Monthly Archives: October 2018

ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం 5

శ్రీ:  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమద్వరవరమునయే నమః

ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం

 << ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం – 4

ఆళ్వార్లు – భగవద్రామానుజాచార్యలు – 1

                నంపెరుమాళ్ళు (శ్రీరంగంలో ఉత్సవ మూర్తులు)  స్వయంగా మన దర్శనానికి   ఎంమ్బెరుమానార్ దర్శనమని పేరు పెట్టినట్లు స్వామి మణవాళ మామునులు అన్నారు.

”  ఎంపెరుమానార్ దర్శనం ఎన్ఱే  నంపెరుమాళ్ పేరిట్టు నాట్టి వైత్తార్ “. శ్రీ వైష్ణవ సంప్రదాయములోను , బయట కూడా భక్తి ఉద్యమానికి రామానుజాచార్యులనే ఆద్యునిగా భావిస్తారు. కావున ద్రమిడోపనిషద్ అర్థాలను వీరి గ్రంధాల నుండే తెలుసుకోవలసి వుంది .

             కిందటి భాగాలలో   రామానుజాచార్యులను  దివ్య ప్రబంధ విద్యార్థిగా , అధ్యాపకులుగా,  ఆళ్వార్ల భక్తులుగా, శిష్య పరంపర ద్వారా ఈ సంప్రదాయ ప్రవర్తకులుగా చూశాము. ఇక ఆళ్వార్ల శ్రీసూక్తులకు, రామానుజాచార్యుల  శ్రీ సూక్తులకు ఉన్న ప్రత్యక్ష సంబంధాన్ని చూడ బోతున్నాము.

             రామానుజాచార్యుల గ్రంధాలు, వారి వ్యాఖ్యానాలు ప్రత్యేక శైలిని కలిగి వుంటాయి. పరమాత్మ గురించిన ప్రస్తావన వచ్చిన చోటల్లా ఆళ్వార్ల మార్గాన్నే అనుసరించారు. పరమాత్మ ఔన్నత్యము, పరస్వరూపము, కల్యాణగుణాలు, సుభాశ్రయము, దివ్యస్వభావము, మనోహరమైన స్వరూపము, దివ్య చేష్టితాలు, మొదలైన వాటిలో మునిగి పోయేవారు. ఏ ఒక్క సందర్భంలో కూడా ఈ అవకాశాన్ని వదులుకోలేదు. ఆ గ్రంధాలను చదివిన వారికి, విన్న వారికి తాను పొందిన అదే ఆనందానుభూతిని  కలుగజేసారు . ఆళ్వార్ల భక్తి పాఠశాలలో, రామానుజుల వారు పొందిన  పరమాత్మానుభవం కొంచెం కూడా వదుల కుండా తమ గ్రంధాలలో అనుగ్రహించారు . ఈ ఆత్మానుభవాన్ని కోరుకునేవాళ్ళు కనీసం శ్రీభాష్యం, గీతాభాష్యం, గద్యత్రయం మొదలైన వాటిని తప్పక సేవించాలి.

“ మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు

మామెవైష్యసి యుక్త్వైవమాత్మానం మత్పరాయణః “

భగవద్గీత 9వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు అన్నాడు.

 ‘ నీ మనసును నా మీద స్థిరముగా నిలుపు, నా భక్తుడుగా వుండు, నన్ను ఉపాసించు, నన్ను నమస్కరించు, నన్ను చేరుకోవటమే లక్ష్యముగా భావించు. నీ మనసును ఈ విధంగా కేంద్రీకరిస్తే నన్ను తప్పక చేరుకోగలవు.’ అని ఈ శ్లోకానికి అర్థం .

      ” మన్మనా భవ! ” అంటే నీ మనసును నా మీద స్థిరముగా నిలుపు అని అర్థము . ఈ మాటలు అతి సులభమైనవి . వీటిని శ్రీ మద్వాచార్యులు స్ప్రుసించనే లేదు. శ్రీ శంకరాచార్యులు मयि वासुदेवे मनः यस्य तव स त्वं मन्मना भव.  అని వ్యాఖ్యానించారు. ఇక్కడ ‘నన్ను’ అంటే వాసుదేవుడని అర్థము. నీ మనసును వాసుదేవుడైన నాపై నిలుపు అనివ్యాఖ్యానం చేశారు .

భగవద్రామానుజుల వారి వ్యాఖ్యానం కఠిన హృదయం కలవారిని కూడా ద్రవింప చేసే విధంగా వుంది.

मन्मना भव – मयि सर्वेश्वरे निखिलहेयप्रत्यनीककल्याणैकताने सर्वज्ञे सत्यसङ्कल्पे निखिलजगदेककारणे परस्मिन् ब्रह्मणि पुरुषोत्तमे पुण्डरीकदलामलायतेक्षणे स्वच्छनीलजीमूतसंकाशे युगपदुदितदिनकरसहस्रसदृशतेजसि लावण्यामृतमहोदधौ उदारपीवरचतुर्बाहौ अत्युज्ज्वलपीताम्बरे अमलकिरीटमकरकुण्डलहारकेयूरकटकभूषिते अपारकारुण्यसौशील्यसौन्दर्यमाधुर्यगाम्भीर्यौदार्यवात्सल्यजलधौ अनालोचितविशेषाशेषलोकशरण्ये सर्वस्वामिनि तैलधारावदविच्छेदेन निविष्टमना भव!

” మన్మనా భవ! “-మయి సర్వేశ్వరే నిఖిల హేయ ప్రత్యనీక కల్యణైకతానే సర్వజ్ఞే  సత్య సంకల్పే నిఖిలజగదేక కారణే పరస్మిన్ బ్రాహ్మణి పురుషోత్తమే పుండరీకదళామాలాయతేక్షణే స్వచ్చనీలజీమోతసంకాశే యుగాపదుదితదినకరసహస్రసదృశతేజసి లావణ్యామృతమహోదదౌ ఉదారపీవరచతుబ్రహౌ అత్యుజ్వలపీతామ్బరె అమలకిరీటమకరకుండలహారకేయూరకటకభూషితే అపారకారుణ్యసౌసీల్యసౌందర్యమాధుర్యగాంభీర్యదార్యవాత్సల్య జలధౌ  అనాలోచితవిశేషాశేషలోకశరణ్యయే సర్వస్వామిని తైలధారావదవిచ్చేదేన నివిష్టమనా భవ!“

           అర్జునుడిని కృష్ణుడు   ‘ఎల్లప్పుడు నన్నే స్మరించు, నన్నే ఆశ్రయించు, నా భక్తుడిగా ఉండు దాని వలన ఉన్నత ఫలితాన్ని పొందగలవు . అనగా పరమాత్మనే పొందగలవు ‘ అని చెపుతున్నాడు. ఇక్కడ పరమాత్మ మాటలను యధాతధంగా చెప్పటం తప్ప వ్యాఖ్యాత కొత్తగా చెప్పదగిన విషయం ఏమి ఉంటుంది ? అని ఒక వ్యాఖ్యాత అన్నారు. కాని స్వామి రామానుజులు మాత్రం ఇక్కడ భగవంతుని అనంత కళ్యాణగుణాలను వివరించారు. అర్జునుడిని యాంత్రికంగా తనను  ఆశ్రయించమని చెప్పాడా కృష్ణుడు? త్రికరణ శుద్ధిగా, ప్రేమతో ఆత్మార్పణ చేయమని చెప్పాడు కదా!  కృష్ణుడు ఎవరు? అయన దేవాదిదేవుడు, పరబ్రహ్మం , ఉన్నతమైన అందమైన , పవిత్రమైన , అద్భుతమైన, మొహనాకారుడు, పరమాత్మ కదా! అయినా సులభుడు , తన భక్తుల హృదయములను ఆనందములో ఓలలాడించగలవాడు . ఆయన తన శిష్యుడిని ఏవో అల్పమైన ప్రయోజనాల కోసం యుద్దం చేయమని చెపుతాడా?

