యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 108

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 107

శ్రీమద్ ఉభయ వేదాంతాచార్య కాంచీపురం ప్రతివాది భయంకరం అణ్ణంగరాచార్యులు ఇచ్చిన వివరణ

ఈ శ్లోకాన్ని (శ్రీశైలేశ దయాపాత్రం) ఎంతో కృపతో శ్రీ రంగనాధుడు స్వరపరిచారు. ఇది భగవానుని వాక్కు అని మేము ధృవీకరిస్తున్నాము. శ్రీ రంగనాధుడే శ్రీ రామ కృష్ణులుగా అవతరించినది. ఆ అవతారాలలో కూడా భగవానుడికి కొందరు ఆచార్యులుగా ఉన్నారు, కానీ అతని మనస్సు తృప్తి పడలేదు. మాముణులను ఆచార్యునిగా (పరిపూర్ణ ఆచార్యుడిగా) పొంది ఆ లోటుని తీరి సంతోషించారు. ఈ లోకంలో అనేక చోట్ల మనం ఇది చూడవచ్చు.

శ్రీశైలేశ దయాపాత్రం: రామావతారంలో భగవానుడు శైలేశ దయాపాత్రం అయిన మహాత్ముని ఆశ్రయించాడు. కానీ నిరాశ ఎదురైయ్యింది. కానీ ఇప్పుడు, శ్రీశైలేశ దయాపాత్రం అయిన వ్యక్తిని పొంది అతను ఉద్ధరించబడ్డాడు. రామావతారం సమయంలో శ్రీరాముడు పొందిన శ్రీశైలేశ దయాపాత్రుడు, సుగ్రీవుడు. అక్కడ ఋష్యముఖ పర్వతం శ్రీశైలం (పర్వతం). మతంగ ముని ఆ పర్వతానికి ఈశన్ (నియంత్రించువాడు). సుగ్రీవుడు అతని దయకు పాత్రుడు (దయాపాత్రం). దుందుబి అనే రాక్షసుడు వాలీని యుద్దానికి రమ్మని సవాలు చేశాడు. ఇద్దరి మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. వాలి చేత దుందుబి వధింప బడి క్రింద వాలాడు. వాలి దుందుబి మృత దేహాన్ని ఒక యోజన (సుమారు 10 మైళ్లు, 16 కిలోమీటర్లు) దూరం విసిరి పడేశాడు. అతని శరీరం ఎగిరి పడుతున్నపుడు, అతని నోటి నుండి కొన్ని రక్తపు బిందువులు మతంగ ముని ఆశ్రమంలో పడ్డాయి. ముని క్రోదించి, తన ఆశ్రమాన్ని అపవిత్రం చేసిన వ్యక్తితో పాటు అతనితో స్నేహంగా ఉండేవారు కూడా తాను నివసించే పర్వతంపైన అడుగు పెడితే మరణిస్తారని శాపం ఇచ్చాడు. వెంటనే, వాలీతో స్నేహం ఉండి, ఆ పర్వతంపైన నివసించే అందరూ తలదాచుకోడానికి అటు ఇటు పరుగులు తీశారు. వాలితో సంబంధం తెంచుకున్న సుగ్రీవుడు, తన ప్రియ మిత్రులతో కలిసి వెళ్లి ఆ కొండపైన తలదాచుకున్నాడు. ఆ విధంగా, అతను శ్రీశైలేశుని దయకు పాత్రుడు అయ్యాడు. “సుగ్రీవం శరణం గతః” (నేను సుగ్రీవుడిని ఆశ్రయిస్తాను), “సుగ్రీవం నాథం ఇచ్ఛతి” (సుగ్రీవుడిని నా స్వామిగా ఆశిస్తున్నాను) అని సుగ్రీవుడితో స్నేహం చేసిన శ్రీ రాముడు, వర్ష ఋతువు దాటాక కూడా సీతా పిరాట్టిని వెదకడంలో సుగ్రీవుడు సహాయం అందించకపోయేసరికి నిరాశ పడ్డాడు. అందుకే, శ్రీ రాముడు లక్ష్మణుడితో “ఓ లక్ష్మణా! సుగ్రీవుని వద్దకు వెళ్లి, నా మాటలుగా అతనితో చెప్పు: చేసిన సహాయం మరచిన వ్యక్తి అధముడు; వాలి మార్గం ఇంకా సుగ్రీవుడికి ఇప్పటికీ తెరిచి ఉందని చెప్పు. నేను అతనిని, అతని బంధు మిత్రులతో సహా నరకానికి పంపడానికి సిద్ధంగా ఉన్నాన నని చెప్పు” అని అన్నాడు. అలాగ, అప్పుడు ‘శ్రీశైలేశ దయాపాత్రుడి’ యందు తృప్తి పొందలేకపోయారు. ఇప్పుడు, శ్రీ రంగనాధుడిగా, శ్రీశైలేశ దయాపాత్రుడిని పొంది ఉద్ధరణ పొందారు. తిరువాయ్మొళి పిళ్ళై అనే పేరుతో పిలవబడే తిరుమలై ఆళ్వార్ల (శ్రీశైలేశ) కృపకు పాత్రుడైన మాముణులను నేను నమస్కరిస్తున్నాను అని వివరించారు.

ధీభక్త్యాది గుణార్ణవం: రామావతారంలో, రాముడు సముద్ర రాజుకి శరణాగతి చేసారని అందరికీ తెలుసు. విభీషణుడి మాటల ప్రకారం “సముద్రం రాఘవో రాజా శరణం గంతుమర్హతి” (రఘకుల తిలకుడు (శ్రీరాముడు) సముద్ర రాజుకి శరణాగతి చేయుట సముచితమేనా) అని శ్రీ రాముడు సముద్రం ఎదుట తలవంచాడు; కానీ ఇక్కడ కూడా రాముడికి నిరాశే మిగిలింది. ఆ సముద్ర రాజు శ్రీ రామునికి సహాయం అందించడానికి ముందుకు రాకపోయేసరికి, క్రోదాగ్నికి గురై, లక్ష్మణునితో “చాపమానయ సౌమిత్రే! సారాంచ ఆసీవివిషోపమాన్ సగరమశోషయిష్యమి” (నా విల్లు బాణాలు తీసుకురా లక్ష్మణా! నేను ఈ సముద్రంలో నీళ్ళు లేకుండా చేస్తాను) అని అన్నాడు. ఆ విధంగా, శరణాగతి చేయడానికి ప్రయత్నించిన ప్రతి చోటా, తిరస్కరణయే లభించింది. ఆ లోటుని తీర్చుకోడానికి, ఉప్పు సముద్రం ఎదుట కాకుండా, జ్ఞాన భక్తి వైరాగ్య గుణాల మహాసాగరుడైన మణవాళ మాముణులకు వంగి నమస్కరించాడు.

యతీంద్ర ప్రవణం: “మందిపాయ్ వడవేంగడ మామలై వానవర్గళ్ సంధి శెయ్య నిన్ఱాన్ అరంగత్తు అరవిణ్ అణైయాన్” (శేష శయ్యపైన పవ్వళించి ఉన్న శ్రీరంగనాధుడే, నిత్యసూరుల ఆరాధనలు స్వీకరిస్తూ తిరువేంగడముడయానుడిగా తిరుమలలో నిలబడి ఉన్నాడు). ఆ తిరువేంగడముడయానుడికి రామానుజులు శంఖ చక్రాలను ప్రసాదించి, “అప్పనుక్కుచ్చంగాళి అళిత్తరుళుం పెరుమాళ్” (దయతో తిరువేంకటేశ్వరునికి శంఖ చక్రాలను అందించినవాడు) అని కీర్తించబడ్డారు. పెరుమాళ్ళు రామానుజులను తమ ఆచార్యునిగా భావించారన్నది అందరికీ తెలిసిన విషయమే. రామానుజులలో ఎటువంటి తృటి లేకపోయినా, ఇరామానుశ నూఱ్ఱదాది 97వ పాశురంలో “తన్నై ఉఱ్ఱాట్చెయ్యుం తన్మైయినోర్” (రామానుజులకు కైంకర్యం చేసే వారి దివ్య తిరువడిని తిరువరంగత్తు అముదనార్లను అధిరోహింపజేశారు) అని పెరుమాళ్ళు తెలుసుకున్న తరువాత, యతీంద్రుని కన్నా యతీంద్రప్రవణర్లకు శిష్యుడిగా ఉండటమే మంచిదని భావించాడు – అంటే నేరుగా రామానుజులకు బదులుగా మణవాళ మాముణుల ద్వారా అని అర్థం. అందుకే, తాను యతీంద్ర ప్రవణర్లకు నమస్కరిస్తున్నానని అన్నారు.

