరైతే వేదమును ప్రామాణికముగా భావించుదురో వారు తప్పక వేదములో చెప్పబడిన సూచనలను వీలైనంతగా పాటించవలెను.ప్రస్తుత రోజులలో మరియు వయసులో మనలో అధిక శాతం ఆచారములు/అనుష్ఠానములను (చాలా కొద్దిమంది శ్రద్దగా పాఠించుచున్నారు)కోల్పోవుచున్నాము.కాని వేదములో చెప్పినవిధముగా,వైదికులు అందరినీ పంచ కాల పరాయణులు అందురు – వారు రోజును 5 భాగములుగా విభజించి ఆ భాగములో గల క్రియలను నిర్వర్తించుదురు. మొత్తము రోజులో మధ్య  భాగముపై దృష్టి ఉండును అదే తిరువారాధనము.

ఆ 5 భాగములు~:

  • అభిగమనము – నిద్రలేవడము (బ్రహ్మ ముహుర్తమునకు ముందు – ఉదయము 4గం,,లకు) మరియు కాలకృత్యములను పూర్తిచేయడము- ఉదయము అనుష్ఠానములైన మలలోని వ్యర్థమును తొలిగించడము,దంతావాదానము,స్నానము చేయడము, సంధ్యా వందనము, మొదలగునవి.
  • ఉపాధానము – తిరువారాధనమునకు కావలసిన సామగ్రిని సేకరించడము.
  • ఇజ్జా (యాగము) – సేకరించిన సామాగ్రిని తిరువారాధనములో ఉపయోగించడము -ఇది గృహములలో మధ్యాహ్నము నిర్వర్తించుదురు.
  • స్వాధ్యాయము – వేదమును, దివ్య ప్రబంధము, మొదలగు వాటిని నేర్చుకోవడము మరియు నేర్పడము (వారియొక్క వర్ణములకు ఇది వర్తించును).
  • యోగము – ధ్యానము మరియు నిద్ర ద్వారా మన యొక్క ఉనికిని  బ్రహ్మముపై  కు ఉంచుట.

ఇక్కడ, ఇజ్జ (యాగము) అనగా దేవ పూజ (ఒక మూర్తిని ఆరాధించడము) మరియు శ్రీవైష్ణవులు వారి యొక్క గృహములోని పెరుమాళ్ల కు తిరువారాధనము చేయడము. తిరువారాధనముతో పాటుగా, మనము ఎమ్పెరుమాన్ గురించి తెలుసుకోవడము,ప్రవచనములను వినడము మరియు వాటిని మననము చేయడము.

పంచ సంస్కారమును పొందిన తదుపరి, తిరువారాధనమును చేయుటకు అర్హులు,కారణము అది మనలను శుద్ది చేసి మన యొక్క నిత్య జీవితము లో ఈ కర్తవ్యమును చేయుటకు తోడ్పడును.

పెరుమాళ్ తిరుమొళి 1.7 పాశురములో పెరియవాచ్ఛాన్ పిళ్ళై యొక్క వ్యాఖ్యానమును మనము ఇక్కడ గమనించితే – “మరమ్ తిగళుమ్…“, కొరకు “ఇరు-ముప్పొజుదు” (2 + 3) – వారు ఇక్కడ దానిని “పంచ కాలన్గల్” (రోజులో 5 భాగములు) గుర్తించిరి.

ఇతిహాసాములు/పురాణములుఉప బ్రహ్మణములు – వీటి ద్వారా మనము వేదమును అర్థము చేసుకోవచ్చు.

శ్రీ రామాయణములో, శ్రీ రాముడు తన యొక్క కుల ధనము/దైవము అయిన- శ్రీ రంగనాథులకు (ఆ సమయములో నారాయణన్ అను నామము కలదు) తానే స్వయముగా తిరువారాధనము సమర్పించేవారు-వీరు మొదట బ్రహ్మచే ఆరాధనను అందుకొని తదుపరి  రఘు వంశ రాజులచే (ఇక్ష్వాకుడు మొదలు శ్రీ రాముడు వరకు)ఆరాదించబడిరి. ప్రసిద్దమైన శ్రీ రామాయణ శ్లోకములో “సహ పత్న్యా విశాలాక్ష్యా నారాయణమ్ ఉపాగమతు” సీతా పిరాట్టి తిరువారాధనములో ఏ విధముగా శ్రీ రాముడికి కలసి/సహాయము చేసెనో చూపును.

శ్రీ రాముడు శ్రీ రంగనాథుని విభీశణాళ్వాన్ కి ఇచ్చుట

పురాణములలో కూడా, తిరువారాధనము యొక్క వైశిష్ట్యాన్ని ఎన్నో సంఘటనలు ద్వారా చూపును.

శ్రీమద్ భాగవతములో గల ఒక గొప్ప పద్యము శ్రీ ప్రహ్లదాళ్వన్ చెప్పిన ఆఙ్ఞలను తెలుపును అది~:

శ్రవణమ్ కీర్తనమ్ విష్ణోః స్మరణమ్ పాదసేవనమ్
అర్చనమ్ వందనమ్ దాస్యమ్ సఖ్యమ్ ఆత్మనివేదనమ్

ఈ పద్యము ఎమ్పెరుమాన్ ని ఏ విధముగా  ఆరాదించవచ్చునో తెలియచేయును. తిరువారాదనములో భాగముగా ఎన్నో విధములైన అంగములు నేరుగా సంబంధము కలిగి ఉండును.తిరువారాదనములో,మనము భగవంతును నామమును గురించి పాడుదుము ,మనము స్వామికి అర్చనను చేయుదుము, ఎమ్పెరుమాన్ కీర్తిని వర్ణించుదుము,ఎన్నో విధములుగా వారికి సేవలు చేయుదుము,మొదలైనవి.

గరుడ పురాణములో,ఎమ్పెరుమాన్ స్వయముగా తన యొక్క భక్తునికి ఉండవలసిన 8 గుణములను చెప్పినారు,

మద్ భక్త జన వాత్సల్యమ్, పుజాయామ్ అనుమోదనమ్, స్వయమ్ అపి అర్చనమ్ చైవ ….

ఇక్కడ 2 ముఖ్యమైనవి పుజాయామ్ అనుమోదనమ్ -అనగా ఎవరైతే  వేరే ఒకరు నన్ను పూజించున్నప్పుడుగాని లేక స్వయమ్ అపి అర్చనమ్ తానే స్వయముగా ఆరాదించునప్పుడు గాని సంతోషించుదురో వారు భక్తులు . దీనికి మణవాళ మామునిగళ్ తన ఆచార్య హృదయములోని 85వ చూర్ణికై లో వ్యాఖ్యానము వ్రాసిరి . ఇలా చాలా సంఘటనలు వివిధ పురాణములు మరియు ఇతిహసములలో ఉన్నవి.