                అర్జునిడికి ఈవిషయం స్పష్టంగా తెలుసు. రామానుజులు ఇక్కడ చక్కటి వివరణను ఇవ్వాలను కున్నారు . ఆళ్వార్ల మార్గంలో ప్రయాణించిన వారు , పరమాత్మ మీద అపారమైన ప్రేమ కలిగి ఉన్నవారు , ఆయననే కోరుకునేవారు, తమ హృదయమంతా పరమాత్మను నింపుకున్నవారు కదా!. కూరత్తాళ్వాన్లు ఈ విషయంగా రామానుజుల వారిని नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्मव्यामोह. (నిత్య మచ్యుత పదాంభుజ యుగ్మరుక్మ వ్యామోహ) అని వర్ణించారు. ఈ మాట అనగానే రామానుజుల హృదయం నుండి గట్టుతెగిన నదిలాగా ప్రేమ ప్రవాహం పొంగుతుంది. ఈ ప్రవాహమే వినేవారి, చదివేవారి పర్యంతం ప్రవహిస్తుంది. ఇదియే రామానుజుల కోరిక . ఏకకాలంలో స్వామి ఒక చక్కని వ్యాఖ్యాత , ఆచార్యులు, గొప్ప భక్తులు ….ఇలా పలు కోణాలను ఆయనలో చూడవచ్చు. ఆళ్వార్ల నోటి నుండి వెలువడిన ప్రేమ పూరితమైన వాక్కులు వినగానే  రామానుజుల వారి హృదయంలో అనంతమైన పరిణామాలు కలుగుతాయి.

సర్వేశ్వరుడనైన నాపై మనసును నిలుపు –

నాపై = ఎటువంటి కొరతలు లేని, సర్వ మంగళములకు మూలమైన , స్ప్రుహణీయ మైన కళ్యాణ గుణములు గల , సర్వ వ్యాపకుడైన, సత్య సంకల్పుడైన , మూలకారకుడైన, పర బ్రహంమైన , అరవిందలోచనుడైన , నీలజీమోత సన్నిభుడైన, తేజోమయుడైన , పితాంభరధారి అయిన , పలు ఆభరణాలు, కుండలము, హారము, కంకణము , భుజకీర్తులు, ధరించి అపారకారుణ్య గుణములతో కూడి అందరికి సులభుడైన నామీద నీ మనసును అవ్యవధానంగా నిలుపు అర్జునా!   అన్నాడు అని వివరించారు .

            ఈ వ్యాఖ్యానం వలన స్వామి రామానుజులు పరమాత్మ మీద భక్తి చేయవలసిన కారణాలను చక్కగా వివరించారు. పరమాత్మ మనోహర దివ్య రూపము, ఆయన ఔన్నత్యము, ఆనందమయమైన కళ్యాణ గుణములు భక్తుల హృదయాలను వశీకరిస్తున్నవి. ఆ ప్రవాహములో మునిగి కృష్ణతృష్ణలో ఆయనకు కైంకర్యం చేయటానికి మనసు తపించి పోతుంది. ఈ పంక్తులను విన్నా, చదివినా భక్తుల హృదయములు అసంకల్పితంగానే కృష్ణుభక్తిలో లీనమై ఆయన నోటి నుండి వెలువడిన గీతామృతంలో  ఓలలాడుతాయి అని రామానుజుల అభిమతం .

ఆళ్వార్ల నుండి లభించిన భక్తి సంపద రూపమే స్వామి రామానుజులు అని వేరే చెప్పవలసిన అవసరం లేదు. దీ నినే అముదనార్లు ఈ విధంగా వర్ణించారు.

பண்டருமாறன் பசுந்தமிழ் ஆனந்தம் பாய்மதமாய்

விண்டிட எங்களிராமானுச முனிவேழம்!

పన్దతరు మాఱన్ పశున్తమిழ் * ఆనందమ్ పాయ్ మదమాయ్

విణ్ డిడ * ఎఙగ్ళ్ ఇరామానుశ మునివేழమ్…….

கலிமிக்க செந்நெற்கழனிக்குறையல் கலைப்பெருமான் ஒலிமிக்க பாடலையுண்டு தன்னுள்ளம் தடித்து அதனால் வலிமிக்க சீயம் இராமானுசன்!

కలిమిక్క సేన్నేర్ కழనికురైయల్ కలైపెరుమాన్ ఒలిమిక్క పాడలైఉండు తన్నుళ్ళం తడిత్తు అదనాల్ వలిమిక్క సీయం ఇరామానుసన్ …….

అడియేన్ చూడామణి రామానుజ దాసి

మూలము :  https://srivaishnavagranthams.wordpress.com/2018/02/03/dramidopanishat-prabhava-sarvasvam-5/

archived in https://srivaishnavagranthams.wordpress.com/

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org
pramAthA (preceptors) – https://guruparamparai.wordpress.com
SrIvaishNava Education/Kids Portal – http://pillai.koyil.org

ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం 4

శ్రీ:  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమద్వరవరమునయే నమః

ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం

 <<ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం – 3

            ఆళ్వార్లు ,ఆళవందార్లు – సన్యాసుల నాయకులు

       మనకు నాలాయిర దివ్య ప్రబంధమును సాధించి పెట్టినవారైన స్వామి నాధమునుల మనుమడు , స్వామి రామనుజులకు పరమాచార్యులు అయిన ఆళవందార్లకు యామునచార్యులు, యమునైతురైవన్, యామునముని అని అనేక పేర్లున్నాయి. వారు అనుగ్రహించిన అర్థాలనే వారి తరువాత అవతరించిన ఆచార్యులు ఆదరించి తమ గ్రంధ రచనలో అనుసరించారనడం అతిశయోక్తి కాదు. ఆళవందార్లు అనుగ్రహించని అర్థాలు మన సంప్రదాయంలో లేవు.

స్వామి ఆలవందర్

            ‘ శ్రీయమునార్య సమోవిద్వాన్ నభూతో నభవిష్యతి ‘ श्रीयामुनार्यसमो विद्वान् न भूतो न भविष्यति| అని కీర్తించబడిన వారు ఆళవందార్లు. తిరువరంగత్తముదనార్లు వీరిని ‘ యతికట్ క్కిరైవన్ యమునై త్తురైవన్ ‘  ( యతులకు దైవ సమానుడు ) అని కీర్తించారు .

