శ్రీవైష్ణవ సరళతమ మార్గనిర్ధేశిక – రహస్య త్రయం

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవరమునయే నమః
శ్రీవానాచల మహామునయే నమః

శ్రీవైష్ణవ సరళతమ మార్గదర్శిని

<<దివ్య ప్రబంధం మరియు దివ్య దేశములు

పంచ సంస్కారములలో ఒక్కటైన మంత్రోపదేశం అనే ప్రక్రియ (రహస్య మంత్రముల ఉపదేశము) చాలా ప్రథానమైనది. ఈ సంస్కారములో ఆచార్యునిచే మూడు రహస్య మంత్రములు శిష్యునికి ఉపదేశించ బడతాయి. అవి

*తిరుమంత్రం / అష్ఠాక్షరి మహామంత్రం – బదరికాశ్రమములో నారాయణ ఋషిచే నర ఋషికి ఉపదేశించ బడింది (వీరిద్దరు భగవానుని అవతారం).

   “ ఓం నమో నారాయణాయ ”  

సంక్షిప్తార్థం: భగవానునికే చెందిన ఈ జీవాత్మ భగవానుని ముఖోల్లాసమునకై జీవించాలి. సర్వేశ్వరుడైన నారాయణునికి మాత్రమే కైంకర్యమును చేయాలి.

* ద్వయ మంత్రం – విష్ణు లోకమున శ్రీమహాలక్ష్మికి శ్రీమన్నారాయణునిచే ఉపదేశించబడింది.

“ శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే ||   శ్రీమతే నారాయణాయ నమః ”   

సంక్షిప్తార్థం: శ్రియః పతియైన శ్రీమన్నారాయణుని శ్రీ పాదములను ఆశ్రయిస్తున్నాను. శ్రియః పతియై  సర్వసులభుడైన నారాయణుని శ్రీపాదముల నిస్వార్థ సేవ చేయుటకు ఉపాయముగా ఆశ్రయించుచున్నాను.

*చరమ శ్లోకం (భగవద్గీతలో భాగం): కురు క్షేత్రయుద్ధ రంగమున శ్రీ కృష్ణుడిచే అర్జునునకు  ఉపదేశించబడింది.

 

సర్వధర్మాన్  పరిత్యజ్య మామేకం శరణం వ్రజ |
అహం త్వాం
 సర్వపాపేభ్యో  మోక్షయిష్యామి మా శుచః ||

సంక్షిప్తార్థం: ఇతరోపాయములన్నింటిని సవాసనగ విడిచి నన్నే ఇతరోపాయ నిరపేక్షకునిగా నమ్మియుండుమా! సర్వ శక్తిమంతుడనైన నేను నిన్ను అన్ని ప్రతి బంధకముల నుండి విడిపింతును, దుఃఖింపకుమా! అని భగవంతుడు ప్రతిఙ్ఞా పూర్వకముగా ఉపదేశించెను.

 ఈ మూడు రహస్య మంత్రములకు రెండు విధములైన సంబంధ బాంధవ్యములు ఉన్నాయని మాముణులు తమ ముముక్షుపడి వ్యాఖ్యానమున తెలిపారు. (ద్వయ మహా మంత్ర వివరణలో)

  • విధి – అనుష్ఠానం (సిద్ధాంతం – ఆచరణ) తిరుమంత్రం జీవాత్మ మరియు పరమాత్మల మధ్య సంబంధమును తెలుపుతుంది. చరమ శ్లోకం పరమాత్మ జీవాత్మను తనకు ఆధీనం మవ్వమని ఆదేశిస్తుంది. ద్వయం జీవాత్మ పరమాత్మను ఆశ్రయించుటకు సదా ధ్యానమును చేయుమని తెలుపుతుంది.
  • వివరణ – వివరణి (సంక్షిప్త వర్ణన) తిరుమంత్రం “ఓం నమో నారాయణ” లో ప్రణవం (ఓం) గురించి తెలుపుతుంది.  ద్వయం, తిరు మంత్రమును వివరించును. చరమ శ్లోకం దీనినే అతి వివరంగా తెలుపుతుంది.