భగవత్ గీతా – కృష్ణుడి యొక్క శ్రీ సూక్తులు

చాలా శ్లోకములలో కృష్ణుడే స్వయముగా తిరువారాధ యొక్క ప్రాముఖ్యతని తెలిపెను.

తానే రెండు మారులు ఈ విధముగా చెప్పెను”మన్ మనా భవ మద్ భక్త~: మద్ యాజి మామ్ నమస్కురు” – అర్థము మనము ఎల్లప్పుడూ స్వామిని గుర్తుచేసుకోవడము ,తన యెడల భక్తి ఉండి ఆరాధిoచడము.

మన పూర్వాచార్యులు కూడా అర్చావతరము పరంగా శ్లోకమును గుర్తించిరి “యే యతా మామ్ ప్రపద్యన్తే తామ్స్ తతైవ భజామి అహమ్” . ఈ శ్లోకము చెప్పిన విధముగా ఎమ్పెరుమాన్ భక్తుని కోరిక ప్రకారము తాను ఎన్నో అవతారములను దరించును- అదే అర్థము “తమర్ ఉగన్తతు ఎవ్వురువమ్ అవ్వురువమ్ తానే” (ముదల్ తిరువందాది).

“పత్రమ్ పుష్పమ్ ఫలమ్ తోయమ్ యో మే భక్త్యా ప్రయచ్చతి ...” (9.26) శ్లోకములో, ఎమ్పెరుమాన్ చెప్పెను ఎవరైనా ఒక ఆకుగాని (తులసి),పుష్పము, పలము మరియు నీరు గాని ప్రేమతో ఇచ్చిన నేను స్వీకరించుదును. తదుపరి శ్లోకములో తాను ఈ విధముగా చెప్పెను “యత్ కరోశి … మద్ అర్పణమ్” – నీవు ఏ క్రియనైనా చేయు,ఆ క్రియ నాకు అర్పించే విదముగా చేయుము. ఇవి అన్నీయు  మన తిరువారాదనములో సహజ సిద్ధంగా ఉండే భావములు. మరియు భకితో ఏది అర్పించిననూ తాను స్వీకరించే ఎమ్పెరుమాన్ యొక్క సౌలభ్య గుణమును చూపును.

తదుపరి తాను ఈ విధముగా చెప్పెను “యగ్య శిశ్టాసిన~:…” (3.13) శ్లోకము,ఏ ఆహారము అయిననూ మన కొరకు వండినదీ ఎమ్పెరుమానుకు మొదలు నివేదించకుండా మనము స్వీకరించినచో ,అది చాలా దోషము.మనము ప్రసాదము తప్ప వేరేది స్వీకరించరాదని తాను స్పష్టముగా చెప్పెను. యాగము అనగా తిరువారాధనము మరియు అను యాగము అనగా ప్రసాదమును స్వీకరించడము.

అరుళిచెయల్ (దివ్య ప్రబంధములు ఇవి చాలా ముఖ్యమైనవి మనకు)~:

అరుళిచెయల్ లో, చాలా పాశురములు నేరుగా/అంతర్లీనముగా తిరువారాధనము యొక్క పద్దతిని తెలుపును-ఎమ్పెరుమాన్ ఆరాధ విధానమును.

తమర్ ఉగన్తతు ఎవ్వురువమ్ (ముదల్ తిరువన్తాది)

పొయైగై ఆళ్వార్ చాలా అందముగా ఎమ్పెరుమాన్ యొక్క సౌలభ్యమును తన భక్తులు ఏ విధముగా చూడదలచుకుంటే ఆ అవతరాములలో( నామములు) దర్శనము ఇస్తారని చెప్పెను.చాలా సంఘటనలు ఈ పాశురము యొక్క వ్యాఖ్యానమును మన పూర్వాచార్యుల యొక్క జీవితములలో చూడవచ్చు.

శూట్టు నన్ మాలైగళ్ -నిత్యసూరుల తిరువారాధనము (తిరువిరుత్తమ్)

తిరువిరుత్తములో, నమ్మాళ్వార్ వివరముగా నిత్యసూరులు పరమపదములో తిరువారాదనము ఏ విధముగా చేసెనో చూపించెను.ఈ పాశురములో,వారు ఈ విధముగా  చెప్పిరి,అప్పుడు నిత్యసూరులు ధు పమును సమర్పించగా ఎమ్పెరుమాన్ పొగతో కప్పివేయబడెను, స్వామి దానిని అవకాశముగా మలచుకొని అక్కడి నుండి మాయము అయ్యి,

  • లీలా విభూతిలో కణ్ణన్ ఎమ్పెరుమానుగా అవతరించి
  • వెన్నని దొంగలించి వీలైనంతా ఆరగించి మరియు
  • 7 ఎద్దులను చంపి నప్పిన్నై పిరాట్టిని వివాహము చేసుకొని.
  • తన యొక్క ఇష్టమైన కుడ కూత్తు పై నాట్యము ఆడి (కుండలను చేతిలో మరియు తల పై ఉంచుకొని , డోలుని నడుములో ఉంచుకొని నాట్యము చేస్తూ ).
  • దూపము యొక్క పొగ వెళ్ళగానే తిరిగి పరమపదమునకు చేరుకొని ఏమి జరగనట్టూ తిరిగి అక్కడ కూర్చునెను.

పరివతిల్ ఈశనై పాడి (తిరువాయ్ మొళి)

తిరువాయ్ మొళిలో, నమ్మాళ్వార్ ఎమ్పెరుమాన్ యొక్క స్వారధత్వమును (సులభమైన ఆరాద్య గుణమును) వివరించెను.ఈడు వ్యాఖ్యానములో, నమ్పిళ్ళై భట్టర్ మరియు నంజీయరుల మధ్య   జరిగిన అందమైన సంభాషణలను వెలికి తీసెను, అక్కడ భట్టర్ ఈ విధముగా చెప్పిరి ఎటువంటి పుష్పమునైనను ఎమ్పెరుమాన్ కు సమర్పించవచ్చు .వారు ఇంకా ఈ విదముగా చెప్పిరి కొన్ని ఆకులను తెచ్చి కాల్చివేయుము, వాటిని  కూడా ఎమ్పెరుమాన్ గొప్ప సువాసననగా స్వీకరిస్తాడు .