వందే రమ్యజామాతరం మునిం: పెరుమాళ్ళ అవతారాలలో, శ్రీ రామావతారంలో విశ్వామిత్రుడికి శిష్యుడిగా, కృష్ణనవతారంలో సాందిపని మునికి శిష్యుడిగా భగవానుడు ఉన్నాడు. అయితే, ఆ రెండు చోట్లా పెరుమాళ్ళకు నిరాశయే మిగిలింది. రాముడు విశ్వామిత్రునితో కలిసి జనక మహారాజు రాజసభకు వెళ్ళినపుడు, గౌతమ మహర్షి తనయుడైన శతానందుడి నుండి, విశ్వమిత్రుడు మేనకల కలయిక గురించి, విశ్వమిత్రుని వశిష్ఠ మహర్షితో యుద్దం మొదలైన తమ ఆచార్యుని రజో తమో గుణాల కథనాలను విన్నాడు. శ్రీ రామాయణం బాల కాండం 51వ సర్గంలో వివరించబడి ఉన్నాయి. “ఇటువంటి వ్యక్తిని ఆచార్యునిగా ఆశ్రయించ వచ్చా?” అని భావించి నిరాశ చెందాడు. కృష్ణావతారంలో, సాందిపని ముని వద్ద అన్ని విధ్యలు నేర్చుకున్నాడు. కృష్ణుడే శ్రీమాన్ నారాయణుడని, మోక్షం ప్రదాత అని తెలిసినప్పటికీ, సాందిపని ముని గురుదక్షిణగా కోల్పోయిన తన కొడుకును తిరిగి తీసుకురమ్మని కృష్ణుడిని అడుగుతాడు. ఈ విధంగా, భౌతిక వాంఛలపై ఆసక్తి ఉన్న ఇద్దరు మునులను తిరస్కరించి, పూర్ణ వైరాగ్యులు, పవిత్ర గుణా సాగరులైన మాముణులను తమ ఆచార్యుడిగా స్వీకరించాడు.

అందువల్ల, ఇంత విశేష అర్థాలున్న ఈ శ్లోకాన్ని భగవానుడే పఠించగలడు. ఇవి ఆతని దివ్య హృదయ కమలలోని విషయాలు కాబట్టి, మరెవరి సొత్తు కాలేదు. కాబట్టి ఇవి స్వయంగా పెరుమాళ్ళు పలికిన పలుకులేనని నిర్ధారించబడింది.

ఇంతటితో యతోంద్ర ప్రవణ ప్రభవం ముగింపుకు వచ్చింది

దివ్యదంపతి తిరువడిగళే శరణం
ఆళ్వార్ ఎమ్పెరుమానార్ జీయర్ తిరువడిగళే శరణం
పిళ్లై లోకం జీయర్ తిరువడిగళే శరణం

మూలము: https://srivaishnavagranthams.wordpress.com/2021/11/03/yathindhra-pravana-prabhavam-108/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 107

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 106

ఇప్పుడు, యతీంద్రర్ (రామానుజులు), యతీంద్రప్రవణర్ (మణవాళ మాముణులు) మధ్య పోలికలు గమనిద్దాం: 

శ్రీ రామానుజులు సంస్కృత తమిళ భాషల ప్రాధాన్యతను ఎత్తి చూపుతూ శ్రీరంగానికి ఉత్తరాన ఉన్న శ్రీపెరంబుదూర్లో అవతరించారు. వీరి అవతారం కారణంగా, “నారణనై క్కాట్టియ వేదం కళిప్పుఱ్ఱదు తెన్ కురుగై వళ్ళల్ వాట్టమిళా వణ్ తమిళ్ మఱై వాళ్ందదు” (సంస్కృతం ఆనందించింది; ఆళ్వార్తిరునగరిలో అవతరించిన నమ్మాళ్వార్లు వాడిన గొప్ప తమిళ భాష ఉద్దరింపబడింది). మణవాళ మామునిగళ్, “అరంగ నగరుం మేవు తిరునగరియుం వాళ్ంద మణవాళ మాముని” (శ్రీరంగం, ఆళ్వార్తిరునగరి రెండూ మణవాళ మాముణుల అవతారంతో ఉద్ధరింపబడ్డాయి) అని చెప్పినట్లుగా, తమిళ భాష ఉద్దరించుటకు దక్షిణ ప్రాంతానికి తిలకం వంటి ఆళ్వార్తిరునగరిలో మణవాళ మాముణులు అవతరించారు. వీరు సంస్కృత తమిళ భాషలలో నైపుణ్యం ఉన్నప్పటికీ, వారి కీర్తి స్థాపన కోసమై ఇక్కడ తమిళ్ మాత్రమే ప్రస్తావించబడింది. నల్లని రత్నం (శ్రీ రంగనాధుడు) దర్శనం పొంది, కైంకర్య సంపదతో జీవిస్తూ, కైంకర్యం, ఇరు వేదములను (సంస్కృత, ద్రవిడ) పోషించడానికి మాముణుల కూడా తమ స్వస్థలాన్ని విడిచి, రెండు నదుల (కవేరి, కొల్లిడం) మధ్య ఉన్న శ్రీరంగానికి వెళ్ళారు. “ఎల్లా ఉయిర్గాట్కుం నాధన్ అరంగన్” (సమస్థ జీవరాశులకు అధిపతి శ్రీ రంగనాధుడు) అని రామానుజులు కీర్తిస్తే, “పల్లుయిర్ క్కుం విణ్ణిన్ తలై నిన్ఱు వీడళిప్పాన్” (అందరికీ మోక్షప్రధానం చేసేవారు రామానుజులు) అని, “అనైత్తులగుం వాళ ప్పిఱంద ఇరామానుశన్” (ఈ లోకంలో అందరినీ ఉద్ధరించేందుకు రామానుజులు అవతరించారు) అని మణవాళ మాముణులు ఎత్తి చూపారు. జీయర్ అవతరణకు ముందు కాలంలో, ఉడయవర్ల (రామానుజులు) మహిమలకు అంత వైభవం ఉండేది కాదు. రామానుజుల గొప్పతనానికి దీపం వెలిగించిన వారు జీయర్. వీరిరువురు నరనారాయణుని వలె అవతారాలు దాల్చారు (భగవానుడు బద్రికాశ్రమంలో ఆచార్య శిష్యుని రూపాలలో నర నారాయణుడిగా అవతరించారు). అక్కడ ఆచార్య శిష్యులు ఇద్దరూ ఒకరే; ఇక్కడ రామానుజులు, మాముణుల విషయంలో కూడా అదే జరిగింది [ఇద్దరూ ఆదిశేషుని అవతారాలు]. రామానుజులు నారాయణుడి మహిమలను కీర్తిస్తే, జీయర్ రామానుజుల మహిమలను కీర్తించారు. నారాయణుడు, రామానుజులిద్దరూ చతురాక్షరీలు (నాలుగు అక్షరాలు ఉన్న వారు). ఉత్తములలో పరమ ఉత్తములైన మాముణులు చరమచతురక్షరి (అత్యుత్తమ నాలుగు అక్షరాల పదం) తో దృఢ నిశ్చయులై ఉండేవారు. ఆచార్యుడు తప్ప మరే ఇతర దేవతను ఎరుగని స్థితిని చరమపర్వం (అంతిమ స్థితి) అంటారు. రామానుజులను నమ్మాళ్వార్ల తిరువడి అని కూడా అంటారు. మధురకవి ఆళ్వార్లకు నమ్మాళ్వార్ల పట్ల చరమ నిష్ఠ ఉన్నప్పటికీ, నమ్మాళ్వార్ల దివ్య పాదాలను రామానుజులని పిలుస్తారు. అలాగే, రామానుజుల వద్ద కూరత్తాళ్వాన్, ముదళియాండాన్ మొదలైన ఉత్తమ శిష్యులు ఉండేవారు, కానీ మణవాళ మాముణులు మాత్రమే యతీంద్రప్రవణర్‌ గా ప్రసిద్ధి చెందారు. ఈ తనియన్ (శ్రీశైలేశ దయాపాత్రం) వేద సారమైన ప్రపత్తికి సమానంగా నిత్య అనుసంధానం (ప్రతిరోజూ పఠించేది) చేయాలి.