ఈ మూడు రహస్య మంత్రములలో ద్వయ మంత్రము మన పూర్వాచార్యులచే విశేషంగా ధ్యానించ బడి కీర్తింపబడింది. ఇదే మంత్ర రత్నముగా (అన్ని మంత్రములలో రత్నంవంటిది)  ప్రసిద్ధి చెందినది. ఈ మంత్రం శ్రీమహాలక్ష్మి  పురుషాకార (మధ్య వర్తిత్వం/ సిఫారిస్) పాత్రను తెలుపుతుంది.

శ్రీ మహాలక్ష్మితో కూడుకొని ఉన్న శ్రీమన్నారాయణుడే జీవుల ఉజ్జీవనకు ప్రధాన కారణం. దేవరాజ గురు  (ఎరుంబియప్ప) “వరవరముని దినచర్య” లో మణవాళ మాముణుల పుణీతమైన దినచర్యను గ్రంథస్థ పరిచారు. ఆ విషయమై దీనిలోని 9వ శ్లోకములో –

మంత్రరత్నానుసంధాన సంతత స్ఫురితాధరం| తదర్థతత్త్వ నిధ్యాన సన్నద్ధపులకోద్గమం||

శ్రీమణవాళ మాముణు అధరములు (పెదవులు) నిరంతరం మంత్ర రత్నమును అనుసంధించు చుండును. ఈ ద్వయాను సంధానముచే (ద్వయం యొక్క వివరణే తిరువాయ్మొళి) వారి శరీరం పులకించి పోయేది – అని వివరణ. కావున ద్వయ మంత్రం  ఎప్పుడు కూడ స్వతంత్రముగా అనుసంధించరాదని – గురుపరంపర మంత్రం (అస్మద్గురుభ్యో నమః నుండి శ్రీధరాయ నమః వరకు) అనుసంధానం చేసిన పిమ్మట మాత్రమే ద్వాయానుసంధానం చేయాలని ఇది ఙ్ఞప్తికి తెస్తుంది.

మన పూర్వాచార్యులలో పరాశర భట్టర్ మొదలుకొని (అష్ఠశ్లోకి), పెరియ వాచ్చాన్ పిళ్ళై (పరందరహస్యం) , పిళ్ళై లోకాచార్యులు  (శ్రియఃపతి పడి, యాదృచ్ఛికపడి, పరంద పడి, ముముక్షు పడి) అళిగియ మణవాళ పెరుమాళ్ నాయనార్  (అరుళిచ్చెయళ్ రహస్యం) మణవాళ మాముణులు (ముముక్షుపడి వ్యాఖ్యానం) మొదలైన వారందరు రహస్య త్రయమున వారి వారి వ్యాఖ్యానములలో విశదముగా తెలియపరచారు. ఈ ప్రబంధముము అన్నింటిలో అతి ప్రధానముగా ముముక్షు పడి నిలుస్తుంది మరియు శ్రీ వైష్ణవుల కాలక్షేపములలో ఈ గ్రంథమే సింహ భాగమును ఆక్రమిస్తుంది.

రహస్య త్రయం ముఖ్యంగా తత్త్వ త్రయం మరియు అర్థ పంచకంపైన దృష్ఠిని సారిస్తుంది. శ్రీ వైష్ణవులు తెలుకోవలసిన ముఖ్యార్థములలో ఇది ప్రధానమైనది.

ఆళ్వార్ తిరువడిగళే శరణం
ఎంపెరుమానార్ తిరువడిగళే శరణం
పిళ్ళైలోకాచార్యర్ తిరువడిగళే శరణం
జీయర్ తిరువడిగళే శరణం
జీయర్ తిరువడిగళే శరణం

అడియేన్ నల్లా  శశిధర్ రామానుజదాస

మూలము : http://ponnadi.blogspot.in/2015/12/rahasya-thrayam.html

పొందుపరిచిన స్థానము: https://srivaishnavagranthamstelugu.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org

Leave a comment