మరొక ముఖ్యమైన విషయమును కూడా ఇక్కడ తీసుకువచ్చెను ,ఇతరమైన దేవతల మాదిరి కష్టమైన పనులను – “ఆట్టై అఱుత్తు తా” (మేకలను సమర్పించు), “పిళ్ళైక్ కర్ఱి తా” (నీ బిడ్డను ఆహారముగా ఇవ్వు), మొదలగు వాటిని అడగరు. శ్రీమన్ నారాయణుడు తన యొక్క భక్తులను ప్రేమతో కూడిన భక్తిని మాత్రమే అడుగును.

చెయ్య తామరై కణ్ణన్ పదిగమ్ (తిరువాయ్ మొళి)

ఈ పదిగము పూర్తిగా గృహ అర్చన యొక్క కీర్తిని వెలికితీసెను. నమ్మాళ్వార్ గృహములలో వేంచేసి ఉండే ఎమ్పెరుమాన్  యొక్క గొప్ప తనమును వివరించారు . మామునిగళ్ ఆళ్వార్ యొక్క భక్తి భావనను తన తిరువాయ్ మొళి నూఱ్ఱన్తాది 26వ పాశురములో ఈ విధముగా వివరించెను”ఎయ్తుమవర్క్కు ఇన్నిలత్తిల్ అర్చావతారమ్ ఎళితు” (ప్రపంచములో ఉన్న వారందరు , అర్చావతార ఎమ్పెరుమాన్ ని చాలా సులభముగా చేరవచ్చును).

తెరిత్తు ఎళుది వాశిత్తుమ్ కేట్టుమ్ వణoగి వళిపట్టుమ్ పూసిత్తుమ్ పోక్కినేన్ పోతు (నాన్ముగన్ తిరువన్తాది)

ఇది తిరుమళిశై ఆళ్వార్ యొక్క దిన చర్య .తాను స్వయముగా తన యొక్క రోజును ఏ విధముగా గడుపునో చెప్పెను-ఎమ్పెరుమాన్ గురించి నేర్చుకోవడము,వ్రాయడము,చదవడము మరియు ఎమ్పెరుమాన్ ని ప్రతిరోజు ఆరాధించడము

పూర్వాచార్య అనుష్ఠానములు (అభ్యాసములు), ఉపదేశములు (సూచనలు) మరియు ఐదిహ్యములు (సంఘటనలు)

అనుష్ఠానములు (అభ్యాసములు)

ఎందరో ఆచార్యులు వారి యొక్క తిరుమాళిగైలో (గృహములలో) తిరువారాధనమును చేసినప్పటికినీ,దివ్య దేశ ఎమ్పెరుమానులకి/ఆళ్వారులకి/ఆచార్యులకి స్వయముగా తిరువారాధను చేసేవారు.

నాథమునిగళ్ – కాట్టు మన్నార్ కోవెలలో, నాథమునిగల్ స్వయముగా మన్ననారులకి తిరువారాదనమును చేసెనని చెప్పబడినది.

అరుళాళ పెరుమాళ్ ఎమ్పెరుమానార్ ఎమ్పెరుమానారులకు  పేరరుళాళన్ (ఎమ్పెరుమానారుల ఆరాధన మూర్తి) తిరువారాధనము చేయవలెనని చెప్పిరి.

తిరువాయ్ మొళి పిళ్ళై మరియు మణవాళ మామునిగళ్ ఇద్దరూ ఆళ్వార్ తిరునగరిలో గల భవిష్యదాచార్యనులకు (ఎమ్పెరుమానార్) తిరువారాధనమును చేసిరి.

ఉపదేశములు (సూచనలు)

ఎమ్పెరుమానార్ తమ యొక్క నిత్య గ్రంథము (సంస్కృతములో) తిరువారాధనము   యొక్క పద్దతిని చాలా వివరముగా వ్రాసిరి.ఇది వారి యొక్క నవ రత్నము (స్వామి యొక్క ప్రతీ ఒక గ్రంథము ఒక రత్నము మరియు ఇది వాటిలో చివరిది).

మణవాళ మామునిగళ్ తన జీయర్ పడిలో (తమిళ) తిరువారాధన క్రమమును వ్రాసిరి,ఇది ఎమ్పెరుమానారుల గ్రంథము కన్నా కొంచెము చిన్నది.

మనము వారి ఇరువరి యొక్క అనుష్టానములు మరియు ఉపదేశములు చూస్తే, అవి నిజముగా మన గురించే అని తెలుసుకోవచ్చు- శ్రీవైష్ణవులకు.

ఐదిహ్యములు (సంఘటనలు)

చాలా విషయములలో పూర్వాచార్యులు తిరువారాధనము యొక్క ప్రాధాన్యతని ఎట్లు నిరూపించిరో తెలియచేయును.

ఎమ్పెరుమానార్ వంగి పురత్తు నంబి
పెరియ తిరుమొళి 6.7.4 – పెరియవాచ్ఛాన్ పిళ్ళై వ్యాఖ్యానము – ఈ పాశురములో, తిరుమంగై ఆళ్వార్ కణ్ణన్ ఎమ్పెరుమాన్ (తానే సర్వశ్రేష్ఠుడైన అది దేవత అయిననూ) విషయమై వెన్నను దొంగిలించినప్పుడూ యశోదమ్మకి భయపడడం , దొరుకునప్పుడు వెంటనే ఏడవడము మొదలు పెట్టేవాడు.ఈ విషయము యొక్క సంబంధంను, ఒక అందమైన సంఘటన ద్వారా వివరించెను. వంగి పురత్తు నంబి ఎమ్పెరుమానారులను ఒకసారి తిరువారాధన క్రమమును (ఏ విధముగా గృహములలో నిత్య ఆరాధనను చేయవలెనో)తెలుపమని అడిగెను. కాని ఎమ్పెరుమానార్ తన యొక్క పనుల ఒత్తిడి కారణముగా వారికి నేర్పుటకు సమయమును కేటాయించలేకపోయిరి. ఒకానొక సమయములో  ఎమ్పెరుమానార్ తిరువారాధన క్రమమును ఆళ్వాన్ మరియు మారుతి శిరియాండాన్ (హనుమత్ దాసర్) లకు మొదలుపెట్టిరి. ఆ సమయములో వంగి పురత్తు నంబి ఆ గదిలోకి ప్రవేశించగా వారిని ఎమ్పెరుమానార్ చూసి గొప్ప అనుభూతిని చెందిరి. ఆ సమయములో వారు ఈ విధముగా చెప్పిరి “నా మదిలో ఈ యొక్క సందేహము చాలా రోజులనుండి ఉండెను.ఇప్పుడు నేనుఅర్థము చేసుకొంటిని ఎందుకు ఎమ్పెరుమాన్ (తానే సర్వ శ్రేష్టుడైనప్పడికినీ) వెన్నని దొంగిలించి పట్టుబడినప్పుడూ భయపడెనో అని .నేను అటువంటి అనుభూతిని ఇప్పుడు చెందినాను .నన్ను అడిగినప్పుడూ,నేను నేర్పలేకపోతిని కాని ఎలాగో  ఇప్పుడు మొదలు పెట్టాను. నేను ఆచార్యుడిని  మరియు మీరు నా యొక్క శిశ్యుడైన కారణముగా నేను భయపడలేదు, కాని నా  యొక్క చర్య వల్ల ,మిమల్ని చూచుటకు భయము చెందితిని”.