             ఆళవందార్ల అద్భుతమైన మేధాశక్తిని అర్థం చేసుకోవటానికి వారు అనుగ్రహించిన స్తోత్రరత్నం , సిద్దిత్రయం, ఆగమ ప్రామాణ్యం వంటి గ్రంధాలు ఉపకరిస్తాయి. వీటి ద్వారా వారి కవితా శక్తి ,తాత్విక జ్ఞానం  , రచనాపఠిమ , పంచరాత్రాగమముపై ఉన్న అధికారం తెలుసుకోవచ్చు. ఈ క్రింద వారి మాటలలోనే వారి అభిప్రాయం చూద్దా        न वयं कवयस्तु केवलंन वयं केवल-तन्त्र-पारकाः,

अपितु प्रतिवादिवारण-प्रकटाटोप-विपाटन-क्षमाः |

“ న వయం కవయస్తు కేవలం , న వయం కేవల-తత్ర –పారకాః ,అపితు

  ప్రతివాదివారణ –ప్రకటాటోప –విపాటన –క్ష్మమాః “

      “ మనం కేవలం కవి మాత్రం కాదు,కేవల ఆగమ తంత్రములు తెలిసినవాడిని కాదు. దానికి మించి ఏనుగు లాంటి ప్రతివాదులను గర్వ భంగము చేయగల సమర్దులం “ అని దైర్యంగా ప్రకటించారు. ఈ మాటలు స్వామి అహంకారంతో చెప్పినవి కావు, కేవలం తమ సమర్థతను ప్రతివాదులకు తెలియచేయటం కోసం చెప్పినవి.

మన సంప్రదాయంలో ఆచార్యులు ,సంస్కృత  భాషలో వేదవాక్యాల ఉదాహరిస్తూ అనేక సిద్దాంత గ్రంధాలను రచించారు.  వీటిలో ఆళ్వార్ల  రచనల నుండి ఉదాహరణలు కనపడవు. వాటిని చదివే వారిని సులభ గ్రాహ్యలు కావాలని భావించటమే దానికి కారణము . మన సిద్దాంతానికి సంభందించిన శ్రీవైష్ణవ సంప్రదాయ గ్రంధాలలో ఆళ్వార్ల  రచనల నుండి  అనేక ఉదాహరణలు కనపడతాయి .

నమ్మాళ్వార్

ప్రపన్న కులమునకు అధిపతిగా శ్రీశఠకోపులు

స్వామి నమ్మాళ్వార్లపై అళవందార్లకున్న అభిమానం ఎంతో తెలుసుకోవటానికి స్తోత్రరత్నంలోని 5వ శ్లోకం నుండి చూడవచ్చు. ‘ మతాపితా ‘  అని ప్రారంభమయ్యే ఈ శ్లోకంలో  స్వామి నమ్మాళ్వార్ల పేరు ప్రత్యక్షంగా ఉదాహరించ కుండా ‘ ఆద్యస్తనః కులపతేః వకుళాభిరామం ‘ అని ప్రయోగించారు. వకుళ మాలను ధరించిన వారు  నమ్మాళ్వార్లుఅని ఎలా భావించాలి ఎవరైనా వకుళ మాలను ధరించవచ్చు కదా అన్న సందేహం కలగవచ్చు. నమ్మాళ్వార్ల తమ పాశురాలలో ‘ నట్కమళ్ మగిళ్ మాలై మార్బినన్ మాఱన్ శఠకోపన్ ‘. అని చెప్పుకున్నారు. అందుకనే నమ్మాళ్వార్లకు వకుళాభరణ భూషణుడు అన్న పేరు స్థిరపడింది . తరవాత వచ్చిన ఆచార్యులు वकुलाभरणं वन्दे जगदाभरणं मुनिम्. ‘వకుళాభరణం వందే  జగదాభరణం మునిం ‘ అని కీర్తించారు.

నాథముని

స్తోత్రరత్నంలో ఆచార్య వరుస క్రమము

                  స్తోత్రరత్నంలో స్వామి ఆళవందార్లు మొదటి మూడు శ్లోకాలలో నాధమునులను కీర్తించి , తరువాత శ్రీవిష్ణుపురాణ కర్త అయిన పరాశర మహర్షిని గురించి ఒక  శ్లోకమును చెప్పారు . కాని మన గురుపరంపరా క్రమంలో ముందు నమ్మాళ్వార్లు , నాధమునులు , ఆళవందార్లు అనే క్రమంలో సేవిస్తాము.

పరాశర ముని

ఆళవందార్లు స్తోత్రరత్నంలో ముందు సంస్కృత వేదానికి ఆచార్యులైన పరాశర మహర్షిని, తమ కులపతులైన నాధమునుల గురించి  ప్రస్తుతించి  , తరువాత మన సంప్రదాయ కులపతులైన నమ్మాళ్వార్లను ప్రస్తుతించి వచ్చు కదా! లేక ముందు తమ ఆచార్యులను , కులపతులైన నమ్మాళ్వార్లను ప్రస్తుతించి సంస్కృత వేదానికి ఆచార్యులైన పరాశర మహర్షిని ప్రస్తుతించి వచ్చు కదా! ఎందుకని ఈ వరుస కరమాన్ని పాటించలేదు. అన్న ప్రశ్న ఉదయిస్తుంది. ఈ ప్రశ్నకు స్వామి దేశికులు చక్కటి వివరణను ఇచ్చారు.

స్వామి దేశికుల వ్యాఖ్యానం

          ఈ ప్రశ్న యొక్క జవాబులోనే ద్రమిడోపనిషత్ ప్రభావం యొక్క గొప్పదనం దాగి వుంది. దానిని స్వామి వేదాంత దేశికులు ఎంత చక్కగా వివరించారో చూద్దాం .

స్వామి నాధమునుల తరవాత నమ్మాళ్వార్లను  స్తుతించినందుకు కారణము ఆళ్వార్లే  స్వామి నాధమునులకు ద్రమిడోపనిషత్ ను అనుగ్రహించినవారు అని మన సంప్రదాయంలో ప్రసిద్దము కదా అనుకోవచ్చు .  కాని ఆళ్వార్లను పరాశర మహర్షి తరవాత ఎందుకు స్తుతించారు? అంటే  “వేదవేదాంతము యొక్క  అర్థాలను పరాశర మహర్షి కంటే ఆళ్వార్లు చక్కగా వివరించారు. ఇంకా ఆళ్వార్ల పాశురాలు పరమాత్మకు ఇంపుగాను ,ఇష్టం గాను ఉన్నవి . పరమ కృపతో భగవద్విషయం మనకు అనుగ్రహించి వుండటం చేత ఆళవందార్లు- ఆళ్వార్లను,కోటాను కోట్ల జీవాత్మలకు స్వామి అయిన పరమాత్మను సమానంగా చూశారు . వేదాంతంలో ఎలాగైతే శ్రీమన్నారాయనుడే మాతా పితా సర్వం అని చెప్పబడిందో అలాగే ఆళవందార్లు వకుళా భరణ భూషణుడినే తమకు సర్వస్వముగా భావించారు.’ వకుళాభిరామం శ్రీమత్ తదంగ్రియుగళం మూర్తనా ప్రణమామి ‘