మూలము: https://srivaishnavagranthams.wordpress.com/2021/11/02/yathindhra-pravana-prabhavam-107/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 106

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 105

ప్రణవం (ఓం) “యద్వేదాదౌస్వరః ప్రోక్తో వేదాంతేచ ప్రతిష్ఠితః” (వేద పారాయణం ప్రారంభంలో, చివరిలో ప్రణవం పఠించబడుతుంది) అని చెప్పబడినట్లే, ‘శ్రీశైలేశ దయాపాత్రం’ మాముణుల స్తుతి రూపంలో ఉన్న ఈ తనియన్, దివ్య ప్రబంధ పారాయణము, వాటి అర్థ వ్యాఖ్యానాములు, రహస్యముల ప్రారంభంలో, చివరిలో పఠించబడుతుంది.

ప్రణవంలో, అకారం (అ) భగవానుని సూచిస్తుంది, మకారం (‘మ’) చేతనుని, ఉకారం (ఉ) ‘అ’ ‘మ’ రెండింటి మధ్య ఉన్న సంబంధాన్ని చూపుతుంది. “అవ్వనవరుక్కు మవ్వానవరెల్లాం ఉవ్వానవరదిమై” (సమస్థ చేతనులు పెరుమాళ్లకు దాసులు) అని పెద్దలు అంటారు. ఈ అర్థాన్ని ఈ తనియన్లో ప్రతి పంక్తిలో మనం చూడవచ్చు:

శ్రీశైలేశ దయాపాత్రం: శ్రీశైలేశ అనే పదం అకారవాచ్యుడైన భగవానుని సూచిస్తుంది. అటువంటి భగవానుడి కోసం తప్ప మరెవరి కోసం చేతనుడు ఉనికిలో ఉండడని, భగవానుడి కృపకు పాత్రుడన్న వాస్తవాన్ని దయాపాత్రం అనే పదం సూచిస్తుంది. ప్రమాణాల ప్రకారం “ఆచార్యః స హరిః సాక్షాత్” (హరియే ఆచార్యుడు), ఆచార్యుడే భగవానుడు అని తెలుపుతుంది.

ధీభక్త్యాది గుణార్ణవం: దివ్య ప్రబంధ పాశురాలలో చెప్పినట్లే “తామరైయాళ్ కేల్వన్ ఒరువనైయే నోక్కుం ఉణర్వు” (శ్రీమహాలక్ష్మి పతి కోసమే ఈ చేతనుడు ఉన్నాడు), “ఆదియంజోదిక్కే ఆరాధ కాదల్” (పరమాత్మ కోసమే నా భక్తి), “ఉన్నిత్తు మఱ్ఱొరు దెయ్వం తోళాళ్” (విశ్లేషణ తరువాత మరే ఇతర దేవతను ఆరాధించడు), ఎందుకంటే ‘ధీభక్త్యాది గుణార్ణవం’ అనే వాఖ్యం జ్ఞాన భక్తి వైరాగ్యాన్ని సూచిస్తుంది, ఇది భక్తి ద్వారా భగవత్ శేషత్వాన్ని సూచిస్తుంది. “ఉన్నిణైత్ తామరైగట్కు అన్బురుగి నిఱ్కుమదే” (భగవానుడి దివ్య పాద యుగళి పట్ల భక్తితో ఉండటం) అనే చేతనుడి స్వరూపం (చేతనుడి స్వభావం) భగవత్ జ్ఞానం మాత్రమే కాబట్టి, శేషత్వమే (భగవత్ కైంకర్యం) జ్ఞానం అని నిర్వచించబడింది. ఇతర దేవతలకు ఇచ్చే ప్రాముఖ్యతను తిరస్కరించడమే వైరాగ్యం అని నిర్వచించబడింది.

యతీంద్ర ప్రవణం: ‘యతీంద్ర’ అనే పదం భగవత్ పారతంత్రుడిని, ఏ పని లేకుండా ఉండే వారిని సరిదిద్దే వాడిని, వాళ్ళు శ్రీమహాలక్ష్మి పతికి సేవ చేసేలా చేసేవాడిని సూచిస్తుంది. ఈ కారణంగా రామానుజుల కృపకు పాత్రులైనారు మాముణులు. భగవత్ అనన్యార్హ శేషత్వం (భగవానుడి కోసమే) అన్న గుణం తమ అనుచరుల వరకు ప్రవహించాలి. అంతేకాకుండా, ‘యతీంద్ర’ అనే పదం ప్రత్యేకంగా రామానుజులను సూచిస్తుంది. ‘రామానుజ’ అనే పదంలో ‘రామ’ అనే పదం అకారవాచ్యుడిని (ఎమ్పెరుమాన్) ని సూచిస్తుంది, ‘అనుజ’ అనే పదం కైంకర్యం చేసే చేతనుడిని సూచిస్తుంది. ‘రామానుజం యతిపతిం ప్రణమామి మూర్ధ్నా’ (యతులలో ప్రధానుడైన ఆ రామానుజుల ఎదుట శిరస్సు వంచి నమస్కరిస్తాను) అనే వాఖ్యం భక్తి స్థితిని సూచిస్తుంది.

వందే రమ్యజామాతరం మునిం: ఇది కూడా పైన పేర్కొన్న అర్థాన్నే సూచిస్తుంది. రమ్యజామాతృ అనే పదం అకారవాచ్యుడైన భగవానుని సూచిస్తుంది, ‘ముని’ అనే పదం సర్వ జ్ఞాని, పరమ చేతనుడైన భగవానుని కోసమే తాము అనే జీవుడిని సూచిస్తుంది. కాబట్టి, ఈ పదాలన్నీ ప్రణవార్థాలను సూచిస్తున్నాయని అనుకోవడంలో తప్పులేదు.

మూలము: https://srivaishnavagranthams.wordpress.com/2021/11/01/yathindhra-pravana-prabhavam-106/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 105

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 104

యతీంద్ర ప్రవణ ప్రభావం – అనుబంధం

శ్రీశైలేశ మంత్ర మహిమ

శ్రీశైలేశ దయాపాత్రం ధీభక్త్యాది గుణార్ణవం
యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం

మణవాళ మాముణుల శిష్య రూపంలో శ్రీ రంగనాధుడు వారిని కీర్తిస్తూ ఈ తనియన్ను పఠించారని అందరికీ తెలుసు. మనకు ఇది మహామంత్రము, మంత్ర రత్నంతో (ద్వయ మహామంత్రం) సమానమైనది. ఈ మంత్ర మహిమను గొప్పతనాన్ని మనం ఇక్కడ అనుభవించబోతున్నాము.