భట్టర్సోమాసియాణ్డాన్

ఒకసారి సోమాసియాణ్డాన్ తిరువారాధన క్రమము గురించి అడుగగా, భట్టర్ వారికి వివరణతో ఉపదేశించిరి. ఒకసారి సోమాసియాణ్డాన్ దర్శనార్ధమై భట్టరుల వద్దకు రాగా, భట్టర్ ప్రసాదమును స్వీకరించుటకై ఉపక్రమించి, హఠాత్తుగా తిరువారాధనము చేయడము మరిచిపోయారని గ్రహించి,వారి తిరువారాధన పెరుమాళ్ అక్కడకి తీసుకురమ్మని వారికి ఆ సిద్ధము చేసిన ఆహారమును నివేదించి ఆవెంటనే ప్రసాదమును స్వీకరించిరి. అప్పుడు  సోమాసియాణ్డాన్ అంత పెద్ద తిరువారాధనము మాకు ఎందుకు అని అడుగగా, భట్టర్ ఈ విధముగా చెప్పెను, లఘు తిరువారాధనము అయిననూ చాలును (ఆ సమయములో తిరువారాధనము మొదలు పెడితే,ఆ సమయములో వాటిపై మోహము మరియు కోరికలతో మునిగిపోవును) మరియు సోమాసియాణ్డాన్లకు తిరువారాధనము పెద్దదైననూ చాలదు(ఎందుకనగా ఆ వ్యక్తి సోమ యాగమును చాలా గొప్పగా జరుపుతారు – అందువలన ఎదైననూ వారికి చిన్నదిగా కనబడి సంతృప్తి చెందరు).

ఎఱుమ్బి అప్పామణవాళ మామునిగళ్

  • ఒక్కప్పుడు ఎఱుమ్బి అప్పా శ్రీరంగమును దర్శించి మామునిగళ్ వద్ద ఆశ్రయమును పొందిరి,ఆ సమయములో,వారు అద్భుతమైన కాలక్షేపములను వినిరి,కాని వారు మామునిగళ్ యొక్క ప్రసాదమును తీసుకొనక అక్కడినుండి తిరిగి తన యొక్క స్వగ్రామమునకు వెళ్ళిరి.తన యొక్క తిరుమాళిగైకి వెళ్ళిన తరువాత, వారి యొక్క తిరువారాధన పెరుమాళ్ (శ్రీ రామ) కోయిల్ ఆళ్వార్ (తిరువారాధన గది) తలుపులు తెరుచుకొనకపోగా వారిని మణవాళ మామునిగళ్ వద్దకి వెళ్ళమని ఆదేశించిరి.
  • పూర్వ/ఉత్తర దిన చర్య (మామునిగళ్ నిత్యకృత్యములు) గ్రంథములో, ఎఱుమ్బి అప్పా మామునిగళ్ నిత్య కర్మలలో భాగమైన  తిరువారాధనమును గురించి కీర్తించిరి.

రహస్య గ్రంథములు

ముఖ్యముగా రహస్య గ్రంథములలో చాలా చోట్ల గృహ అర్చన (గృహ మూర్తులకు) గురించి చెప్పబడినది.వాటిలో కొన్నిటిని మనము ఇక్క చూద్దాము~:

ముముక్షుప్పడి

ద్వయ ప్రకరణము – సూత్రము 141 – ఇవైయెల్లామ్ నమక్కు నమ్పెరుమాళ్ పక్కలిలే కాణలామ్ – వ్యాఖ్యానములో, మామునిగళ్ ఈ విధముగా చెప్పిరి, ఈ అన్ని దివ్యమైన గుణములు (వాత్సల్యము, స్వామిత్వము, సౌశీల్యము, సౌలభ్యము, ఙ్ఞానము, శక్తి, మొదలగు) నమ్ (మన) పెరుమాళ్ నందు ఉండెను.

గమనికః ఇక్కడ  నమ్పెరుమాళ్ అనగా సాధారణముగా శ్రీ రంగనాథన్,ఈ విషయములో అన్ని అర్చావతార ఎమ్పెరుమానులు మరియు మన యొక్క గృహములలో ఉన్నవారిని అనుసంధించుకోవాలి.

ఆచార్య హృదయము

చూర్ణికై 75 – వీట్టిన్బ ఇన్బప్ పాక్కళిల్ ద్రవ్య బాషా నిరూపణ సమమ్ ఇన్బమారియిల్ ఆరాయిచి – వ్యాఖ్యానములో, మామునిగళ్ ఈ విధముగా చెప్పిరి, వీట్టిన్బమ్ అనగా వారి యొక్క మదిలో మరియు ఆలోచనలలో ఉన్న ఎమ్పెరుమాన్   పూర్తిగా అర్చావతార ఎమ్పెరుమానే .ఇది గృహ అర్చావతార మూర్తి (గృహములలో ఉన్న మూర్తి) యొక్క గొప్పతనమును తెలుపును.

ముగింపు

పై అన్నింటిలో మనము తిరువారాధనము యొక్క ప్రాముఖ్యతను వేదము, ఇతిహాసములు, పురాణములు, దివ్య ప్రబంధములు, పూర్వచార్య అనుష్ఠానములు/ఉపదేశములు/ఐదిహ్యములు మరియు చివరగా రహస్య గ్రంథములు ఏ విధముగా తెలిపెనో గమనించవచ్చు.ప్రతీ శ్రీవైష్ణవుడి యొక్క కర్తవ్యము తమ యొక్క నిత్య కృత్యములో తప్పక కొంత సమయమును తిరువారాధనమును తమ యొక్క గృహ ఎమ్పెరుమానులకు చేసి మరియు తిరువారాధనము పూర్తి అయిన పిదప ప్రసాదమును (ప్రసాదము మాత్రమే)తీసుకొనవలెను.