वकुलाभिरामं श्रीमत्तदङ्घ्रियुगलं मूर्ध्ना प्रणमामि |

మన పూర్వాచార్యులు కూడా , ఆళ్వార్లను పరమాత్మ శ్రీపాదాలుగానే భావించారు.అందువలననే ఆళవందార్లు పరమాత్మ కీర్తించే స్తోత్రమును చేసేముందు ఆయన  శ్రీపాదాలైన నమ్మాళ్వార్లను స్తుతించారు పెద్దల అభిప్రాయము . స్తోత్రరత్నంలోని పలు శ్లోకాలు ఆళ్వార్ల పాశురాలకు పోలిక కలిగి వుండటమో ,కొన్ని చోట్ల ప్రత్యక్షంగా అదే అర్థాన్ని తెలియజేసేవిగానో  అమరివున్నాయి. ( వీటి అర్థాలను వారి వారి ఆచార్యుల దగ్గర గ్రంధ కాలక్షెపము ద్వారా తెలుసుకోగలరు )

  1. कः श्रीः श्रियः (12) ,श्रियः श्रियम् (45) కః శ్రీః శ్రీయః (12)  శ్రీయః శ్రీయమ్ (45)అన్న ప్రయోగము ‘ తిరుమంగై ఆళ్వార్ల తిరువుక్కుతిరువాగియ సెల్వా ‘ అనే  పాశురభాగాన్ని పోలి ఉంది.
  2. ‘ నిరాసకస్యాపి న తవాదుత్సహే ‘ (26) అన్న శ్లోక పాదము

         ‘ తరుతుయరంతడాయేల్ ఉన్ శరణ అల్లాల్  శరణ్ ఇల్లై

         విరై కుళువు మలర్ పొళి సూళ్ విట్టువకొట్టమ్మానే ‘

         అనే  కులశేఖర ఆళ్వార్ల పాశుర భాగాన్ని పోలి ఉన్నాయి.

     3.గుణేన రూపేణ విలాస చేమష్టితౌ: సదా తవైవోచితయా తవ శ్రియా ‘(38 ) ‘ ఉనకేర్ కుం                       కోలమలర్ ప్పావై కణ్ పా  ‘ అన్న నమ్మళ్వార్ల  పాశుర భాగాన్ని పోలి ఉంది.

  1. ‘ నివాస శయ్యాసన ‘ అన్న (40) శ్లోక పాదము ‘ సేన్ద్రాల్ కుడైయాం ‘ అన్న నమ్మళ్వార్లపాశుర భాగాన్ని పోలి ఉంది.
  2. నమ్మళ్వార్ల ‘ వళవేళులగు ‘ దశక సారంగా 47శ్లోక పాదము ‘ ధిగశుచిమవినీతం ‘ అమరింది.

     6 . నమ్మళ్వార్ల ‘ఎనదావితందొళిందెన్ ……

          ఎనదావియార్ ఆనార్ తంద నీ కొండు ఆక్కినయే ‘ అనే    పాశుర భాగం’ వపుషాదిషు ‘ (52) , ‘              మమనాథ ‘ (53)  శ్లోక పాదములకు సరిపోతుంది .

  1. ‘ మహత్మభి: మాం‘(56) అన్న ప్రయోగానికి , ‘ ఒరునాళ్  కాణ వారాయే , నమ్మై  యోరుకాల్ కాట్టి నడన్దాల్ నాంగలుయ్యోమే , ఎమ్మావీట్టుతిరముం సెప్పం ‘అన్న నమ్మాళ్వార్ల  పాశుర భాగానికి సరిపోతుంది .
  2. నమ్మాళ్వార్ల ‘ ఏరాళుమిరైయోన్ ‘ దశకం యొక్క సారం 57 వ శ్లోకంలో ‘న దేహం న ప్రాణాన్ ‘ అన్నశ్లోక పాదములో వివరించ బడింది.

పై ఉదాహరణల వలన ఆళ వందార్లు నమ్మాళ్వార్ల ప్రబంధాన్ని తమ రచనలకు ప్రమాణంగా స్వీకరించారని చెప్పడానికి ఉపకరిస్తాయని .

స్వాదయన్నిహ సర్వేషాం త్రయ్యన్ తార్తం సుదుర్గ్రహం !

స్తోత్ర యామాస యోగీంద్ర  తమ్ వందే యామునాహ్వాయం !!

అడియేన్ చూడామణి రామానుజ దాసి

మూలము :  https://srivaishnavagranthams.wordpress.com/2018/02/02/dramidopanishat-prabhava-sarvasvam-4/

archived in https://srivaishnavagranthams.wordpress.com/

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org
pramAthA (preceptors) – https://guruparamparai.wordpress.com
SrIvaishNava Education/Kids Portal – http://pillai.koyil.org

ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం 3

శ్రీ:  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమద్వరవరమునయే నమః

ద్రమిడోపనిషత్ ఫ్రభావ సర్వస్వం

<< ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం – 2

 

ఈ క్రింద చూపిన తైత్తరీయోపనిషత్తులోఉన్న ద్రమిడోపనిషత్తు అనే దివ్యప్రబందానికి స్తోత్రంగా అమరివున్నది.  

సహస్రపరమా దేవి శతమూలా శతాంఙుంకరా !

సర్వం హరతు మే పాపం దూర్వా దుస్వప్ననాశిని !!

              పైన చూసిన ‘ దేవి ‘ అన్న ప్రయోగం ప్రకారం ‘ దివు ‘ అన్న ధాతువు నుండి వచ్చింది . ఈ ధాతువులో

అనేక అర్థాలు పేర్కొనబడినవి. 

‘ దివు ‘ క్రీడా విజిగీషా వ్యవహార ద్యుతి స్తుతి మోద మద స్వప్న కాంతి గతిషు !

                  పైన చూసిన  వివరణలో ‘ స్తుతి ‘ పదమే ఇక్కడ సరిపోతుంది. ‘ స్తుతి ‘ అంటే స్తోత్రం, కీర్తన అనే అర్థం వస్తుంది.  దివ్యప్రబందంలో పరమాత్మ కళ్యాణ గుణాలను కీర్తించడమే కావున ‘స్తుతి ‘ అనటమే తగివుంటుందని పూర్వాచార్య మతము.

              ‘ దుర్వా ’ అన్న పదానికి విశేషణంగా ‘ దేవి ‘ అన్న పదం అమరి వుంది , అనగా పసుపు వర్ణమని అర్థం వస్తుంది. ఇలాగే ఆళ్వార్ల పాశురాలకు ‘ పసుంతమిళ్ ‘ అని పిలవబడుతుంది . పరమాత్మను కీర్తించు ‘ పసుంతమిళ్ ‘ అన్న అర్థం రావటం వలన సంస్కృతంలో చెప్పే ఉష్ణం అన్న అర్థం ఇక్కడ వర్తించదు.

తైత్తరీయంలో ఉన్న ‘ సహస్ర పరమా ‘ వేయి పాశురాలతో  కూడినది అని గ్రహించాల్సి వుంది.