పిళ్ళై లోకం జీయర్ వ్రాసిన వ్యాఖ్యానం ఆధారంగా

పెరియ జీయర్ [మణవాళ మాముణులు] తిరువాయ్మొళి పిళ్ళైల తిరువడి సంబంధం పొందారు, “వాళి తిరువాయ్మొళి పిళ్ళై మాదగవాల్ వాళుం మణవాళ మామునివన్” (తిరువాయ్మొళి పిళ్ళైల అనుగ్రహముతో జీవించే మణవాళ మాముణులు చిరకాలం వర్ధిల్లాలి) అని కొనియాడబడ్డారు. వీరు తిరువాయ్మొళి పిళ్ళై వద్ద తిరువాయ్మొళి మొదలైన దివ్యప్రబంధాల అర్థాలను నేర్చుకోవడమే కాకుండా అందరినీ ఈ అర్థాలను నేర్చుకొని ఉద్దరణ పొందమని ప్రోత్సహించేవారు. ఆ దిశలో వీరు కైంకర్యం చేస్తుండేవారు. అర్చక ముఖేన నంపెరుమాళ్ళు మణవాళ మాముణులను పిలిచి, తాను తనతో పాటు భక్తులందరూ లాభం పొందేలా పెరియ తిరుమండపం (శ్రీరంగం ఆలయం లోని దివ్య మండపం) లో తిరువాయ్మొళి అర్థాల ఉపన్యాసం చేయమని ఆదేశించారు. పెరుమాళ్ళ ఆజ్ఞాను శిరసా వహిస్తూ మాముణులు అమలు పరచారు. ‘ఉయర్వర ఉయర్ నళం’ నుండి ప్రారంభించి ‘అవావఱ చూళ్’ తో ముగించారు. మాముణుల ఉపన్యాస విధానానికి సంతోషించి, పెరుమాళ్ మాముణులకు ‘ముప్పత్తారాయిర ప్పెరుక్కర్’ (తిరువాయ్మొళి ఈడు వ్యాఖ్యానం (ముప్పత్తారాయిర ప్పడి అని పిలుస్తారు) ను వివిధ అర్థాలతో వివరించేవాడు అని అర్థం) అన్న పేరుతో గౌరవించారు. దయతో పెరుమాళ్ళు మాముణులను పొగుడుతూ శ్రీశైలేశ దయాపాత్రం తనియన్ను పఠించారు.తమపై కరుణ కురిపించిన పెరియ పెరుమాళ్ళ కోసం ఈ క్రింది పాశురాన్ని మాముణులు రచించారు.

నామార్? పెరియతిరుమండపమార్? నంపెరుమాళ్
తామాగ నమ్మైత్తనిత్తళైత్తు – నీ మాఱన్
శెందమిళ్ వేదత్తిన్ శెళుం పొరుళై నాళుం ఇంగే
వందురై ఎన్ఱేవువదే వాయ్ందు

(అసలు మనం ఎవరు? తిరుమండపం అంటే ఏమిటి? స్వయంగా నంపెరుమాళ్ళు విడిగా పిలిచి, “మాఱన్ (నమ్మాళ్వార్) స్వరపరచిన తమిళ్ వేద అర్థాల ఉపన్యాసం చెప్పండి” అని ఆజ్ఞాపించారు. ఇది ఎంతటి భాగ్యం!)

పెరియ జీయర్ కోసం నంపెరుమాళ్ళు స్వరపరచిన తనియన్ అర్థం: తిరువాయ్మొళి పిళ్లై కృపా పాత్రుడు, శ్రీ భాష్యకారుల (రామానుజులు) పరమ భక్తుడు, జ్ఞాన భక్తి వైరాగ్య గుణా సాగరుడు అయిన కోయిల్ అళగియ మణవాళ జీయర్ను నేను ఆరాధిస్తాను..

శ్రీశైలేశ దయాపాత్రం: తిరువాయ్మొళి ప్పిళ్ళైల [శ్రీశైలేశర్] మహా కృపకు పాతృలు మనవాళ మాముణులు. నమ్మాళ్వార్ల తిరువడి అయిన రామానుజులను (వీరి తిరువడిని) అటువంటి తిరువాయ్మొళి ప్పిళ్ళై వారు ఎన్నడూ మరువలేదు. శ్రీశైలపూర్ణులు (రామానుజులకు మేనమామగారు, వారికి శ్రీ రామాయణ బోధించిన పెరియ తిరుమలై నంబి), శ్రీశైల దేశికర్ (తిరువాయ్మొళి ప్పిళ్ళై), వీరిరువురి ద్వారా శ్రీ రామాయణం మరియు తిరువాయ్మొళి యొక్క భక్తి ప్రవాహం చేరి మణవాళ మాముణుల తిరుహృదయంలో నివాసం చేసుకుంది. వీరిని యతీంద్ర ప్రవణర్ (రామానుజుల తిరు పాద భక్తులు) అని కూడా పిలుస్తారు.

దీభక్త్యాది గుణార్ణవం: జ్ఞాన భక్తి వైరాగ్య మహా సాగరం వంటి వారు మణవాళ మాముణులు. మునుపు ఇళైయ పెరుమాళ్ (లక్ష్మణుడు), ఇళైయాళ్వార్ (రామానుజులు) స్వరూపాలలో కూడా మాముణులు జ్ఞాన భక్తి పరిపూర్ణులు. కానీ పెరియ జీయర్ విషయంలో, పెరియ పెరుమాళ్ళ పట్ల వీరి భక్తి ప్రపత్తులు రెట్టింపని చెప్పుకోవచ్చు.

యతీంద్ర ప్రవణం: యతీంద్ర ప్రవణం అనే పదం, నంపెరుమాళ్ళ పట్ల మాముణులకు ఉన్న భక్తి, ఎల్లలు & పరిమితి లేని భక్తి గా ఎమ్పెరుమానార్ల పై  చేరింది (భక్తికి, ప్రపత్తికి అనంతమైన సీమను సూచిస్తుంది). రామానుజులు పరాంకుశ భక్తర్ (నమ్మాళ్వార్ల దాసులు). మాముణులు యతీంద్ర దాసులు (యతీంద్ర ప్రవణర్).

వందే రమ్యజామాతరం మునిం: అళగియ మణవాళ మాముణుల తిరు నామాన్ని ధ్యానిస్తూ, మాముణుల దివ్య పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశారు.

మూలము: https://srivaishnavagranthams.wordpress.com/2021/11/01/yathindhra-pravana-prabhavam-105/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 104

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 103

మణవాళ మాముణుల వాళి తిరునామాలు

ఇప్పువియిల్ అరంగేశర్ క్కు ఈడళిత్తాన్ వాళియే
ఎళిల్ తిరువాయ్మొళిప్పిళ్ళై ఇణైయడియోన్ వాళియే
ఐప్పశియిల్ తిరుమూలత్తవదత్తాన్ వాళియే
అరవసప్పెరుంజోది అనంతన్ ఎన్ఱుం వాళియే
ఎప్పువియుం శ్రీశైలం ఏత్తవందోన్ వాళియే
ఏరారుం ఎతిరాశర్ ఎన ఉదిత్తాన్ వాళియే
ముప్పురినూల్ మణివడముం ముక్కోల్ దరిత్తాన్ వాళియే
మూదరియ మణవాళ మామునివన్ వాళియే

నాళ్ పాట్టు 

సెందమిళ్ వేదియర్ శిందై తెళిందు శిఱందు మగిళ్ందిడి నాళ్
శీరులగారియర్ శెయ్దరుళ్ నఱ్కలై తేశు పొలిందిడు నాళ్
మందమది ప్పువి మానిడర్ తంగళై వానిల్ ఉయర్ త్తిడు నాళ్
మాశఱు జ్ఞానియర్ శేర్ ఎదిరాశర్ తం వాళ్వు ముళైత్తిడు నాళ్
కందమలర్ పొళిల్ శూళ్ కురుగాదిబన్ కలైగళ్ విళంగిడు నాళ్
కారమర్ మేని అరంగ నగర్ క్కిఱై కణ్గళ్ కళిత్తిడు నాళ్
అందమిల్ శీర్ మణవాలమునిప్పరన్ అవదారం శెయ్దిడు నాళ్
అళగు తిగళ్ందిడుం ఐప్పశియిల్ తిరుమూలం అదు ఎను నాళే