మన పెద్దలు ఈ తిరువారాధన క్రమమును ఆచార్యుల వద్ద నేర్చుకొనవలసినదిగా చెప్పిరి.తిరువారాధన క్రమమును సరియగు పద్దతిలో నేర్చుకొన్న పిదప సులభముగా ఆచరించుటకు ఈ రోజులలో చాలా పుస్తకములు తిరువారాధన క్రమమును గురించి లభ్యమగుచున్నవి.

ప్రతీ రోజు భక్తితో తిరువారాధనము చేయడము ద్వారా భగవానుడి యొక్క అపరిమితమైన కృపకు(వారి అంత పరిణామములో/నాణ్యత కాకపోయిననూ)మరియు మన గృహములలో వారు ఉండుటకు గల సౌలభ్యమునకు పాత్రులము కాగలము.

గడిచిన కాలములో ఎమ్పెరుమానుకు తిరువారాధనము పూర్తి అయిన పిదప ,ఆ యొక్క ప్రసాదమును భాగవతులకి తదియారాధనముగా ఉపయోగించే ఆచారము ఉండేది.యాత్రకి వెళ్ళే భక్తులు ఈ యొక్క తదియారాధనముపై ఆదారపడేవారు మరియు శ్రీవైష్ణవులు తమ యొక్క గృహములలో నిత్య కృత్యముగా ఈ విధిని చేసేవారు.ఇది మన యొక్క జీవితములో ముఖ్యమైన విధిగా గుర్తించిరి.కాని ప్రస్తుత కాలములో దీనిని చూడడము చాలా దుర్లభమవుచున్నది.వీలైనంత వరకూ మనమూ ఇందులో పాల్గొనవలను.

అనుబంధము: తిరువారాదనము చేయుటకు గల సోపానములు 

తయారుకావడము

  • తల స్నానము చేయడము.
  • ఊర్ద్వ పుణ్డ్ర ధారణము -12 నామములను తిరుమణ్/శ్రీచూర్ణమ్ ధరించడము(గురుపరంపరా శ్లోకము, ఆచార్యుల తనియన్లను,పెరుమాళ్ మరియు తాయార్ యొక్క ద్వాదశ నామ మంత్రములు పఠించుచూ).
  • సంధ్యా వందనము.
  • మధ్యాహ్నము (వీలును బట్టి ఆ దినములో) – సాధారణముగా తిరువారాదనము మధ్యాహ్న సమయములో చేయవలెను,కాని ఈ రోజులలో అది సాధ్యాపడదు.మనమందరమూ వీలైనంతవరకూ శాస్త్రము చెప్పిన విధముగా చేయవలెను, వీలుకానప్పుడు ఎమ్పెరుమానుని మన్నించవలసినదిగా వేడుకొనవలెను.
  • పంచ పాత్రలను సిద్దము చేయుట , ధూపము, దీపము, తిరువిళక్కు (దీపము), పుష్పము, తీర్థము, తీర్థ పరిమళము (యిలాచి/కర్పూరము – సుగంధ పరిమళము కలిగిన తీర్థ పొడి),మొదలగునవి.
  • ఆచార్యుల శ్రీ పాద తీర్థము (చరణామృతము) – సాధారణముగా తిరువారాధనములో ఆచార్యుల పాదుకలను లేదా తిరువడి వస్త్రము ( ఆచార్యుల యొక్క పాద పద్మముల గుర్తులను కలిగిన వస్త్రము)ఉంచుదుము.ఎవరైనా ఆ పాదుకలకు లేదా తిరువడి వస్త్రమునకు గురు పరంపర మంత్రము(అస్మద్ గురుభ్యో నమ:, …),ఆచార్యుల యొక్క తనియనులను చదువుతూ తీర్థమును వాటికి సమర్పించి ఆ తీర్థమును శ్రీపాద తీర్థముగా స్వీకరించుదురు. నిత్య తిరువారాధనములో ఇది చాలా ముఖ్యమైన భాగము.
  • గృహములో గల మిగిలిన వారు(స్త్రీలతో కలిపి)తిరువారాధనములో వివిద విధములుగా పాల్గొనవచ్చును-పూలను కోయడము,తిరువారాధనము చేసే ప్రదేశమును శుభ్రము చేయడము,భోగమును తయారుచేయడము, మొదలగునవి.

సోపానములు~:

గమనిక~: పాత్రల యొక్క ఉద్దేశ్యము
1 – అర్ఘ్యము -ఎమ్పెరుమాన్ యొక్క హస్తములను శుభ్రము చేయుటకు
2 – పాద్యము -ఎమ్పెరుమాన్ యొక్క పాద పద్మములను శుభ్రము చేయుటకు
3 – ఆచమనీయము -ఎమ్పెరుమాన్ యొక్క నోటిని శుభ్రమును చేయుటకు
4 – కండూశం(కడుగుట) ,   స్నాన్ల్యం( స్నానం) , మధుపర్కం (తేనే మొ||)  పానిల్యం( భోజ్యాసనమునకు నీరు) , ఒక్కొక్క ఆసనమునకు కండూశం(కడుగుట) చేయుట.

5 – శుద్ధ ఉదకమ్ – ఎమ్పెరుమానుకు సమర్పించే దేనినైననూ ప్రోక్షణచేయుటకు

6 – పడిక్కమ్ – ఎమ్పెరుమానుకు సమర్పించిన తీర్థమును ఉంచుటకు
7 – ఆచార్యులకు తీర్థమును సమర్పించుటకు
8 – తిరుక్కావేరి – శుద్ధమైన తీర్థమును ఉంచుటకు (తిరువారాధనములో ఉపయోగించుటకు)

తిరువారాధనములో ముఖ్యముగా మన యొక్క ఆచార్యులు తమ యొక్క శ్రీ హస్తముల ద్వారా మనచే ఎమ్పెరుమానుకకు తిరువారాధనమును చేయుచుంచున్నారని భావించవలెను.