        నాయనార్ల ఆచార్య హృదయం సూత్రంలో “ వేదంగళిల్ పౌరుష మానవ గీతా వైష్ణవంగళ్  ప్పోలే , అరుళి చేయల్ సారం “ అని అన్నారు. (ఆళ్వార్ల పాశురాలు వేదాలలో పౌరుష మనవ గీతా వైష్ణముల వంటివి)

         వేదాలలో పురుషసూక్తం , ధర్మ శాస్త్రాలలో మనుధర్మము , భారతంలో భగవద్గీత, పురాణాలలో విష్ణు పురాణం, ఎంత ముఖ్యమైనవో ద్రావిడ వేదంలో తిరువాయిమొళి అంత  ముఖ్యమైనది అని ఆచార్యు పురుషుల అభిప్రాయం .

శతమూలా – నూరు పాశురాలతో కూడినది … తిరువాయిమొళిలోని వెయ్యి పాశురాలు  తిరువిరుత్తం లోని  నూరు పాశురాలతో సంబంధం గలవి.

         నాయనార్ల ఆచార్య హృదయంలో “ఋక్ సామత్తాలే సరసమాయ్  స్తోపత్తాలే పరంబుమా పోలే సోల్లార్ తొడైయల్ ఇసై కూట్ట అమర్ సువై ఆయిరమాయిట్ట్రు .” 

         ఋగ్వేదంలో మధ్య మధ్య సంగీత  స్వరముల వలన అందము ఎలా చేకూరుతుందో ,అలాగే నూరు పాటలు పాడినా అదే అందం   చేకూరుతుంది.  అలాగే  తిరువిరుత్తంలోని  నూరు పాశురాలు, తిరువాయిమొళిలోని వెయ్యి పాశురాలుగా విస్తరించబడింది అనటం అతిశయోక్తి కాదు .  

ముదల్ ఆళ్వారులు

 

శతాంఙుంకరా నూరు పాశురాలు అనే విత్తనం నుండి మొలిచినవి. నాలాయిర దివ్య ప్రబంధము మొదటి ఆళ్వార్ల ముదల్ తిరువందాది , ఇరండాం తిరువందాది , మూండ్రాం తిరువందాది లోని నూరు నూరు , పాశురాల నుండి  మొలిచాయి అనటంలో అతిశయోక్తి ఏమి లేదు .

          

 

తరువాత పదమైన – దుస్వప్ననాశిని. .. దివ్యప్రబంధము మన చెడు స్వప్నాలను పోగొడతాయి. ఈ సందర్భంగా తిరుమంగై ఆళ్వార్లు చెప్పిన పాశురాన్ని చూడాల్సి వుంది .

తిరుమంగై ఆళ్వార్లు

‘ ఊమనార్ కండ కనవిలుం   పళుదాయొళిందన”

      మూగవాడు స్వప్నముతో వృధా చేసే కాలం కన్నా పరమాత్మను తెలుసుకోని కాలమే వృధా అయిన కాలము.  అలాగే పరమాత్మను తెలుసుకోని కాలమే చెడు స్వప్నము వంటి కాలము . చెడు స్వప్నము అని ఎందుకు అన్నారంటే పరమాత్మను తెలుసుకోని వారు ఈ పెద్ద సంసార సాగరంలో పడి దుఃఖిస్తారు. ద్రావిడ వేదము  జీవులకు పరమాత్మను గురించి తెలియ జేసి ఈ పెద్ద సంసార సాగరం నుండి దరి చేరుస్తుంది .

“ ఇప్పత్తినాల్ సన్మం ముడి వెయిది

    నాసం కండీర్ గళేజ్ఞనాలే   “

 ‘  ( ఈ పది పాశురాల వలన ఎడారిలో ఎండమావి  వంటి ఈ జన్మ ముగిసి దుఃఖ సాగరం తొలగి పోతుంది   )

సర్వం హరతు మే పాపం …. మే సర్వం పాపం హరతు…..మన పురాకృత పాపం తత్వ హిత పురుషార్థాలను తెలుసుకోవటానికి ఆటంకంగా ఉన్నవి. ఈ స్తోత్రము అటువంటి పురాకృత పాప రాసిని తొలగ దోస్తుంది .

               ఈ శ్లోకము ఋక్, ద్రావిడ వేదమును పటించేవారి పాపాలను పోగొట్ట మని ప్రార్థిస్తుంది. పరమాత్మ మృదువైన పచ్చదనాన్ని గురించి మాట్లాడే వేయి పాసురాల తిరువాయి మొళిని ప్రధాన అంశంగా కలిగి ఉన్నది. ఇది మొదటి ఆళ్వార్ల తిరువందాడి నుండి విస్తరించబడినది . మన సంసారమనే దుస్వప్నాన్ని పోగొట్టగల శక్తి గలది. 

             ఇంక,  ఏడవ కాండంలో ఐదవ ప్రశ్నలో  వేదేబ్యాస్స్వాహా అని తరువాత గాథాబ్యాస్స్వాహా అని సంస్కృత వేదాన్ని , దివ్యప్రబంధమనే ద్రావిడ వేదాన్ని-‘ వేద , గాథా ‘అన్న ప్రయోగంతో పేర్కొన్నది. స్వామి దేశికులు ‘ గాథా ‘ అన్న ప్రయోగం ద్రమిడోపనిషత్ తాత్పర్య రత్నావళిలో పలు చోట్ల ద్రావిడ వేదమనే అర్థంలో ప్రయోగించారని తెలుస్తున్నది  . ఉదాహరణకు తాత్పర్య రత్నావళి నుండి రెండవ శ్లోకం చూద్దాం .

ప్రజ్ఞాఖ్యే మంథశైలే ప్రథితగుణరుచిం నేత్రయన్ సంప్రదాయం

తత్తల్లబ్ది-ప్రసక్తౌః అనుపధీ –విభుదౌః   అథ్రీతో వెంకటేశః !

తల్పం కల్పామ్తయూనః సత శఠజిదుపనిషత్ -దుగ్ధ –సింధుం విమత్నన్

గ్రథ్నాని స్వాదు-గాథా-లహరి-దశ-శతి –నిర్గతం రత్నజాతం !!   

భావము: నిత్య యవ్వనుడైన శ్రీమన్నారాయణుని కల్యాణగుణాలనే రత్నాలను కలిగివున్న, ఆయన పవళించె పాలకడలి లాంటి, వేయి అలల లాగా వేయి పాశురాలు కలిగివున్న శఠకోపుల దివ్య ముఖము నుండి వెలువడిన భావసముద్రము, దీనిలో నిండి వున్న అమృతోపమానమైన విషయాలను అనుభవించాలని ఆశపడిన ఆస్థీకుల కోరిక మేరకు పూర్వాచార్యులనే కవ్వంతో ఈ అమృత మధనం చేస్తున్నాడు.

ఇక్కడితో ద్రావిడ వేదం యొక్క గొప్పదన్నాన్ని సంస్కృత వేదంతో పోల్చు చర్చ ముగుస్తున్నది.  