మంగళం

శ్రీమతే రమ్యజామాతృ మునీంద్రాయ మహాత్మనే
శ్రీరంగవాసినే భూయాత్ నిత్యశ్రీనిత్య మంగళం 

శ్రీ పిళ్ళై లోకార్య జీయర్ వైభవం

మణవాళ మాముణుల వైభవాన్ని వివరిస్తూ యతీంద్ర ప్రవణ ప్రభవం అనే ఈ దివ్య గ్రంధాన్ని కృపతో పిళ్ళై లోకార్య (పిళ్ళై లోకం) జీయర్ రచించారు. గోవిందప్ప తాదర్ (దాసర్) వంశస్థులైన వీరు, మధురకవియాళ్వార్లు నమ్మాళ్వార్ల పట్ల ఉన్నట్లే, వీరు మణవాళ మాముణుల తిరువడి యందు నిష్ఠతో ఉండేవారు. ఈ గోవిందప్ప దాసర్ సన్యాశ్రమాన్ని స్వీకరించాక భట్టర్ పిరాన్ జీయర్ అనే దివ్య నామాన్ని పొందారు. మణవాళ మాముణుల అష్టదిగ్గజులలో వీరు ఒకరు. అళగియ మణవాళర్ గోవిందప్ప దాసర్ల తిరు కుమారుడు. అళగియ మణవాళర్ మనవడు వరదాచార్యుడు. వరదాచార్యులు సన్యాసాశ్రమాన్ని స్వీకరించాక, వీరు పిళ్ళైలోకం జీయరుగా ప్రసిద్ధి చెందారు. మణవాళ మాముణులు రచించిన యతిరాజ వింశతి, ఉపదేశ రత్న మాల, తిరువాయ్మొళి నూఱ్ఱందాది, ఆర్థి ప్రబంధాలకు వీరు మణి ప్రవాళ వ్యాఖ్యానాలు వ్రాశారు. రామానుజుల దివ్య మహిమలను వర్ణిస్తూ వీరు ‘రామానుజార్య దివ్యచరితం’ అను గ్రంధాన్ని రచించారు. ఇరామానుశ నూఱ్ఱందాదికి నాలాయిర తనియన్లకు వ్యాఖ్యానాలు రచించారు. వీరి తిరు నక్షత్రం మేష మాసంలో (చిత్తిరై) శ్రావణం (తిరువోణం) నక్షత్రం.

సముద్రంలో కొట్టుకు పోయిన తిరుక్కడన్మల్లై గుడిలో ఇప్పుడున్న చోట సన్నిధిని పునర్నిర్మానం చేసి, పెరుమాళ్, భూదత్తాళ్వార్ల విగ్రహాలను ప్రతిష్టించారు. ఆ సన్నిధిలో మొదటి తీర్థం మొదలైన ఆలయ గౌరవాలను పొందారు. ఇప్పటికి కూడా వారి పూర్వాశ్రమ సంతతి ఈ గౌరవాలను పొందుతున్నారు. ఈ జీయర్ జీవిత చరిత్ర గురించిన వివరాలు అంతగా అందుబాటులో లేవు.

శ్రీ పిళ్ళైలోకం ​​జీయర్ తిరువడిగళే శరణం

మూలము: https://srivaishnavagranthams.wordpress.com/2021/10/30/yathindhra-pravana-prabhavam-104/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 103

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 102

మాముణులతో ఉన్న శిష్యులు

ఆ విధంగా, యతీంద్ర ప్రవణులు (రామానుజుల పట్ల భక్తి ప్రపత్తులతో ఉన్నవారు) అయిన జీయర్ దివ్య తిరువడి సంబంధం పొందిన శిష్యులందరూ ఆచార్య అభిమన నిష్ఠతో (ఆచార్యుల పట్ల భక్తితో దృఢంగా నిమగ్నమై), తమ శిష్యులను కూడా జీయరుని ఆశ్రయించమని బోధిస్తూ జీవించారు. వాళ్ళు కూడా ఉత్తర దినచర్య శ్లోకంలో చెప్పినట్లుగానే జీవనం సాగించారు.

అపగతమతమానైః అంతిమోపాయ నిష్ఠైః అతిగత పరమార్తైః అర్థకామానపేక్షైః
నిఖిలజనసుహృద్దిర్ నిర్జితక్రోధలోభైః వరవరమునిబృత్యైః అస్థుమే నిత్యయోగః

(మణవాళ మాముణుల శిష్యులు – ఆచార్యాభిమానమే (ఆచార్యుల పట్ల భక్తి ప్రపత్తులు) అత్యున్నత సాధనం (కర్మ, జ్ఞాన, భక్తి, ఆచార్యాభిమానం లలో) అనే దృఢ నమ్మకంతో, ఆచార్య పరతంత్రులై, అహంకార రహితులై, ఆచార్య కైంకర్యం చేస్తూ, అదియే పురుషార్థం (అత్యున్నత ఫలం) అని భావిస్తూ, భోగ భాగ్య ఆసక్తులు లేకుండా, విరోధుల పట్ల కూడా కోపరహితంగా ఉంటూ, క్రోధాన్ని జయించి, సకల సంపదలను గడ్డి పోచకు సమానంగా భావించే, ఆచార్య కైంకర్యం చేస్తూ, ఆచార్య అభిమానమే పరమావధి అనే దృఢ నమ్మకంతో ఉంటూ, ఉభయ విభూతులాను (సంసారం, శ్రీవైకుంటం) సమానంగా పరిగణించేవారు.

శ్రీ శఠారిగురోదివ్య శ్రీపాదాబ్జ మధువ్రతం
శ్రీమద్ యతింద్రప్రవణం శ్రీలోకార్యమునిం భజే

(రామానుజుల పట్ల భక్తి ప్రపత్తులు కలిగి, తమ దివ్య తిరువడి నుండి అమృతమయమైన తేనె కారుచు ఉండే శ్రీ పిళ్ళై లోకం జీయరుని నేను ఆరాధిస్తాను)

మూలము: https://srivaishnavagranthams.wordpress.com/2021/10/30/yathindhra-pravana-prabhavam-103/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 102

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 101

ఎఱుంబి అప్పా కోరిక

తరువాత, జీయర్ తిరునాడుకు చేరుకున్న విషయం గురించి ఎఱుంబియప్పా కూడా తెలుసుకున్నారు. ఈ శ్లోకం ద్వారా తెలుపబడింది.

వరవరముని పతిర్మే తద్పదయుగమేవ శరణమనురూపం
తస్యైవ చరణయుగళే పరిచరణం ప్రాప్యమితి ననుప్రాప్తం

(అడియేనుకి స్వామి అయిన మణవాళ మాముణుల దివ్య పాద పద్మాలు అత్యున్నత ఫలాన్ని [శ్రీవైకుంఠం చేరుకోవడం] పొందే సాధనాలు; కమలముల వంటి వారి తిరువడి కైంకర్యం లభించుట పరమ ప్రాప్తం. ఇది నా ప్రగాఢ నమ్మకం కూడా) తమ ఆచార్యుడి పట్ల దృఢ నిష్ఠతో ఉన్న వీరు, తమ ఆచార్యులు దూరమవ్వడం సహించలేకపోయారు. ఆ విరహ బాధనే వారిని ఈ పాశురాన్ని రచింపజేసింది.

వపురవిః సపదిమధీయం వరవరవమునివర్య మోచనీయమితం
పరిచరతి నహిభవంతం భగవనినహి భగవదభిమతా నపివా 

(ఓ మణవాళ మామునీ! మంగళ గుణాల పూర్ణుడా! అడియేనుని ఈ దేహం నుండి విడిపించుటకు తామే తగినవారు; ఈ శరీరంతో దేవర్వారికి కైంకర్యం చేసే అదృష్టం అడియేనుకి కలుగలేదు; ఎంబెరుమానార్ దాసులకు కూడా ఈ శరీరంతో కైంకర్యం చేయలేకపోయాను)

ఇతిపునరేష వితన్నభితురి తరధిదూరనిమ్నపతరూడః
వరవరమునివర కరుణాం నిగ్నన్ పదనృపసురశ్నుతే నియమాన్

(జ్ఞానం ఉండికూడా, పాప కర్మల చేస్తూ “ఇతడు మానవ రూపంలో ఉన్న జంతువు” అని అనిపించుకున్నాను; పాప కర్మల ఫలాలను అనుభవిస్తూ, మణవాళ మాముణులు కురిపించిన కరుణను నాశనము చేస్తూ అతి నీచమైన జీవితాన్ని గడిపాను)

ఆయుపహరతి జగతాం అయముధయం విలయమపిభజన్ భానుః
మయిపునరితమ నృశంసో వరవరమునివర్య వర్తయత్యేవ

(ఓ మణవాళ మామునీ! ఈ సూర్యుడు ఉదయిస్తూ అస్తమిస్తూ [సూర్యోదయం మరియు సూర్యాస్తమయం] ఈ లోకుల ప్రాణ ఘడియలను తరిగిస్తున్నాడు; కానీ అడియేన్ విషయంలో మాత్రం, ఈ ప్రపంచంలో నా జీవితాన్ని పెంచి అతి దారుణమైన శిక్ష నాకు వేస్తున్నాడు)

తదితః పరమనురూపం నవిళంబితుమితి చింతయంతయయా
మలభజనాధితోమాం వరవరమునివర్య మోచయధ్వరితం

(ఆ కారణంగా, ఓ మణవాళ మాముని! అడియేన్ విషయంలో, ఇక ఆలస్యం చేయడం తగదు; దేవర్వారి దివ్య సంకల్ప కృపతో, దయచేసి ఈ శరీరం నుండి నన్ను విముక్తుడిని చేయుము). అతను ఎంతో ఆర్తితో ఉన్నాడు; జీయర్ గుణాలను అనుభవించాలని, అతనికి కైంకర్యం చేయాలనే కోరికతో ఉన్న ఎఱుంబికి ఈ సంసారంలో ఉండడం అనేది, శ్రీ రాముడికి దూరమై రావణుని అశోక వాటికలో బాధపడుతున్న సీత పరిస్థి వంటిది. తిరువిరుత్తం 1వ పాశురంలో “పొయ్ నిన్ఱ జ్ఞానముం పొల్లా ఒళుక్కుం అళుక్కుడంబుం ఇన్నిన్ఱ నీర్మై ఇనియాం ఉఱమై” (ఈ తప్పుడు జ్ఞానాన్ని, అనుచిత ప్రవర్తనను, ఈ అపవిత్ర దేహాన్ని నేను సహించలేకపోతున్నాను), “ఆవిక్కోర్ పఱ్ఱుక్కొంబు నిన్నలాల్ అఱిగిన్ఱిలేన్ యాన్” (నీవు తప్ప ఈ ఆత్మకు ఆధారం ఇంకెవరూ నాకు గోచరించుటలేదు) అని తిరువాయ్మొళి పాశురములో అన్నట్లు, తమ ఆచార్యులను చేరే వరకు వీరి విరహ బాధ తగ్గేటట్లు లేదు. ఒక్క రోజు కూడా వేయి యుగాలనిపించాయి వారికి. మాముణుల దివ్య నామ జపం చేస్తూ, తరచూ స్పృహ కోల్పోతున్న స్థితిలో అలాగే ఉన్నారు.

మూలము: https://srivaishnavagranthams.wordpress.com/2021/10/29/yathindhra-pravana-prabhavam-102/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 101

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 100

వానమామలై జీయర్ తిరిగి వచ్చుట 

వానమామలై జీయర్ తమ ఉత్తర భారత యాత్రను ముగించుకొని తిరిగి వచ్చారు; వీరు తిరుమల దగ్గర్లో ఉన్నప్పుడు జీయర్ శ్రీవైకుంఠానికి చేరుకున్నారన్న వార్త విన్నారు. అంతులేని దుఃఖంతో తిరుమలకు వెళ్లి, అక్కడ కొంతకాలం ఉండి, తమను తాము ఓదార్చుకొని శ్రీ రంగానికి తిరిగివచ్చారు. తమ ప్రయాణంలో లభించిన సామాగ్రిని పెరుమాళ్లకు తమ కైంకర్యంగా సమర్పించారు. తరువాత బాధతో మఠానికి వెళ్ళారు. జీయర్ నాయనార్లకు తమ సాష్టాంగ నమస్కారాలు చేసి, అక్కడ కైంకర్యములను ముగించుకొని వెంటనే వానమామలైకి బయలుదేరారు. ఆ తర్వాత మళ్లీ తిరుమలకు వెళ్లి, మార్గంలో ఉన్న ఎఱుంబికి కూడా వెళ్లి, కొంత కాలం అక్కడ ఉండి, శుద్ధసత్వం అణ్ణన్, పోళిప్పాక్కం నాయనార్లకు తిరువాయ్మొళి ఈడు బోధించారు. తరువాత, వానమామలైకి తిరిగి వచ్చి, అక్కడ కొలువై ఉన్న దెయ్వనాయగన్ పెరుమాళ్ళకి కైంకర్యం కొనసాగించారు.

అంతిమోపాయ నిష్ఠను వ్రాసిన భట్టర్పిరాన్ జీయర్ 

భట్టర్పిరాన్ జీయర్, తమ పేరుకు అనుగుణంగా “వడమామలైక్కదిపర్ భట్టనాథముని” (తిరుమల అధిపతి అయిన భట్టనాథముని) తిరుమలకు వెళ్లి, అణ్ణరాయ చక్రవర్తి, నాయనార్, తోళప్పర్ మొదలైనవారికి సంప్రదాయ సూచనలను అందించి దర్శన ప్రచారం చేయమని ఆదేశించారు. పరవస్తు అణ్ణన్, పరవస్తు అళగియ మణవాళ జీయర్లను కూడా తమ శిష్యులుగా స్వీకరించి, వారిని సత్సంప్రదాయ ప్రవర్తకులుగా తీర్చి దిద్దారు. చేతనులను ఉద్ధరించాలని, , వీరు కృపతో ‘అంతిమోపాయ నిష్ఠ’ (ఆచార్యుడు, ఆచార్యుడే అంతిమ ఉపాయం) గ్రంథాన్ని వ్రాసారు. ఈ ప్రబంధం ఉత్తమ రహస్య గ్రంధముగా పెద్దలు పరిగణిస్తారు.

అంతిమోపాయ నిష్ఠాయా వక్తా సౌమ్యవరోమునిః
లేకస్కస్యాన్వయోమేత్ర లేకనీ తాళపత్రవత్

(‘అంతిమోపాయ నిష్ఠ’ అను ఈ గ్రంధాన్ని కృపతో మణవాళ మాముణులు అనుగ్రహించారు. ఈ గ్రంధముతో అడియేన్ సంబంధం కేవలం తాళపత్రాలు, రచనా పరికరం వరకు మాత్రమే).

ఎందై మణవాళ ముని ఎనక్కళిత్త
అంతిమోపాయ నిట్టైయాం ఇదనై చ్చిందై శెయ్దు ఇంగు
ఎల్లారుం వాళ ఎళుదివైత్తేన్ ఇప్పువియిల్
నల్లఱివొన్ఱిల్లాద నామ్

(ఈ ‘అంతిమోపాయ నిష్ఠ’ నా స్వామి అయిన మణవాళ మాముణులు అనుగ్రహించినది. ఏ పరిజ్ఞానం లేని ఈ అడియేన్, కేవలం ఈ ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ ఉద్ధరించబడాలన్న ఉద్దేశ్యముతో వ్రాసాను) ఈ గ్రంధముపై తమ ఆధిపత్యాన్ని స్పష్టంగా తిరస్కరిస్తున్నారు.

తిరునరాయణపురం తోటలో కైంకర్యము

భట్టర్పిరాన్ జీయర్ దివ్య తిరువడి ఆశ్రయం పొందిన తొళప్పర్, స్వయంగా ఆచార్య పరతంత్రులు. వీరి అన్నగారు అళగియ మణవాళ దాస నాయనార్లను, మణవాళ మాముణులు శ్రీరంగ పెరుమాళ్ళ అనుమతితో తిరునాయపురం వెళ్లి, అక్కడ ఎమ్పెరుమానార్లకు, శెల్వ పిళ్ళైకి కైంకర్యం చేయమని ఆదేశించారు. వారి ఆదేశం మేరకు అక్కడికి వెళ్ళి పెరుమాళ్ళ కోసం ఒక తోటను నిర్మించి తమ కైంకర్యాన్ని ప్రారంభించారు. అక్కడి స్థానికులను ఎందరినో సంస్కరించి ఉద్దరించారు. ఈ విధంగా శ్రీశైలేశ దయాపాత్ర కీర్తి ఆ ప్రాంతాలలో మారుమ్రోగేలా, శ్రీశైలం (తిరువేంగడం) కి పశ్చిమాన ఉన్న ప్రాంతాలలో కూడా శ్రీశైలేశ దయపాత్ర మహిమలు ప్రతిధ్వనింపజేశారు. వారు తిరునారాయణపురంలో యతిరాజ మఠం వెనుక బసచేసి ఉండేవారు. అయ్యన్ మొదలైన తమ వంశం తరువాత తరాలవాళ్ళు కూడా ఆ కైంకర్యమును నిష్ఠగా నిర్వహించారు.

మూలము: https://srivaishnavagranthams.wordpress.com/2021/10/27/yathindhra-pravana-prabhavam-101/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 100

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 99

జీయర్ నుండి విడిన శిష్యుల బాధ

తరువాత, “కదిరవన్ పోయ్ గుణపాల్ శేర్ంద మహిమై పోల్” ,(సూర్యుడు) యొక్క గొప్పతనం తూర్పు దిశకు చేరుకోవడం వంటిది) లో చెప్పబడినట్లుగా, ఒక సూర్యుడు తూర్పు దిశలో అమర్చబడ్డారు. జీయర్ నాయన్‌ఆర్, కందడై అన్నన్ మరియు శిష్యులు అందరూ  చాలా బాధపడ్డారు.

శీయర్ ఎళుందరుళివిట్టార్ సెగముళుదుం
పోయిరుళ్ మీళ ప్పిగుందదే తీయ
వినై నైయ వెంబులనాల్ ఈడళిందు మాయ్వోర్
అనైవార్ క్కుం ఏదో అరణ్

(జీయర్ శ్రీవైకుంఠముకి అధిరోహించారు. ప్రపంచమంతటా చీకటి అలుముకుంది. తమ పాప కర్మలతో బాధపడి, ఇంద్రియాలకు దాసులైన వారికి ఇప్పుడు రక్షణ ఏది?) శిష్య లక్షణానికి అనుగుణంగా అందరు, తమ శిరో క్షావరం చేసుకొని, స్నానమాచరించి, మఠంలోకి తిరిగి ప్రవేశించారు. జీయర్ మఠంలో లేని శూన్యతను చూసి బాధపడ్డారు. కళ్ళ నిండా కన్నీళ్లతో, గద గద స్వరంతో పాసురాలు పాడి ఒకరినొకరు ఓదార్చుకున్నారు. జీయర్ గొప్పతనానికి అనుగుణంగా, తిరువధ్యయనం (శ్రీవైకుంఠానికి అధిరోహించిన రోజుతో మొదలుకొని పదమూడు రోజుల పాటు ఆచరించవలసిన కర్మలు), తీర్థ ప్రసాద సేవలు జరిపారు. తరువాత, జీయర్ వారిని నియమించిన కైంకర్యములను నిష్ఠతో నిర్వహించారు.

అనంతరం, ఇక్ష్వాకు కుల దీపంగా స్తుతింపబడే పెరియ పెరుమాళ్ళు, జీయర్ తమ చరమ సమయంలో తిరిగి ఇచ్చిన శ్రీ రంగరాజులను, మఠాన్ని, జీయర్ నాయనార్కు (మాముణుల మనుమలు) ప్రసాదించాడు. వీటితో పాటు, పెరుమాళ్ళు వారికి తీర్థం, దివ్య హారము, దివ్య వస్త్రం, శ్రీ శఠకోపురం మొదలైన గౌరవాలతో వారిని సత్కరించి ఆశీర్వదించారు. ఇది చూసి, జీయర్ అభిమానులందరూ సంతోషించి, జీయర్ నాయనార్ను స్వయంగా జీయరుగా భావించి, నిత్యం సేవించారు.

శ్రీ భాష్యం, తిరువాయ్మొళి ఈడుల అధ్యయనం చేసిన జీయర్ నాయనార్

జీయర్ ఆదేశానుసారం తన మనవడు, జీయర్ నాయనార్ కు కందాడై అణ్ణన్, తిరువాయ్మొళి ఈడు (తిరువాయ్మొళికి వ్యాఖ్యానం) బోధించారు. ఆ పైన జీయర్ ఆదేశానుసారం, జీయర్ నాయనార్, కందాడై నాయన్లకు ప్రతివాది భయంకరం అణ్ణా శ్రీభాష్యం (వేదవ్యాసుల బ్రహ్మ సూత్రాలకు రామానుజులు వ్రాసిన) ఉపదేశించారు. ప్రతివాది భయంకరం అణ్ణా, ఉపదేశం సంపూర్ణం చేసి తమ కర్తవ్యాన్ని నిర్వహించినట్లు ఈ శ్లోకంలో వివరించబడింది.

శ్రీమాన్ సుందరజామాతృ మునిః పర్యాయ భాష్యకృత్
భాష్యం వ్యాకురు తే తస్య శ్రోతృకోడౌ మమాన్వయః

(భాష్యకారుల (రామానుజుల) పునరవతారము, కైంకర్య శ్రీమాన్ (కైంకర్య సంపద కలిగినవాడు) అయిన మాముణులు, శ్రీ భాష్యం అర్థాలను స్వయంగా వివరిస్తున్నారు. ఆ శ్రీభాష్య అధ్యయన గోష్ఠితో నాకు సంబంధం ఉంది). తమ ఏకైక నివాస స్థలంగా తిరుపతిలో నివసిస్తున్న పొళిప్పాక్కం పోరేఱ్ఱు నాయనార్ వంటి వారికి శ్రీభాష్యమును బోధించారు. తరువాత భట్టర్‌ పిరాన్ జీయర్ వంశస్థులైన పరవస్తు శ్రీనివాసాచార్యుడికి, అలాగే వారి సబ్రహ్మచారి (సహావిద్యార్థి) పరవస్తు అళగియ మణవాళ జీయర్‌ కు కూడా అతను తిరువాయ్మొళి ఈడును బోధించి, నిజంగానే వీరు తిరువాయ్మొళి నాయనార్ అను నిరూపించుకున్నారు. ప్రతివాధి భయంకరం అణ్ణా [సిద్ధాంతాన్ని అంగీకరించని వారు భయపడేలా ఉండేవారు) గొప్పతనాన్ని ప్రదర్శించి రామానుజ సిద్ధాంతాన్ని రక్షించారు.

మూలము: https://srivaishnavagranthams.wordpress.com/2021/10/26/yathindhra-pravana-prabhavam-100/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 99

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 98

జీయర్ యొక్క ఆశీస్సులు

ఆ తరువాత, జీయర్ చరమ కైంకర్యలు నిర్వహించేందుకు, వారి పూర్వాశ్రమ మనుమడు, జీయర్ నాయనార్, శిష్యులందరితో కలిసి కావేరి నది స్నాన మాచరించారు. జీయర్ తిరుమంజనం కోసం కావలసిన జలాన్ని తీసుకొని వెళ్ళారు. వారి దివ్య తిరుమేనిని తిరుమంజనవేధి (వివిధ పుణ్య కార్యాలు నిర్వహించే ఎత్తైన ఒక వేదిక) పై ఉంచి, పురుషసూక్తం, ద్వయ మహామంత్రం, అనేక శ్లోకాలను పఠిస్తూ తిరుమంజనం గావించారు. “విస్థీర్ణబాలతల విస్పురదూర్ద్వపుండ్రం” (విశాలమైన వారి నుదురులో ప్రకాశిస్తున్న తిరుమన్ కాప్పు) అని చెప్పినట్లుగానే, వారి తిరుమేనిని దివ్యమైన వస్త్రంతో తుడిచి, పన్నెండు ఊర్ధ్వ పుండ్రాలను ధరింపజేశారు. మిగిలిన తిరుమన్ కాప్పు శ్రీచూర్ణాన్ని అమూల్యమైన ఆస్థిగా అందరూ పంచుకున్నారు. వారి దివ్య తిరుమేనిని ఒక దివ్య సింహాసనంపై ఉంచి, అందరూ చరణాలపైన తమ శిరస్సుని ఉంచి నమస్కరించారు. ప్రతి క్షణాన్ని అనుభవిస్తూ కనురెప్ప వార్చకుండా వారి దివ్య స్వరూపాన్ని చూస్తూ తమ తమ హృదయాలలో జీయర్ దివ్య స్వరూపాన్ని నిలుపు కున్నారు.

ఆ సమయంలో, శ్రీ రంగనాధుడు ధరించిన ఎర్రటి దివ్య వస్త్రాన్ని, శ్రీ రంగనాధుడు తమ దివ్య వక్షస్థలంపై ధరించిన వనమాలను ఉత్తమ నంబి (శ్రీరంగ దేవాలయ ప్రధాన కైంకర్యపరుడు) బంగారు కంచంలో ఉంచి, తమ శిరపైన పెట్టుకొని, ఆలయ ఇతర కైంకర్యపరర్లతో కలిసి మఠానికి వేంచేశారు. జీయర్ శిష్యులు ఎదురు వెళ్లి, వారికి నమస్కారాలు సమర్పించి, వారి తలపై పెరుమాళ్ ప్రసాదాన్ని స్వీకరించారు. పెరియాళ్వార్ తమ తిరుప్పల్లాండు 9 వ పాశురంలో పేర్కొన్నట్లుగానే “ఉడుత్తు క్కళైంద నిన్ పీతగవాడై ఉడుత్తు క్కలత్తదుండు తొడుత్త తుళాయ్ మలర్ శూడి కళైందన శూడుం ఇత్తొండర్గళోం” (మీ శిష్యులము, మీరు తొడిగిన వస్త్రాన్ని, దివ్య తుళసి మాలను మేము ధరిస్తాము). పెరుమాళ్ళు ధరించిన వస్త్రం, మాలతో జీయర్ తిరుమేనిని అలంకరించారు. ఆలయ కైంకర్యపరర్లు, అనేక ఆచార్య పురుషులు, జీయర్లు, ఏకాంగులు, శ్రీవైష్ణవులు, జీయర్‌ను సేవించుకొని వారి తనియన్లను (‘శెయ్య తామరై తాళిణై వాళియే’ (75వ భాగంలో చూడవచ్చు) త) సేవించి మంగళాశానములు సమర్పించారు. “రామానుజులను సేవించలేదేనన్న లోటుని జీయర్‌ ను సేవించుకొని పూరించుకున్నాము, ఇప్పుడు వారు కూడా మనలను విడిచిపెట్టి వెళుతున్నారు” అని అందరు ఒకరితో ఒకరు చెప్పుకొని బాధపడ్డారు. ఆ తర్వాత వారి శిష్యులు శ్రీచూర్ణ పరిపాలన (జీయర్ తిరుమేనిపై దివ్య సింధూరం లేపనం చేయుట) కైంకర్యం నిర్వహించి మిగిన లేపనాన్ని తమ నుదుటిపైన ధరించారు. జీయర్ దివ్య తిరుమేనిని పుష్పక విమానం (పూలతో అలంకరించిన వాహనం) పైన ఉంచి, ఆ వాహనాన్ని శిష్యులు తమ భుజాలపై మోస్తూ, ఛత్ర చారలు, మేళతాలాలు, శంఖ నాదములతో ముందుకు సాగారు.

పదాకాత్ విజినీం రమ్యాం దూర్యోద్కుష్ట నినాదనీం
సిగ్దరాజపదాం రామ్యాం కృత్స్నం ప్రకీర్ణ కుసుమోత్కరాం

(ఆ ఊరుని, జీయర్ వచ్చే మార్గం మొత్తం నీళ్లు చల్లి, అందమైన జెండాలతో, పుష్పాలతో అలంకరించి, అనేక సంగీత వాయిద్యాలతో మారుమ్రోగించారు) వారు మార్గాన్ని వివిధ పుష్పాలు ఫలాలను ఇచ్చే చెట్లతో అలంకరించారు. చెరకులను మోసుకెళుతూ రామానుస నూఱ్ఱందాది మొదలైన పాశురాలను పఠించారు. దివ్యజలాన్ని చల్లారు, పువ్వులు చల్లారు. ఏక తిరుచ్చిన్నం (రాజులు, దేవతలు మొదలైన వారి ఊరేగింపులో ఊదబడే వాయుద్యం) ఊదుతూ “మణవాళ మాముణులు తిరునాడుకి చేరుకున్నారు” అని నినాదాలు చేశారు”. మహిళలు దీప హారతులు సమర్పించారు. ఊరేగింపు వెళ్ళే వీధుల్లో ప్రజలందరూ సాష్టాంగ నమస్కారం చేశారు.

తిరుప్పళ్ళి నిర్వహణ 

[సన్యాసులకు అగ్నితో ఎలాంటి సంబంధం ఉండకూడదు కాబట్టి, దహనం చేసే బదులు వారిని పాతిపెట్టే ప్రక్రియను మన సంప్రదాయంలో ‘తిరుప్పళ్ళి’ సేవ అని అంటారు]. జీయర్ పెరుమాళ్ళ పాదపద్మాల యందే ఉండాలని, ఆదికేశవ పెరుమాళ్ కొయిల్ సమీపంలోని, ‘తవరాసన్ పడుగి’ (రామానుజులు కావేరి ఒడ్డున స్నానమాచరించిన చోటు) వద్దకు తీసుకెళ్ళారు. భూమిదేవి సీతా పిరాట్టిని తన ఒడిలోకి తీసుకున్నట్లు, మణవాళ మాముణులును కూడా తన ఒడిలోకి తీసుకొని సంతోషించింది. ఆళవందార్లు ఎంబెరుమానార్ల మాదిరిగానే, యతుల నియమాలను నిష్ఠగా పాఠించి, జీయర్ దివ్య స్వరూపం కూడ సమాధి చేయబడింది.

మూలము: https://srivaishnavagranthams.wordpress.com/2021/10/26/yathindhra-pravana-prabhavam-99/

పొందుపరిచిన స్థానము – http://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://guruparamparai.wordpress.com
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org