పెద్దలు చెప్పిన విధముగ ప్రతీ ఒక్కరు మొదటగా వీటన్నింటీనీ మొదటగా ఆచార్యులకు, మామునిగళ్, ఎమ్పెరుమానార్, నమ్మాళ్వార్ (మిగలిన ఆళ్వారులకు), విష్వక్సేనర్ (మరియు తిరువనన్తాళ్వాన్, గరుడాళ్వార్, సుదర్సనాళ్వార్, పాన్చజన్యాళ్వార్) లకు ఎమ్పెరుమాన్ మరియు పిరాట్టిలకన్నా మొదటగా అరాదించవలెను.ఉదాహారణకు, అర్ఘ్యము, పాద్యము, ఆచామనము మొదటగా ఆచార్యులకు తక్కిన పరివారమునకు చివరగా ఎమ్పెరుమానుకు సమర్పించవలెను.మనము ఆచార్యులకు ప్రత్యేక పాత్రను ఆచార్యుల ఆరాదన కొరకై వినియోగించవలెను. భోగము, పుష్పము, చందనము, మొదలగునవి., మొదటగా ఎమ్పెరుమానుకి తదుపరి ఆళ్వారులకి, ఆచార్యులకి చివరగా వారి యొక్క ఆచార్యులకి క్రమముగా సమర్పించవలెను.

క్రింద చెప్పబడిన పద్ధతి సులభమైన రీతిలో ఉండును.ఇది యే కాక పద్దతి వేరు వేరుగా ఆ యా తిరుమాళిగై లకు  ,కుటుంబములకు, దివ్య దేశము లకు, మొదల్గు వాటిని బట్టి  ఉండును. మీ యొక్క పెద్దల ద్వారా మీరు తెలుసుకొని ఆచరించవలయును. తిరువారాధన చేయుటకు అర్హులైన వారి అందరికి ఉపకరించును.

  • తిరుతుళాయ్(తుళసి) తీసుకొని ప్రణామమును సమర్పించి, “తులస్యమ్రుత జన్మాసి…” అను శ్లోకమును పఠించుచూ
  • తిరువిళక్కును (దీపము)వెలిగించవలెను -ఇక్కడ తనియనులను, వయమ్ తగళియా, అన్బే తగలియా, తిరుక్కణ్డేన్ పాశురములను అనుసందిచవచ్చును.
    పంచ పాత్రలను అమర్చుకొనవలెను.
  • తీర్థమును తిరుక్కావేరిలో తీసుకోవలెను (ముఖ్యమైన తీర్థము పాత్ర ).
  • ద్వయము లోని ఉత్తర వాఖ్యమును పఠించుచూ (శ్రీమతే నారాయణాయ నమ~:) – తీర్థము మరియు తిరుతుళాయ్ (తుళసి) మరియు మిగతా సామాగ్రిని(పాత్రల్ని, పుష్పములు, మొదలగు) తీర్థముతో ప్రోక్షన చేయవలెను.
  • పాత్రలలోనికి తీర్థమును తీసుకొనవలెను.
  • ముమ్మార్లు అరచేతులతో చప్పట్లు చేస్తూ కోయిల్ ఆళ్వార్ తలుపులను తెరువవలెను(ఎమ్పెరుమానుని మేలుకొలపడము)జితంతే (1 మరియు 2 స్తోత్రములి), కౌసల్యా సుప్రజా శ్లోకము, కూర్మాదీన్ దివ్య లోకాన్ శ్లోకము, నాయగనాయ్ నిన్ఱ నన్దగోపనుడైయ, మారి మలై , అన్ఱు ఇవ్వులగమ్ అళన్దన్ మరియు అఙ్ కన్మా ఙ్యలత్తు అరశర్ పాశురములను పఠించిచూ.
  • సాష్టాంగ ప్రణామమును సమర్పించవలెను.

మంత్రాసనము – ఎమ్పెరుమానుని తిరువారాదనమును స్వీకరించమని పిలుచుట

  • క్రితము దినము యొక్క పుష్పములను తీసివేయుట- “ఉడుత్తు కళైన్ద” పాశురమును అనుసందించుచూ.
  • అర్ఘ్యమును సమర్పించడము (జలముతో స్వామి యొక్క శ్రీ హస్తములను శుబ్రము చేయడము), పాద్యము (జలముతో స్వామి యొక్క పాద పద్మములను కడుగడము), ఆచమనము (జలముతో స్వామి యొక్క నోటిని కడుగడము) -వాటిని సమర్పించుచున్నప్పుడు ఓమ్ అర్ఘ్యమ్ సమర్పయామి, ఓమ్ పాద్యమ్ సమర్పయామి, ఓమ్ ఆచమనియమ్ సమర్పయామి అనుచూ లేదా ఈ విధముగానైనా అనుచూ తిరుక్కైగళ్ విళాక్కియరుళ వేన్డుమ్, తిరువడిగళ్ విళాక్కియరుళ వేన్డుమ్, ఆచమనమ్ కన్డరుళ వేన్డుమ్.
  • అందరు ఎమ్పెరుమానులను తిరువారాధనమునకు ఆహ్వానించడము (108 దివ్య దేశ ఎమ్పెరుమానులను)

స్నానాసనము – ఎమ్పెరుమానుకు తిరుమంజనమును సమర్పించడము

  • సాలగ్రామ ఎమ్పెరుమానులని తీసుకొని తిరుమంజన పళ్ళెములో ఉంచుకొని.
  • అర్ఘ్యము, పాద్యము, ఆచమనమును సమర్పించి.
  • స్నానీయమ్ సమర్పించడము – ఓమ్ స్నానీయమ్ సమర్పయామి లేదా స్నానీయమ్ కన్డరుళ వేన్ణ్డుమ్.
  • తిరుమంజనమును చేయడము – పురుష సూక్తము, నారాయణ సూక్తము, విష్ణు సూక్తము, శ్రీ సుక్తము, భూ సూక్తము, నీళా సూక్తములను పఠించుచూ – సమయమును బట్టి .చివరగా “వెణ్ణై అళైన్ద కుణున్గుమ్” పదిగమ్ మరియు ఇతర తిరుమంజన కాల పాశురములను సేవించవచ్చు.
  • అర్ఘ్యము, పాద్యము, ఆచమనము, దూపము, దీపము, వెచ్చని పాలు/పలములను(వీలును బట్టి) సమర్పించవలెను.
  • ఆ తీర్థమును మొత్తము తీర్థపాత్రలోనికి తీసుకొనవలెను.