అడియేన్ చూడామణి రామానుజ దాసి

మూలము :  https://srivaishnavagranthams.wordpress.com/2018/02/01/dramidopanishat-prabhava-sarvasvam-3/

archived in https://srivaishnavagranthamstelugu.wordpress.com/

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org
pramAthA (preceptors) – https://guruparamparai.wordpress.com
SrIvaishNava Education/Kids Portal – http://pillai.koyil.org

ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం 2

శ్రీ:  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమద్వరవరమునయే నమః

ద్రమిడోపనిషత్ ఫ్రభావ సర్వస్వం

<< ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం – 1

కూరత్తళ్వారు

 

  స్వామి నమ్మళ్వార్లే వేదాంతానికిమన సంప్రదాయానికి ఉన్నతమైన ఆచార్యులని స్వామి రామానుజులుకు ద్రావిడ వేదం మీద ఉన్న ప్రీతిని ఇంతకు ముందు చూసాము. ఇక మన పూర్వాచార్యులైన ఆళవందార్లుకూరత్తళ్వాన్లుభట్టరు,వేదాంత దేశికులు ,వారు అనుగ్రహించిన గ్రంధాలుఉపబ్రహ్మణముల సహాయంతో మన ఆళ్వార్ల ఔన్నత్యాన్నిదివ్యప్రబంధ ఔన్నత్యాన్ని అనుభావిద్దాము.

 

ఆళవందారు

స్వామి దేసికన్

వేదములో ద్రమిడొపనిషత్-నమ్మాళ్వార్లు అనే సూర్యుడు

నమ్మాళ్వార్లు

            స్వామి మధురకవి ఆల్వార్లు ఉత్తరాది యాత్ర చెస్తూ వుండగా దక్షిణం నుండి అధ్బుతమైన జ్యోతి ఒకటి  కనపడింది. ఆ జ్యోతి గురించి తెలుసుకోవాలన్న ఆతృతతో వారు ఆ వెలుగు వెంట దక్షిణ దిక్కుగా నడవగా ఆఖరికి అది తిరుక్కురుగూరులోని నమ్మాళ్వార్ల నుండి వస్తుండటం చూసి ఆశ్చర్యపోయారు.

           ఈ సందర్భంగా స్వామి  అళగియ మణవాళ పెరుమాళ్ నయనార్లు అనుగ్రహించిన ఆచార్యహృదయంలోని చూర్ణిక చూడతగినది.

 ” ఆత్తియ రామ దివాకర అచ్త్యుతభానుక్కళుక్కు పోగాద వుళ్ళిరుళ్ నీంగ సోషియాత పిఱవి క్కడల్ వఱ్ఱి విహసియాద పోదిఱ్ కమలమలర్దదు వకుళభూషణ భాస్కరత్తిలే. “

        తూర్పున ఉదయించే సూర్యుడి వెలుగు వలన తొలగని మన అజ్ఞానం అనే చీకటి తొలగిపోయింది.  రాముడి  ప్రకాశవంతమైన వేడివలన ఎండిపోని ఈ దరిలేని సంసార సాగరం ఇప్పుడు ఎండిపోయింది. కృష్ణుడి ప్రకాశము వలన వికసించని జీవాత్మల హృదయాలు ఇప్పుడు పూర్తిగా వికసించినవి. వీటన్నిటికి కారణం మన లోకంలో అవతరించిన భాస్కరుడువకుళ పుష్పాలను అలంకరించుకున్న  నమ్మాళ్వార్లు అంటే అది అతిశయోక్తి కాదు.

  శ్రీమన్నాధమునులు నమ్మళ్వార్ల గురించి ఈ క్రింది శ్లోకాన్ని చెప్పారు.

నాథముని

” యద్గోసహహస్రమపహంతి తమాంసి పుంస్వాంనారాయణో వసతి యత్ర సశంకచక్ర !

యన్మండలం  శృతిగతం ప్రణమంతి విప్రాః తస్మై నమో వకుళభూషణ భాస్కరాయ!! “

                       ఏ వేయి కిరణాలు (వెయ్యి తిరువాయిమొళి పాశురాలు) జీవాత్మల అజ్ఞానాన్ని పోగొడుతున్నవోఎవరి తిరుమేనిలో నారాయణుడు తన శంఖచక్రాలతో ప్రవర్దిల్లుతున్నారోఎవరి నివాసస్థానమును శాస్త్రాలు పొగుడుతున్నాయోవేదాంతులచే నమస్కరింప బడుతున్నదో ఆ వకుళ  మాలాంకృత సూర్యుడిని దాసుడు నమస్కరిస్తున్నాడు.

నాధమునుల ఈ శ్లోకానికి మూలమైన  శ్లోకాన్ని చూద్దాము.

‘ ద్యేయసదా సవితృమండల మధ్యవర్తీ

నారాయణ సరసిజాసన, సన్నివిష్టః !

కేయూరవాన్ మఖరకుండలవాన్ ,కిరీటీ

హరి హిర్ణ్యనయ వపుః ధృతశంఖచక్రః ” !!

          ఈ శ్లోకంలో అందంగా అలంకరింపబడిన నారాయణుడు శంఖచక్రములను ధరించి సవితృ మండలంలో వేంచేసివున్నాడు. ఆయన ఎల్ల వేళల ధ్యానింప తగినవాడు. నాధమునులు ఇక్కడ నమ్మాళ్వార్లను ఆనందంగా  వేంచేసివున్న సవితృ మండల సూర్యునిగా చెపుతున్నారు. వారి వేయి పాశురాలను వేయి కిరణాలుగా వర్ణిస్తున్నారు. ఆళ్వార్లు తమ కాంతితో మధురకవులను ఉత్తరం నుండి దక్షిణానికి ఆకర్షించారు.  సవితృ మండలము నుండి ప్రకాశించే కిరణాలను సావిత్రం అని అంటారు. అందువలన తిరువాయిమొళికి ఇక్కడ  సావిత్రం అన్న పేరు ఏర్పడింది. ఇంద్రుడు భరద్వాజుడిని సావిత్రిని  నేర్చుకోమని ఆదేశించారు. 

భరద్వాజుడి కోరిక ఇంద్రుడి తీర్చటం …

         యజుర్ బ్రాహ్మణంలో, గాటకం మొదటి ప్రశ్నలో , ఇంద్ర-భరద్వాజ సంవాదం ఉంది.

భరద్వాజుడు త్రయీ అని పొగడబడే వేదాధ్యయనం చేయాలనీ సంకల్పించాడు. ఇంద్రుడి దగ్గర వందల సంవత్సరాల ప్రమాణం ఉన్న మూడు పురుషకాలాలు వరంగా పుచ్చుకొని ప్రయత్నించి ఆఖరికి తన శక్తినంతా కోల్పోయాడు. అప్పుడు ఇంద్రుడు భరద్వాజుడి దగ్గరకు వెళ్ళి మరొక పురుషకాలం ఇస్తే ఏమి చేస్తారని ప్రశ్నించాడు. దానికి ఆయన మళ్ళి వేదాధ్యయనం చేస్తానని చెప్పాడు. ఇంద్రుడు భరద్వాజుడి వేదాధ్యయనం చేయాలన్న కోరికను అర్థం చేసుకొని తన యోగవిద్య వలన మూడు వేదాలను మూడు పర్వతాలుగా చేసి  భరద్వాజుడి ముందు నిలిపాడు . ఒకొక్క పర్వతం నుండి ఒకొక్క గుప్పెడు మట్టిని తీసుకు రామన్నాడు. అలా తెచ్చిన మట్టిని చూపించి “ వేదాలు అనంతాలు, ఇప్పటి దాకా మీరు నేర్చినది ఈ గుప్పెడు” అని చెప్పాడు. అది విన్న భరద్వాజుడు వేదాలను ఆసాంతం అధ్యయనం చేయటం సాధ్యం కాదు కదా అని చింతించారు . ఇంద్రుడు భ్రరద్వాజుడికి సకల వేద సారమైన సావిత్రి విద్యను ఉపదేశించాడు.  ‘ సావిత్రి ‘ అంటే తిరువాయిమొళి .

భట్ట భాస్కరుడు ,తన వ్యాఖ్యానంలో ఈ క్రింది విధంగా చెప్పారు.

“ఇదం సావిత్రం విద్ది, అయం హి సావిత్రః సర్వ విద్యా సర్వవేద విధ్యాధ్యయనపుణ్య ఫలావాత్పిహేతు: తస్మాత్తక్తిహేతు: తస్మాత్తక్తిం వ్రుతాశ్రమేణ? ఇదామేవ వెడితవ్యమిత్యుక్త్వా తస్మై భారద్వాజాయ సావిత్రమువాచ”.

‘సావిత్రి ఆధారంగా వేదాలలోని సకల అర్థాలను తెలుసుకోవచ్చు. సావిత్రి ఉండగా మనం ఎందుకు చితించాలి ? సావిత్రిని తెలుసుకుంటే చాలు’   అని ఆ సావిత్రిని ఇంద్రుడు భ్రరద్వాజుడికి ఉపదేశించాడు.

           వేదాలు అనంతం. మన ప్రయత్నంతో అధ్యయనం చేయటం సాధ్యం కాదు. వేదాధ్యయనం చేయాలంటే సావిత్రిని తెలుసుకోవాలి. అనంత సాగరాన్ని చూసి అప్రతిభుడై నిలిచినప్పుడు ఆ అర్థాలను సులువుగా తెలుసుకునే మార్గం చూపించటం అవసరమే కదా! మన ఆచార్యులు సూర్యుడి వేయి కిరణాలను వకుళ భూషణ భాస్కరుని వేయి  పాశురాలుగాలుగా పేర్కొన్నారు.  

అడియేన్ చూడామణి రామానుజ దాసి 

మూలము :  https://srivaishnavagranthams.wordpress.com/2018/01/31/dramidopanishat-prabhava-sarvasvam-2/

archived in https://srivaishnavagranthamstelugu.wordpress.com/

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org
pramAthA (preceptors) – https://guruparamparai.wordpress.com
SrIvaishNava Education/Kids Portal – http://pillai.koyil.org

ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం 1

శ్రీ:  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమద్వరవరమునయే నమః

ద్రమిడోపనిషత్ ఫ్రభావ సర్వస్వం

స్వామి రామానుజులు మరియు దివ్య ఫ్రబంధము

  ఆళ్వార్లచే అనుగ్రహింపబడిన దివ్య ఫ్రబంధమును ముఖ్య ప్రమాణమంగా తీసుకొని స్వామి రామానుజులు శ్రీభాష్య గ్రంధ  రచన చేసారు. అందు వలన స్వామి రామానుజులకు దివ్య ఫ్రబంధంతో ఉన్న అనుబంధాన్ని ఇక్కడ చూద్దాం. జ్ఞానాదికులు నేర్చుకోదలచిన సిద్ధాంతమును  ఒక ఆచార్యులుగానోపండితులుగానోశిష్యులుగానో ఉండి అధ్యయనం చేయవచ్చు. అలా అధ్యయనం చేసేవారు ఇతరులకు నేర్పించే అర్హత గల వారవుతారు అనటంలో సందేహం లేదని పెద్దల భావన. ఈ విషయాన్ని మనసులొఎ నిలుపుకొని ముందుకు సాగుదాం.

  దివ్య ఫ్రబంధం శిష్యులుగా స్వామి రామానుజులు

                స్వామి రామానుజులు శిష్యులుగా  దివ్య ఫ్రబంధంతో సహా అనేక విషయాలను అధ్యయనం చేశారన్న విషయం గురుపరంపరా ప్రభావంలో పలు సందర్భాలలో కనపదుతుంది. 

ఎంబెరుమానార్ తిరుమలైయాండాన్ శ్రీ పాదత్తిలే తిరువాయిమొళి అర్థం కేట్టరుళినార్ “

 (ఎంబెరుమానార్లు తిరుమలైయాండాన్ల దగ్గర దివ్య ఫ్రబంధం అధ్యయనం చేశారు.)

            స్వామి రామానుజులు ఆళ్వార్ల  ఫ్రబంధాలను గురుముఖత నేర్చుకున్నారని రామానుజ నూత్తందాదిలో చెప్పబడింది. పూర్వాచారుల స్తూత్రాలనుగురుపరంపరా సారం మొదలైన శ్రీవైష్ణవ సంప్రదాయ గ్రందాలను స్వామి రామానుజులు శిష్యులుగా ఉండి అధ్యయనం చేశారని తెలుస్తున్నది. దివ్య ప్రబంధ తాత్పర్యాన్ని, అంతరార్థాలను ఆసాంతం ” అంజుకుడిక్కొరు సంతతియాయ్ ” (ఐదు వంశాలకు ఒక్క సంతానంగా) అన్నట్లు నాధమునుల నుండి శిష్యాచార్య పరంపరగా సాగి ,ఆళవందార్ల శిష్యులైన ఐదుగురు ఆచార్యుల దగ్గర అధ్యయనం చేసారు.ఈ నాటికి ఆచార్య పరంపర కొనసాగుతున్నందుకు గురుపరంపరా ప్రభావము, దివ్యప్రబంధమే కారణం. వీటిని మనం అధ్యయనం చేయటమే కాక, అధ్యాపనం చేసి మన సత్సాంప్రదాయాన్ని కొనసాగించా వలసిన అవసరం ఉంది. మన సంప్రదాయంలో దివ్యప్రబంధ అధ్యయనం తప్పనిసరి అయిన భాగం. అందువలననే స్వామి రామానుజులు కూడా ఈ ఆళ్వార్లు అనుగ్రహించిన దివ్య ప్రబంధాన్ని ఎంతో ఆదరంతోఆశక్తితో అధీకరించారు.

” దివ్య ప్రబంధ ఆచార్యులుగా శ్రీరామానుజులు “

       ప్రతి ప్రబంధాన్ని సేవించే ముందు ఆ ప్రబంధానికి సంబంధించిన  తనియన్లను సేవించటం ఆచారంగా ఉన్నది. ఒక్కొక్క ప్రబంధానికి ఒకటికంటే ఎక్కువ తనియన్లు ఉండవచ్చు. ఈ తనియన్లు ఎందుకు ఉన్నాయి అన్న విషయం చూద్దాం.

1. ఆయా  ప్రబంధాల ప్రాముఖ్యతను తెలియ చేయటానికోసం.

2. ఆయా  ప్రబంధాలను అనుగ్రహించిన ఆళ్వార్ల గొప్పదనాన్ని తెలియచేయటం కోసం.

3.ఆళ్వార్లను వారి అవతార స్థలాలను కీర్తించడం కోసం.

4.ఆయా  ప్రబంధాల సారాన్ని తెలియచేయటం కోసం.

          పైన చూసిన విషయాల వలన తనియన్లు ఆళ్వార్ల ప్రబంధాలలోని తాత్పర్యాలను సంక్షిప్తంగా తెలియచేస్తా యని బోధపడుతుంది. కాని, తిరువాయిమొళిలోనుపెరియ తిరుమొళిలోను అలా లేకపోవటం చూడవచ్చు. తిరువాయిమొళికి పూర్వాచార్యులు ఆరు తనియలను అనుగ్రహించారు. వాటిలో ఒకటి సంస్కృతములోను ,మిగిలినవి తమిళంలోను ఉన్నాయి. అందులో రెండు స్వామి రామానుజుల కాలము తరవాత వారి శిష్యులైన అనంతాళ్వాన్లు చేసిన తనియన్ ఒకటి కాగా, స్వామి పరాశర భట్టర్లు చేసిన తనియన్ ఒకటి .

అనంతాళ్వారు

” ఏయ్ న్ద పెరుం కీర్తి ఇరామానుసమునితన్

వాయ్ న్ద మలర్పాదం వణంగుగిన్ఱేన్

ఆయ్ న్ద పెరుం శీరార్ శఠకోపన్ సెంతమిళ్ వేదం తరిక్కుం పేరాద ఉళ్ళం పెర “

 

          ఈ తనియన్లో స్వామి నామ్మాళ్వార్లు అనుగ్రహించిన ద్రావిడ వేదం పరిపూర్ణంగా మనసుకు పట్టడానికి స్వామి రామానుజులే కృప   అని ప్రార్థిస్తున్నారు.

” వాన్ తిగళుం శోలై మదిరళంగర్ వణ్పుగళ్ మేల్

ఆన్ఱ తమిళ్ల్ మఱైగళ్  ఆయిరముం

ఈన్ఱ ముదల్ తాయ్ శఠగోపన్

మొయింబాల్ వళర్త ఇదత్తయ్ ఇరామానుసన్ “

పరాశర భట్టర్

       

 

  వేయి పాశురాల తిరువాయిమొళి అనే బిడ్డను కన్న తల్లి నమ్మాళ్వార్లు కాగా(వ్యాఖ్యానాలు చేసిన)

పెంచిన తల్లి రామానుజులు అని ఈ తనియన్ అర్థము.

 

 

 

 

 

 

 

 

ఎంబార్ స్వామి

        అదే విధంగా పెరియ తిరుమొళికి సంస్కృతములో ఒకటి ,తమిళములో మూడు తనియన్లు అమరి ఉన్నాయి. అందులో స్వామి ఎంబార్లు అనుగ్రహించినది ఒకటి ఉన్నది.

ఎంగళ్ గతియె ఇరామానుస మునియే!

శంగై కెడుత్తండ తవరాసా!

పొంగు పుగళ్ మంగైర్ కోనీంద మఱై ఆయిరమనైత్తుం ,

తంగు మనం నీ ఎనక్కు తా! “

    ఈ తనియన్లో తిరుమంగై ఆళ్వార్లు  అనుగ్రహించిన పెరియ తిరుమొళి అంతరార్దాలతో మనసులో స్థిరముగా ఉండేవిధంగా అనుగ్రహించమని స్వామి రామానుజులను ప్రార్థిస్తున్నారు.

          ఈ తనియన్లను చేసిన వారు పరమపద నాధుడినోశ్రీమహాలక్ష్మినోశ్రీమన్నాధమునులనోఆళ్వార్లనో కాక స్వామి రామానుజులను ప్రార్థించటం కనపడుతుంది.  దీనికి కారణం భట్టర్లు అనుగ్రహించిన తనియన్ వలన గ్రహించ వచ్చు. ఆళ్వార్లు దివ్య ప్రబంధాలను అనుగ్రహించినప్పటికీవాటి ఔన్నత్యాన్ని అందరికి తెలియజేసివాటిని రక్షించి స్వామి రామానుజులు. తన శిష్యుల మూలంగా ప్రబంధాలకు వ్యాఖ్యానాలు రాయించి వాటిని అంగీకరించి వాటిని కోరిక గలవాళ్ళందరు చదివి ప్రయోజనాన్ని పొందేట్లుగా చేసిన వారు స్వామి రామానుజులు.  రామానుజులను గురించిన ఐతిహ్యాలువారే ఉత్తాకాచార్యులని పూర్వాచార్యులు చేసిన నిర్వాహాలు తెలియచేస్తున్నాయి.

 

“ మాఱనురై సెయిద తమిల్ మఱైవళర్తోన్ వాళియే  “

             స్వామి మామునులు కూడా తమ ఆర్తి ప్రబంధంలో ద్రావిడ వేదాన్ని రక్షించి పొషించినది స్వామి రామానుజులనే కీర్తించారు.

పై విషయాల వలన స్వామి రామానుజుల ఆచార్య స్థానము యొక్క ప్రాముఖ్యత తెలుస్తున్నది.

స్వామి రామానుజులు నడిచి చూపిన ఉన్నతమైన మార్గము

                స్వామి రామానుజుల జీవన విధానాన్ని చూసినపుడు వారు విద్వానాలేక వేదాంతియాఅన్న ప్రశ్న ఉదయిస్తుంది. దీనికి జవాబు తిరువరంగత్తముదనార్ల పాశురాలలో చూడవచ్చు. ఎందుకంటే అముదనార్లు రామానుజుల జీవన విధానాన్ని దగ్గర ఉండి చూసినవారు.    

” ఉరు పెరుంసెల్వముం తందైయుం తాయుం

ఉయర్ గురువుం వెరి తరు పూమగళ్ నాధనుం

మాఱన్ విళంగియ సీర్నెరితరుం  సెంతమిళారనమే యెన్ఱి

నీణిలత్తోర్ అఱితర నిన్ఱ ఇరామానుసనెన క్కారముతే!”

         స్వామి రామానుజులు నమ్మాళ్వార్లచే అనుగ్రహించబడిన ప్రబంధాలను తమ తల్లిగాతండ్రిగాఆచార్యులుగాసంపదగాదైవముగా,  భావించటమే కాక ఆ మర్గములోనే నడచి చూపిన వారు . మనోవాక్కాయకర్మల దివ్య ప్రబంధాలను ఆదరించిఆచరించివాటిపై తమకు ఉన్న భక్తిని ప్రపంచానికి చాటి చూపించారు.

అడియేన్ చూడామణి రామానుజ దాసి

మూలము :  https://srivaishnavagranthams.wordpress.com/2018/01/30/dramidopanishat-prabhava-sarvasvam-1/

archived in https://srivaishnavagranthams.wordpress.com/

pramEyam (goal) – http://koyil.org
pramANam (scriptures) – http://granthams.koyil.org
pramAthA (preceptors) – https://guruparamparai.wordpress.com
SrIvaishNava Education/Kids Portal – http://pillai.koyil.org