అలంకారాసనము -ఎమ్పెరుమానుని అలంకరించడము

  • సాలగ్రామ ఎమ్పెరుమానులని తిరిగి యదా స్థానములో ఉంచి.
  • పాత్రలలో తిరిగి శుద్ద తీర్ఠమును పోయవలెను.
  • సాత్తుప్పడి (చందనము)మరియు పుష్పములను సమర్పించవలెను- “గన్దద్వారామ్ దురాదర్శామ్…” అను శ్లోకము మరియు “పూశుమ్ శాన్దు ఎన్ నెన్జమే” పాశురమును పఠించుచూ.గమనిక~:సాధరణముగా ఊర్ద్వ పుణ్డ్రమును సాలగ్రామ ఎమ్పెరుమానుకి పెట్టరు – ఒక్క శాత్తుప్పడి తప్ప.
  • తిరిగి మరలా అర్ఘ్యము, పాద్యము, ఆచమనమును ఇవ్వవలెను.
  • ధూపమును సమర్పించవలెను (దూర్వస్య శ్లోకము), దీపము (ఉద్దీప్యస్య శ్లోకము).
  • మంత్ర పుష్పము, వేదా ఆరంభము (వేదమును మొదలు పెట్టడము).
  • ద్వాదశ నామ అర్చన.
  • దివ్య ప్రబంధమును పఠించడము .
  1. పొద్దుతనియన్లు “శ్రీశైలేశ దయాపాత్రమ్”
  2. తిరుప్పల్లాణ్డు, తిరుప్పళ్ళియెళుచ్చి, తిరుప్పావై, అమలనాదిపిరాన్, స్థల పాశురము (నివసించుచున్న లేదా ఆ దివ్య దేశమునకు సంబంధించిన), కణ్ణినుణ్ శిఱుత్తామ్బు, కోయిల్ తిరువాయ్ మొళి,రామానుజ నూఱ్ఱన్తాది, ఉపదేశ రతిన మాలై, మొదలగునవి.
  • గమనిక~:
  1. మీకు లభించిన సమయమును బట్టి పఠించవచ్చును.
  2. రామానుజ నూఱ్ఱ అందాది  ప్రపన్న గాయత్రి/సావిత్రి అని పిలుచుదురు -మామునిగళ్ చెప్పిన విధముగా గాయత్రి మంత్రమును ఒక బ్రహ్మణుడు ఏ విధముగా జపించునో ,ఒక ప్రపన్నుడు తప్పక రోజు రామానుజ నూఱ్ఱ అందాది పఠించవలెను.
  3. ప్రతి నెలా ఆ రోజు యొక్క నక్షత్రమును అనుసరించి పూర్తి 4000 వేల దివ్య ప్రభంద పాశురములను అనుసందించవలెను.పూర్తి వివరములకు  http://kaarimaaran.com/sevakalam.html.

ఆ సమయములో భోగము (ఆహారమును)తయారుచేయవలెను.భోగమును తయారుచేయుటకు ప్రత్యేక పాత్రలను వాడవలెను.అదే విదముగా భోగమును వండిన పాత్రలో కాకుండా-మరొయొక పాత్రలోనికి తీసుకొనవలెను.ఈ పాత్రలను మన గురించి వండరాదు,ఎమ్పెరుమాన్ గురించి వీటిని ప్రత్యేకముగా ఉంచవలెను.

భోజ్యాసనము -ఆహారమును నివేదించడము

  • అర్ఘ్యమును, పాద్యమును, ఆచమనమును సమర్పించవలెను.
  • ఎమ్పెరుమాన్ ఎదురుగా భోగమును ఉంచవలెను.
  • తీర్థముతో ప్రోక్షణచేసి కొంచెము తిరుతుళాయ్ (తుళసి)భోగముపై ఉంచవలెను.
  • భోగమును ఎమ్పెరుమానుకు సమర్పించుచూ కూడారై వెల్లుమ్ శీర్, నాఱు నఱుమ్పొళి ల్, ఉలగముణ్డ పెరువాయా పాశురములను మరియు యా ప్రీతిర్ విదురార్పితే శ్లోకమును అనుసంధిం చవలెను.
  • ఎమ్పెరుమానుకు సురుళముదు (తమళపాకు/వక్క), శాత్తుప్పడి (చందనము) సమర్పించవలెను
  • దానిని ఆళ్వార్ ఆచార్యులకు (భోగము, మొదలగు) నివేదించవలెను .
  • ఇప్పుడు భోగము ప్రసాదముగా మారును మరియు దానిని ప్రక్కకితీసుకువెళ్ళవలెను.

పునర్ మంత్రాసనము – మంగళాశాసనము/శాత్తుముఱై

  • అర్ఘ్యమును, పాద్యమును, ఆచమనమును సమర్పించవలెను.
  • ఆరతి ఇస్తూ- “తద్ విష్నోర్ పరమమ్ పదమ్….”
  • మంగళశానన స్తోత్రములైన కోయిల్, తిరుమలై, పెరుమాళ్ కోయిల్, తిరునారాయణపురమ్ ఎమ్పెరుమానులను, జగన్నాథన్, పెరుమాళ్ (శ్రీ రామన్), పార్థసారథి ఎమ్పెరుమానులను తదుపరి ఆణ్డాళ్, నమ్మాళ్వార్, కలియన్, ఎమ్పెరుమానార్, మణవాళ మామునిగళ్,అందరు ఆచార్యులకు సేవించవలెను.
  • తదుపరి శాత్తుముఱై పాశురములు, తిరుప్పల్లాణ్డు పాశురము, వాళి తిరునామములు.
  • మొదట తిరువారాధనము చేయుచున్న వ్యక్తి తీర్థమును స్వీకరించి తదుపరి అందరికీ ఇవ్వవలెను.
  • శ్రీ పాద తీర్థమును తిరువారాధనమును చేసిన వ్యక్తి అందరికీ ఇవ్వవలెను.
  • తిరువారాధనములో ఎమ్పెరుమాన్ పాదములకు సమర్పించిన తిరుతుళాయ్ (తుళసి),తిరువారాధనము చేసిన వ్యక్తి స్వీకరించి అందరికీ పంచవలెను.
  • ఆ రోజు యొక్క నక్షత్రమును అనుసరించి ఆళ్వార్/ఆచార్యన్ వాళి తిరునామములను అనుసంధించవలెను.

పర్యంకాసనము – ఎమ్పెరుమానుని విశ్రాంతి తీసుకొమ్మని కోరుట

  • “పన్నగాతీశ పర్యంగే”, “క్షీర సాగర” శ్లోకములు పఠించవలెను.
  • సాష్ఠాoగ ప్రణామమును సమర్పించవలెను, “ఉపచారాపదేశేన” శ్లోకము (తిరువారాధనము చేసినప్పుడు  దోషములు చేసిన క్షమించమని కోరుట)
  • కోయిల్ ఆళ్వార్ తలుపులని మూసివేయవలెను(తిరువారాధనము గది) -“ఉఱగల్ ఉఱగల్ ఉఱగల్”, “పనిక్కడలిల్ పళ్ళి కోళై పళగవిట్టు” పాశురములను అనుసందిచుతూ.

అనుయాగము – యాగము/తిరువారాధనము పూర్తిచేయడము

  • దేవరాజ అష్ఠకమును లేదా వరవరముని పూర్వ/ఉత్తర దిన చర్య లేదా వానమామలై జీయర్ ప్రపత్తి/మంగళాశాసనము వారి యొక్క మఠము/తిరుమాళిగై సంబంధమును బట్టి అనుసందించవలెను
  • ప్రసాదమును శ్రీవైష్ణవ అతిథులకు సమర్పించవలెను
  • తదుపరి ప్రసాదము (అహారము)స్వీకరించవలెను

ఇతర అంశములు~:

  • అనాధ్యాయన కాలము
  1. అనాధ్యాయన కాలములో,మనము ఆళ్వార్ పాశురములను అనుసంధించము. అప్పుడు కోయిల్ ఆళ్వార్ ద్వారములనితీసి,జితన్తే స్తోత్రము (మొదటి 2 శ్లోకములు), కౌసల్యా సుప్రజా రామ శ్లోకము, కూర్మాదీన్ శ్లోకము పఠించుచూ ద్వారమును తెరువవలెను.ద్వారము తీయునప్పుడు మన హృదయములో ఆళ్వార్ పాశురములను గుర్తుచేసుకోవడము/ధ్యానించడములో ఏ విధమైన అడ్డు లేదు.
  2. అదే విధముగా,తిరుమంజనము సమయములో,సూక్తములతో ఆపవలెను.
  3. మంత్ర పుష్పము,”శెన్ఱాల్ కుడైయామ్” బదులు,”ఎమ్పెరుమానార్ దరిశనమ్ ఎన్ఱే” అను పాశురము అనుసంధించవలెను.
  4. శాత్తుముఱై,ఉపదేశ రత్తిన మాలై మరియు తిరువాయ్ మొళి నూఱ్ఱ అందాది పాశురములు తదుపరి “సర్వ దేశ దశ కాలే…” మరియు వాళి తిరునామములు.
  • లఘు తిరువారాధనము (30 నిమిషములకు లోపల)
  1. కోయిల్ ఆళ్వార్ ద్వారములని తెరుచుట
  2. అర్ఘ్య, పాద్యము, ఆచమనము
  3. తిరుమంజనము
  4. తిరుప్పల్లాణ్డు, తిరుప్పావై, మొదలగు – మన సమయమును బట్టి ఏదైననూ.అనాధ్యాయన కాలమందు,దివ్య ప్రబంధము తనియన్ లు, ఉపదేశ రత్తిన మాలై, మొదలగునవి.
  5. ఎమ్పెరుమాన్, ఆళ్వార్/ఆచార్యులకు భోగమును నివేదించడము
  6. శాత్తుముఱై
  7. శ్రీ పాద తీర్థమ్
  8. కోయిల్ ఆళ్వార్ ద్వారబంధనము.
  • ముఖ్య గమనిక~:
  1. పూర్వ/ఉత్తర దినచర్యలో చూపిన విధముగా, తిరువారాధనము ఒక రోజులో 3 పర్యాయములు చేయవలెను.మనకు ఎంత వీలైతే అంతవరకు.
  • సాధారణ తిరువారాధనము ఉదయము సంధ్యావందనము తదుపరి
  • విశేష తిరువారాధనము మాధ్యాహ్నికము తదుపరి
  • సాధారణ తిరువారాధనము సాయంత్రము సంధ్యావందనము తదుపరి
  1. .ఏకాదశి రోజున, సాధారణముగా పూర్తి అలంకార తళిగై (ఆహారము)తయారు చేయము.కొన్ని ఫలములు/కాజు లేదా సాధారణ భోగమును తయారు చేసి నివేదించవలెను ఆ యొక్క కుటుంబ పరిస్థితులను బట్టి(పిల్లలు,వయసు మీరిన వారు ఉన్నచో).
  2. ద్వాదశి రోజున, తిరువారాధనమును త్వరగా చేసి పారణము చేయవలెను(ఉపవాసమును మొదట తీర్థము తీసుకొని విడువవలెను,తదుపరి తిరుతుళాయ్ (తుళసి) మరియు ప్రసాదమును స్వీకరించవలెను).
  3. అనాధ్యాయన కాలమందు,మనము సాదారణముగా 4000 దివ్య ప్రబంధ పాశురములను అనుసంధించము పూర్వాచార్య స్తోత్రములు, ఉపదేశ రత్తిన మాలై, తిరువాయ్ మొళి నూఱ్ఱ అందాది, ఆళ్వార్/ఆచార్య తనియన్లు, వాళి తిరునామములు, మొదలగునవి పఠించవలెను.మార్గళి మాసము మొదలు, తిరుప్పళ్ళియెళుచి మరియు తిరుప్పావై అనుసందించవచ్చు.
  4. ప్రయాణము చేయునప్పుడు,మనతో పాటు ఎమ్పెరుమానుని తీసుకువెళ్ళడము లేదా వారికి తిరువారాధనము సమర్పించే విధముగా ఎమ్పెరుమానుని ఇతర శ్రీవైష్ణవులకి ఎవరికైనా ఇవ్వవచ్చు.
  5. ఆశౌచ కాలములో మనము తిరువారాధనము చేయకూడదు,ఇతర యేర్పాట్లను చేయవలెను
  6. చివరగా,ఎమ్పెరుమాన్ మన గృహమందు ఉండి తిరువారాధనము చేయకపోతే ఒకరిని మన గృహమునకు అహ్వానించి మనము బయటకు వెళ్ళిపోయినట్లే.

శాస్త్రము మరియు పూర్వాచార్యుల అదేశములను అనుసరించి మన గృహములలో తిరువారాధనము తప్పక చేయవలెను, ప్రతీ ఒక్కరు పరిపూర్ణంగా  భగవత్/భాగవత/ఆచార్య కైంకర్యమును చేసినచో  వారికి ప్రియమైన  వార గుదుము.

శ్రీవైష్ణవ తిరువారాధనం – ప్రమాణం

అడియేన్ రఘు వంశీ రామనుజ దాసన్

source: http://ponnadi.blogspot.in/2012/07/srivaishnava-thiruvaaraadhanam.html

thamizh: http://srivaishnavagranthamstamil.wordpress.com/2013/12/13/srivaishnava-thiruvaaraadhanam/

hindi: